సాధారణంగా ఓటరు జాబితాలో ఒకే కుటుంబంలోని పేర్లన్నీ వరస క్రమంలో ఒకేచోట ఉంటాయి. ప్రస్తుత జాబితాలో చాలావరకు ఓట్లు ఇలా కాకుండా తారుమారయ్యాయి. పోలింగ్ కేంద్రాలు సైతం మారిపోయాయి.
ఎన్నో కష్టనష్టాలకోర్చి వరి సాగు చేసిన రైతు వెన్ను విరిగింది. ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా చాలా మండలాల్లో వరి పంట దెబ్బతింది.
ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండపాలెం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు సన్నెపోగు విజయకుమార్(60) అనారోగ్యంతో ఆదివారం యర్రగొండపాలెంలోని ఇజ్రాయేలు పేటలో గల ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి…
ప్రజాశక్తి-మార్కాపురం: కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు అన్నారు. ఐక్య పోరాటాలతో ప్రభుత్వ…
ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమం పాఠశాలలో కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని యర్రగొండ పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో డిసెంబర్ నెల కోటా కందిపప్పు కార్డుదారులకు పంపిణీ చేయలేదు. కాగా డిసెంబర్ కోటాలో జిల్లా వ్యాప్తంగా…
ప్రజాశక్తి-కనిగిరి: ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా 45వ మహాసభలు డిసెంబర్ 12,13 తేదీల్లో ఒంగోలు నగరంలో జరుగుతాయని ఆ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్…
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : విశ్వబ్రాహ్మణులకు అందుబాటులో ఉంటానని. కార్పెంటర్లకు కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తానని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు హామీ…
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : అపార్ట్మెంట్ వాచ్మెన్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బిజి భవన్లో ఒంగోలు నగర అపార్ట్మెంట్ వాచ్మెన్…
జిల్లాలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతు న్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వి ద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన పరీక్ష ఫీజు రాయి తీ అక్కరకు రాకుండా పోయింది. సర్కారు విధించిన నిబంధనలతో ఒక్కరికి కూడా వర్తించకుండా పో యింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీల మోతలు.. కరెంట్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. జగన్రెడ్డి అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంలో మూడుసార్లు కరెంట్ చార్జీలు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. మండలంలోని మూలగుంటపాడులో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమంలో స్వామి మాట్లాడారు. గత టీడీపీ హయాంలో విద్యుత్రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి లోటు నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు.
వైద్యారోగ్యశాఖలో 2020లో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు బయటపడుతున్నారు. నకి‘లీలలు’ వెలుగు చూస్తున్నాయి. దీంతో అటు ఉద్యోగాలు పొందిన వారితోపాటు ఇటు నియామకాల సమయంలో పనిచేసిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వైద్యారోగ్యశాఖలో నియామకాలపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో కలెక్టర్ దినే్షకుమార్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
కనిగిరి ప్రాంతంలోని యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మున్సిపాల్టీ పరిధిలోని 9వ వార్డు బోయపాలెంలో ఆదివారం బాబు ష్యూరిటీ..భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఉగ్ర ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పాలెంలోని ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించారు. టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యను ఉగ్ర వివరించారు.
ప్రభుత్వం చేనేతను చిన్నచూపు చూస్తోంది. చేనేత చట్టాలు కొన్ని కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అందుకు చేనేత, జౌళి శాఖ అధికారుల ఉదాసీన వైఖరే కారణమని సగటు చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. పవర్లూమ్ వస్త్రాలు, చేనేత వస్త్రాలుగా చెలామణి అవుతున్నాయి.
కనిగిరి ప్రాంత ప్ర జలకు నిరంతరం కంటి వైద్య శిబిరాలతో పా టు వివిధ రకాల వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్కు కంటి పరిక్షల కోసం వ చ్చిన వృద్ధులను డాక్టర్ పేరు, పేరునా ఆప్యాయంగా పలకరించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన వృద్ధులు డాక్టర్ ఉగ్రకు చేతులెత్తి నమస్కరించారు. ఎంతో మంది పేదలకు కం టి చూపు దాతవయ్యావు, నీవు చల్లగా ఉండా లని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ రాజకీయంలో ఉన్నా, లేకు న్నా కనిగిరి ప్రాంత ప్రజలకు నిరంతం పలు కార్యక్రమాల ద్వారా సేవ చేస్తూనే ఉన్నానని అన్నారు.
తుఫాన్ ప్రభావంతో పం టలు నష్టపోయిన రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మిన్నకుం డటం సమంజసం కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి మండలాలలోని పలు గ్రామాల లో వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం ఎమ్మెల్యే రవికుమార్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పంటనష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.