విద్యార్థులకు ఇబ్బందులు.. ప్రయోగశాలల నిర్మాణానికి వేములదీవిలో 350 ఎకరాల భూమిని గుర్తించారు. భూసేకరణ పూర్తికాకపోవడంతో వర్సిటీకి అప్పగించలేదు. దీంతో విద్యార్థులు ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన నిమిత్తం సుమారు 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్తున్నారు.
గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన లక్ష్మి చదువుకోలేకపోయినా సంతకం చేయగలరు. కానీ డ్వాక్రా సంఘంలో చేసిన తీర్మానం చదవలేరు. చేతిలో చరవాణి ఉన్నా డిజిటల్ లావాదేవీలు నిర్వహించలేకపోతున్నారు
అన్నార్తుల ఆకలి తీర్చేలా.. అన్న క్యాంటీన్ల విస్తరణకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల అన్న క్యాంటీన్లు కొనసాగుతుండగా.. కొత్తగా ఏలూరు జిల్లాలో 4, పశ్చిమ గోదావరిలో 3 ఏర్పాటు చేయనున్నారు.
గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఈ నెల 14వ తేదీ నాటికి ప్రవాహం 9 లక్షల నుంచి 10 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని వరద పర్యవేక్షణ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫోన్ ఇన్’లో ఈఈ సమస్య: చినమామిడిపల్లి మురుగు కాలువను ఆక్రమించారు. నరసాపురం పట్టణంలో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను దానిలో వేస్తున్నారు. బి.కొండేపాడు ఛానల్ ఆక్రమణలతో పూడిపోయింది.
ఇరగవరం పోలీస్స్టేషన్లో 2021లో నమోదైన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.1.10 లక్షల జరిమానా విధిస్తూ సోమవారం భీమవరం పోక్సో కోర్టు న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ తీర్పు చెప్పారు
గ్రామ పంచాయతీల్లో దోమల నివారణ కోసం కొనుగోలు చేసిన ఫాగింగ్ యంత్రాలు అటకెక్కాయి. యంత్రాలకు అవసరమైన రసాయనాలను ఆరోగ్య శాఖ సరఫరాను నిలిపివేయడంతో అవి మూలన చేరాయి
దల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాలను పూర్తి చేసి.. శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించింది
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జాతీయ రహదారి విస్తరణ పనులు ఏళ్ల తరబడి ముందుకు కదలడం లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధి కారులు సమీక్షలు జరిపినా తుతూ మంత్రంగా పనులు ప్రారంభించి రెండు రోజు ల్లోనే ముగించేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్లో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి పునరావాస కాలనీ లకు తరలిస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో వంద లాదిమంది నిర్వాసితులకు పరిహారం అం దలేదు.