Second term funds released అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. తొలివిడత జమకాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు సైతం పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకూ ఈ నిధులు జమయ్యేలా చర్యలు తీసుకోవాల’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
గత వైసీపీ ప్రభుత్వం రహదారులను పట్టించుకోకపోవడం వల్లనే రహదారులు దారుణంగా తయారయ్యాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం సంతబొమ్మాళి- కోటబొమ్మాళి రహదారి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Purchase of grain ‘రైతులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశామ’ని జిల్లాపౌరసరఫరాలశాఖ డీఎం వేణుగోపాల్ తెలిపారు. సోమవారం నరసన్నపేట మార్కెట్ కమిటీ ఆవరణలో గిడ్డంగులను పరిశీలించారు.
Ichchapuram RTC complex, far from the village ఇచ్ఛాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో ఏర్పడిన రెండో కాంప్లెక్స్ ఇది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయాలు ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇచ్ఛాపురం పట్టణానికి దూరంగా కాంప్లెక్స్ ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
Kidnappings on the rise in the srikakulam జిల్లాలో నేర సంస్కృతి పెరుగుతోంది. అప్పట్లో పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి గ్రామాలకు సైతం పాకుతోంది. ప్రధానంగా భూదందాలు, ఆస్తి తగాదాలు, సెటిల్మెంట్లు మూలంగానే ఈ ఘటనలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు పలాస, కాశీబుగ్గ, నరసన్నపేట వంటి పట్టణాల్లో తరచూ ఈ ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సులో 613 ఒప్పం దాలు, రూ.13.27 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రం పెట్టుబడుల హబ్గా మారనుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసే స్మార్ట్ కిచెన్ల ఏర్పాటును తక్షణమే రద్దు చేయా లని ఆ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, అధ్యక్ష, కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర డిమాండ్ చేశారు.
హర్యానా రాష్ట్రం మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన జాతీయ సమై క్యతా శిబిరంలో డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఎన్ఎస్ఎస్ బృందం పాల్గొని ప్రతిభ కనబరిచింది. వివిధ విభాగాల పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడంతో సోమవారం వర్సిటీలో వారిని వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని అభినం దించారు.
చిన్నపిల్లలకు ఒంట్లో బాగోకపోతే ఏమీ తోచదు. ఏ ఆసుపత్రికి తీసుకెళ్తే బాగుంటుందని ఎంతో మందిని వాకబు చేస్తుంటాం. ఆ సమయంలో ప్రభుత్వాసుపత్రి సంగతి అసలు ఆలోచనకే రాదు.
సిక్కోలు యువ క్రికెట్ క్రీడాకారుడు త్రిపురాన విజయ్ను ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్(డీసీ) రూ.30 లక్షలు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. టెక్కలికి చెందిన విజయ్.
ప్రభుత్వాలు మారుతున్నా గంగపుత్రుల బెంగ తీరడం లేదు. అసలే సముద్రంపై చేపల వేటకు సమయం అనుకూలించడం లేదు. మరోవైపు జెట్టీలు, కోల్డ్ స్టోరేజీలు వంటి సదుపాయాల్లేక మత్స్యకారులు నానా పాట్లు పడుతున్నారు.
సిక్కోలు తీర ప్రాంతంలో అరుదైనవి సోంపేట బీలతో పాటు నౌపడా తంపర నేలలు. సోంపేట బీల భూములను సంరక్షించేందుకు ముందుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నౌపడా తంపర నేలలను మాత్రం గాలికొదిలేసింది.
ఓవైపు సాహిత్య సదస్సులు..మరోవైపు సాంస్కృతిక ప్రదర్శనలు..సైన్సు ప్రయోగాలు..పుస్తక ప్రియులతో జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద నగరపాలకసంస్థ క్రీడా మైదానం కళకళలాడుతోంది.
నరసన్నపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సారవకోట మండలానికి చెందిన బాలింత మృతి చెందారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
యువతిని పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఆమె వద్ద బంగారం, నగదు తీసుకుని పరారైన వ్యక్తిని విజయవాడ కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఎడమ కంటికి శస్త్రచికిత్స చేయించుకుంటే ఉన్న చూపు కూడా పోయిందని కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామానికి చెందిన బాధితుడు జీరు ఎర్రయ్య ఆరోపించాడు.
ఉరుకులు పరుగుల జీవనం.. భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు.. ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేకపోవడం.. తదితర కారణాలతో చాలా మంది బయట ఆహారాన్నే ఎక్కువగా తింటున్న రోజులివి.
వంశధార నదిలోని వరద నీరంతా వృథాగా పోతోంది. అక్టోబరు మొదటి వారంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ నెల 3న నదిలో లక్ష క్యూసెక్కులకుపైగా నీటి ప్రవాహం చేరింది.
ఖరీఫ్ వచ్చిందంటే చాలు ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులు మోసపోతుంటారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు అన్నదాతలను దోచుకోవడం పరిపాటైపోయింది. కొనుగోలు కేంద్రాల్లో నమోదైన తేమ శాతానికి, రైసు మిల్లుల్లోని తేమ శాతానికి తేడాలుండటం మిల్లర్లకు కలిసొస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేసి ఉద్యోగ విరమణ పొందినవారు ఏటా జీవన ప్రమాణ పత్రం పొందాలి. వాటి కోసం పింఛనుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడేవారు.
వంటకు గ్యాస్ సిలిండరు వినియోగించని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. వినియోగదారులకు కేంద్రం రాయితీ ఇస్తుండగా..అర్హులైన పేద కుటుంబాలకు దీపం 2.0 కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 3 బండలు ఉచితంగా అందజేస్తోంది.
బంగాళాఖాతంలో తరచూ ఏర్పడుతున్న అల్పపీడనాలు, తుపాన్లు జిల్లాలో తీర ప్రాంతంపై ప్రభావం చూపుతున్నాయి. రక్షణ చర్యలు లేకపోవడం, అలల ఉద్ధృతి కారణంగా కోతకు గురై సమీప గ్రామాలకు ముప్పు వాటిల్లుతోంది.