బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ప్రమాదం జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. స్లాబ్ కూలి నలుగురు కూలీలకు గాయాలయ్యాయి.
హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ఓ యువకుడిపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడికి బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్లో చదువుకునేందుకు సోమాలియా నుంచి వచ్చిన యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర లేదన్నారు. అయినా ఆమె ఎందుకు ఇంత హడావుడి చేస్తుందో అర్థం కావడం లేదన్నారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకే కాదు.. ప్రజల మధ్యకు రావడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి.. లబ్ది దారులకు ఈ రేషన్ కార్డులు అందజేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
Guruvareddy On HCA scam: ఫేక్ క్లబ్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లు సృష్టించడం అంతా బయటపడిందని గురువారెడ్డి అన్నారు. ఎలక్షన్ కమిషన్ సంపత్ కుమార్ ఎలా ఇతనిని పోటీ చేయించారని ప్రశ్నించారు. జగన్మోహన్ రావు అనహర్హుడని వ్యాఖ్యలు చేశారు.
Raja Singh Resignation Reaction: దేశ సేవ, హిందుత్వాన్ని రక్షించేందుకు 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరినట్లు రాజాసింగ్ తెలిపారు. బీజేపీ తనకు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని గుర్తుచేశారు.
HCA Scam ED Enters: హెచ్సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, కేసు వివరాలు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది.
Raja Singh Resignation Accepted: రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజాసింగ్ ప్రకటించారు.
రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరుపుతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. త్వరలోనే తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని, న్యాయశాఖ దీనిపై పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.
HCA Scam CID Investigation: హెచ్సీఏ స్కాంలో అరెస్ట్ అయిన ఐదుగురిలో నలుగురు చర్లపల్లి జైలులో ఉండగా.. కవిత చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. ఈ ఐదుగురిని కస్టడీలోకి తీసుకుంటే హెచ్సీఏకు సంబంధించిన అవకతవకలు, హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
భద్రాచలం రామచంద్రస్వామి దేవస్థానం భూములు కబ్జా అయ్యాయని, అయినా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏపీలో పొత్తులో ఉన్నారని మౌనంగా ఉండిపోయారా? అంటూ విమర్శలు గుప్పించారు.