కొండపి నియోజకవర్గంలో ఈనెల 21న ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామిలతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నమద్యం ముడుపుల కేసు వ్యవహారం జిల్లాలోని వైసీపీ నేతల్లోనూ గుబులు రేపుతోంది. కోర్టుకు సిట్ సమర్పించిన 3వ చార్జిషీట్లో వైసీపీకి చెందిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పేరును ప్రస్తావించింది. అందులోనే పొదిలి కేంద్రంగా నగదు పంపిణీ జరిగినట్లు, ఆమొత్తం ఒంగోలులో వైసీపీ వలంటీర్లకు అందినట్లు పేర్కొనడం ఆందోళన పెరగటానికి కారణమైంది.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో 51 విచారణ రెండో రోజైన బుధవారం కూడా తూతూమంత్రంగానే సాగినట్లు సమాచారం. విచారణాధికారైన సహకార శాఖ అదనపు కమిషనర్ గౌరీశంకర్ రెండో రోజు ఉదయాన్నే బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే గడిపినప్పటికీ విచారణ పెద్దగా సాగలేదని సమాచారం. కీలకమైన రికార్డులను బ్యాంకు అధికారుల నుంచి ఆయన పొందలేకపోయినట్లు తెలుస్తోంది.
శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభవుతున్నాయి. ఈ సమయంలో జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు అందరూ ఒకచోట ఉంటారు. ముఖ్యమంత్రితో సహా మొత్తం రాష్ట్ర మంత్రివర్గం, ఉన్నత స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. దీంతో జిల్లాకు సంబంధించిన ప్రధాన అభివృద్ధి అంశాలు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
పెద్దారవీడు మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులపై గూడుపుఠాణీ జరుగుతోంది. ప్రజలకు, ప్రజాప్రతి నిధులకు తెలియకుండానే సామాజిక తనిఖీలు చేసిన వారికి, ఆయా పనులను పర్యవేక్షించిన సిబ్బందికి మధ్య జరిగిన చీకటి ఒప్పందాల మేరకు నివేదికలను తారుమారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురిసింది. బుధవారం తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో మొదలైంది. పిడుగుల శబ్దాలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో భారీవర్షం కురిసింది.
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భార్యను కట్టేసి బెల్ట్తో బాదుతూ, కాళ్లతో తన్నుతూ క్రూరంగా హింసించిన భర్త కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మూడు బృందాలను రంగంలోకి దించారు.
ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను బుధవారం ఘ నంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి కార్యక్రమంలో పాల్గొని బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ను ఆయన కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజకీయాలపైనే కాకుండా ప్రజల మనోభావాలపై కూడా ముద్ర వేసిన మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. సర్వజన వైద్యశాలను బుఽధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులలో తిరిగి రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ప్రస్తుతం పెరిగిన ఓపీల సంఖ్యకు తగినట్లుగా సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు.
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో భార్యను పందిరికి కట్టి అతి క్రూరంగా హిసించిన వ్యక్తి, అతనికి సహకరించిన మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
అనారోగ్య సమస్యలు లేక కాదు. దూర ప్రాంతాల వారు ఒంగోలు నగరానికి వెళ్లాలంటే కనీసం రూ.500లు ఖర్చవుతుంది. అందుకే వాటిని భరిస్తూ కాలం వెల్లబుచ్చుతున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు.
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామని నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మురళీధర్ హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైళ్లలో గంజాయి రవాణా జరుగుతున్నట్లు గుర్తించామని, వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తూ పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుంటునట్లు వివరించారు.
కొత్తపట్నం మండలంలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రతిపాదించిన భూముల వివరాలు సర్వే సంఖ్యల వారీగా పంపాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) జిల్లా ఉన్నతాధికారులను కోరింది.
స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలన్నీ ఇకపై పక్కాగా ఉండనున్నాయి. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘మన డబ్బులు-మన లెక్కలు’ పేరిట ప్రత్యేక యాప్ను తీసుకొస్తోంది.
ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు కృష్ణుడి ఆలయంలో చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఆలయద్వారం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
‘కరేడులో ఇండో సోల్ వద్దు..దొనకొండే ముద్దు’ నినాదంతో ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.