ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంతృత్వ పాలన సాగిస్తున్న బీజేపీ, అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి హరీ్షరావు ఈనెల 3వ తేదీన నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. హరీ్షరావు పాల్గొనే సభాస్థలిని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు.
ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన బ్యాంకు నూతనంగా మరో ఐదు శాఖలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి మంజూరు చేసిందని బ్యాంకు చైర్మన కర్నాటి వెంకట బాలసుబ్రహ్మణ్యం, సీఈవో సీత శ్రీనివాస్ తెలిపారు.
మునిసిపాలిటీల్లో ఎక్కడ చూసినా తాగునీటి ఇబ్బందులే. ‘తాగునీటి సమస్య పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు చేపడతాం. ప్రతి ఇంటికీ నీరందిస్తామ’న్న అధికారపార్టీ నేతల ప్రకటనలు.. ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడంతో.. తాగునీటి పథకాల నిర్వహణ గాలికొదిలేశారు.
ఓటు హక్కు వచ్చిన ప్రతి యువత ప్రస్తుత ఎన్ని కల్లో ఎంపీ అభ్యర్థుల గుణాలు చూసి, ఆలోచించి ఓటు వేసి ఎన్ను కోవాలని పార్లమెంట్ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తనయుడు నల్లారి నిఖిలేష్రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మండలంలోని కెంచానపల్లి, జుంజురంపల్లి, బీఎనహళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహించారు.
ఎస్ఎల్బీసీ సొరంగం పనులను మూడేళ్లలో పూర్తిచేస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎ్సకు ఓటువేస్తే మూసీలో వేసినట్లేనని, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా నిర్వహించిన నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
లోక్సభ సమరం వేడెక్కుతున్న కొద్దీ అభ్యర్థులు, పార్టీల నాయకులు సామాజిక సమీకరణాలపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు లోక్సభ స్థానాల్లో ఎక్కడ ఏ వర్గం ఏ రకమైన ప్రభావాన్ని చూపగలుగుతుందనే అంచనాల్లో ఆయా పార్టీల నేతలు, వ్యూహకర్తలు మునిగితేలుతున్నారు.
మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం.. దేవునల్తాడలో టీడీపీ నేతల ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక టీడీపీ, జనసేన కార్యకర్తలు వారి ప్రయత్నాలను తిప్పికొట్టడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చేసుకుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం పార్లమెంటుతోపాటు, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ తెలిపారు.
కళింగపట్నం (కె.మత్స్యలేశం) బీచ్ను వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. బీచ్కు పూర్వవైభవం తీసుకొస్తామని గతంలో మాటిచ్చి మరిచింది. ఐదేళ్ల కిందట వచ్చిన వరదలకు బీచ్ తీరం కోతకు గురైంది. తీరంలోని బొమ్మలు, సిమెంట్ బల్లలు, ఇతర పర్యాటక సామగ్రి అంతా సముద్రంలో కలసిపోయింది. సందర్శకులు రావడం మానేశారు. బీచ్కు పూర్వవైభవం తీసుకొస్తామని, అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి ధర్మాన హామీఇచ్చారు. ఐదేళ్లు గడిచినా ఈ పనులు ముందుకు సాగలేదు. నిధులు రాక, బిల్లులు కాక పనులు ఆగిపోయాయి. పర్యాటకాన్ని పట్టించుకోని వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.
ఎచ్చెర్ల మండలం కుప్పిలికి చెందిన గుడివాడ కుప్పయ్యకు గెలుపోటములతో సంబంధం ఉండేది కాదు. ఆర్థిక భారమైనా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకో సరదా. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి ఎన్నికలో పోటీ చేసేందుకు ముందుకొచ్చేవాడు. 2009, 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నామినేషన్ వేశాడు. గతఎన్నికలో (2019)లో పోటీచేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే తాను నమ్ముకున్న బీఎస్పీ జనసేనకు మద్దతు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించాడు. కొన్నాళ్లు చిలకపాలెంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కొవిడ్తో మూడేళ్ల కిందట ఆయన మృతి చెందాడు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కనిపించకపోవడంతో అంతా చర్చించుకుంటున్నారు. అలాగే లావేరు మండలానికి చెందిన గుడివాడ అప్పారావు కూడా 1999 ఎన్నికల వరకూ మూడు నాలుగు సార్లు ఇదే నియోజకవవర్గం నుంచి పోటీచేశారు.
కర్నూలు జిల్లా పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న విద్యార్ధులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు భీమునిపల్లె వెంకటసుబ్బయ్య తెలిపారు.
