జగనన్న ఇల్లు’ పథకం కింద తమకు పట్టా ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలం ఎక్కడో చూపించలేదని, తమకు స్థలం చూపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును స్థానిక మహిళలు ప్రశ్నించారు.
[03:08] జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన జగనన్నకు చెబుదాం(స్పందన) కార్యక్రమానికి వివిధ సమస్యలపై ఏకంగా 124 వినతులు బాధితులు అందించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూకు 79 ఫిర్యాదులు రాగా..
[03:08] సచివాలయాలు ఇక రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా మారనున్నాయి. ఈ మేరకు ఆస్తుల క్రయ, విక్రయాలు నిర్వహించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమైంది. విజయనగరం జిల్లా పరిధిలో 116 సచివాలయాలున్నాయి.
[03:57] ఏ గ్రామానికి వెళ్లినా కల్లాల్లోనే ధాన్యం బస్తాలు దర్శనమిస్తున్నాయి. వాటిపై గడ్డి కప్పి భద్రపరిచారు. అధికారులేమో లక్ష్యం ముగిసింది.. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే కానీ కొనలేమని చేతులెత్తేస్తున్నారు.
[03:47] తాను సీబీఐ అధికారినంటూ సాలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తనవద్ద రూ.4.55 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, అడిగితే ఇవ్వడం లేదని రాజాంకు చెందిన మహిళ ఎస్పీ దీపిక ఎం.పాటిల్ వద్ద మొరపెట్టుకున్నారు.
[03:41] రాష్ట్రంలో రహదారుల నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యంత్రాంగంలో కదలిక వచ్చింది. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లకు మరమ్మతులు చేసే దిశగా జిల్లాలో కసరత్తు జరుగుతోంది.
[02:54] ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షల్లో తొలిసారిగా డిగ్రీ అధ్యాపకుల సేవలను వినియోగించుకునేలా ఉన్నత విద్యాశాఖ మండలి అనుమతి ఇచ్చింది. ఇంటర్ బోర్డు విజ్ఞప్తి మేరకు ఆదేశాలు జారీ చేసింది.
[02:58] జల్సాల కోసం సెల్ఫోన్లు, మోటారు సైకిళ్లు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 54 చరవాణులతో పాటు, 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ధాన్యం కొనుగోలు తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొద్దిరోజులుగా ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తున్నారు. పంటను ఎన్నాళ్లు కల్లాల్లో ఉంచుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుపు మండి రహదారులపై బైఠాయిస్తూ.. పంటకు అగ్గిపెడుతూ.. రాస్తారోకోలు చేపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న ఎఫ్ఏ-3 పరీక్షల (యూనిట్ -3)కు సంబంధించి మూల్యాంకనానికి సమయం పెంచాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్రావు సోమవారం ఓ ప్రకటనలో కోరారు.
అంగన్వాడీలు కదంతొక్కారు. తాము ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై పోరుబాట పట్టారు. ఒకేసారి జిల్లా కేంద్రానికి వందలాదిగా తరలివచ్చి ధర్నాకు దిగారు. గ్రాడ్యూటీ ఇవ్వాలని, కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఫేస్యాప్ హాజరు వద్దని నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్దకు సోమవారం ఉదయం నుంచే గుంపులుగా అంగన్వాడీలు, ఆయాలు చేరుకున్నారు.
‘వాటర్ షెడ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చారు. దీంతో ఐదు రోజులు దగ్గరుండి పని చేయించాను. అంతలో వైసీపీ నేతల నుంచి పైరవీలు మొదలయ్యాయి. పని ఆపేసివైసీపీ నేతలకు అప్పగించారు. ఇదేమిటని అడిగితే చెక్ పవర్ కట్ చేస్తామన్నారు’ అంటూ ఓ రైతు స్పందనలో టీడీపీ నేతల సహకారంతో సోమవారం ఫిర్యాదు చేశారు.
గతంలో సేకరించిన రెల్లి భూముల్లో కొన్నింటిని ఏపీఐఐసీకి అప్పగించేందుకు ప్రయత్నాలు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించేందుకు కొత్తవలస మండలం రెల్లి గ్రామ పరిధిలో కేటాయించిన భూమిది. దీనికి రక్షణగా ప్రహరీ నిర్మించారు. భవన నిర్మాణాలు చేపట్టి ఉంటే ఈ పాటికే గిరిజన విద్యార్థులతో ఈ ప్రాంతం కళకళలాడేది.
రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, సొమ్ములు కూడా తక్షణమే చెల్లించాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ డిమాండ్ చేశారు.
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్ఈబీ ఏఎస్పీ ఆస్మా ఫర్హీన్ అన్నారు. స్థానిక బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల్లో సోమవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.