మరొకరు తీవ్ర గాయాలు ప్రజాశక్తి-పెదరాయపాడు : ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన పెదరాయపాడు వేంపాడు రహదారిలో శుక్రవారం ఉదయం జరిగింది. వేంపాడు గ్రామానికి…
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు.
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది.
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు.
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు.
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది.
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని మాదిగలను నమ్మించి వంచించిన ద్రోహి జగన్రెడ్డి అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ అన్నారు. అమరావతి గ్రౌండ్స్లో గురువారం కూటమి సంఘీబావ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తన తండ్రి చివరి కోరిక అని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మా ట తప్పిన మాదిగ ద్రోహి జగన్ అని దుయ్యబట్టారు. వైసీపీ వచ్చాక దళితులపై దాడులు పెచ్చురిల్లాయన్నారు. పైకి మాత్రమే నా ఎస్సీలు అంటూనే లోలోపల ఎస్సీలను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి 10రోజులు అవుతున్నా కోడ్ అమలు చేయడంలో అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. నిబంధనలు అమలు చే యాల్సిన అధికారులు ఇంకా అలసత్వం వీడడంలేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలంలోని టిడిపి నేత చిలకా ఇజ్రాయేలు గురువారం యర్రగొండ పాలెంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీలో చేరారు. ఆయనతో పాటు టిడిపి నుంచి 35 కుటుంబాల…
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: మండలంలోని నిడమానూరులో గురువారం ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రానున్న…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలం అక్కపాలెం గ్రామంలోని పది వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరంతా గురువారం యర్రగొండపాలెంలోని టిడిపి కార్యాలయానికి వచ్చి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి…
పని వికేంద్రీకరణలో భాగంగా ఇంటర్ మా ర్కుల స్కానింగ్కు ఈఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆయా మూల్యాం కన కేంద్రాల వద్దే ఏర్పాట్లు చేశారు. వచ్చేనెల 4వతేదీతో ఇంటర్మీడియేట్ జ వాబుపత్రాల మూల్యాంకనం పూర్తికానుంది.
ఎన్నిక కోడ్ వచ్చిన తరువాత అద్దంకి ప్రాంతంలో ఇసుక రవాణాపై మైనింగ్ అధికారుల తనిఖీలు పెరిగాయి. దీంతో ఇసుక రవాణా పూర్తిగా నిలిచింది. దీనినిబట్టి ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగాయన్న అనుమానాలకు మరింత బలం చేకూరింది. గుండ్లకమ్మ నదిలో అద్దంకి ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి రీచ్ను అధికారికంగా గుర్తించలేదని గ తంలో మైనిగ్ అధికారులు ప్రకటించారు.
జిల్లాలో ఎన్ని కల కోడ్ అమలులో ఉన్నందున లైసెన్సులు కలిగి న ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. కొత్తగా ఎ లాంటి లైసెన్సులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో దివాళా తీసిన రాష్ర్టానికి జనసత్వాలు అందించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
ప్రజాశక్తి-కనిగిరి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాక ముందు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడటమే కాకుండా వర్గీకరణ అనేది తండ్రి వైస్సార్ చివరి కోరిక అని ఆరోజు మాట ఇచ్చి అధికారంలోకి…
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు డిఎస్పి ఎం కిషోర్బాబు మండలంలోని అమ్మనబ్రోలు, కనపర్తి, రాపర్ల, మాచవరం, నాగులుప్పలపాడు తదితర గ్రామాల్లో గురువారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.…
‘ప్రజాశక్తి-మద్దిపాడు: మండల పరిధిలోని ఇనమనమెళ్లూరు గ్రామంలో గురువారం రెండోరోజు బాబు ష్యూరిటీ -భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్…
రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఆపార్టీ బాపట్ల పార్లమెం ట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. గురువారం సాయంత్రం మార్టూరులోని తూర్పుబజా రున ఉన్న వినాయక స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం లో వైసీపీ అరాచక పాలన అంతం కావాలని స్వామి వా రిని ప్రార్ధించినట్టు చెప్పారు. అనంతరం జరిగిన కార్యక్ర మంలో తూర్పుబజారుకు చెందిన వైసీపీకి చెందిన సీని యర్ నేత కొనకంచి మురళి తన అనుచరులతో ఏలూరి సమక్షంలో పార్టీలో చేరారు.
వారంతా నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన వధువు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు. తెలంగాణలోని పాల్వంచలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. వధూవరులతోపాటు ఇతర బంధుమిత్రులు బస్సులో వస్తుండగా, వారు కందుకూరు చేరుకునే లోపు ఇంటి వద్ద పనులన్నీ చక్కబెడదామన్న ఆలోచనతో ముందుగా కారులో బయల్దేరారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం దాటిన వెంటనే వారి కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుకు రెండో వైపు వెళ్లి మార్జిన్లో ఉన్న సిమెంటు దిమ్మెను ఢీకొట్టింది. దీంతో వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి అరుణ (50), చిన్నమ్మ కుమార్తె శ్రావణి (22), మేనమామ భార్య దివ్య (28) అక్కడికక్కడే మృతి చెందారు. వధువు సోదరుడు వేణు, మేనమామ వినోద్.. ఆయన మూడేళ్ల కుమారుడు అభిరామ్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.
రాష్ట్రంలో ఐదేళ్లు అరాచక పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. భావితరాల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని మూడు పార్టీలు ఎన్నికల్లో జత కలిశాయని చెప్పారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో గ్రామాల్లో వైసీపీ కనీసం తట్టెడు మట్టె కూడా వేయలేదన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ ముందే వైసీపీ ప్రలోభాల జాతర ప్రారంభించింది. ఓటర్లును ఆకట్టుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఒంగోలులో ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. షెడ్యూల్ ప్రకటనకు ముందే సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లపై నజరానాల వల విసిరిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఓటర్లకు గాలం వేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చీరలు, ఇతరత్రా తాయిలాల పంపిణీ ప్రారంభించారు. అయితే అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొందరు సీ విజిల్ను అస్త్రంగా చేసుకున్నారు. నగర పరిధిలోని గుత్తికొండవారిపాలెంలోని ఓ గోదాములో భారీగా చీరలు నిల్వ ఉన్న విషయమై బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఆగమేఘాలపై స్పందించి రూ. 20లక్షల విలువైన తాయిలను అధికారులు సీజ్ చేశారు. అయితే కేసు నమోదు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదేరోజు అర్ధరాత్రి నగరంలో వైసీపీ రంగులతో ఉన్న తోపుడు బండ్లను వైసీపీ నేతలు పంపిణీ చేస్తుండగా సీవిజిల్కు సమాచారం అండంతో 14 బండ్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ చర్యలు కరువయ్యాయి.
పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే వారు వచ్చేనెల 22వ తేదీలోపు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినే్షకుమార్ సూచించారు. అత్యవసర సర్వీసులో ఉండే 33శాఖల ఉద్యోగులకు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో జిల్లాలోని పార్లమెంట్, అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపే లక్ష్యంతో పనిచేయాలని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు తీర్మానించాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా బరిలోకి దిగుతున్న విషయం విదితమే.