Supreme Court: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారని సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తప్పు ఎవరు చేసినా తప్పేనని, ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని ధర్మాసనం పేర్కొంది.
చరిత్రలో నిలిచిపోయేవిధంగా తెదేపా అధిష్ఠానం కడపలో మహానాడు నిర్వహించనుంది. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. కడప నగర సమీపంలో కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం గ్రామ సమీపంలో 150 ఎకరాల్లో ఏర్పాట్లు కొలిక్కి వస్తున్నాయి.
విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. ఉచిత సీట్లు పొంది విద్యను అభ్యసించటానికి విద్యార్థులు ముందుగా ఆన్లైన్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని సమీప పాఠశాలను ఎంపిక చేసుకుని ప్రవేశం పొందాల్సి ఉంది.
ఉమ్మడి కడప జిల్లాలోని ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.300 కోట్లతో విద్యుత్తు పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా తొలి విడతలో 624 వ్యవసాయ ఫీడర్లతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్ (11 కేవీ, ఎల్టీ) లైన్లు ఏర్పాటు పనులు గత రెండేళ్ల నుంచి నత్తనడకను తలపిస్తున్నాయి.
గత వైకాపా ప్రభుత్వం నిలిపేసిన బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరిస్తూ ఎన్డీయే ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ ఉత్తర్వులు జారీ చేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేసవి కాలంలో పంట భూమి ఎండిపోకుండా, భూసారం పెంచేందుకు వర్షాకాలానికి ముందు పొడి విత్తనాలు విత్తడం (ప్రీ మూన్సూన్ సోయింగ్ - పీఎండీఎస్) విధానం రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుంది.
ప్రొద్దుటూరులో ప్రజల వాహనాలకే కాదు.. పోలీసుల బైక్లకూ రక్షణ లేకుండా పోయింది. ఇటీవల ఓ ఎస్.ఐ ఇంట్లో దొంగలు చోరీ చేసిన విషయం మరువక ముందే.... పోలీసుల అదుపులో ఉన్న ఓ అనుమానితుడు స్టేషన్ ఎదురుగా నిలిపి ఉంచిన బ్లూకోల్ట్స్ బైక్తో పరారైన మరో ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర బయోడైవర్సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో మదనపల్లె శ్రీజ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థినికి రాష్ట్రస్థాయి పురస్కారం వచ్చినట్లు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఆర్.గురుప్రసాద్ తెలిపారు.
జీవనోపాధికి కువైట్ వెళ్లిన వ్యక్తి స్వస్థలానికి వస్తూ ఇంటికి చేరకముందే మార్గ మధ్యలో తీవ్ర అనారోగ్యానికి గురై శ్రీలంకలోని ఆసుపత్రిలో చికిత్స మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబం చివరి చూపు కోసం తల్లడిల్లిపోతోంది.