శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.
రహదారి ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై ప్రసాద్రావు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా రామభద్రపురం నుంచి బాడండి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా గుంతలు ఏర్పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల తుపాను సమయంలో అందించిన సేవలకు గానూ మెంటాడ మండలంలోని లక్ష్మీపురానికి చెందిన ఆశా కార్యకర్త వై.బంగారమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నారు.
కాశిబుగ్గ విషాదాన్ని రాజకీయంగా వాడుకోవాలనే వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని సంధ్యారాణి మండిపడ్డారు. ఇటువంటి మానవీయ విషాదంలో రాజకీయాలు చేయడం తీవ్రమైన అనైతిక చర్య అని పేర్కొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిక్కోలు గణిత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి గణిత ప్రతిభ పాటవ పరీక్షలు నిర్వహించారు.
ఎత్తైన కొండలు.. చేతికందేటట్లు మేఘాలు.. కనుచూపుమేరలో గోస్తనీ నది.. నదిలో దూసుకుపోయే బోట్లు.. ఇదీ ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో మనసుకు ఆహ్లాదం పంచే వాతావరణం.
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అడుగు పెట్టింది. ఆదివారం సౌత్ ఆఫ్రికాతో తలపడుతున్న మహిళా క్రికెటర్లకు బలిజిపేట మండలం వెంగాపురం శ్రీభారతి పబ్లిక్ స్కూలు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో భక్తుల తొక్కిసలాట ఘటనతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి ఆదేశాల మేరకు డీఆర్వో శ్రీనివాసమూర్తి.
అమృత్ భారత్ పథకం పనులతో చీపురుపల్లి రైల్వేస్టేషన్కు నూతన శోభ సంతరించుకుంది. చీపురుపల్లి, రాజాం, పాలకొండ నియోజకవర్గాలతో పాటు చుట్టు పక్కల మండలాల ప్రజలు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.
బొబ్బిలి పట్టణంలోని వెలమవారివీధి సన్రే అపార్టుమెంట్ మూడో అంతస్తులోని ఉపాధ్యాయుడు బెవర రామకృష్ణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బీరువాలోని 12 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.
సౌర విద్యుత్తు వినియోగం పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల్లో ప్రతి కుటుంబానికి ఆర్థిక ఆసరా కలిగిస్తూ ఆదాయం పొందేలా చేస్తున్నాయి.
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సులో పేలుళ్ల ఘటనలో బాంబుల విక్రయాలకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అందులో ఒకరు డిగ్రీ చదువుతున్న విద్యార్థి.
Protected water is doubtful. జిల్లాలో వాటర్ ప్లాంట్ల నిర్వహణపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇదే విషయం అధికారుల తనిఖీల్లో సైతం నిర్ధారణ అవుతోంది. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఎఫ్ఎస్ఎస్ఎఐ (పుడ్సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆప్ ఇండియా) అనుమతులు తప్పనిసరి.
pacs not working పేరుకు పీఏసీఎస్(ప్రైమరీ అగ్రికల్చర్ కోపరేటివ్ సొసైటీ). పాలక మండలి కూడా ఉంది. కానీ చాలా సంవత్సరాలుగా రైతులకు రుణాలిచ్చింది లేదు. అసలు ఆర్థిక లావాదేవీలే జరగడం లేదు. సిబ్బంది చూస్తే సీఈవో ఒక్కరే. అతనికీ రెండున్నరేళ్లుగా వేతనం అందడం లేదు. విజయనగరంలోని గాజులరేగ పీఏసీఎస్ దుస్థితిది.
murder by son మంచం పట్టిన తండ్రిని కంటికి రెప్పలా చూడాల్సిన తనయుడు మృగంలా ప్రవర్తించాడు. కనీసం కదల్లేని తండ్రి పట్ల ఏమాత్రం దయలేకుండా.. అతన్ని అత్యంత కర్కశంగా అంతమొందించాడు. మద్యంమత్తులో మానవీయతను మరిచాడు. గొంతు కోసి తలను వేరు చేసి ఓ గమేనా (సిమెంట్ గోలం)లో పెట్టి ఇంటికి కొద్ది దూరంలో పడేశాడు. శనివారం సాయంత్రం బాడంగి మండలం గొల్లాది గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మామిడి సత్యం (62) మృతిచెందాడు. ఈ దారుణాన్ని చూసిన వారంతా చలించిపోయారు. ఆ ప్రాంతంలో భయానక పరిస్థితి ఏర్ప డింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో గల 6822 కుటుంబాలకు మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత రేషన్ అందజేస్తుందని మార్క్ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు.
Studies Under the Tree పనసభద్ర పంచాయతీ పరిధి చెలకమెండగి గ్రామంలోని మండల ప్రాఽథమిక పాఠశాలకు పక్కా భవనం లేదు. దీంతో ఇక్కడున్న 30 మంది విద్యార్థులు చెట్టు కిందే చదువులు కొనసాగించాల్సి వస్తోంది.
Made a Fuss… Then Left It As It Is! గత వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ అంటూ ఎంతో హడావుడి చేసింది. కానీ పక్కా భవనాల నిర్మాణం మాత్రం పూర్తి చేయించలేకపోయింది. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకలేకపోయింది. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఫలితంగా భవన నిర్మాణాలకు బ్రేక్ పడింది. చివరకు అద్దె గృహాలు, పంచాయతీ భవనాల్లోనే సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లను నిర్వహించాల్సిన దుస్థితి.
How Safe Are Our Temples? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో చోటుచేసుకున్న ఘటన జిల్లావాసులను కలవరపరుస్తోంది. భక్తులను కలచివేస్తోంది. ఇదే సమయంలో మన్యం జిల్లాలోని ఆలయాల్లో భద్రత ఎంత? అనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది.
Festive Fervor at ‘Vanamtho Utsavam’ జిల్లాలోని ఏజెన్సీ అందాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సీతంపేటలో వనంతో ఉత్సవం (పార్వతీపురంలో టూరిజం సీజన్ స్టార్ట్స్)కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
Devotees Throng Totapalli ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించి పులకించిపోయారు.