ఒకప్పుడు సినిమా విడుదల అవుతుందంటే పల్లె, పట్నం తేడా లేదు.. ఓ పండుగ వాతావరణం ఉండేది. టికెట్టు దొరికితే చాలు ఆ లెక్కే వేరుగా ఉండేది.. సినిమా విడుదలకు ముందురోజు అర్ధరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు.. ఏడాదికాలం ఒకే సినిమాను నడిపిన థియేటర్లూ ఉండేవి.
రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఉచితంగా ప్రభుత్వం అందించే బియ్యంకు అధిక ధర ఆశ చూపి కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం అందించే బియ్యం నాసిరకమంటూ ప్రచారంతో చీకటి వ్యాపారాన్ని పెంచుకుంటు న్నారు.
జిల్లా మీదుగా వెళ్లనున్న పలు జాతీయ రహదారుల నిర్మాణానికి మార్గం సుగమవుతోంది. ఇప్పటికే అవసరమైన భూములు గుర్తించి సేకరించినా కొన్ని సర్వే నంబర్లలో భూ వివాదాలు తలెత్తాయి.
చలి మొదలైంది.. న్యుమోనియా విజృంభిస్తోంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుంచి చిన్నారులు న్యుమోనియా బారిన పడుతున్నారు. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఏలూరు నుంచి రావులపాలేనికి రాకపోకలు సాగించే ఏలూరు ఆర్టీసీ డిపో బస్సులో.. డ్రైవరు వెనుక ప్రథమ చికిత్స పెట్టె కనిపించని దృశ్యమిది. ప్రమాదవశాత్తు ఏదైనా ఘటన చోటుచేసుకుంటే..
నేరం జరిగాక స్పందించటం కాదు. ముందే నియంత్రించాలి. అప్పుడే శాంతిభద్రతలు బాగుంటాయి. ఆ విధానం పోలీసింగ్లో రావాలి. ఆ లక్ష్యంగా పనిచేస్తా’ అని చెబుతున్నారు యువ ఐపీఎస్ అధికారిణి జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత.
ఉపాధ్యాయుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కాళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన పథకంలో కుళ్లిన గుడ్లను వండి వడ్డించే యత్నం చేశారు.
నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం శక్తి సమేత శైవక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడ కొలువైన దుర్గా లక్ష్మణేశ్వర స్వామిని కార్తిక మాసంలో వేలాది మంది భక్తులు దర్శించుకుని అభిషేకాలు చేయించుకుంటారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు మంచి రోజులు రానున్నాయి. పూర్వవైభవం తీసుకురావడంతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడనున్నాయి.
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం టిడ్కో లబ్ధిదారులకు శాపంగా మారింది. మొన్నటి వరకు ఉన్న ఇంటికి అద్దె కట్టలేక, చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక, బ్యాంకు అధికారుల నుంచి కిస్తీలు కట్టాలంటూ వచ్చే ఒత్తిడితో సతమతమైన లబ్ధిదారులను తాజాగా మరో సమస్య వేధిస్తోంది.
ఉపాధిహామీ పథకంలో పారదర్శకతను పెంచే దిశగా చేపట్టిన శ్రామికుల ఈ-కేవైసీ ప్రక్రి¨య శత శాతానికి దరి చేరలేదు. జిల్లాలో ఇప్పటికీ 66,359 మంది శ్రామికులు ఈ-కేవైసీ చేయించుకోలేదు.