ఉత్తర గోవాలో (Goa) ఘోర అగ్ని ప్రమాదం (Fire Acciden) జరిగింది. అర్పోరా గ్రామంలో ఉన్న బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో (Night Club) అర్ధరాత్రి సమయంలో సిలిండర్ పేలడంతో (Cylinder Blast) మంటలు చెలరేగాయి.
శనివారం అర్ధరాత్రి క్లబ్ కిచెన్లో ఉన్న గ్యాస్ సిలండర్ పేలి మంటలు వ్యాపించాయని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది క్లబ్ సిబ్బందే. ఉత్తరగోవాలోని అర్పోరాలో ఉన్న ఓ క్లబ్లో ఈ ప్రమాదం జరిగింది.
కాంగ్రెస్ ప్రభు త్వం ‘రెండేండ్ల పాలన-విజయాలు-వైఫల్యాలు’ అనే అంశంపై ఆదివారం రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ నాలెడ్జ్ క్రియేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గోసుల శ్రీని�
మహారాష్ట్ర నుంచి 1956 తర్వాత వలసొచ్చిన ఎస్టీలు లంబాడీ క్యాటగిరీ కిందికి రాబోరని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు సింగిల్జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
[06:29]సూడాన్లోని దక్షిణ కొర్డోఫాన్ రాష్ట్రంలో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) ప్రయోగించిన ఓ డ్రోన్ శిశుపాఠశాలపై పడటంతో 50 మంది చనిపోయారు.
[06:23]మాజీ ప్రధాని వాజ్పేయీ దేశానికి అందించిన సేవలు, సుపరిపాలనను నేటి తరానికి గుర్తుచేస్తూ.. అందరిలో స్ఫూర్తిని నింపేందుకు ఆయన శత జయంతి ముగింపు సందర్భంగా సుపరిపాలన బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు, దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారిలో అవకాశాలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందన్న అనుమాన
[06:17]ఉక్రెయిన్పై రష్యా ఆకస్మిక దాడి చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా, ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం.
[06:21]రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటుచేయించింది వైకాపా నేత, మాజీమంత్రి జోగి రమేషేనని (ఏ-18) సిట్ నిగ్గుతేల్చింది.
[06:22]కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఈ) చట్టమంటే.. వైద్య రంగాన్ని కార్పొరేట్కు అప్పగించడమేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు దిలీప్ భానుశాలి పేర్కొన్నారు.
[06:22]పలు సమస్యలతో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి సీఎం చంద్రబాబు శనివారం వినతులు స్వీకరించారు.
[06:21]భారతీయ కళలు, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ప్రక్రియలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
[06:20]గత వైకాపా ప్రభుత్వంలో వేెంకటేశ్వరస్వామి మీద నమ్మకం లేని గ్యాంగ్ని అందలం ఎక్కించి తిరుమల పవిత్రతను అప్పటి సీఎం జగన్ దిగజార్చారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు.
[06:21]రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, చింతూరు డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో విలీన మండలాలు కొత్త జిల్లాలోకి వెళ్లనున్నాయి.
వేధిస్తున్నాడు, న్యాయం చేయండని వేడుకున్న మహిళకు ఇదో కొత్తరకం వేధింపులు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న అధికారి మరీ నీచపు పనికి దిగజారిన దుస్థితి. ఒంటరి మహిళ అని కూడా చూడకుండా, మానసికంగా కుంగిపోతున్న ఆమె దయనీ�
హిల్ట్ పాలసీలో ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అనేలా వ్యవహరిస్తున్నది. పారిశ్రామికవాడల నుంచి అన్ని పరిశ్రమల తొలగింపు పూర్తయ్యేవరకు ల్యాండ్ కన్వర్షన్ చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడం
[06:16]దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా సమీపంలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సాల్స్విల్ టౌన్షిప్లో అనుమతులు లేని ఓ బార్లో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు.
[06:10]కేంద్ర విత్తన చట్టం ముసాయిదాలో సవరణలు చేయాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, రైతు సంఘాల నాయకులు కేంద్రానికి సూచనలు చేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.అల్దాస్ జానయ్య పిలుపునిచ్చారు.
[06:10]కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తామని బీసీలను తీవ్రంగా మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేతలు విమర్శించారు. బీసీల రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని ఆత్మహత్య చేసుకున్న సాయిఈశ్వర్ చారి అంత్యక్రియలను వారు శనివారం జగద్గిరిగుట్టలో నిర్వహించారు.
