ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అనే పేరు ప్రకటించారు.
2024లో జరిగిన డీఎస్సీ (District Selection Committee) టీచర్ నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా, SGT (Secondary Grade Teacher) విభాగాల్లో జరిగిన అక్రమాలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
రాష్ట్రంలో ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగ యువత చేస్తున్న డిమాండ్ సరైనదే అని ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
Rajnath Singh: నిజాం భారత్కు మాత్రమే వ్యతిరేకం కాదు.. భారత ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమని కేంద్రమంత్రి రాజ్నాథ్ అన్నారు. ఇప్పటికీ దేశంలో రాజాకార్లు ఉన్నారని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు మూసీ పక్కన నివసిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మూసీకి వరద వచ్చినప్పుడు ఆ వరదలో కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Hyderabad IT Raids: హైదరాబాద్లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ కళాసిగూడలో క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
Telangana Liberation Day: సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజా పాలన తెచ్చుకున్నామన్నారు.
ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో గన్పార్క్లో ఉన్న అమర వీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.
హైదరాబాద్ నగరంలోని ఓ రిటైర్డ్ మహిళా అధికారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. 76 ఏళ్ల రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు వేధించారు.
హైదరాబాద్ నగంరలో ఐటీ అధికారులు మరోసారి విస్తృత్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ప్రముఖ బంగారం షాపు యజమానులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జీ మంత్రి జాతీయ జెండా ఎగరవేయనున్నారు.