రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్కల్యాణ్ తొలిసారిగా వినూత్నంగా ప్రారంభించిన ‘మన ఊరు- మాటామంతి’ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కొత్త అధ్యాయానికి గురువారం అంకురార్పణ జరిగింది.
ఆమదాలవలస పుర పరిధిలో ఆక్రమణల పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు. అయితే చెరువు లేదంటే స్థలాలు అది కాదంటే మట్టి, ఇసుక, కంకర ఇలా అన్ని వనరులను దోచేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ నాయకుల హస్తం కూడా ఉండటం గమనార్హం.
‘తెదేపాకు కార్యకర్తలే బలం, బలగం.. వారికి నాయకులు అందుబాటులో ఉండేలా చూసి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం.. ప్రతి కార్యకర్తకు పెద్దపీట వేసి వారి సమస్యలు పరిష్కార దిశగా కార్యాచరణ రూపొందిస్తాం’ అని కేంద్రమంత్రి రామ్మోహనాయుడు పేర్కొన్నారు.
సాధారణంగా బ్యాంకు నుంచి రుణం పొందడం అంత సులువేమీ కాదు. అలాంటిది వ్యవసాయేతర, కార్పొరేటేతర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు హామీ లేని రుణాలిస్తూ ఆర్థిక తోడ్పాటునందిస్తోంది ప్రధానమంత్రి ముద్రా యోజన(పీఎంఎంవై).
మద్యం మత్తులో స్నేహితుడిని గడ్డ కట్టిన సిమెంట్ బస్తాతో తలపై బాది హత్య చేసి పరారైన నిందితుడిని గురువారం విజయవాడ మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. జిల్లాలోని కల్యాణ వేదికలు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. జూన్ వరకు ముహూర్తాలు ఉండటంతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Seal charges Extra payment కాశీబుగ్గ సబ్డివిజన్లో మొత్తం 14 మండలాలు. వేలాది మంది ట్రేడర్లు. వారి వద్ద ఉన్న ధర్మకాటా(విద్యుత్ తూకం)కు కొత్తగా సీలు వేయాలంటే చలానా కన్నా రూ.400 అదనంగా ఇచ్చుకోవాల్సిందే. ఇదీ కాశీబుగ్గలో తూనికలు కొలతలశాఖ అధికారి టి.శ్రీధర్ అవినీతి భాగోతం. ఓ వ్యాపారి ముందుకు వచ్చి ఆయన అవినీతిపై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో గురువారం సాయంత్రం దాడులు చేయగా.. రూ.1.78 లక్షల అవినీతి సొమ్ముతో ఆ అధికారిని పట్టుకున్నారు.
Public interaction ఎండలమల్లన్న కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. రావివలస గ్రామాన్ని అభివృద్ధి చేసేలా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ చర్యలు చేపట్టారు. ప్రజలతో మమేకమై.. వారి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరి కోసం మాటామంతీ’ అనే స్ర్కీన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి సిక్కోలు నుంచే శ్రీకారం చుట్టారు.
ఆ యువకుడు ఉద్యోగం కోసం నంద్యాలలో శిక్షణ పొందుతూ వారం రోజుల కిందట స్వగ్రామం చొర్లంగి గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ లోని అక్క, బావలను చూసేందుకు వెళుతూ రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Indian Army Rare Honour సిక్కోలు మేజర్కు అపూర్వ గౌరవం దక్కింది. సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన ఆర్మీ మేజర్ మళ్ల రామ్గోపాలనాయుడుకు.. దేశ రక్షణ చరిత్రలోనే రెండో అత్యుత్తమ పురస్కారమైన ‘కీర్తి చక్ర అవార్డు’ లభించింది. గురువారం రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు.