Telangana: నగరంలోని గౌలిగూడ మందిర్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అయితే శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిర్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజసింగ్, మాజీమంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో రాం మందిర్ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణా ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ సమాజానికి ఒరగబెట్టింది ఏంటని ప్రశ్నించారు.
Telangana: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర మొదలైంది. గౌలిగూడ నుంచి తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బన్సీలాల్ పేట్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర సాగనుంది.