మూగజీవాలకు పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పశుగ్రాసం కొరత ఏర్పడుతుందన్న ముందుచూపుతో.. గత టీడీపీ ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాల పెంపకానికి చేయూతనిచ్చింది. వ్యవసాయ, పశుసంవర్థకశాఖలు కలిసి మేలైన బహువార్షికం, ఏక వార్షికం గడ్డి విత్తనాలను సబ్సిడీపై అందించి క్షేత్రాల పెంపకానికి తోడ్పాటునిచ్చాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటికి స్వస్తి పలికింది.
మహా శివరాత్రి నాడు శ్రీశైౖలం మల్లన్నకు అలంకరించే చేనేత పాగాను పొందూ రులో సోమవారం ఊరే గించారు. లావేటి వీధికి చెందిన చేనేత కార్మికుడు బనిశెట్టి వీరాంజనేయు లు మల్లన్నకు పాగా నే శాడు. దీనితో పాటు భ్రమ రాంభకు చీర, విఘ్నేశ్వరు ని, బసవన్నకు ప్రత్యేక వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వస్త్రాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలో ఊరేగించారు.
నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్లు పూర్తయి నాలుగేళ్లు అవుతున్నా.. పనులు మాత్రం వేగవంతం కావడంలేదు. ఖరీఫ్ సీజన్ నాటికి కాలువ పనులు పూర్తిచేస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నా.. నిధుల సమస్య కారణంగా జాప్యమవుతోంది.
అదానీ గ్రూప్ కంపెనీలపై సమగ్ర విచారణ జరిపించా లని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు సోమవారం నగరంలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ హెచ్చరించారు.
కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడిచేసి వ్యాపారి కోట్ని రామారావు వద్ద నుంచి రూ.3.90 లక్షలు విలువ చేసే సుమారు 10 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రీ జనల్ విజిలెన్స్ అధికారి సురేష్బాబు ఆదేశాలతో ఈ దాడి చేశారు. రామారావుని విచారించగా లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు ఉంచానని అంగీకరించినట్లు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సింహాచలం తెలిపారు. బియ్యా న్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు. రామారా వుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ అశోక్కుమార్, సిబ్బంది రామ్మోహన్, ఉమ, అప్పన్న, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేర కు టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి గ్రామ సచివాలయం-4 పరిధిలోని సుమారు 30 మంది రైతులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయానికి తమ సమస్యను విన్నవించుకునేం దుకు వచ్చారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, ఇది చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం పోలీసులతో పాదయాత్రకు అడు గడుగునా ఆటంకాలు కలిగిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రను చూసి తాడేపల్లి ప్యాలెస్లోని జగన్ రెడ్డికి చెమటలు పడు తున్నాయన్నారు.
మత్తు పదార్థాలు, మాదక దవ్యాల విక్రయాల నియంత్రణ కోసం మరింత నిఘా పెంచాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరుగునున్న మహా శివరాత్రి జాతరను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదేశించారు.
మూడు రాజధానులు ఖాయం. త్వరలో విశాఖపట్నంలో రాజధానిని ప్రారంభిస్తాం. ముఖ్యమంత్రి విశాఖకు మకాం మారుస్తారు.’ అని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడం సరికాదని, ఇంకెంత కాలం ప్రజలను మోసం చేస్తా రని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు ప్రశ్నించారు. సోమవారం ఆయన విలే కరులతో మాట్లాడారు.
తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు.
రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటే సైకిల్ అధికారంలో రావాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి బగ్గు రమణ మూర్తి అన్నారు. సోమవారం చిక్కాలవలసలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.
వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం తక్షణమే అందించాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ డిమాండ్ చేశారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బాధితులతో కలిసి వచ్చి కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్కు వినతిపత్రం అందించారు.
[06:29] ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ ఎంపికల జోరు తగ్గింది. గతంలో ఈ సమయానికి పలు సంస్థలు వందల మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైంది.
[06:27] సంతబొమ్మాళి మండలం తలగాం-రాజగోపాలపురం రహదారి మధ్యలో ఈ ఏడాది జనవరి 7న ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనదారుడు, ఆటో చోదకుడు మృతిచెందారు. రోడ్డు ఇబ్బందికరంగా ఉండటంతో వాహనాలు తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
[06:17] కాంట్రిబ్యూటరీ పింఛను విధానాన్ని(సీపీఎస్) రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర డిమాండు చేశారు.
[06:17] వైకాపా, తెదేపాలు కుటుంబ పార్టీలుగానే చెలామణి అవుతున్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసేలా పనిచేయాలని ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ కోరారు.