[17:36]ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి తరఫున ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
[17:15]‘#సింగిల్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందన్నారు. అయితే, మార్పును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.
[16:52]ప్రతి ఏడాది భారత్..పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా 50 గిగావాట్లు జోడిస్తే..2029 నాటికి బొగ్గు దిగ్గుమతులను పూర్తిగా ఆపివేయొచ్చని ‘థింక్ ట్యాంక్ క్లైమేట్ రిస్క్స్ హారిజన్’ రూపొందించిన నివేదిక తెలిపింది.
[16:39]తెలంగాణలో గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది.
[15:41]తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది భారాసనేనని, సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలు చెప్పిన సందేశం ఇదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
[15:23]పటిష్ఠమైన భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తయారు చేసిందని, రైతులను ఇబ్బంది పెట్టకుండా సక్రమంగా అమలు చేసే బాధ్యత అధికారులదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
[15:10]భారత సముద్ర జలాలపై రఫేల్ గర్జనలు వినిపించనున్నాయి. నౌకాదళం కోసం వీటిల్లోని ప్రత్యేక రకాన్ని కొనుగోలు చేసేందుకు మన దేశం ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకొంది.
[15:04]IPL 2025: అద్భుతమైన ఆటతీరుతో ఐపీఎల్లో దూసుకుపోతున్న జట్లు.. ప్లేఆఫ్స్పై కన్నేశాయి. ఇక నుంచి ప్రతి విజయమూ కీలకమే. పాయింట్ల పట్టికలో ఆఖరున ఉన్న టీమ్లు ఎవరికి ముప్పుగా మారతాయో చూడాలి.
[14:13]‘కన్నప్ప’ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు కథా నాయకుడు మంచు విష్ణు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోనూ ప్రచారానికి సిద్ధమయ్యారు.
[13:52]ఓటీటీ ప్లాట్ఫామ్, సోషల్ మీడియాల్లో అశ్లీల కంటెంట్ని కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రంతో సహా పలు ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు నోటీసులు జారీ చేసింది.
[13:46]ఉగ్రదాడి నుంచి నటి దీపికా కాకర్, తన భర్త షోయబ్ ఇబ్రహీం తప్పించుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన పోస్ట్పై వచ్చిన విమర్శల గురించి షోయబ్ క్లారిటీ ఇచ్చారు.
[13:40]పహల్గాం ఉగ్రవాదులు భద్రతా దళాల చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకొన్నారు. ఒకసారి కాల్పుల జరిపి పారిపోగా.. మరోచోట భోజనం చేస్తూ ఆహారంతో సహా పరారయ్యారు.
[12:27]IPL 2025: మిడిలార్డర్లో రిషభ్ పంత్ కీలకంగా మారతాడని ఇప్పటికీ భావిస్తున్నామని లఖ్నవూ మెంటార్ జహీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు. అతడు పేలవ ఫామ్ నుంచి బయటకొస్తాడని పేర్కొన్నాడు.
[11:15]IPL 2025: ఆర్సీబీ దూకుడు కొనసాగుతోంది. ఏడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్లోకి చేరింది. ప్లేఆఫ్స్కు మరింత చేరువైన ఆ జట్టు ఓ ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
[11:08]పహల్గాంపై చేసిన ఉగ్రదాడితో పాకిస్థాన్కు ఇప్పుడు ఊపిరి ఆడడం లేదు. ఆ దేశ పాలకులు ఎంతో.. ఆడంబరంగా మొదలుపెట్టిన గ్రీన్ పాకిస్థాన్ ప్రాజెక్టు.. భారత్ కన్నెర్ర చేయడంతో ఒడలిపోయింది.
[11:05]ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం ఆయనకు బీపీలో హెచ్చుతగ్గుల రావడంతో విచారణ జరగలేదు.
