ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో భవిష్యత్తుకు భరోసా పేరుతో విడుదల చేసిన తెదేపా మొదటి విడత మేనిఫెస్టోపై తెలుగు యువత నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్వహించిన మహానాడు అనంతరం సామాజిక మాధ్యమాల్లో కొందరు తనపై వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారం చేస్తున్నారని తెదేపా ప్రొఫెషనల్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని తెలిపారు.
సీఎస్ఐఆర్ అరోమా మిషన్-3.0లో భాగంగా జిల్లాలో సుగంధ పంటల సాగు ప్రోత్సాహానికి ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. నిమ్మగడ్డి, కాశగడ్డి, వట్టివేరు, కామాక్షి కసువు సాగుకు జిల్లాలో అనువైన వాతావరణం ఉందని అధికారులు గుర్తించారు.
చర్మకారులకు ఉపాధి కల్పించాలనే సదాశయంతో ఏర్పాటు చేసిన లెదర్ పార్క్ అది. తొలినాళ్లలో కొందరిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో ఉన్నతాశయం నీరుగారగా.. విలువైన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
ఆధునిక సమాజంలో విద్యుత్తు ఓ నిత్యావసరం. అలాంటి సేవలు అందించే కీలకశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన అధికారులు, సిబ్బంది పోస్టుల భర్తీ ఏళ్లుగా లేకపోయింది.
పుల్లలచెరువు/యర్రగొండపాలెం: ఒక యువకుడి మృతదేహాన్ని కొందరు వ్యక్తులు కారులో తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు...
● ఒకరు మృతి, 8 మందికి గాయాలు పొదిలి రూరల్: పొదిలి మండలం మాదాలవారిపాలెం సమీపంలో శుక్రవారం రాత్రి బొలెరో వాహనం, ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా...
అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో శ్రీ నెమిలిగుండ్ల రంగనాయకస్వామి ముఖద్వార ప్రారంభోత్సవం, శ్రీ పోలేరమ్మ తల్లి, పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి.
మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద 108 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
గ్రానైట్ పరిశ్రమపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సీనరేజీ వసూలును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. నెలకు రూ.57.88కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.1,389 కోట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా సరికొత్త ప్రక్రియకు తెరతీసింది.
మండల విద్యాఽధికారి (ఎంఈవో)-2 పోస్టులు మంజూరు ఎప్పుడన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ పోస్టులను ఇప్పటికే గ్రేడ్-2 హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేసి భర్తీచేస్తారా? లేక స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి ఇచ్చి నియమిస్తారా? అన్న విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు.
గ్రామాల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబాల వారి జీవనోపాధి పెంపొందించేందుకు వైకెపీ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేయాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ బి. బాబురావు సూచించారు. స్థానిక వైకెపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వీవోఏలకు సమావేశంలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. పొదుపు గ్రూపుల్లో ఉండి ఆసక్తిగల మహిళలకు చిన్నతరహా, మధ్యతరహాకు చెందిన డెయిరీ యూనిట్లు, పొట్టేలు పిల్లలు యూనిట్లు, కారం మిషన్లు, సెంట్రింగ్ యూనిట్లు, టెంట్ హౌస్, డీజే యూనిట్లు, బడుగు వికాసం కింద కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు తదితర వాటికి రుణాలు ఇప్పించాలని తెలిపారు. అలాగే గ్రూపుల్లో లేని నిరుపేద కుటుంబాలను గ్రూపుల్లో చేర్పించాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కొలిక్కిరాని పరిస్థితి ఏర్పడింది. మే 31వతేదీ వరకు బదిలీల కోసం ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వాటిని పరిశీలించి బదిలీలు చేయాల్సి ఉంది. అయితే ముందుగా ప్రజాప్రతినిధుల నుంచి బదిలీల కోసం సిఫార్సు లేఖలు వచ్చినా మరలా వారి ఆమోదం కోసం పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహిళల మెడల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడటమే వృత్తిగా ఎంచుకున్న ముగ్గురు దొంగలను శుక్రవారం అరెస్టు చేసినట్లు కనిగిరి డీఎ్సపీ రామరాజు తెలిపారు. స్థానిక డీఎ్సపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హనుమంతునిపాడు మండలం విరగారెడ్డిపల్లి గ్రామంలో రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధురాలు ఉడుముల ఆదిలక్షమ్మ మెడలో నుంచి బంగారు చైను గుంజుకుని దొంగలు పారిపోయారు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగతనానికి పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీఎ్సపీ తెలిపారు.
ప్రభుత్వం అందించే పథకాలు ప్రజల దరికి చేర్చేలా వివిధ శాఖల అధికారులు చొరవ వహించాలని నియోజకవర్గ స్పెషల్ అధికారి, జిల్లా ఉద్యానవనాధికారి గోపిచంద్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు పఽథకం ద్వారా జరుగుతున్న స్కూల్ నిర్మాణాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, త్రిపురాంతకం, తాళ్లూరు, కంభం, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు గిద్దలూరు, దర్శి ప్రాంతాల్లో 1520 హెక్టార్లలో బత్తాయి సాగవుతోంది. ప్రతి వేసవిలో వచ్చే కాపుతోనే రైతులు నాలుగు డబ్బులు వెనకేసుకుంటారు.
ఆ వృద్ధుడిది ఉన్నతాశయం. భార్య మరణం తర్వాత ఒంటరిగా ఉంటున్నారు. తన ఆస్తి పది మంది మంచికి ఉపయోగించాలనుకున్నారు. ఓ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైకాపా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పిలుపొచ్చింది. దీంతో ఆయన గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.