వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రమాదంలో పడిన పాఠశాల విద్యను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పిల్లలకు మెరుగైన బోధన అందించాలన్న విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సంస్కరణలు చేపడుతున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాల్లోనూ పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. ఇతరత్రా పనులున్నాయన్న కారణంతో సిబ్బంది పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో వివరాల నవీకరణకు అవస్థలు తప్పడం లేదు.
పక్కపక్కనున్న ఇరు కుటుంబాల వారు గొడవ పడి పరస్పరం ఫిర్యాదులు చేయగా, పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన దొనకొండ మండలంలోని రుద్ర సముద్రంలో చోటు చేసుకుంది.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రీజనల్ స్థాయిలో గెలిచిన జూనియర్స్, సీనియర్స్ జట్లు రాష్ట్ర స్థాయిలో తలపడుతున్నాయి.
తర్లుపాడు మండలం కేతగుడిపి పంచాయతీ బుడ్డపల్లెలో వంద ఎకరాల పశువుల మేత బీడు ఆక్రమణకు గురైందని గ్రామానికి చెందిన ఏడుకొండలు... ముఖ్యమంత్రి చంద్రబాబును గత నెలలో కలిసి ఫిర్యాదు చేశారు.
చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అక్బర్ వలి. ఒంగోలు డెయిరీ ఎదుట కర్నూలు రోడ్డులోని ఆక్రమణల తొలగింపులో భాగంగా ఈయనకు చెందిన గ్యాస్ వెల్డింగ్ దుకాణమూ పోయింది.
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే ఆటోలకు డ్రైవర్ పక్కన ఉన్న సీట్లు, వెనుక వైపున ఉన్న అదనపు సీట్లను యర్రగొండపాలెం ఎస్ఐ…
మార్కాపురం పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రెండు మాసాలుగా మిరప కోతలు ఉధృతంగా సాగుతుండడంతో పట్టణం నుంచి కూలీలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆటోల్లో పరిమితికి మంచి ఎక్కి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మెనూలో ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల విద్యార్థులకు ఒకే మెనూను అమలు చేసేవారు. అయితే రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు ఉన్నాయి. ఈనేపథ్యంలో జోన్ల వారీగా మెనూను ప్రభుత్వం ప్రకటించింది.
Market slowdown in Karnataka ప్రస్తుత సీజన్ ఆంధ్రలో ప్రత్యేకించి దక్షిణాదిలోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపి స్తున్నాయి. అందుకు కర్ణాటకలో కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటమేనని తెలుస్తోంది.
గుండ్లకమ్మ ప్రాజెక్టులో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో నీటి నిల్వ చేసే అవకాశం వచ్చింది. గతంలో వలే 3.40 టీఎంసీలు నిల్వ చేయనున్నట్లు ప్రాజెక్టుల ఎస్ఈ నాగమురళీమోహన్ తెలిపారు. ఇప్పటివరకు జలవనరుల శాఖ ఎన్నెస్పీ అద్దంకి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న ఆయన్ను మూడు రోజుల క్రితం ఒంగోలులోని ప్రాజెక్టుల ఎస్ఈగా ప్రభుత్వం నియమించింది.
జిల్లాలోని 38 గ్రామాల్లో సోమవారం నుంచి రీసర్వే ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారుల బృందాలు సర్వే ప్రారంభించాయి. ప్రభుత్వ భూములతోపాటు దేవదాయ, రైతుల భూములను రీసర్వే చేసి రికార్డులను పకడ్బందీగా తయారుచేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంది.
వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పాలక మండళ్ల రిజర్వేషన్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ విషయంలో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల అభ్యంతరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్గా స్పందించడంతో అడుగు ముందుకు పడింది.
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : మహిళా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చినప్పుడే ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడంతో పాటు దేశాభివృద్ధి చెందుతుందని ఎంపిపి నలమలపు అంజమ్మ, ఎంపిడిఒ వై మహాలక్ష్మి పేర్కొన్నారు.…
ప్రజాశక్తి-పొన్నలూరు : పొన్నలూరు పోలీస్ స్టేషన్ను కొండేపి సిఐ సోమశేఖర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడుతూ స్టేషన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని…
గ్రామాలలో అంతర్గత మట్టిరోడ్లను సీసీ రోడ్లుగా అభివృద్ధి చే సేందుకు రూ.4.2 కోట్లు నిధులు మం జూరైనట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
బతుకుదెరువుకు పట్నమొచ్చి స్థిరపడిన వారు, స్థానిక నిరుపేద కార్మికులు ఎందరో. వీరిలో చాలా వరకు అరకొర ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో2014-19 మధ్య శ్రమశక్తి సంఘాలుండేవి. వైకాపా గద్దెనెక్కాక నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వీటిని పునరుద్ధరిస్తూ కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది.
‘గత అయిదేళ్ల వైకాపా పాలన అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసింది. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ని అధఃపాతాళానికి నెట్టింది. లెక్కకు మించి చేసిన అప్పులు.. ఎలా పరిపాలించకూడదో తెలుపుతూ చేసిన తప్పులనే వారసత్వ సంపదలుగా మిగిల్చింది’.
వర్షపాతం తక్కువగా నమోదయ్యే రాయలసీమ ప్రాంతం మాది. నాన్న సాధారణ రైతు.. అమ్మ గృహిణి. తల్లిదండ్రులకు నేను, చెల్లి సంతానం. మా ఇద్దరికీ మంచి చదువులు చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనేది వారి ఆశ.
జిల్లాకు చెందిన మన్నం శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు 2022లో రద్దయిన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం పేరుతో విరాళాలు సేకరిస్తున్నారని పేర్కొంటూ శనివారం విజయవాడలోని తెదేపా కార్యాలయంలో హోంమంత్రి అనితకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షలు ఖర్చయ్యే క్యాన్సర్ శస్త్ర చికిత్సను జీజీహెచ్ వైద్యులు ఉచితంగా చేసి పేద మహిళ ప్రాణాలు కాపాడారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్.
వాహన చోదకుల నిర్లక్ష్యానికి ఇద్దరు వృద్ధులు బలయ్యారు. శనివారం జిల్లాలో వేర్వేరుచోట్ల ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.