[10:48]Pahalgam Terror Attack: ఆన్లైన్ ద్వారా కశ్మీర్ యువతను పాకిస్థాన్ (Pakistan) ఆకర్షిస్తోంది. చెల్లుబాటు అయ్యే వీసాలతో తమ దేశంలోకి వారిని రప్పించుకొని, శిక్షణ ఇచ్చి, కశ్మీర్లో కల్లోలం సృష్టిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
[10:44]రాజ్భవన్లో తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త ప్రమాణస్వీకారం చేశారు. లోకాయుక్తగా జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్ కుమార్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
[09:12]వేసవి సీజన్లో ప్రతి వారం క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి. ఈసారి ఆ స్థాయి వినోదం తగ్గిందనే చెప్పాలి. మే మొదటివారంలో ఆసక్తికర చిత్రాలతో అసలైన వినోదం మొదలు కానుంది. అవేంటి? వాటి కథేంటో చూసేయండి..
[07:48]పదో తరగతిలో ఈసారి మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 8న పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రతిపాదన పంపగా.. దాదాపు 20 రోజులకు నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చారు.
[06:19]స్వయం సమృద్ధి ప్రాజెక్టయిన ప్రజారాజధాని అమరావతి ఐదేళ్ల గ్రహణం నుంచి బయటపడి మళ్లీ వెలుగుబాట పట్టిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
[05:06]పహల్గాం ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ ఘాతుకానికి తెగబడిన ముష్కరులు, వారి వెనక ఉన్న కుట్రదారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఉద్ఘాటించారు.
[05:04]పాకిస్థాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలను దిగ్విజయంగా నిర్వహించింది.
[05:03]గడచిన నాలుగు రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు.
[05:00]పహల్గాంలోని బైసరన్లో జరిగిన ఉగ్ర దాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టింది. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ..
[04:56]పహల్గాం ఊచకోత తర్వాత భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24న ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్శామ్ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది.. సముద్రతలానికి చేరువగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది.
[04:56]తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మే 1 నుంచి జులై 15వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకే తితిదే పరిమితం చేసింది.
[04:50]దిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రి వైద్యులు ఓ మహిళ (36) కడుపులో నుంచి భారీ ఆడ్రినల్ కణితిని తొలగించారు. వైద్యులు పవన్ వాసుదేవా, నీరజ్ కుమార్, అవిషేక్ మండల్ కలిసి మూడు గంటలపాటు శ్రమించి రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ విజయం సాధించారు.
[04:52]ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఒంగోలు డెయిరీ ప్లాంటు ఇది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల యంత్రాలు తుప్పుపట్టి.. ఇప్పుడు గేదెల కొట్టంలా మారింది. 2014-19 మధ్య నష్టాల్లో ఉన్న డెయిరీని అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.35 కోట్లు వెచ్చించి గాడిన పడేలా చేసింది.
[04:53]శ్రీకాకుళంలోని విశాఖ ‘ఏ’ కాలనీకి చెందిన నిమ్మర్తి కమల ఇంటి ఆవరణలోని మామిడి చెట్టు ఒకే గుత్తికి 25 కాయలు కాసింది. అదీనూ మొండి మొదలుకే ఆ గుత్తి వేసింది.
[04:52]ముంబయికి చెందిన సినీనటి కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు బనాయించి, వేధించిన కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
[04:46]హిమాచల్ ప్రదేశ్లో ఓ బైకరు తన పుట్టినరోజు నాడే ప్రాణాలు విడిచాడు. గిరి నది ఒడ్డున అంత్యక్రియలు చేయగా, అతడికి ఎంతో ఇష్టమైన బైక్ను కుటుంబసభ్యులు కాలుతున్న చితికి ఎదురుగా పెట్టారు.
[04:46]తెదేపా కార్యకర్తపై వైకాపాకు చెందిన కౌన్సిలర్, ఆయన అనుచరులు కత్తులతో దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ శివారు పంట పొలాల్లో జరిగింది.
[05:37]రుణయాప్ల ద్వారా అమాయకుల మెడకు రుణ ఉచ్చు బిగిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు గుర్తించారు. వీరికి సహకారం అందిస్తున్న 16 మందిని అరెస్టు చేసినట్లు విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
[04:45]శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచిలో ఉన్న కియా కార్ల పరిశ్రమలో ఇంజిన్లు చోరీ అయిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో దాదాపు 350 ఇంజిన్లు రికవరీ చేసి పెనుకొండకు తరలిస్తున్నట్లు తెలిసింది.
[04:47]మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్టల్లో వారి రహస్య స్థావరాల్లోకి భద్రతా బలగాలు ఆదివారం చొచ్చుకెళ్లాయి. ములుగు జిల్లా వెంకటాపురం పోలీసు సర్కిల్కు సరిహద్దుగా ఉన్న నల్లరాతి(బెడెం మల్లన్న) గుట్టలో శనివారం భారీ సొరంగాన్ని గుర్తించిన విషయం తెలిసిందే.
[04:42]కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు గురై ఆదివారం ముగ్గురు మృతి చెందారు. కౌతాళం మండలంలోని కాత్రికి గ్రామ శివార్లలో క్రికెట్ ఆడేందుకు తెలుగు అశోక్ (20), బాలయ్య (22) వెళ్లిన సమయంలో వర్షం మొదలైంది.
[04:38]నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఉప్పర్పల్లికి చెందిన పి.ఆంజనేయులు (32) తన పొలంలో ఆరబెట్టిన ధాన్యం నిల్వలపై టార్పాలిన్ కప్పుతుండగా.. పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు.
[04:36]తెలుగువారి గురించి తరచూ అవమానకర వ్యాఖ్యలు చేసే నామ్ తమిళర్ కట్చి ప్రధాన సమన్వయకర్త సీమాన్కు వ్యతిరేకంగా, మదురైలోని కప్పలూర్లో వీరపాండ్య కట్టబ్రహ్మన విగ్రహాన్ని ఎన్హెచ్ఏఐ తొలగించడానికి నిరసనగా చెన్నై తిరువళ్లికేణిలో తెలుంగు మున్నేట్ర కళగం ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన నిర్వహించారు.
[04:29]పహల్గాం దాడి తర్వాత కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారని భాజపా ధ్వజమెత్తింది. ఇతర ప్రతిపక్ష నేతలూ ఇలాగే మాట్లాడుతున్నారని విమర్శించింది.
[04:35]రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వచ్చే నెల 2న ప్రధాని మోదీ హాజరయ్యే సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేదిక వద్దకు చేరుకునేలా 11 మార్గాలను సిద్ధం చేశామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
[05:49]పాకిస్థాన్లో పుట్టిన ఓ మహిళ ఇక్కడకు వచ్చి భారతీయుణ్ని పెళ్లి చేసుకుంది. అనుకోని పరిస్థితుల్లో వారి కుమార్తె దాయాది దేశంలో జన్మించింది. ఏడేళ్ల వయసులో ఇక్కడకు వచ్చేసిన ఆ చిన్నారికి ప్రస్తుతం 26 ఏళ్లు.
[04:54]‘కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అంబేడ్కర్ను అవమానాలకు గురిచేసింది. ఎన్నికల్లో ఆయన్ని ఓడించేందుకు కూడా నెహ్రూ ప్రయత్నించారు. అంబేడ్కర్, ఆయన రచించిన రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు’ అని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు.
[04:28]రాష్ట్రంలోని స్థానిక సంస్థల పరిధిలో మ్యాన్హోల్స్ శుభ్రం చేస్తూ 1993 నుంచి ఇప్పటివరకు ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారనే వివరాలను సేకరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది.
[04:27]మొగలులు, దిల్లీ సుల్తాన్లకు సంబంధించిన ప్రస్తావనలన్నింటినీ ఎన్సీఈఆర్టీ (జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి) ఏడో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి తొలగించారు.
[04:27]ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, ఐదు బోధనాసుపత్రులకు సూపరింటెండెంట్లను నియమిస్తూ వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల, తిరుపతి శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాల సహా కాకినాడ, కడప, నెల్లూరు,
[04:26]సింగరేణి, ఎన్టీపీసీ నిర్మించే కొత్త ప్లాంట్ల నుంచి 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కొనుగోలుకు అనుమతించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)లో పిటిషన్లు దాఖలుచేశాయి.
[04:16]హనుమకొండ-సిద్దిపేట జాతీయ రహదారిపై ఏడు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారాస రజతోత్సవ సభకు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు బస్సులు, కార్లలో ఈ దారి వెంబడి తరలివచ్చాయి.
[04:18]కేసీఆర్ సభా వేదికపైకి రాగానే ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపానికి పూలు చల్లి నివాళి అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి అంజలి ఘటించారు.
[04:24]ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆదివారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
[04:23]జపాన్ దేశ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి ఆదివారం ఒసాకా నగరంలోని ప్రసిద్ధ అగ్రో కెమికల్ సంస్థ నిచినో పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు.
[04:21]ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం ఉదయం పలుచోట్ల వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం.. హఠాత్తుగా కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది.
[04:20]చుట్టూ ఆకుపచ్చటి చెట్లు... మధ్యలో ఎర్రపూల గొడుగులా కనువిందు చేస్తోంది ఎర్ర తురాయి(గుల్మొహర్) చెట్టు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ కూడలి సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో ఇలా కనిపించింది.
[04:24]‘విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలు కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వీటికి పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరముంది. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తేనే ఇది సాధ్యం.
[06:15]వాయులింగేశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజన సంద్రంగా మారింది. వేసవి సెలవులు, అందులోనూ ఆదివారం, అమావాస్య కలిసి రావడంతో ఆలయంలో మహాశివరాత్రిని తలపించిన రీతిలో భక్తులు తరలివచ్చారు.
[04:26]కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని నదిచాగి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి చేతికొచ్చిన పంట నీటిపాలైంది. గ్రామంలో సుమారు 900 ఎకరాల్లో వరి కోతలు కోసి ధాన్యాన్ని ఆరబోయగా, వర్షంతో చాలావరకు తడిసి ముద్దయింది.
[04:25]చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చెల్లించే భృతిని రెట్టింపు చేస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తెలిపారు.
[04:54]జమ్మూ-కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూదన్రావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల సాయం అందజేసింది.
[04:53]తూర్పు కనుమల్లోని ప్రకృతి అందాలే కాదు.. అటవీ ఉత్పత్తులూ ఔరా అనిపిస్తుంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కిల్లోగుడలో సంజీవిని సంస్థ నిర్వహిస్తున్న ‘పాత విత్తనాల పండగ’లో వెరైటీ ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
[04:27]ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, ఐదు బోధనాసుపత్రులకు సూపరింటెండెంట్లను నియమిస్తూ వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల, తిరుపతి శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాల సహా కాకినాడ, కడప, నెల్లూరు,
[03:45]క్రిమియాపై రష్యా అధికారాన్ని అంగీకరించే ప్రసక్తే లేదంటోంది ఉక్రెయిన్. ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదిస్తున్న ఉక్రెయిన్ శాంతి ఒప్పందం.. 2014లో మాస్కో ఆక్రమించిన ఈ ద్వీపంపై రష్యాకే హక్కులు ఉంటాయని చెబుతోంది.
[03:44]పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు పూర్తి కావడంతో ఇప్పుడందరి దృష్టి తదుపరి పోప్ ఎన్నికపైకే మళ్లింది. సోమవారం కార్డినళ్లు సమావేశమై ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది.
[03:43]ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్, చైనా పేర్కొన్నాయి. ఇతర దేశాల ఏకపక్ష, ఆధిపత్య విధానాలను వ్యతిరేకిస్తామని ప్రకటించాయి.
[03:43]భారత్లోని జమ్మూకశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై చేపట్టే దర్యాప్తులో రష్యా, చైనా జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ మేరకు ఓ మీడియా కథనం వెల్లడించింది.
[06:00]చింతచిగురు తినాలన్న అభిరుచి ఉన్నవారు దాని ధర విని ‘వామ్మో..’ అంటున్నారు. ఖమ్మం నగరంలోని పాత పురపాలక సంఘం కార్యాలయం, రైతుబజార్ తదితర ప్రాంతాల్లో ఆదివారం కిలో చింతచిగురు రూ.వెయ్యి పలికింది.
[03:40]‘‘గత మూడేళ్లుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో మహత్మాగాంధీ, శాతావాహన, తెలంగాణ, పాలమూరు వర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేశారు. తాజాగా కాకతీయ వర్సిటీలో సోమవారం (28) నుంచి డిగ్రీ పరీక్షలు జరగాల్సి ఉండగా రెండోసారి వాయిదా వేశారు.
[03:39]ఛత్తీస్గఢ్ అటవీప్రాంతంలో ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య డిమాండ్ చేశారు.
[03:36]ఆర్టీసీలో రిటైర్డ్ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
[03:36]దేశంలో ప్రధాన పంటగా ఉన్న వరిలో పోషక విలువలను పెంచాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్, వ్యవసాయ విద్యాపరిశోధన శాఖ కార్యదర్శి మంగీలాల్ జాట్ సూచించారు.
[04:55]రాష్ట్రంలో కీలకమైన విశాఖపట్నం, గుంటూరు నగరపాలక సంస్థల మేయర్ పీఠాలు కూటమి ఖాతాలోకి చేరనున్నాయి. రెండుచోట్లా సోమవారం మేయర్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు.
[04:56]నిన్నటి విధ్వంసం నుంచి..రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు..రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు.
[04:55]పాత లేఅవుట్లకు అనుమతులను తిరిగి పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయం 85 వేల కుటుంబాలకు ఊరటనివ్వనుంది. అప్పు చేసి కొన్న ఇంటి స్థలం (లేఅవుట్లో ప్లాట్)లో సొంతింటి నిర్మాణానికి అనుమతులు రాక.. బ్యాంకుల్లో రుణం దొరక్క.. ఇన్నాళ్లూ వారంతా మనోవేదనకు గురయ్యారు.
[04:55]దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందేందుకు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డుకు గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
[06:03]ఇందిరమ్మ ఇళ్ల కోసం ‘ప్రజాపాలన’లో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేయగా.. వీరిలో 36.03 లక్షల (46.7 శాతం) మంది అర్హులని గుర్తించారు.
[06:04]నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని శాంతిభద్రతల సమస్యగా పరిగణించటం లేదన్నారు.
[02:54]తెలంగాణ గొప్పదనాన్ని చాటే విధంగా భారత్ సమ్మిట్ విజయవంతమైందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
[03:12]తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈఏపీసెట్-2025కు సిద్ధమవుతున్న అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా తమకు పట్టున్న, ఇప్పటి వరకు బాగా చదివిన అధ్యాయాలపైనే చివరి రోజుల్లో దృష్టి సారించాలని అనుభవజ్ఞులైన అధ్యాపకులు చెబుతున్నారు.
[06:04]భారాస ఆదివారం నిర్వహించిన రజతోత్సవ సభ విజయవంతమైంది. ఎల్కతుర్తి సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి గులాబీ దండు కదలివచ్చింది.
[02:34]‘‘చాలా మంది ఫ్రాంఛైజీలు సృష్టిస్తుంటారు. అవి ఎన్ని రోజులుంటాయి.. ఎక్కడి దాకా వెళ్తాయి ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ, శైలేశ్ ‘హిట్: ఫస్ట్ కేస్’ అని ప్రకటించగానే.. ఇది ఓ అనంతమైన ఫ్రాంఛైజీలా ముందుకెళ్తూనే ఉంటుంది అందరికీ అర్థమైపోయింది.
[06:05]రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
[04:56]దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ మన రాష్ట్రంలోని మారుమూల గ్రామం పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకోవడం అప్పట్లో జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తమ అమ్మగారి ఊరు కొమరవోలును దత్తత తీసుకున్నారు.
[02:32]అగ్ర హీరోల నుంచి ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమా ఆశించినా అది అత్యాశే! పాన్ ఇండియా స్థాయి నిర్మాణం కారణంగా ఒకొక్క సినిమా రెండు మూడేళ్లు చిత్రీకరణ చేసుకుంటోంది.
[02:28]ఈ మధ్య తెలుగులో రీ-రిలీజ్ సినిమాల హవా రెట్టింపయ్యింది. పాత క్లాసిక్ హిట్లను 4కె టెక్నాలజీతో కొత్తగా ముస్తాబు చేసి తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి ఆయా చిత్ర బృందాలు.
[02:29]కృత్రిమ మేధ (ఏఐ)తో కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తాయని, తద్వారా పని స్వభావంలో మార్పులు వస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఏఐ గ్లోబల్ హెడ్ అశోక్ క్రిష్ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధికి చోదకంగా ఏఐను పరిగణించాలని, ఉద్యోగాలకు ముప్పుగా చూడరాదని అన్నారు.
[02:27]‘శుభం’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది నటి సమంత. ఇది ఆమె సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన తొలి సినిమా.
[02:27]బెంగళూరు అదరహో. ఈ సీజన్లో చక్కని ప్రదర్శనను కొనసాగిస్తూ ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది. ఛేదనలో ఇబ్బందిపడ్డా..
[02:27]కథానాయకుడు రామ్ పోతినేని.. దర్శకడు పి.మహేశ్ బాబు కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక.
[02:26]ఓ వైపు నటిగా అగ్రతారల సరసన నటిస్తూనే, గాయకురాలిగా సినీప్రియులను ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్. మరికొద్ది రోజుల్లో ‘కూలీ’, ‘జన నాయగన్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుందీమె.
[02:18]ఐపీఎల్-18లో తొలి అయిదు మ్యాచ్ల్లో ఒక్కటే గెలిచింది ముంబయి ఇండియన్స్. ఆ జట్టు ఆట చూస్తే ఈసారి కూడా పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లోనే నిలిచేలా కనిపించింది. కానీ ఇంతలో ఎంత మార్పు!
[02:25]‘‘తెలుగు నటులతో చేసిన అచ్చమైన తెలుగు సినిమా ‘సారంగపాణి జాతకం’. దీన్ని ప్రేక్షకులు పది కాలాల పాటు గుర్తుంచుకునేలా అందించాం’’ అన్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.
[02:16]హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థ న్యూట్రిషన్ నెక్స్ట్.. పెంపుడు జంతువులకు వాటి వయసుకు తగిన పోషణ అందించేందుకు ‘పేరెంట్’ పేరిట ఆహారోత్పత్తులను ఆదివారం విడుదల చేసింది.
[02:09]ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సౌర ఫలకాల (ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్ల) తయారీని ప్రారంభించింది. బ్యాటరీ నిల్వ ఉత్పత్తి సౌకర్యాలను నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు సంస్థ తెలిపింది.
[02:08]కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీల (సీపీఎస్ఈలు) షేర్లు లాభాల పంట పండించాయి. గత 8 ఏళ్లలో 18 ప్రభుత్వ రంగ కంపెనీలు తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రాగా.. 15 కంపెనీల షేర్లు మంచి లాభాలను అందించాయి.
[02:07]స్థిరాస్తి సంస్థ మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, బెంగళూరుల్లో భూమి కొనుగోలుకు ఇందులో అధికమొత్తాన్ని వెచ్చించనుంది.
[02:05]ముక్కోణపు వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఓపెనర్ ప్రతీక రావల్తో పాటు స్నిన్నర్లు రాణించడంతో ఆదివారం వర్ష ప్రభావిత తొలి మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది.
[02:03]సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సేదతీరడం కోసం మాల్దీవులకు వెళ్లింది. సన్రైజర్స్ సోషల్ మీడియా టీమ్ పోస్ట్ చేసిన వీడియోలో ఆటగాళ్లు మాల్దీవుల్లో సరదాగా గడుపుతూ కనిపించారు.
[01:49]ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో సీజన్ మధ్యలో పగ్గాలందుకున్న ధోని కూడా ఆ జట్టు రాత మార్చలేకపోయాడు.
[23:16]దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
[17:11]కొందరైతే ఎప్పుడు చూసినా ‘ఫోన్లోనే తల’మునకలై ఉంటారు. సోషల్ మీడియా(Social Media)లో రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తోనే గడిపేస్తుంటారు.