గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇష్టానుసారంగా ధారాదత్తం చేసినందుకు అప్పట్లో మార్కాపురం, పుల్లలచెరువు తహసీల్దార్లుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన విద్యాసాగరుడు, గంగాధరరావులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఫ్లోరైడ్...ఈ పేరు వింటేనే పశ్చిమ ప్రకాశం ప్రజలు వణికిపోతారు. కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, కొండపి, పరిధిలో ఫ్లోరైడ్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 2.2 నుంచి 11 పీపీఎం వరకు ఫ్లోరైడ్ ఉందని 2012లో కేంద్ర బృందం సర్వే చేసి నిర్ధారించింది.
తాళ్లూరు... పాల ఉత్పతికి పెట్టింది పేరు. అయిదు దశాబ్దాల కిందటే వ్యవసాయానికి అనుబంధంగా ఇక్కడ రైతులు పాడి పరిశ్రమను ఆధారం చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు.
వీల్ఛైర్లలో కనిపిస్తున్నవారు సోదరులైన కొడిమెల ఆదిత్యకుమార్, రవిప్రకాష్లు. వీరిది తాళ్లూరు మండలం మాధవరం. నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు వెంకట్రావు, సుశీల అన్నీ తామై బిడ్డలను పోషిస్తున్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్యం పొందలేని నిరుపేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఆదుకుంటోంది. వైద్య చికిత్స అనంతరం ఖర్చుల రసీదులు ఎమ్మెల్యేలకు అందజేయాలి.
జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో డిజి లక్ష్మి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగాత్మకంగా స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం వద్ద విజయలక్ష్మి స్వయం సహాయక సంఘం సభ్యురాలు ప్రారంభించారు.
ఎంత గొప్ప పథకమైనా దాని అమలులో సరైన పర్యవేక్షణ లేకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి. లక్ష్యంపై స్పష్టత కరవై, లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో విఫలమైతే లెక్కల్లోనే గొప్పతప్ప, ప్రజలకు ఎలాంటి మేలు జరగదు. అందుకు నిదర్శనమే కనిగిరి మండలంలోని బడుగులేరు.
గ్రానైట్ పరిశ్రమ మేనేజర్కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ముంబయిలోని బాంద్రా పోలీసులమని, వివిధ కేసులు నమోదయ్యాయని భయబ్రాంతులకు గురిచేసి పలు విడతలుగా అతని నుంచి రూ.18.35 లక్షలు కొల్లగొట్టారు.
మొంథా తుఫాన్ కారణంగా వెలిగొండ ప్రాజెక్టు పనులకు ఏర్పడిన ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. నిర్మాణ పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఒకటికి రెండుసార్లు వెంటవెంటనే పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
పది ఎకరాల తన భూమిని ఆన్లైన్ చేయాలని కోరుతూ ఐదేళ్లుగా ముగ్గురు ఆర్డీవోలు, తొమ్మిది మంది తహసీల్దార్లకు 100 అర్జీలు ఇచ్చినా పట్టించుకోకుండా తిప్పుకుంటున్నారని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్లోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీకోసంలో జేసీని మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామానికి చెందిన వడ్డెమాని శింగయ్య వేడుకున్నారు.
విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఉత్తమ ఫలితాలనిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ పారిశ్రామిక సంస్థలు ముందుకువచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో 614 ఎంవోయూలు చేసుకున్నాయని వెల్లడించారు.
రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు బుధవారం విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక్కో రైతుకు రూ.6వేలను మూడు విడతలుగా, రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.14వేలను మూడు విడతలుగా ఇస్తున్నాయి.
ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ టంగుటూరి రామాంజి చెక్ పవర్ను తాత్కాలికంగా రద్దుచేస్తూ డీపీవో వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎర్రగొండపాలెం మోడల్ డిగ్రీ కాలేజీలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర నైపుణ్యాబివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సీడాప్ సంయుక్తంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఇన్చార్జి గూ డూరి ఎరిక్షన్బాబు సోమవారం తెలిపారు.
విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో 13.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదరటంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు.
కనిగిరి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యసేవలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని వైద్య ఆరోగ్యశాయ మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి కోరారు. సోమవారం అమరావతిలో మంత్రి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి ఆసుపత్రి పరిస్థితిని వివరించారు.