[06:09]రైతులకు యూరియా కొరత రాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని, సీఎం రైతు వ్యతిరేక విధానాలతో రైతన్నలు నరకం చూస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.
[06:08]వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ వారంలో ప్రారంభిస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె.రమేశ్రెడ్డి తెలిపారు.
[06:07]తెలంగాణ పోలీస్శాఖకు హోంగార్డులు వెన్నెముకలా నిలుస్తున్నారని..పెద్దగా ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తున్నారని డీజీపీ బి.శివధర్రెడ్డి ప్రశంసించారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అంశాలతో త్వరలోనే వారు శుభవార్త వింటారని పేర్కొన్నారు.
[06:06]నిర్ణీత సమయానికి రావాల్సిన ఆర్టీసీ బస్సు రాలేదా? దూరప్రాంత బస్సు బాగా ఆలస్యంగా వెళుతుందా? లోపల సీట్లు సౌకర్యంగా, పరిశుభ్రంగా లేవా? వర్షం నీరు లోపలకు వస్తుందా? డ్రైవర్, కండక్టర్ దురుసుగా వ్యవహరిస్తున్నారా? మీరు ఎక్కాల్సిన స్టాప్లో బస్సు ఆపలేదా? ఇలాంటి సమస్యలు ప్రయాణికులకు ఎదురవుతూనే ఉంటాయి.
[06:04]ఒక పల్లె నుంచి ఒకరు ఇద్దరు కాదు.. 29 మంది దేశ సరిహద్దు రక్షణ విభాగాల్లో పనిచేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామం ప్రత్యేకత ఇది.
[06:03]కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందగా... చేతిలో చిల్లిగవ్వ లేక ఆయన అంత్యక్రియలనూ చేయలేని దైన్యం ఆ కుటుంబానిది. మృతదేహంతోనే మూడు రోజులు ఇంట్లో గడిపారు.
[06:16]అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసులో కీలక నిందితుడైన వంకరెడ్డి మాధవరెడ్డి కోసం సీఐడీ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
[06:16]మాజీ ప్రధాని వాజ్పేయీ శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 11 నుంచి భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించనున్న ‘అటల్- మోదీ సుపరిపాలన యాత్ర’ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆహ్వానించారు.
[06:16]రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నెలకొల్పుతున్న ప్రభుత్వం... ఆ టెక్నాలజీల్లో నిపుణులైన మానవ వనరుల్ని సిద్ధం చేసేందుకు ప్రారంభిస్తున్న కోర్సుకు విశేష స్పందన లభించింది.
[06:15]దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏదైనా విషయాన్ని అవతలి వ్యక్తికి చెప్పేటప్పుడు కేవలం నోటితోనే చెప్పడం కన్నా దానికి సంజ్ఞలు జోడిస్తే మరింత ప్రేరణగా, అనునయ పూర్వకంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
[05:51]గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికలకు మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. సర్పంచి, వార్డు పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు స్థానికంగా ఇంటింటికీ ప్రచారం చేస్తూనే.. మరోవైపు గ్రామంలో ఓటుండీ.. పట్టణాలు, నగరాల్లో నివసించే ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
[05:48]నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం (బీకే), వంగురోనిపల్లె, కల్ములోనిపల్లె, ప్రశాంత్నగర్ పంచాయతీలకు మూడో విడతలో నిర్వహించే ఎన్నికలను ప్రజలు బహిష్కరించారు.
[05:47]గ్రామపంచాయతీ ఎన్నికల మూడో దశలో పోటీకి ఆశావహులు భారీ సంఖ్యలో ముందుకొచ్చారు. మూడో విడతలో 4,158 గ్రామపంచాయతీల్లోని సర్పంచి పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా... 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి.
[05:50]వైకాపా అధ్యక్షుడు జగన్కు.. సొంత బాబాయి హత్యే చిన్న విషయమైనప్పుడు, తిరుమల పరకామణిలో చోరీ ఘటన పెద్ద విషయం ఎలా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు.
[05:47]‘రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి నాలుగైదు మార్గాల్లో సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నా. దాని ప్రకారం ఇంకా 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉంది.
[06:00]రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, రోప్వేలకు మార్గం సుగమమైందని... వరంగల్, ఆదిలాబాద్, రామగుండంలలో కొత్త విమానాశ్రయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వం పేర్కొంది.
దేవాదాయ, ధర్మాదాయశాఖలో పేరుకుపోతున్న దస్ర్తాలు, టెండర్ల ఆమోదం, మతపరమైన ఉద్యోగ నియామకాల్లో గందరగోళంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం ఆ శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.