కళ్యాణదుర్గం అభివృద్ధే నా లక్ష్యం అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర, పోలేపల్లి గ్రామాలలో కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ంందర్భంగా సురేంద్రబాబు, పార్థసారథిలకు నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రజలే కాకుండా పశుపక్షాదులు కూడా నీటి కోసం తండ్లాడుతున్నాయి. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జిల్లా పర్యటనకు వస్తున్నారు. తొలుత చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రానికి గురువారం చేరుకుంటారు. ఇదే రోజు సాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటుహక్కు పొందే అవకాశం కల్పించింది. కుల, మత, వర్గ, లింగ, ధనిక, పేద, ప్రాంతాల కతీతంగా అర్హులైన వారందరికీ ఓటుహక్కు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. బ్రిటిష్ పాలనా కాలంలో కేవలం ప్రభుత్వోద్యోగులు, చదవడం, రాయడం వచ్చినవారు, భూస్వాములు, బ్రిటిష్ ఏలుబడిలో పనిచేసే సిబ్బందికి మాత్రమే ఓటుహక్కును కల్పించే వారు. ప్రధానంగా నిరక్షరాస్యులకు అసలు ఓటుహక్కు ఉండేది కాదు. దేశంలో 1952లో జరిగిన మొదటిసారి సాధారణ ఎన్నికల నుంచి అర్హులందరికీ ఓటుహక్కు కల్పించారు. 1952, 1957ల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా పోలింగ్ పెట్టెలను ఏర్పాటు చేసేవారు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఈ డబ్బాలో ఓటు వేసే వారు. అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంతమంది ఉన్నా ఒకే డబ్బాను కేటాయించి అందులో ఓటు వేసే విధానం అమల్లోకి తీసుకువచ్చారు.1962 నుంచి ప్రతి పోలింగ్ కేంద్రంలో అందరు అభ్యర్థులకు కలిపి ఒకే డబ్బాను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పత్రాలతో ఓటువేసే విధానం నుంచి నేడు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను వినియోగించే వరకూ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు.
ఈ నెల 13న జరగనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బందికి గత ఎన్నికలకు చెల్లించిన రెమ్యునరేషనే కొనసాగించనున్నారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో చెల్లించిన రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధులకు సెక్టార్ ఆఫీసరు కాకుండా అదనంగా నియమితులయ్యే జోనల్ మేజిస్ట్రేట్కు ఏకమొత్తంగా రూ.1500 చెల్లిసారు.
నాకు అరవై దశకంలో ఓటుహక్కు వచ్చింది. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు కల్పించేవారు. ఆనాటి రాజకీయాల్లో విలువలు ఉండేవి. ఓట్లకోసం నాయకులు ఇంటింటికి కాలినడకన వచ్చేవారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరి తరువాత ఒకరు వచ్చేవారు. పోటీదారులు మధ్య స్నేహపూర్వ వాతావరణం ఉండేది. నాయకులు ప్రజలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. రాజకీయల్లో అవినీతి ఎక్కు వైంది. ఓటర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. నాయకులు కూడా ఆ విధంగా తయారయ్యారు. అక్షరాస్యత పెరిగింది.. అలాగే అవినీతి కూడా రాజకీయాల్లో పెరిగింది. ఎన్నికల డ్యూటీలకు సరదాగా వెళ్లేవాళ్లం. ప్రస్తుతం ఎన్నికల డ్యూటీ చేయాలంటే ఉద్యోగులు భయపడు తున్నారు.
పేదకు పింఛన్లను ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదేనని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవివకుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అద్దంకి పట్టణంలోని 11వ వార్డులో ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా అయన ఇంటింటికీ తిరిగి కూటమి సూపర్సిక్స్ పథకాలు, మేనిఫెస్టోపై ఓటర్లను కలిసి వారికి వివరించారు.
సైకిల్ గుర్తు ... ఏడుకు ఏడు మనమే గెలవాలి.. మీ ఉత్సాహం చూస్తుంటే పోలింగ్ రోజు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి కూటమి అఽభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఎండ అని ఎవరు కూడా ఆ రోజు ఓటు వేయకుండా ఇళ్లలో ఉండొద్దు. ఓటు వేయకపోతే కొంపమునుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాయలచెరువులోని మాణిక్య రంగనాథస్వామి ఆలయంలో బుధవారం వైసీపీ నాయకులు రహస్య సమావేశం నిర్వహణకు పన్నాగం పన్నారు. ఇటీవల రాజీనామా చేసిన వలంటీర్లను, మరికొందరు వైసీపీ వారిని అక్కడకు రప్పించి సమావేశపరిచారు.
