జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు సైతం భయపడే విధంగా సాగరుడు ఉగ్రరూపం దాల్చాడు. అలలు ఎగిరిపడుతూ తీరాన్ని తాకుతున్నాయి. సాధారణంగా మత్స్యకారులు వేట ముగిసిన తర్వాత పడవలను నిలుపుకునే ప్రాంతం వరకు అలల ఉధృతి కొనసాగుతోంది.
మొంథా తుఫాన్ ప్రభావం జిల్లాపై కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభమైంది. మంగళ, బుధవారాల్లో తీవ్రత మరింత ఎక్కువగా చూపనుంది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా.
జిల్లాలోని పశ్చిమ రైతులు ఇటీవలి వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. ఆ ప్రాంతంలో ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలలో అత్యధిక భాగం దెబ్బతిన్నాయి. అల్పపీడన ప్రభావంతో ఈనెల 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలతో ఆ ప్రాంతంలోని పత్తి, మిర్చి, పొగాకు, సజ్జ ఇతర పంటలకు నష్టం వాటిల్లింది.
మొంథా తుఫాన్ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. డాక్టర్లు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేశారు. ఆయా వైద్యశాలలకు అత్యవసర మందులను సరఫరా చేశారు. 108 వాహనాలు 40, 104 వాహనాలు 38, 102 వాహనాలు 18 కలిపి 96వాహనాలను అందుబాటులో ఉంచారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరోగ్య భరోసా లభిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. సోమవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు రూ. 60. 99 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీ కాలం ఏడాది కాకుండా కనీసం రెండేళ్లకు పెంపు, గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యంగా మారిన కమిటీల రోజువారీ కార్యకలాపాలను విస్తృతపరిచి పూర్వవైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో సమావేశమై ఈమేరకు తీర్మానం చేశారు.
ఎర్నాకుళం ఎక్స్ప్రె్సలో 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకున్నటు ్లఈగల్ టీమ్ సీఐ సుధాకర్ తెలిపారు. సోమవారం ఈగల్ టీమ్ ఒంగోలు రైల్వే స్టేషన్నుంచి కావలి వరకు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు.
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మొన్నటివరకూ అందుబాటులో ఉన్నా ఇప్పుడు ఒక్కసారిగా పెరిగాయి. ప్రతి కూరలోనూ రుచి కోసం వినియోగించే టమాటా 25 కిలోలు బాక్స్ రూ.1000 ధర పలుకుతోంది.
బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 8,140.18 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
గిద్దలూరు పట్టణం 20వ వార్డు మాజీ కౌన్సిలర్ కుమారుడు పాలకవీటి బాలచెన్నయ్య వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయనతోపాటు అతని అనుచరులకు ఎమ్మెల్యే అశోక్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మొంథా తుఫాన్ నేపథ్యంలో గిద్దలూరు ప్రాంతం మీదుగా వెళ్లే సగిలేరువాగు పరిస్థితిని అధికారులు సోమవారం పరిశీలించారు. మొంథా తుఫాన్ ప్రత్యేక అధికారి అబ్దుల్ రహీం, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, ఎంపీడీవో సీతారామయ్య, పంచాయతీరాజ్ ఏఈ సూరె సుబ్బారావు, వీఆర్వో వై.పి.రంగయ్య, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, వీఆర్ఏలు, పోలీసులు దిగువమెట్ట తాండా వ ద్ద గల సగిలేరువాగును పరిశీలించారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు న అధికారులు, సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి పి.భాస్కర్బాబు అన్నారు.
‘మొంథా’ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి కోన శశిధర్ ఆదేశించారు.
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత తప్పనిసరన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో... పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూలు ప్రకటించింది.
ఆర్టీవీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కోమటికుంట దగ్గర బస్సు అదుపుతప్పి ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు.