డాక్టర్స్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు లేఖ రాశారు. ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహకి జూనియర్ డాక్టర్లు కృతజ్ఞతలు చెప్పారు.
పటాన్చెరులోని పాశమైలారంలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 37 మంది కార్మికులు మృతిచెందారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయిలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ప్రాజెక్ట్లోని పలు ఫిల్లర్లు కృంగాయి.
బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్పై అగ్ర నాయకత్వం సీరియస్ అయింది. అతడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న వెంటనే అగ్రనేతలు రంగంలోకి దిగారు.
Factory Explosion: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాదానికి కారణాలపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరగలేదని తేల్చిచెప్పారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ టీపీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయంటూ ఆరోపించారు. అందులోభాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎన్నికవుతున్నారని తెలిపారు.
Mahesh Kumar Slams Amit: శాంతి భద్రతలు, దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ రాజీపడే ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేంద్రంలో ఫాసిస్ట్ మోడీ పాలనకు వ్యతిరేకంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్నారని తెలిపారు.
రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని మాజీమంత్రి హరీష్రావు అన్నారు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.