మండలంలోని మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతుండడంతో దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములకు ఎక్కడాలేని డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా అక్రమార్కులు బరితెగిస్తున్నారు.
కొంతమంది అధికారులు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై స్పందిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని అన్-ఎయిడెడ్ పాఠశాలలు గురువారం బంద్ పాటిస్తున్నట్టు ఆ సంఘ నాయకులు తెలిపారు.
మకరాంపురం కూడలి వద్ద బుధవారం ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది. ఆదివారం సంత సమీపంలో ట్రాక్టర్ను తప్పించబోయిన కంటైనర్ సంతలోకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది.
ఖరీఫ్ సీజన్ మొదలైంది. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో నారు మళ్లను సిద్ధం చేసుకుని.. విత్తనాలు జల్లే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ చిత్రంలో నెత్తిన బిందెలతో నడుచుకుంటూ వెళ్తున్నవారు కొత్తూరు మండలం కారిగూడ పంచాయతీలోని ఎగువ దొండమానుగూడ గ్రామస్థులు. గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న గ్రేడ్-3 ఏఎన్ఎంల బదిలీల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైల్వేశాఖ పెంచిన ఛార్జీలను మంగళవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లావాసులపైనా ఆ ప్రభావం స్వల్పంగా పడింది. పలాస నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వెళ్లేందుకు పాత రుసుంలనే ప్రకటించి ప్రయాణికులకు అదనపు భారం లేకుండా చేసింది.
జి.సిగడాం మండలం టంకాల దుగ్గివలసలో జ్వరం పంజా విసిరింది. సుమారు 50 మంది వరకు విష జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన టంకాల చిట్టెమ్మ, టి.వెంకటేశ్, బి.పాపారావు, టి.మోహనరావు, గిరిజాల శ్రీరాములు, సీహెచ్.శ్యామలరావు, టి.శ్రీరాములు, టి.అప్పలనర్సమ్మ, టి.చరణ్ తదితరులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు.
సంప్రదాయ మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన ఆధారం. వేట నిషేధ కాలంలో ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సముద్రంపైకి వెళ్లక జీవనం భారంగా మారింది.
కవిటి సీహెచ్సీలో చిన్నారులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఇక్కడికి వైద్యం కోసం చిన్నారులను తీసుకొస్తున్న తల్లిదండ్రులు వైద్యుడి కోసం ఎదురు చూసి చూసి వెనుదిరుగుతున్నారు.
విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో వసతుల కల్పన, విద్యార్థులకు ఏకరూప దుస్తులు, నాణమైన భోజనం, పాఠ్య, రాత పుస్తకాలు అందేలా పర్యవేక్షిస్తోంది.
‘జగన్ అనే భూతం మళ్లీ వస్తే మేం ఇక్కడ ఉండగలమా అని పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలు ఓ ప్రశ్న వేస్తున్నారు. జగన్ అనే భూతాన్ని 1000 అడుగుల గొయ్యి తవ్వి.. అందులో కప్పేస్తాం’ అని హామీ ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
తక్కువ ధరకు బంగారం ఇస్తామని మోసం చేసిన ఉదంతమిది. శ్రీకాకుళం గ్రామీణ పోలీసు స్టేషన్ ఎస్సై కె.రాము తెలిపిన వివరాల మేరకు కాకినాడకు చెందిన శ్రీను ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.