ఈ విద్యాసంవత్సరం పది చదువుతున్న ఓ గిరిజన బాలిక ఆరోగ్యం బాగోలేదని ఓ ఉపాధ్యాయుడు ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి వేళ దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రి కాదని.. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే రోజంతా ఉంచారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అనుమానం పెనుభూతమై భర్త చేతిలో భార్య హతమైంది. భర్తకు కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ దంపతుల బిడ్డల బాగోగులు చూడాలని అధికారులను ఆదేశించింది.
మూడు.. ఆరు.. తొమ్మిది.. తరగతులు చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు రాష్ట్ర సగటుతో పోలిస్తే ఉమ్మడి జిల్లాల సగటు బాగున్నా.. ఇంకాస్త కష్టించాలంటూ జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) ‘పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్’ నివేదిక స్పష్టం చేస్తోంది.
దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం సమీపంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపడుతుండగా.. ఒడిశా నుంచి కారులో తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిసింది.
ప్రియుడితో మనస్పర్థల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భోగాపురం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సూర్యకుమారి వివరాల ప్రకారం నారుపేట గ్రామానికి చెందిన అట్టాడ పుష్ప(22) అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన సాయి ప్రేమించుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాత పడిన ఘటన కొత్తవలస మండలంలో జరిగింది. ఎస్సై హేమంత్ కుమార్ వివరాల ప్రకారం.. లక్కవరపుకోట మండలం భూమిరెడ్డిపాలేనికి చెందిన ఎం.శ్రీను(23), డి.అప్పలనాయుడు గురువారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై విశాఖ నుంచి గ్రామానికి బయలుదేరారు
Illegal Stockpiles Everywhere! ఖరీఫ్ రైతులు ఎరువులు, విత్తనాల విషయంలో ఏ ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ల ద్వారా రైతులకు వాటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో ఎరువులు, విత్తనాలు జిల్లాకు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో కొంతమంది వ్యాపా రులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
This is Odisha... Don’t Come Back Again! ‘ఇది ఒడిశా గ్రామం.. ఏపీ వైద్యశిబిరం ఇక్కడ నిర్వహించొద్దు.’ అని తోణాం వైద్యాధికారి అక్యాన అజయ్కు ఒడిశా రాష్ట్రం పొట్టంగి తహసీల్దార్ దేవేంద్రసింగ్ బహదూర్ దరువా అభ్యంతరం చెప్పారు.
Special Sanitation Drive from 16th జిల్లాలో ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
No Water from Janjavathi! జంఝావతి నుంచి శివారు భూములకు సాగునీరండం లేదు. దీంతో ఖరీఫ్ రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఈ నెల 9న ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశారు. అయినా జియ్యమ్మవలస మండలంలో భూములకు చుక్కనీరు అందని పరిస్థితి నెలకొంది. పిచ్చిమొక్కలు, పూడికలతో ప్రధాన కాలువలన్నీ నిండిపోవడమే ఇందుకు కారణం.
రాష్ట్ర ప్రభుత్వం బలిజిపేట మండలానికి కొత్తగా 144 కొత్త పింఛన్లు మంజూరు చేసినప్పటికీ.. లబ్ధదారులకు ఎందుకు నగదు పంపిణీ చేయలేదని జడ్పీటీసీ సభ్యుడు అలజంగి రవికుమార్ సభలో అధికారులను నిలదీశారు.
రైతులకు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల జాబితాలను సచివాలయాలకు పంపింది. అర్హత ఉండీ జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేసేందుకు ఈనెల 13 వరకు గడువు ఇచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా జనాభా నియంత్రణకు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. దీంతో పెరుగుదల నెమ్మదించింది. దీనివల్ల మున్ముందు యువత కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ముందే ప్రజలను మేల్కొలుపుతోంది.
విజయనగరం సహా జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో సీసీ కెమెరాల ఏర్పాటును విస్తరించారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను అధికారులు అమలు చేస్తున్నారు.