ఒంగోలు నగరంలో ఇంటి పట్టాలకు సంబంధిం చి పునఃపరిశీలన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ స్థానిక రామ్నగర్, అన్నవరప్పాడులో గ తంలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారుల గృ హాలను సందర్శించి ఆయా పట్టాలను పరిశీలిం చారు.
ఉపాధ్యాయ ఉద్యోగాలకు నిర్వహించే డీఎస్పీ పరీక్షకు ఆంధ్రా సివిల్స్గా పేరు. ఇందులో కొలువు సాధిస్తే చక్కటి జీత భత్యాలతోపాటు, సమాజంలో మంచి గుర్తింపు సైతం లభిస్తుంది. అందుకే చాలా మంది దీనికి పోటీపడతారు.
బియ్యంకార్డు నిత్యావసర సరకులకే కాదు, ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం అందాలన్నా తప్పనిసరి. అంతటి ప్రాధాన్యం ఉన్న రేషన్ కార్డుల జారీతోపాటు, మార్పులు, చేర్పులకు సంబంధించి వైకాపా ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో జిల్లాలోని వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.
వైకాపా ప్రభుత్వ హయాంలో భూచోళ్లు చేపట్టిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రీహోల్డ్ను అడ్డం పెట్టుకొని సుమారు 25,331.60 ఎకరాలను అక్రమంగా నిషిద్ధ జాబితాలోంచి తప్పించారని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. 2003కు ముందు అసైన్ చేసిన భూములపై అనుభవదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ నాటి వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలో మూత్రపిండాల వ్యాధిగ్రస్థులు ఏటా పెరుగుతూనే ఉన్నారు. జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లతోపాటు, ఫ్లోరైడ్ సమస్య కూడా ఒక కారణంగా నిలుస్తోంది. కనిగిరిలోని డయాలసిస్ కేంద్రంలో అయిదేళ్ల క్రితం 50 మంది రోగులు ఉంటే ప్రస్తుతం 122 మందికి చేరారు.
పాఠశాల, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే మంచి ఆహారంతోపాటు, మౌలిక వసతులు సమకూర్చాలి. వైకాపా ప్రభుత్వం వసతి గృహాల్లోని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించింది. కూటమి ప్రభుత్వం రాగానే సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
దివ్యాంగ పిల్లలను గుర్తించి వారికి విద్యా బోధనతోపాటు, ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర సమగ్ర శిక్షా ఎస్పీడీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 13 నుంచి భవిత కేంద్రాల సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు.
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా తొలి దశలో ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో పూర్తయింది. కొంతమందికి సాంకేతిక సమస్యలు రావడంతో డీఈవో కార్యాలయాన్ని సంప్రదించారు.
ప్రస్తుత వేసవి సెలవుల్లో యువత బండి సరదాతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కొందరు అత్యుత్సాహంతో విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు ఇంట్లో చెప్పకుండానే స్నేహితులతో కలిసి రోడ్డుపై దూసుకెళ్తుండడంతో అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారు.
నగరానికి తాగునీటి కోసం వినియోగిస్తున్న గుండ్లకమ్మ జలాశయంలో నీరు చేపలు, రొయ్యల చెరువుల వల్ల కలుషితమవుతున్నట్లు ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పందించారు. ఈ మేరకు అధికారులను నివేదిక కోరారు.
ఒంగోలు జాతి ఎడ్లు రాజసానికి, రైతు గొప్పతనానికి నిదర్శనమని రాష్ట్ర శాప్ ఛైర్మన్ రవినాయుడు, కనిగిరి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, నజీర్ అహ్మద్ అన్నారు. మండలంలోని వెంగళాపురంలో హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరిగాయి.
పొన్నలూరులలో గురువారం విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన యువకుడు వెలగపూడి మహేంద్ర హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే ఉద్యోగం వచ్చిన సందర్భంగా హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆంజనేయ స్వామి.
ఒంగోలు ట్రిపుల్ఐటీ కళాశాల ఎక్కడికీ తరలిపోవడం లేదని, ఒంగోలులోనే కొనసాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్సబీవీ స్వామి స్పష్టంచేశారు.
గత వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక పోగా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా అడ్డుకుంది. పెద్దారవీడు మండలంలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు నిలిచిపోవడం వైసీపీ పాలనలో చిత్తశుద్ధికి అద్దం పడుతుంది.
మండలంలోని పలు పంచాయతీల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏకారణం చేతనో ఉన్నతాధికారులు సైతం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మండలంలోని వెంగళాపురం సమీపంలో ఉన్న అభయాంజనేయస్వామిని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్అహ్మద్లు గురువారం ద ర్శించుకున్నారు. 36 అడుగుల అభయాంజనేయస్వామి ప్రాంగణంలో హ నుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు.