చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్లో శనివారం సాయంత్రం మొబైల్ దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అక్టోబరు జీతాల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు జీతం చెల్లించొద్దని నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో ఇవాళ (శనివారం) కాల్పులు కలకలం సృష్టించాయి. సెల్ఫోన్ దొంగను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ మీద కత్తితో దాడికి దొంగ యత్నించాడు.
ప్రముఖ నటుడు కొణిదెల చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు మధ్యంతర ఉత్తర్వులని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శనివారం మంజూరు చేసింది. చిరంజీవి అనుమతి లేకుండా.. పలువురు ఆయన పేరుని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అవ్వా , తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా? అంటూ నిలదీశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో 14వేల అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల నియామకాన్ని చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గూండాలకు రేవంత్రెడ్డి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్ధీన్కు ఇద్దరు గన్మెన్లను ఎందుకు ఇచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
గోడౌన్లో సీజ్ చేసిన లిక్కర్తో పాటు, రైల్వే షిప్పింగ్ మెటీరియల్ కూడా ఉందని డీఎఫ్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించని సీజ్ చేసిన మెటీరియల్ను కస్టమ్స్ అధికారులు గోడౌన్లో భద్రపరిచారని చెప్పారు.
విద్యుత్ తీగ పాఠశాల బస్సుపై తెగిపడటంతో విద్యుత్ శాఖపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే.. తీగ తెగిపడిందని ఆరోపిస్తున్నారు.
బాగ్ అంబర్పేట్కు చెందిన ఓ వృద్ధురాలికి ఈనెల ఆకాష్ చౌదరి పేరిట ఫోన్ కాల్ వచ్చింది. 187 మంది చిన్నపిల్లల అక్రమ రవాణా, హత్య కేసులు వృద్ధురాలిపై ఉన్నాయని సైబర్ నేరగాడు భయపెట్టాడు. తనని అరెస్టు చేసేందుకు బెంగళూరు నుంచి వస్తున్నట్టు వృద్ధురాలిని ప్రలోభ పరిచాడు.