ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా భద్రగిరి(డుమ్మంగి) మత్స్య క్షేత్రంలో పెంచిన చేప పిల్లలను పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జలాశయంలో విడుదల చేశారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు, ఉద్యోగులు చేయి తడపందే దస్త్రం ముట్టుకోరు. దీంతో కొందరు విసిగిపోయి ఎంతోకొంత ముట్టజెబుతారు. మరికొందరు ఇవ్వలేక అనిశాను ఆశ్రయిస్తుంటారు
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో దుకాణాల(అద్దె గదుల) కేటాయింపు వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆదాయానికి సైతం గండి పడుతోంది.
గురుకుల విద్యాలయాలకు కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు సరఫరా చేసేందుకు మంగళవారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో టెండర్లు నిర్వహించారు. ప్రతిసారి ఈ ప్రక్రియ ప్రహసనంగా సాగిపోతోంది.
వీరఘట్టం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 17 ఏళ్లుగా భవన, వసతి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు
జామి మండలం అలమండలో భారీగా పురుగు మందులు బయటపడ్డాయి. మామిడికాయల ప్యాకింగ్ పేరిట వైకాపా నాయకుడు అక్రమంగా నిల్వ చేయడంతో అధికారులు దాడులు చేసి, స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో రోజురోజూ రహదారులు రద్దీగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఎటు వెళ్లినా ఇరకాటం తప్పడం లేదు. మార్గాలు చిన్నవి కావడం, చిరు దుకాణాల ఏర్పాటు, చోదకులు ఇష్టానుసారంగా వెళ్తుండడం, ఆక్రమణలు.. తదితర కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడింది
ఇద్దరు ఆకతాయిల కారణంగా ఓ వృద్ధుడు మృత్యువాత పడిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని స్టేడియం కాలనీకి చెందిన బి.చంద్రమౌళి(61) గతంలో అల్పాహార దుకాణం నడిపేవారు. కొన్నిరోజులుగా కుమారుడితో కలిసి నూడుల్స్ అమ్ముతున్నారు.
తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన కొత్తవలస మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. కుమ్మరబంజరు వద్దగల ఎన్జీవో కాలనీకి చెందిన బి.శ్రీనివాసరావు ఆర్టీసీలో చోదకుడిగా పని చేస్తున్నారు.
The airport is the focal point of North Andhra Pradesh. భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే కేంద్రబిందువు కానుందని పౌరవిమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. విమానాశ్రయ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు.
No Irrigation Water for Rabi Crop వెంగళరాయసాగర్ (వీఆర్ఎస్) ద్వారా రబీ పంటలకు సాగునీరు సరఫరా చేయలేమని ప్రాజెక్టు ఈఈ డీఎస్ ప్రదీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘సాగునీరిస్తారో.. లేదో?’ అన్న కథనంపై ఆయన స్పందించారు.
మెంటాడ మండలాన్ని విజయనగరం డివిజన్లో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని మెంటాడ కూటమి నాయకులు కోరారు. మంగళవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద కూటమి నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించి డీఆర్వో శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు.
Manyam — The Address of Tourism పార్వతీపురం మన్యం పర్యాటకానికి కేరాఫ్గా నిలిచేలా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలో జలపాతాల వద్ద వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.
విజయనగరంలో నివా సముంటున్న పేదల కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్చేశారు. మంగళవారం విజయనగరంలోని ఎల్బీజీనగర్, రామకృష్ణనగర్, వినాయకనగర్, గురజాడనగర్లో సమస్యలు పరి ష్కరించాలని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
Illegal pesticides stock అలమండ గ్రామంలో వైసీపీ నేత, ఉపసర్పంచ్ లగుడు దేవుడుకు చెందిన మామిడి గోదాంలో భారీ ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన పురుగుమందులు, పౌడర్లను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సింహాచలం, ఏవో పూర్ణిమ గుర్తించారు. పక్కా సమాచారంతో తనిఖీకి వెళ్లిన వారు అక్కడ 3550 లీటర్ల పురుగుమందుల ద్రావణం, 2085 కేజీల పౌడర్ను గుర్తించారు.
Extension of Deadline for Inquiry into Garugubilli PACS Irregularities గరుగుబిల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) పరిధిలో అక్రమాల విచారణక గడువు పొడిగించినట్లు విచారణాధికారి ఆర్.రమణ మూర్తి తెలిపారు.
Earthquakes in Bhogapuram భోగాపురంలో మంగళవారం వేకువజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 4.20 గంటల సమయంలో మంచం కదిలినట్లు, ఇంట్లో సామగ్రి కాస్త జరిగినట్లు అనిపించడంతో పాటు పెద్ద శబ్ధం రావడంతో కొందరు బయటకు వచ్చి చూశారు.
Confusion over TET ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఇన్ సర్వీసు టీచర్లలో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టెట్ లేని వారంతా రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
Confusion on Tet ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఇన్ సర్వీసు టీచర్లలో అయోమయం నెలకొంది. ఈ విషయంపై వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టెట్ లేని వారంతా రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ జారీచేసిన టెట్ నోటిఫికేషన్లోనూ ఈ విషయం పేర్కొంది. అయితే ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు టెట్ మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. న్యాయస్థానం తుది తీర్పుపైనే టీచర్ల ‘టెట్’ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.