జిల్లాలో మంగళవారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు జరగనున్న ఏపీపీఎ్ససీ పరీక్షలకు పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేషు ఆదేశించారు.
నివాస గృహాలపై వెళుతున్న విద్యుత్లైన్ తొలగించాలని గ్రామస్థులు పలుమార్లు విద్యుత్ సిబ్బందికి మొరపెట్టుకొన్నారు. అయి నా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇంటిపైన ఆడుకొంటున్న ఎనిమిదేళ్ల బాలికకు విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడింది.
కనిగిరి మండలం బల్లిపల్లి వద్ద నూతనంగా నిర్మించనున్న త్రిపుల్ ఐటీ నిర్మాణానికి సంబంధించిన భూములను మంగళవారం అధికారులతో కలిసి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి మంగళవారం పరిశీలించారు.
భవిష్యత్తులో డిగ్రీ పట్టా అందుకోవాల్సిన విద్యార్థులు కోర్సులో ప్రవేశానికి ఎదురు చూస్తున్నారు. జులై మొదటి వారానికి డిగ్రీ ప్రవేశాలు పూర్తయి తరగతులు మొదలుకావాలి.
ఒంగోలు నగరంతోపాటు జిల్లాలోని మరో మూడు పట్టణాల దాహార్తి తీర్చడానికి అమృత్-2 పథకం కింద నిధులు మంజూరయ్యాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పథకం కింద అడుగు ముందుకు పడలేదు.
చిన్నారులు బాల్య దశలో ఎదగడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నవ చేతన, ఆధార్ శిల పుస్తకాలు రూపొందించింది. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలు పంపిణీ చేశారు.
సాంకేతికతను సద్వినియోగం చేసుకుని నేరాల నియంత్రణకు కృషి చేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. ఉన్నత పాఠశాల వరకు ఆడిపాడిన వారికి కళాశాలలకు వచ్చేసరికి ఆటలు ఆడించేందుకు శిక్షకుల్లేక శిక్షణే లేకుండాపోయింది.
గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3.1 కేజీల గంజాయితో పాటు రూ.9.6 లక్షల విలువైన సొత్తును జరుగుమల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా లారీ ఢీకొని ఒకరు తీవ్రంగా, మరో అయిదుగురు స్వల్పంగానూ గాయపడ్డారు. ఈ సంఘటన టంగుటూరు మండలం శివపురం 16వ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది.