కరవుసీమలో పారిశ్రామిక వెలుగులు విరబూయనున్నాయి. అందులో భాగంగా పీసీపల్లి మండలం గుంటూరు లింగన్నపాలెం సమీపంలో సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా... స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఔత్సాహికులకు భారీ మొత్తంలో బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంది.
గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా నిర్వహించేందుకు 2014-19లో అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి చెత్త ఎత్తిపోసే యంత్రాలు, తరలించే ఆటోలను కొనుగోలు చేసింది. లబ్ధిదారులకు అందజేసే క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ నిలిచిపోయింది.
తరచూ ఏర్పడుతున్న అల్పపీడనాలు, తుపాన్లు జిల్లాలోని సముద్ర తీరంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రక్షణ చర్యలు లేకపోవడం, అలల ఉద్ధృతి కారణంగా కోతకు గురై సమీప గ్రామాల వారికి ముప్పు వాటిల్లుతోంది.
పొలాలకు చుట్టూ తిరిగి వెళ్లలేక.. ప్రమాదమని తెలిసినా కుంగి పోయిన వంతెనపై నుంచే రైతులు, కూలీలు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. మరోవైపు ఉన్న కొద్దిపాటి ఊతం కూడా ఊడిపోయేలా పిల్లర్ కోతకు గురైంది.
‘మొంథా తుఫాన్తో వాటిల్లిన నష్టాన్ని గుర్తించాం. ప్రభుత్వానికి క్షేత్రస్థా యిలోని పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇస్తాం’ అని కేంద్ర బృందం సభ్యులు భరోసా ఇచ్చారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పి.పౌసు మిబసు, మహేష్కుమార్, శశాంక్ శేఖర్రాయ్, సాయిభగీరథ్లతో కూడిన బృందం సోమవారం జిల్లాకు వచ్చింది.
జిల్లాలో డ్వామా పర్యవేక్షణలో జరుగుతున్న వాటర్ షెడ్ పనుల అమలులో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు రెండు అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా వాటర్షెడ్ పనులు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరుగుతున్నాయి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి జిల్లాకు వస్తున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన ఇది మూడోసారి కాగా మూడు విడతలు పశ్చిమ ప్రాంతంలోనే పర్యటించడం విశేషం. అందులోనూ సీఎం గతంలో పాల్గొన్న రెండు, మంగళవారం పర్యటన కూడా రాష్ట్రస్థాయి కార్యక్రమాలే.
గుంటి గంగమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవస్థాన అన్నదాన సత్రం పేరిట నిధులు సమకూర్చి భవనాన్ని నిర్మించారు. అయితే ఆలయ కమిటీ తాజా మాజీ చైర్మన్ దాన్ని శ్రీగంగమ్మ అన్నదాన ట్రస్ట్ సత్రంగా మార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాళాలతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని తన సొంతమన్నట్లు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం మార్చడం పట్ల దాతలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతం.. ప్రత్యేకించి కనిగిరి నియోజకవర్గ భవిష్యత్తుకు భరోసా లభించింది. గత ఏప్రిల్లో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి కనిగిరి నియోజకవర్గంలోనే శ్రీకారం పలికారు. తాజాగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభోత్సవం చేస్తున్నారు. రేపోమాపో ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణానికి శంకుస్ధాపన జరగబోతోంది.
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం వెలిగొండ ప్రాజెక్టును మరోసారి సందర్శించనున్నారు. ఈనెల 7న ప్రాజెక్ట్ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించిన ఆయన పనుల పురోగతిని పరిశీలించేందుకు మళ్లీ వస్తానని చెప్పారు.
ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ కారణంగా ఒంగోలు నియోజకవర్గ పరిధిలో వివిధ శాఖలలో మొత్తం రూ. 92 కోట్లు నష్టం వాటిల్లిందని, బాధితులను ఆదుకుని నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేంద్ర బృందాన్ని కోరారు. సోమవారం ఒంగోలు విచ్చేసిన కేంద్ర బృందాన్ని కొత్తపట్నం మండలం చింతల వద్ద ఎమ్మెల్యే దామచర్ల కలిసి నష్టం వివరాలను తెలియజేశారు
గ్రానైట్ పరిశ్రమ సమస్యలపై పరిష్కార దిశగా ప్రభుత్వం నియమించిన కమిటీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. సమస్యల అధ్యయనానికి ఫ్యాక్టరీ ఓనర్లు విన్నవించుకున్న డిమాండ్లను ఫీల్డ్ లెవెల్లో పరిశీలించటానికి మైన్స్ అధికారులు సోమవారం చీమకుర్తి మండల పరిధిలోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీలను పరిశీలించారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు చెప్పారు. సోమవారం మండలంలోని గంగాపాలెం సమీపంలో ఎంఎ్సఎంఈ(చిన్న, మధ్యతరహా సంస్థలు) పార్క్ స్థలాన్ని మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డితో కలిసి ఎరిక్షన్బాబు పరిశీలించారు.
జిల్లాలో సోమవారం ప్రాచీన శివలింగం, నంది విగ్రహాలు బయటపడ్డాయి. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం గ్రామ సమీపంలో తంగిరాల వద్ద గుండ్లకమ్మ నది మధ్యన చట్టులో కనిపించాయి
కొండ కనుమల్లో మారుమూల గ్రామాల్లో కోట్ల రూపాయల వెచ్చించి ప్రజాప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తోంది. ఈక్రమంలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలానికి మహర్దశ పట్టింది.
అనారోగ్య పరిస్థితులలో ఆర్థికంగా సతమతమవుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా ఇస్తుందని ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు.