[03:12] మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో పరిస్థితి చూశారా.. ఎంతోమంది ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చే ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులే డుమ్మా కొట్టారు.
[02:54] దొనకొండ మండల కేంద్రం నుంచి చందవరం వెళ్లే రహదారిలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతిగృహం ఉంది. దీనికి ఎడమ వైపు ప్రహరీ కంటే ఎత్తులో పెద్ద పాముల పుట్ట ప్రమాదకరంగా కనిపిస్తోంది.
[02:54] వారిద్దరూ అన్నదమ్ములు. స్నేహితుల్లా ఉండేవారు.. ఏ పనైనా కలిసే చేసేవారు..కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం తొలుత తమ్ముడు గుండెపోటుకు గురై కన్నుమూయగా గుండెలవిసేలా రోదించి అన్న కూడా కుప్పకూలి ప్రాణాలు విడిచారు.
[02:54] గ్రానైట్ పరిశ్రమ నుంచి అధిక మొత్తంలో ఖజానాకు ఆదాయం తీసుకురావాలన్న ధ్యాస తప్ప వ్యాపారాన్ని పెంచే మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
[02:54] దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్-హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద సోమవారం మహా ధర్నా చేపట్టారు.
ఒంగోలు లోక్సభ స్థానంపై టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మళ్లీ దృష్టి సారించారా? అన్న ప్రశ్నకు తాజా పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. అధికార పార్టీలోని ముఖ్యులతోపాటు కిందిస్థాయి నాయకుల్లో కొద్దిరోజులుగా ఇదే విషయం చర్చనీయాంశం గా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు, నిన్నటికి నిన్న మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైవీ పర్యటనలు, ఆ సందర్భంగా చేసిన ప్రసంగాలు, ఆయన్ను ఉద్దేశించి మిగిలిన నాయకులు చేసిన వ్యాఖ్యానాలను పరిశీలిస్తే వైవీ చూపు ఒంగోలుపై ఉన్నట్లు అర్థమవుతుంది.
ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ వైద్యం అందించిన ఈ ఆసుపత్రిలో ఇప్పుడు సాధారణ జబ్బులకూ చికిత్స అంతంతమాత్రంగానే అందుతోంది. అరకొర వైద్య సదుపాయాలు, వైద్యుల కొరత కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తున్న రోగులకు భయం తప్ప భరోసా లభించడం లేదు.
ప్రభుత్వ ఉద్యోగులంతా ముఖఆధారిత హాజరు కచ్ఛితంగా వేయాల్సిందేనని కలెక్టర్ దినేష్కుమార్ స్పష్టం చేశారు. దీని ఆధారంగానే జీతభత్యాల చెల్లింపు ఉంటుందని తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో సోమవారం ఆయన డయల్ యువర్ కలెక్టర్, అనంతరం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మినహాయించినవి తప్ప మిగిలిన శాఖల ఉద్యోగులంతా విధిగా ముఖ హాజరు వేయాలన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వమంటే బెదరిస్తున్నారని పెద చెర్లోప ల్లికి చెందిన బాధితుడు ఎస్పీ మలిక గర్గ్కు ఫిర్యాదు చేసారు. సోమ వారం స్థానిక పోలీస్ కార్యాలయ ఆవరణంలోని గెలాక్సీ భవ న్లో జరిగిన స్పందన కార్యక్రమంలో పెద చెర్లోపల్లికి చెందిన బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేసారు.
పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ సీనియర్ నాయకుడు చలువాది వెంకటస్వామి (68) అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం చీమకుర్తిలో అంత్య క్రియలు నిర్వహించారు.
దొనకొండ కస్తూరీభా గాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ) విద్యార్థినీ విప్పర్ల సుప్రియ(15) కొద్ది రోజులుగా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వైద్యం పొందుతూ సోమవారం మృతి చెందింది.
కనిగిరి, నగర పంచాయతీ పరిధిలోని శివారు కాలనీల వాసులు పలు సమస్యలతో అల్లాడిపోతున్నారు. అభివృద్ధి లేకపోగా.. పన్నుల బాదుడిని భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాశిరెడ్డి కాలనీ, పాతూరు ప్రజలు పలు సమస్యలతో తిప్పలు పడుతున్నారు. మౌలిక వసతులు కరువై అల్లాడుతున్నారు. నగర పంచాయతీ అయ్యాక పన్నులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయే తప్ప వసతులు కల్పించలేదు. దాదాపు 300 వరకు గృహాలున్న కాశిరెడ్డికాలనీని సైతం పాలకులు పట్టించుకోవడం లేదని ఆ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముండ్లమూరు మండలంలోని వేములబండ గ్రామానికి చెం దిన దుగ్గినేని కృష్ణమ్మకు చెందిన పాడుబడిన ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అర్హులైన అందరికీ సంక్షేమ పథకా లను అందిస్తామని ఎమ్మెల్యే బాలి నేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడపగ డపకు కార్యక్రమంలో భాగంగా సో మవారం 31వ డివిజన్ పరిధిలోని మా మిడిపాలెంలో కార్పొ రేటర్ నా గజ్యోతి, నాగేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు.
అద్దంకి పట్టణంలో ట్రాఫిక్పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా పట్టణం పరిధిలోని నామ్ రోడ్డులో పలు కూడలి ప్రాంతాలలో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడ టంతోపాటు వాహనాలు అడ్డదిడ్డంగా నడుపుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్రెడ్డి అనుసరిస్తున్న విధా నాలు అత్యంత దారుణంగా ఉన్నాయని సీపీ ఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ధ్వజ మెత్తారు. ఎన్నికల ముందు ఇళ్లు కట్టి ఇస్తా మని హామీ ఇచ్చిన జగన్ అఽధికారంలోకి వ చ్చాక విస్మరించారని ఆరోపించారు.
విపత్తు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదమిత్రులు త మ బాధ్యతలను బాధ్యతా యు తంగా నిర్వహించి బాధిత ప్రాం త ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడాలని కలె క్టర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని స్పందన హాలులో సో మవారం విపత్తుల నిర్వహణపై శిక్షణ పొందిన వలంటీర్లకు కలెక్టర్ కిట్లను అందజేశారు.
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను వెంటాడి ఆటోలోని బియ్యాన్ని, అలాగే రేషన్ షాపులో నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం వేకువజామున పట్టుకున్నారు.