చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం సరోజని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం అందిస్తోంది.
పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందుతున్నారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోని అనేక గ్రామాలకు ఈ ఆసుపత్రే పెద్ది దిక్కు. నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. అయితే, ఇక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
తోడు లేనిదే బయటకు వెళ్లలేని విభిన్నప్రతిభావంతులు వారు. వైకల్య అర్హత ధ్రువీకరణ కోసం సదరం పరీక్షలకు శుక్రవారం వచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి పడిగాపులు కాశారు. వైద్యులు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్పై వైసీపీ నాయకులు కోడిగుడ్లతో దాడిచేయడం పిరికిపంద చర్య అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. శుక్రవారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు.. అదుపు లేకుండా పోతోంది. సహజ వనరులను దోచుకునేందుకు తెగబడుతున్న వ్యక్తులు భవిష్యత్ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ప్రజలకు ఎదురుకానున్న తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు. ఊటబావుల చెంతనే లోతుగా తవ్వుకుపోతున్నారు. ఎస్.కోట మండలంలోని మామిడిపల్లి, వేములాపల్లిలో గోస్తనీ తీరాన్ని ఇసుక తవ్వకాలకు అడ్డాగా మార్చేశారు. రేగిడి మండలంలో నాగావళి తీరంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.
మండలంలోని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్యులు ఉన్నా టెక్నీషయన్లు లేవపోవడంతో రోగ నిర్ధారణ పరీక్షలకు పాట్లు పడుతున్నారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలై 25 రోజులు కావస్తున్నా నోటిఫికేషన్ విడుదల కాలేదు.
కొట్టాం-జామి బ్రిడ్జిపై జామి గ్రామస్థులు, పలుగ్రామాల రైతులు జడ్పీటీసీ మాజీ సభ్యుడు బండారు పెదబాబు, జామి మాజీ సర్పంచ్ ఇప్పాక వెంకట త్రివేణి ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ అధికారులు తీరుపై నిరసనకు దిగారు.
దోమల నుంచి రక్షణకు ప్రతి ఒక్క కుటుంబం తెర లు రాత్రివేళల్లో విని యోగించాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) తులసి కోరారు. శుక్రవారం మండలంలోని బొడ్డ వర పంచాయతీ పరి ధిలో గల గాదెల్లోవా, లక్ష్మీపురం,లచ్చందోరపాలెంలో మలేరియనివారణలో భాగంగా నిర్వహించిన స్ర్పేయిం గ్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది తాతారావు పాల్గొన్నారు.
బొబ్బిలిలోని నాయకు డుకాలనీ పక్కనే ఉన్న కోటి చెరువు కబ్జా కోర ల్లో చిక్కుకొని పూర్తిగా కనుమరుగయ్యే ప్రమా దంలోఉందని, తక్షణమే పరిరక్షించాలని సీపీఐ నాయకుడు డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఇరిగే షన్ అధికారులు అధికా రపార్టీ నాయకులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా ఏమి తెలియనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఆరోపిం చారు.
జిల్లా రిజిస్ర్టార్గా ఏవీ కుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురు వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం విజయవాడ హెడ్క్వార్టర్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె జిల్లా రిజిస్ర్టార్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహి స్తున్న ఎం.సుజనను విశాఖ జిల్లా రిజిస్ర్టార్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆమె 2021లో విజయనగరం జిల్లా రిజిస్ర్టార్గా బాధ్యతలు చేపట్టారు.
అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వాడుకోవడమే సూక్ష్మసేద్యం ప్రత్యేకత. రైౖతులు సానుకూలతలను బట్టి ఏర్పాటు చేసుకొనే బిందు, తుంపర్ల సేద్య పరికరాలకు రాయితీ వస్తుంది.
ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ రెండో రోజూ కొలిక్కిరాలేదు. బుధవారం అర్ధరాత్రి వరకూ జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైన అధికారులు ఉన్నతాధికారుల ఆమోదం కోసం గురువారం సాయంత్రం వరకు నిరీక్షించారు.
రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతు భరోసా పేరుతో ఏడాదికి రూ.13,500 అందిస్తుండడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
భీమసింగి సహకార చక్కెర కర్మాగారంలోని వేంకటేశ్వరాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సింహాచలం దేవస్థాన వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.