ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్పై తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అభినందించారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐ బొమ్మ, బప్పం వెబ్సైట్లను బ్లాక్ చేశారు. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పేరిట సీఎం రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్లో ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించబోతోంది. ప్రపంచ స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి, వ్యాపార, ఆర్థిక రంగాలలో ప్రగతిని చర్చించేందుకు..
ఆరు సంవత్సరాల కాలంలో వేలాది పైరసీ సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు రవి. థియేటర్లో విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న నిందితుడు రవి కారణంగా టాలీవుడ్ నిర్మాతలకి వేలాది కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తోంది. మొత్తం 23 టీమ్స్తో ఇవాళ (శనివారం)సోదాలు జరిపారు. గండిపేట్, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో దగ్గుబాటి రానా సైతం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో విచారణకు వచ్చారు. బెట్టింగ్ యాప్తో చేసుకున్న అగ్రిమెంట్, ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చిన పారితోషికంపై రానాను ప్రశ్నించారు సీఐడీ అధికారులు.
ఓటమి నేపథ్యంలో జూబ్లీహిల్స్ క్యాడర్తో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్. అయితే, పరాజయం తర్వాత జూబ్లీహిల్స్ కార్యకర్తలు నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతోండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ ఫ్లైఓర్పై ఓ కారు బోల్తాపడింది. అలాగే కరీంనగర్ జిల్లాలో ట్రాలీ ఆటో బోల్తాపడింది. ఈ రెండు ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి.