"అక్టోబర్ 25, 2025న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్కు ఎడమ పక్కటెముక దిగువ భాగంలో గాయమైంది. తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు" అని సోమవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో బీసీసీఐ తెలిపింది.
తుపాను తీరం దాటే సమయంలో తీవ్ర తుపానుగా బలపడనుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మొంథా తుపాను ప్రభావంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీలోని బీచ్ల వద్దకు పర్యటకులను అనుమతించట్లేదు. విశాఖ ఆర్కే బీచ్లో పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే హడావుడిగా తనిఖీలు చేయటం, తర్వాత పెద్దగా దృష్టి సారించరనే విమర్శలను ఆర్టీఏ అధికారులు తోసిపుచ్చుతున్నారు.కానీ, కర్నూలు ప్రమాదం జరగడానికి ముందు ఎప్పుడు ఎక్కడ విస్తృతంగా సోదాలు చేశారని బీబీసీ ప్రశ్నించగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు సరైన సమాధానం చెప్పలేదు.
" ఆదివారాల్లో కూడా పొలాల మధ్య తిరుగుతున్నారంటే లాభం కోసం కాక విలువల కోసం పని చేస్తున్నారని అర్ధం. ఇదే నాకు నమ్మకం కలిగించింది" అని స్వామినాథన్కు బదులిచ్చారు. ఆ రైతు విశ్వాసం భారతదేశ భవిష్యత్తును మార్చింది. నౌకలు తెచ్చే గోధుమలపై ఆధారడిన దేశాన్ని స్వయంసమృద్ధిగా మర్చారు స్వామినాథన్.
'శరీరంలోని ప్రతీ కణానికి విటమిన్ బీ-12 అవసరం. ఆహారాన్ని శక్తిగా మార్చడం, కొత్త అణువులను తయారు చేయడం, కణాల్లో జరిగే రసాయన చర్యల్లో విటమిన్ బీ-12 కీలక పాత్ర పోషిస్తుంది’
బంగారం, వెండిని కరిగించి, రత్నాలను చిన్న ముక్కలుగా విరగ్గొట్టే అవకాశం ఉందని, ఇప్పటికే అది జరిగి ఉండొచ్చని డిటెక్టివ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా జరిగితే ఏమవుతుంది?