కేంద్రంలోని బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం ఆరోపించారు. ఈవిషయంపై అక్టోబరు 15వ తేదీ వరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజీపీ మండలాధ్యక్షుడు పైల విష్ణుమూర్తి తెలిపారు. గురువారం ఆనందపురం, ఆబోతులపేట, దవళపేట, వాడ్రంగి గ్రామాల్లో బీజేపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సూచనలతో సేవా పక్షోత్సవాలు నిర్వహించారు.
lady Suicide attempt విభేదాల కారణంగా భర్త తనకు దూరమవుతాన్నడనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మార్కెట్లో పురుగుల మందు తాగారు. న్యాయం కోసం కాశీబుగ్గ పోలీసుస్టేషన్కు వెళ్లి.. అక్కడ ఆవరణలో కుప్పకూలిపోయారు.
Unfinished work due to YCP's negligence కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ‘జల్జీవన్ మిషన్’ పనులను గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం చేసిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో ఆర్డబ్ల్యూఎస్, నేషనల్ హైవే, ఎంపీ లాడ్స్కు సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
మండలంలోని పెద్ద కొజ్జిరియా సమీపంలోని జాతీయరహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించారన్న సమాచారం మేరకు గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలిం చారు. జాడుపుడి సమీపంలో కొందరి వ్యక్తులకు సుమారు ఆరు ఎకరాల స్థలం ఉండగా, మధ్యలో ప్రభుత్వ గోర్జిగా పిలువబడే 62 సెంట్ల స్థలంఉంది. ఇటీవల ఆ స్థల యజమానులు వెంచర్లుగా మార్చేందుకు సిద్ధమయ్యారు.
వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2కె25 అంబాసిడర్’ డిజిటల్ మారథాన్ పేరిట సెట్శ్రీ విభాగం కార్యక్రమం చేపట్టనుంది.
అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ), తలసరి ఆదాయం పెంపునకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేపట్టింది.
పలాస మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలలో నైట్ వాచ్మెన్గా పని చేస్తున్న వ్యక్తి అక్కడ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని పలుమార్లు వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, అలల తాకిడితో సుందరమైన ఇసుక తిన్నెలు, మడ అడవులు సముద్ర గర్భంలో కలిసిపోతుంటే.. మరో వైపు తీర ప్రాంతాల నుంచి నిశీధి వేళ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.
ఇంటింటికీ స్వచ్ఛమైన కుళాయి నీరు.. వినేందుకు ఎంతో బాగున్నా గత ప్రభుత్వం బృహత్తర పథకానికి తూట్లు పొడిచింది. కేంద్రం నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడంతో పనులు అత్తెసరుగా మిగిలిపోయాయి.
రోజురోజుకు విస్తరిస్తున్న నగరం శ్రీకాకుళం. జిల్లా కేంద్రానికొచ్చే జనాభా సైతం పెరుగుతూవస్తోంది. ఇందుకనుగుణంగా వసతులు మాత్రం నగరపాలక సంస్థ కల్పించలేకపోతోంది. ముఖ్యంగా నగర పరిధిలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.
ప్రభుత్వం ఏడాదికి నాలుగు త్రైమాసికాలకు విడతల వారీగా బోధనా రుసుము విడుదల చేయాలి. గత వైకాపా హయాంలో నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తే తిరిగి వారు కళాశాలలకు చెల్లించేవారు.
గిరిజన ప్రాంతంలో ఉన్న బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొరగా వైద్య సేవలందుతున్నాయని దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై వేధింపులు పెరిగాయని.. వారి ఆస్తులు కాజేస్తున్నారని వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకరబాబు విమర్శించారు.
మహిళలు నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవాలని వజ్రపుకొత్తూరు పీహెచ్సీ వైద్యాధికారి రిచర్డ్బూన్, ఆయూష్ వైద్యాధికారి జిన్పణిమాఽధవి తెలిపారు.బుధవారం డోకులపాడులో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశిబిరం నిర్వ హించి మహిళలు వివిద రకాల వైద్య పరీక్షలు చేశారు.
కోటబొమ్మాళి యూరియాకోసం రైతులు నిరసన తెలిపారు. ఎరువుల షాపుల వద్ద యూరియా అందజేస్తామని సోమవారం వ్యవసాయాధికారులు టోకెన్లు ఇచ్చారు. దీంతో రైతులు బుధవారం టోకెన్లతో కోటబొమ్మాళిలోని ఎరువుల షాపుల వద్దకు చేరుకున్నారు.