చీకటిపై వెలుగు... చెడుపై మంచి, విజయానికి ప్రతీక దీపావళి. చీకటి తర్వాత వచ్చేది వెలుగే... అనే ఆశతో, ఆశయంతో సాగాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాం. చిచ్చుబుడ్డి విరజిమ్మె వెలుగుల్లా అన్నదాతలు...
వర్షాకాలంలో పలుచోట్ల కుంభవృష్టి కురవడంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే నీటి మట్టం 1.43 మీటర్లకు చేరింది. ఈ ఏడాది మే-సెప్టెంబరు మధ్య తేడా గమనిస్తే జిల్లాలో కాళ్ల తప్ప మిగిలిన 19 మండలాల్లో నీటి మట్టాలు పెరిగాయి.
వ్యాస రచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలపై పట్టు కలిగి ప్రతిభ చూపగలిగితే మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం మీ సొంతం కానుంది. 6-8 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది.
కొవ్వాడ డంపింగ్యార్డులో ఖాళీగా తొట్టెలు ఇవి. ఇప్పటి వరకు ఇక్కడ కిలో ఎరువు కూడా తయారు చేయలేకపోయారు. ఇదే మండలం చినఅమిరంలోనూ ఇదే పరిస్థితి. ఈ రెండు పంచాయతీలకు ప్రత్యేకాధికారి ఎంపీడీవోనే కావడం విశేషం.
వైకాపా సర్కారు హయాంలో అటకెక్కించిన రైతుబంధు పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేనప్పుడు పంట ఉత్పత్తులను ఈ పథకం ద్వారా మార్కెట్ యార్డు గోదాముల్లో ఆరు నెలల పాటు
ఏలూరు వన్టౌన్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి. ప్రతి దీపావళికి రూ.1000 నుంచి 1500 వెచ్చిస్తారు. ఈసారి దీపావళి టపాసులు ధరలు అధికంగా ఉండటంతో రూ.2500 అయ్యిందని అయినా గతంలో వచ్చిన టపాసులకు తక్కువే ఉన్నాయని సంచి కూడా నిండలేదని వాపోతున్నారు
పెళ్లిళ్ల సీజన్ కావడంతో కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత మూడు నెలల్లో వందలాది పెళ్లిళ్లు జరిగాయి. వీటి నమోదులు పరిశీలిస్తే చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ధాన్యం పంట నూర్పుళ్లు ప్రారంభమవుతున్నాయి. ఈ ఖరీఫ్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సరళీకృత విధానాలను అందుబాటులోకి తెస్తోంది.
తాడేపల్లిగూడేనికి చెందిన కానిస్టేబుల్కు ఇద్దరు కుమారులు. గతంలో ఏటా జూన్లో సరెండర్ సెలవుల సొమ్ము ఖాతాకు జమయ్యేది. వాటితో ఒక విడత ఇద్దరికీ పుస్తకాలు, ఫీజుల అవసరాలు తీరేవి. 2023 నుంచి ఈ చెల్లింపులు నిలిచిపోయాయి.
విదేశానికి వెళ్తున్న కుటుంబ సభ్యులను సాగనంపేందుకు ఎంతో ఆనందంగా బయలుదేరిన వారు మరో 20 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరతామనుకునే సరికి ప్రమాదం జరిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు.
పెళ్లైన తరువాత వచ్చే పండుగలకు కొత్త అల్లుళ్లకు అత్తింటి వారు జరిపే మర్యాదలు అంతా ఇంతా కాదు. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్లకు కొత్త రకాల వంటకాలను రుచి చూపించడం జరుగుతుంది.