పార్వతీపురం జిల్లా కేంద్రానికి గురువారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలీకాఫ్టర్లో విశాఖ నుంచి ఆయన ఇక్కడకు వస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
పేరు గొప్పే కాని గురజాడ విశ్వవిద్యాలయం ఎందులోనూ ఆ స్థాయి కనిపించడం లేదు. సాధారణ సౌకర్యాల నుంచి అధ్యాపకుల వేతనాల వరకూ.. విద్యార్థులకు మౌలిక సదుపాయాల నుంచి వారు తినే ఆహారం వరకూ.. అన్నీ కొరతే. వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించేసి వదిలేసింది. కీలకంగా ఉండాల్సిన అధ్యాపకులను కూడా అరకొరగా నియమించారు. కాకినాడ జేఎన్టీయు నుంచి ధామాషా విధానంలో రావాల్సిన నిధులు రాలేదు. హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, మరుగుదొడ్లు బాగాలేవని కొద్దినెలల కిందటే విద్యార్థులు వర్సిటీ గేటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయినా గాడిన పడలేదు. ఈ సంస్థ కళాశాలకు ఎక్కువ.. యూనివర్సిటీకి తక్కువ అంటూ విమర్శలు ఎదుర్కొంటోంది.
జిల్లాలో కార్మికులు ఘనంగా మే డే వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాడవాడలా జెండాలు ఎగురవేసి.. కార్మిక పోరాటాల్లో అమరులైన వారికి నివాళి అర్పించారు. అనంతరం వారి సేవలను గుర్తుచేసుకున్నారు.
కొమరాడ మండలంలో సీమనాయుడువలస జంక్షన్- కెమిశీల గ్రామ రహదారిపై బుధవారం ఏడు ఏనుగులు హల్చల్ చేశాయి. ఒక్కసారిగా అవి రోడ్డుపైకి రావడంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు భయబ్రాంతులకు గురయ్యారు.
వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ భర్త లలిత్సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పేర్కొన్నారు. దర్శి ప ట్టణంలోని 6వ వార్డులో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో పొందుపర్చిన పథకాలను వివరిస్తూ ప్రయోజనాలను తెలిపారు.
వైసీపీని సాగనంపితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పార్టీలో చేరికలతో స్థానిక అమరావతి ప్రాంగణం సందడిగా ఉంటుంది. వివిధ మండలాలకు చెందిన వైసీపీ నేతలు డాక్టర్ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరేందుకు ఊత్సాహంగా తరలివస్తున్నారు. ప్రతిరోజు నియోజకవర్గంలో వందలాది కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి.
CSK vs PBKS : పదిహేడో సీజన్లో రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) మరో విజయం సాధించింది. చెపాక్ గడ్డపై తమకు తిరుగులేదని చాటుతూ.. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను ఐదోసారి చిత్తుగా ఓడి
‘మా గ్రామానికి రోడ్డు వేయనిదే ఓట్లు వేయం’ అని పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు బుధవారం గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు.
నారాయణరావుపేట/సిద్దిపేట రూరల్/చిన్నకోడూరు, మే 1: పదేళ్లు పాలించిన బీఆర్ఎ్సకు, కొత్తగా ఏర్పడిన కాంగ్రె్సకు ఓటేస్తే ఫలితం శూన్యంగా మారుతుందని బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, మే 1: పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి తన భర్త వెంకట్రామారెడ్డిని గెలిపించాలంటూ ఆయన సతీమణి ప్రణతిరెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
చిన్నకోడూరు, మే 1: సిద్దిపేట అంటే సీఎం రేవంత్రెడ్డికి మొదటి నుంచి చిన్న చూపేనని, తెలంగాణ తెచ్చింది మన సిద్దిపేట బిడ్డ కేసీఆర్ అని, అలాంటి కేసీఆర్ను సీఎం రేవంత్రెడ్డి ఇష్టారీతిన తిడుతున్నాడని, కేసీఆర్ను తిట్టడం అంటే మన సిద్దిపేట ప్రజలను అవమాన పర్చినట్లేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
రైతులు, మహిళలు, కార్మికు లు సబ్బండ వర్గాల పేదల సంక్షేమమే బీజేపీ ధ్యేయ మని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ అన్నారు.
కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ సర్కార్ వచ్చినా…. టీడీపీకి గుర్తింపు ఉంటుందా? ఆ పార్టీ అనుకున్నట్టుగా పరిణామాలు ఉంటాయా? అసలు కేంద్ర సర్కార్లో టీడీపీ భాగస్వామి అవడానికి బీజేపీ ఒప్పుకుంటుందా? మేనిఫెస్టో విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలు ఏం చెబుత
శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో ఒక రోజు బ్రహ్మాండమైన విందు భోజనం తిన్నారంతా. అందులో తెనాలి రామకృష్ణ ఉన్నారు. కూరలన్నింటిలో వంకాయ కూర బావుందని చాలామంది మెచ్చుకున్నారు.
జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి కుమార్తె పదో తరగతి పరీక్ష రాసే సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థలు అతడి కుమార్తె అడ్మిషన కోసం వెంటబడటం మొదలుపెట్టాయి.
అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పా ర్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో ఎండలు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. దీంతో సాధారణ జనంతో పాటు వన్య ప్రాణులు దాహార్తీ తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో అటవీ శాఖ ఈసారి ఎన్నడు లేని కష్టాలు ఎదురవుతున్నాయి.