రాష్ట్ర బడ్జెట్లో బల్దియాకు రూ.3,200 కోట్లు కేటాయించినా.. ఆ నిధులను విడుదల చేసేందుకు ఆర్థికశాఖ ముందుకురావడం లేదు. ప్రభుత్వం కేటాయించిన మొత్త ంలో ఇప్పటివరకు కేవలం పదోవంతు మాత్రమే విడుదలయ్యాయి.
నగరంలో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి హైడ్రా రంగంలోకి దిగుతోంది. వాహన రద్దీ సమస్యతో పాటు ఫుట్పాత్, రహదారి ఆక్రమణలపై నగర ట్రాఫిక్ విభాగంతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది.
నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్సులు, మైదానాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. సౌకర్యాల పెంపు, ఆధునిక హంగులు ఇతరత్రా లక్ష్యాలతో పనులు ప్రారంభించింది.
కొత్తగా ప్రారంభించిన సికింద్రాబాద్ - గోవా (వాస్కోడిగామ) రైలు ప్రయాణంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. రైలు వేళలతో ప్రయాస పెరుగుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బందికి సరైన వసతులు లేక బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు. 10 నుంచి 15 మంది సిబ్బంది పనిచేసే కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేదు.
జిల్లాలోని వ్యవసాయ విపణులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో లక్ష్యానికి మించిన ఆదాయం సాధించాయి. పది విపణిల్లో తాండూరు విపణికి ప్రత్యేక శ్రేణి హోదా ఉంది.
ఉపాధ్యాయ కొలువు సాధించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ విభాగంలో పొరుగు సేవల కింద విధులు నిర్వహిస్తున్న అభ్యర్థులు.. ఆంధ్రప్రదేశ్లో డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) పూర్తిచేశారు.
ప్రపంచంలోని పలు చిన్నదేశాలు విభిన్న అంశాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని, 140 కోట్లకుపైగా జనాభా కలిగిన భారత్ ఈ విషయంలో ఇంకా వెనకబడి ఉందని త్రిపుర గవర్నర్ ఇంద్రాసేనారెడ్డి అన్నారు.
ఇందిరాపార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 27న ఉదయం 11 గంటలకు ‘సదర్ సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఎం.అంజన్కుమార్ యాదవ్ తెలిపారు.
వేగంగా ఎందుకు వెళ్తున్నావని ఓయువకుడిని ప్రశ్నించడమే ఆ వృద్ధుడికి మరణశాసనమైంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. టెంపుల్ అల్వాల్కు చెందిన ఆంజనేయులు(69).
తెలుగు విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికిగాను యూజీ, పీజీ కోర్సుల కౌన్సెలింగ్ ఈనెల 23 నుంచి నిర్వహించనున్నట్లు వర్సిటీ సెంట్రల్ అడ్మిషన్ కమిటీ డైరెక్టర్ డా.బి.రాధ ఒక ప్రకటనలో తెలిపారు.