: ప్రజలు మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు కోరారు.వైసీపీనాయకులు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని లవిడాం గ్రామంలో సీసీరోడ్డును ప్రార ంభించారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగాటీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ తెలిపారు.రాజాం మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు నేలమట్టమై నిరాశ్రయులుగా మిగిలిన బత్తిన సరోజిని కుటుంబాన్ని ఎమ్మెల్యే మంగళవారం పరామర్శించారు.
ప్రతిఒక్కరూ మొుక్కలు నాటి పర్యా వరణాన్ని పరిరక్షించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. పండ్ల మొక్కలు పెంపకంతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చుని తెలిపారు. మంగళవారం మండలంలోని గాబువానిపాలెంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.
జిల్లాలోని పలుచోట్ల దుకాణాల్లో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిషేధిత మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
దొంగతనాలు.. గంజాయి సేవించడం.. చైన్ స్నాచింగ్.. ఆరుబయట స్థలాల్లో మద్యం తాగడం.. పేకాట ఆడటం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం.. తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని పోలీసులు ఇట్టే పట్టేస్తున్నారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 కార్యక్రమాన్నిచంద్రబాబు ఏర్పాటు చేసి, దానిపై ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున తెలిపారు. అటువంటి కార్యక్రమం గురించి ఎమ్మెల్సీ బొత్స, చిన్న శ్రీనులు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవుపలికారు.
Worried Whether the Stock Will Be Refilled or Not! ఖరీఫ్ రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వరి ఉడుపులు ప్రారంభ దశలో ఉండడంతో యూరియా, ఎరువుల కోసం పరుగులు పెడుతున్నారు.
Three-Member Committees for PACS ఉమ్మడి జిల్లాలో 94 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు త్రిసభ్య కమిటీ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ పలు పీఏసీఎస్ లకు చైర్మన్, మరో ఇద్దరు సభ్యులను నియమిం చింది.
Target of ₹86 Crore Stree Nidhi Loans జిల్లాలో పొదుపు సంఘాలకు రూ.86 కోట్ల వరకు స్ర్తీనిధి రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఏజీఎం కామరాజు తెలిపారు. ఇప్పటివరకు రూ.12.4 కోట్లు అందజేశామన్నారు.
Multi-Specialty Hospital Works Accelerated జిల్లా కేంద్రం పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతంగా పూర్తి చేసి, త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు.
Efforts to Prevent Anemia జిల్లాలో రక్తహీనత నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వైద్యసిబ్బందిని డీఎంహెచ్వో భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం ఆర్ఆర్బీ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది సమీక్షించారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
గ్రామాల్లోని ఆశావర్కర్లు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ జగన్మోహన్రావు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. విజయనగరం జిల్లా గరివిడిలోని వెటర్నరీ కాలేజ్పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విజయనగరంలో సెప్టెంబర్ 25న జరిగే ఓపెన్ మిస్టర్ ఆంద్రా బాడీ బిల్డింగ్ పోటీలను జయప్రదం చేయాలని విజయనగరం బాడీబిల్డర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకరర్రావు, నిర్వాహకులు కనకల కృష్ణ అన్నారు.
పట్టణాలను పరిశుభ్రంగా మారుస్తాం.. చెత్త సమస్య నివారిస్తాం.. ఇళ్ల నుంచి సేకరించి డంపింగ్ యార్డుల్లో నిల్వ చేసిన చెత్తను జీరో లెవెల్కి తీసుకొస్తాం.. స్వచ్ఛాంధ్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలంటూ సుద్దులు చెప్పిన గత ప్రభుత్వ పాలకులు ఆచరణలో శుద్ధి మరిచారు.
ఏటా వర్షాకాలంలో డయేరియా, మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ పరిస్థితిని నివారించడానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
జిందాల్ కంపెనీ ప్రతినిధులు తమ భూముల్లో జేసీబీల సాయంతో పంటలను దౌర్జన్యంగా తొలగిస్తున్నారని ఎస్.కోట మండలం ముషిడిపల్లి, పెదఖండేపల్లి, బొడ్డవర, కిల్తంపాలెం గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
చీపురుపల్లి మండలం కర్లాంలో ఉన్న వెంకట్రామ పౌల్ట్రీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గతంలో పనిచేసిన కార్మికులు డిమాండు చేశారు.