[06:00] ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
[05:56] ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోని ఎల్కేజీ, యూకేజీ విద్యార్థుల వివరాల నమోదుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమైంది. ఈ ప్రక్రియను ఈ నెల 8వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది.
[06:00] సమస్యలను సకాలంలో పరిష్కరించినప్పుడే అధికారులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
[06:00] ఆచంట మండలం కోడేరు ఇసుక రీచ్ సీజ్ కేసు చివరికి గనులు, భూగర్భశాఖ(మైనింగ్) అధికారుల చేతిలోకి వెళ్లింది. అనుమతులు లేకుండా తవ్వకాలు కొనసాగించడంతో నరసాపురం సబ్కలెక్టరు సూర్యతేజ ఆదేశాలతో ఈ నెల 2న రెవెన్యూ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
[06:00] ఆకివీడు, చింతలపూడి నగర పంచాయతీల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు అమృత్-2.0లో నిధులు మంజూరయ్యాయి. దీంతో పాటు పలు పట్టణాల్లో చెరువుల ఆధునికీకరణకూ కేటాయించారు.
[06:00] ‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రాం మాకు రెండు కళ్లు లాంటివారు. వారి విగ్రహాలు పక్కపక్కనే ఏర్పాటు చేయాల’’ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
[06:00] ధర చెప్పకుండా ఉత్పత్తిదారుల వద్ద గుడ్లు తరలిస్తూ, కొన్ని రోజుల తరువాత తక్కువ సొమ్ము ముట్టజెప్పడంపై కోళ్లఫారాల నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
[05:48] పది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట తీవ్ర విషాదం అలముకుంది. పెళ్లి శుభలేఖలు పంచేందుకు వరుడితో వెళ్లిన అతడి అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్ఘటన సోమవారం రాత్రి ఆచంట మండలం కోడేరులో జరిగింది.
పెంటపాడు మండలంలో అలంపురం మేజర్ గ్రామ పంచాయతీ. మహిళా సర్పంచ్ తాతపూడి ప్రగతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఎస్సీ రిజర్వేషన్లో ఎన్నికయ్యారు. ఈ కారణమో ఏమో తెలియదు గాని సర్పంచ్కు అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది.
స్పందనకు వచ్చే ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించాలి. ఆ దరఖాస్తు లు రీ ఓపెన్ కాకుండా సంతృప్తికర స్థాయిలో పరి ష్కరించాలి’ అని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.
జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు కేటాయించే వరకూ పోరాటం సాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ స్పష్టం చేశారు.
పాలకొల్లు కేంద్రంగా బంగారం నగలు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 63.5 కాసుల బంగార నగలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు
2019 ఎన్నికల ముందు అందరికీ అన్ని ఇస్తానని అరచేతిలో స్వర్గం చూపించి, ఎన్నికల అనంతరం అధికారం దక్కించుకుని సీఎం అయ్యాక జగన్ మోహన రెడ్డి మొండి చెయ్యి చూపిస్తూ, ఇదేమిటని ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు పెడుతున్నాడని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణపై సోమ వారం కలెక్టరేట్లో డీఆర్వో మూర్తి సమీక్షించారు. పరీక్షలను సమర్ధ్దవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బడా బాబులు దేశాన్ని దోచుకు తింటున్నారని, అదానీ, అంబానీలను పోషిస్తూ దేశ సం పదను అమ్మేస్తున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ఇల్లందలపర్రు గ్రామంలోని సత్తి లోకేష్ రెడ్డి పొలం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా పురుగుమందుల పిచికారి కార్యక్రమం రైతులకు ప్రత్యక్షంగా చూపించారు.
[05:36] ఎంతో మంది యువకులు స్వయం ఉపాధి కోసం వాహన రంగాన్ని నమ్ముకున్నారు. వారికి ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ తదితర వాహనాలు కలిగిన అర్హులకు రూ.10 వేల చొప్పున ఇస్తోంది.
[05:36] సాగులో ఉత్పాదక వ్యయం తగ్గించుకుని పనులు సులభతరం చేసుకోవడానికి ప్రభుత్వం రాయితీపై అందించే యంత్ర పరికరాలు సరిగ్గా అందక రైతులు అవస్థలు పడుతున్నారు.
[05:36] : ముత్యాలపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు బందన మహాలక్ష్మిరావు ఇంట ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... మహాలక్ష్మిరావు, అతని సోదరుడు శ్రీనివాసరావు(36) భవన నిర్మాణ సెంట్రింగ్, రాడ్బెండింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నారు.
[05:36] సంఘ సభ్యులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలని పద్మశాలి సంఘం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీఈడబ్ల్యూఏ) రాష్ట్ర అధ్యక్షుడు జి.వి.ఎస్.రామకృష్ణ సూచించారు.
[05:36] సాగులో తగిన యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే తక్కువ పెట్టుబడితోనే అధిక ఉత్పత్తి సాధన సాధ్యమేనని ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
[05:36] సీపీఎస్ విధానం రద్దు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంకల్ప దీక్షను ఆదివారం భీమవరంలో నిర్వహించారు.
[05:36] ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారీ జీతాల కోసం నిరీక్షణే మిగిలింది. ఐదు నెలలుగా 1వ తేదీని ఉద్యోగులు మరిచిపోయారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీ వస్తుందంటే చిరుద్యోగుల నుంచి అధికారుల వరకు వేతనం కోసం చూస్తుంటారు.
[05:36] భీమవరం పరిధిలోని కుముదవల్లి రోడ్డులో దాదాపు 20 ఎకరాల్లో ఓ లేఅవుట్ వేశారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. పది శాతం కామన్ సైట్గా రెండు ఎకరాలు వదల్లేదు.