ఎచ్చెర్ల క్యాంపస్: పంచాయతీలకు సంబంధించి పూర్తిస్థాయి పాలనాంశాలపై పట్టు అవసరమని పంచాయతీరాజ్ అసిస్టెంట్ కమిషనర్ ఇ.కృష్ణమోహన్ అన్నారు. ఎచ్చెర్లలోని...
కాశీబుగ్గ: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్లో భాగంగా ఆర్కే ఫౌండేషన్ నిర్వహించిన వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్దాన జానపద నృత్యానికి గుర్తింపు...
కోటబొమ్మాళి ప్రకాషనగర్ కాలనీకి సమీపంలో గల కొండ పక్కన ఉన్న జగనన్నకాలనీకి ఆనుకొని ఉన్న చెత్తసంపద కేంద్రం ఏర్పాటుచేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. పంచాయతీ పరిధిలోని చెత్త సేకరించి ఇక్కడ డంప్ చేస్తుండడంతో కుళ్లి దుర్వాసన వస్తుండడంతో రోగాల బారినపడుతున్నామని, దీనిని మరోచోటికి మార్చాలని జగనన్నకాలనీవాసులు డిమాండ్చేస్తున్నారు. ఇక్కడ కాలనీలో 115 మందికి స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం 70 ఇళ్లనిర్మాణం పూర్తికాగా 30 మంది గృహప్రవేశాలుచేశారు. జగ నన్న కాలనీలో ఇచ్చిన స్థలాల్లో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయం సరిపోక పోవడంతో అప్పులుచేసి ఇళ్లు నిర్మించుకున్నామని పలువురు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కాలనీ పక్కన ఉన్న చెత్తసంపద కేంద్రంలో వేసిన తడి, పొడిచెత్త వల్ల దుర్వాసన వస్తుండడంతో ఇబ్బందిప డుతున్నామని పలువురు వాపోతున్నారు.కాలనీకి ఎటువంటి మౌలిక సదుపా యాలు లేకపోయినా అష్టకష్టాలుపడి ఇళ్లు నిర్మిం చామని, ఇంతలో ఇక్కడే చెత్త సంపద కేంద్రం ఏర్పా టుచేయడంతో దోమలు స్వైరవిహారంచేస్తుండడంతో అవస్థలు పడుతున్నామని తెలిపారు. తక్షణమే పంచాయతీ అధికారులు స్పం దించి చెత్తసంపద క్రేందాన్ని మరో చోటకు మార్చాలని వారు కోరారు. కాగా తాను చెత్తసంపద కేంద్రాన్ని పరిశీలించి, మరోచోటికి మారుస్తానని ఎంపీడీవో ఫణీం ద్రకుమార్ తెలిపారు.
గార మండలం కె.మత్స్యలేశం బీచ్లో ఈ నెల 19న గల్లంతైన పదో తరగతి విద్యార్థి కూన ప్రవీణ్ (15) మృతదేహం పోలాకి మండలం రాజారాంపురం తీరంలో గురువారం గుర్తించారు.
తాడివలస పంచాయతీ కార్యదర్శి వెంకటరావు ఇంటి పన్నులు పంచాయతీ ఖాతాకు జమచేయకుండా అవకతవకలకు పాల్పడ్డారం టూ తాడివలస గ్రామానికి చెందిన చిగులపల్లి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎంపీడీవో సీపాన హరిహరరావు గురువారం విచారణ చేపట్టారు.
వంశధారకు వరదొస్తే చాలు.. నదీ తీర ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు కరువవుతోంది. నదిలో నీటిమట్టం పెరిగితే.. వారి గుండెల్లో గుబులు రేగుతుంది. ఒడిశాలోని వంశధార క్యాచ్మెంట్ ప్రాంతాలైన మోహన, గుణుపూర్ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురిస్తే.. వరదనీటితో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.
జీపీఎన్ విధానాన్ని క్యాబినెట్ ఆమోదించడంపై ఉద్యోగులు గురువా రం నిరసన తెలిపారు. ఈసందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీసీపీఎస్ఈఏ జిల్లా అధ్యక్షుడు తూముల సూర్యారావు, పీఆర్టీయూ నాయకులు ప్రసాదరావు, రుషి, శివకృష్ణ, ఎన్జీవో కొత్త తాలూకా అధ్యక్షుడు అల్లు తిరుపతిరావు, మిన్నారావు, రాజగోపాల్, ఏపీటీఎఫ్ నాయకులు వై.సత్యనారాయణ,సీపీఎస్ నాయకులు తిరు పతిరావు, ఇప్పిలి శ్రీనివాసరావు, అప్పారావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు.