[21:51]Maruti price reduction: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రయాణికుల వాహన ధరలను తగ్గించింది. తన వాహన శ్రేణిపై గరిష్ఠంగా రూ.1,29,600 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
[21:11]శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ పరిశ్రమ కోసం రైతుల నుంచి ఎక్కడా బలవంతంగా భూములు లాక్కోబోమని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
[20:32]మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడప జైల్లో బెదిరించిన ఘటనపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరోసారి విచారణ చేపట్టారు.
[20:09]SEBI clean chit to adani: హిండెన్బర్గ్ ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ఆయన కంపెనీలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి క్లీన్చిట్ లభించింది.
[19:22]గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన యర్రు బాపారావు(39) హైదరాబాద్లో యానిమేటర్గా ఉద్యోగం చేశారు. తర్వాత స్వగ్రామానికి వచ్చి 60 మందికిపైగా రైతులతో కలిసి ‘అత్తోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ’గా ఏర్పడి దేశీవరి సాగు చేస్తున్నారు.
[18:00]EPFO single login: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మెంబర్ పోర్టల్లోనే పీఎఫ్ లావాదేవీలను తెలుసుకునేలా పాస్బుక్లైట్ (Passbook lite) పేరుతో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
[18:03]లఖ్నవూ వేదికగా భారత్ A, ఆస్ట్రేలియా A మధ్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ మ్యాచ్ మూడోరోజు ఆట ముగిసింది. ఈ సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది.
[16:28]పాకిస్థాన్ జట్టు వివాదాల మీద కాకుండా, తమ ఆటతీరును మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వారికి హితవు పలికారు.
[16:08]కొందరు గిట్టని వ్యక్తులు తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు, సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవాలు వ్యాపింపజేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
[12:39] ఆండీ పైక్రాఫ్ట్ టోర్నీ నుంచే తప్పించాలని డిమాండ్ చేసినా.. చివరికిి అతడే మళ్లీ తమ మ్యాచ్కు రిఫరీగా రావడం పాక్ జట్టు భరించలేకపోతోంది. దీంతో ఐసీసీ ఎన్ని సార్లు అవసరం లేదని చెబుతున్నాసరే విచారణ చేయించాలని కోరడం దాని పరిస్థితి అద్దం పడుతోంది.
[11:08]తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Batthula Laxma Reddy), ఆయన కుటుంబసభ్యులు విరాళం అందించారు.
[10:48]ఏదైనా చేసేటప్పుడు సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి కదా.. ఇదీ ఓ సినిమాలోని డైలాగ్. అలా చేయకపోతే ఠక్కున దొరికిపోతారు. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఇలాగే తయారైంది.
[10:22]అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం (Air India Plane Crash) యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో మృతులకు సంబంధించిన నాలుగు కుటుంబాలు విమానాల తయారీ సంస్థ బోయింగ్పై అమెరికాలో దావా వేశాయి.
[08:41]ఆసియా కప్ నుంచి వైదొలగుతామని ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ జట్టు చివరికి దిగొచ్చి ఆడింది. దానికి కారణం ఆర్థికపరమైన అంశాలైనా సరే.. అవేమీ కాదన్నట్లుగా వ్యాఖ్యానించింది.
[08:05]చింత చచ్చినా పులుపు చావలేదంటారు.. ఇది సరిగ్గా పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు నప్పుతుంది. ఆసియా కప్లో ఆ జట్టు చేస్తున్న చేష్టలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
[06:15]తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించడానికి చెన్నై నుంచి గొడుగుల ఊరేగింపు బుధవారం బయలుదేరింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా ‘తిరుకుడై సేవా సమితి ట్రస్టు,
[06:13]ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. పూరీ సాగర తీరంలో మోదీ చిత్రపటంతో ఇలా సైకత శిల్పాన్ని రూపొందించారు.
[06:12]బెంగళూరు నగర శివారులోని బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనంలో వసీకరన్ అనే ఎలుగుబంటికి వెటర్నరీ వైద్యుడు కృత్రిమ కాలు అమర్చారు. బళ్లారి అటవీ ప్రాంతంలో 2019లో ఒక వేటగాడు వేసిన వలలో వసీకరన్ పడింది.
[06:11]ఏనుగుల పాలిట శాపంగా మారిన మొక్కలతో అవే ఏనుగుల బొమ్మలు తయారుచేస్తూ కర్ణాటక మహిళలు జీవనోపాధి పొందుతున్నారు. నీలగిరి జిల్లా కొడముల గ్రామానికి చెందిన గిరిజనులకు ‘రియల్ ఎలిఫెంట్ కలెక్టివ్’ అనే ఎన్జీవో లాంటానా మొక్కలతో బొమ్మల తయారీపై శిక్షణ ఇచ్చింది.
[06:10]కేరళలోని ఎర్నాకుళం జిల్లా రైతు డయాస్ పి.వర్గీస్ ఎనిమిదేళ్ల క్రితం పైనాపిల్ సాగు మొదలుపెట్టారు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక కొంతకాలం వదిలేశారు. అయినా నిరాశ చెందలేదు.
[06:57]ప్రపంచంలో విలాసవంతమైన క్రూజ్లను నడిపే సంస్థ ‘రీజెంట్ సెవెన్ సీస్’. ఇది తాజాగా తన అత్యంత ఖరీదైన క్రూజ్లో ప్రయాణానికి సంబంధించిన వివరాలను విడుదల చేసింది. 2027లో ప్రారంభమయ్యే ఈ ‘‘వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్’’ క్రూజ్..
[06:08]వరద ముంపులో ఉన్న వారు అధికార యంత్రాంగం కోసం ఎదురుచూడకుండా తమను తాము రక్షించుకునేలా ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని చెన్నై మహానగర పాలక సంస్థ(జీసీసీ) తాజాగా నిర్ణయించింది. కొన్నేళ్లుగా చెన్నైలో వరదలకు వందల వాడలు మునుగుతున్నాయి.
[06:04]యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అబుధాబీలో డ్రైవరు రహిత డెలివరీ వాహనాలు రోడ్లపైకి వచ్చేశాయి. ఇక్కడి మస్దార్ నగరంలో తొలిసారిగా డ్రైవర్ రహిత అటానమస్ వాహనాలను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు.
[06:03]డిజిటల్ అరెస్టు చేశామంటూ సైబర్ మోసగాళ్లు బెదిరించడంతో తమ ఇంటి పెద్దను కోల్పోయామని బాధిత కుటుంబ సభ్యులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇవి.. హైదరాబాద్కు చెందిన 75 ఏళ్ల వయోధికురాలికి వాట్సప్ కాల్ వచ్చింది.
[06:02]మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మెడస్కో అటవీ ప్రాంతంలో కొందరు మావోయిస్టులు మాటువేసి ఉన్నారనే సమాచారంతో పోలీసు సీ-60 దళంతోపాటు సీఆర్పీపీఎఫ్ బెటాలియన్లు చుట్టుముట్టాయి.
[05:59]వాతావరణ మార్పుల ప్రభావంతో దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పెరుగుతున్నాయి. సాధారణంగా వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉపరితల వాతావరణం వేడెక్కడంతో మార్చి-జూన్ మధ్యకాలంలో వాటి తరచుదనం, తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
[07:59]రాష్ట్రంలోని ఒంగోలు నుంచి దొనకొండ, దూపాడు నుంచి బేతంచర్ల, మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లె వంటి ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు నిర్మించేలా.. సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధమవుతున్నాయి.
[05:47]అమెరికా ఫెడరల్ రిజర్వ్.. అంచనాలకు తగ్గట్లుగానే కీలక రేట్లలో 0.25% కోత విధించింది. దీంతో వడ్డీ రేట్లు 4-4.25 శాతానికి పరిమితమయ్యాయి. 2024 డిసెంబరు తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడం ఇప్పుడే.
[05:35]ఉపాధ్యాయురాలు కావాలనేది ఆమె ధ్యేయం. తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు. తర్వాత సైనికురాలిగా ఎంపికై దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తూ... ఖాళీ సమయాల్లో లక్ష్య సాధన కోసం కృషి చేశారు. అనుకున్నది సాధించారు...
[07:14]అధిక ఉష్ణోగ్రతలు, అత్యంత కఠిన పరిస్థితులనూ తట్టుకునే ఒంగోలు జాతి గిత్తలంటే.. రాజసానికి పెట్టింది పేరు. బలిష్టంగా, పెద్ద మూపురంతో ఠీవీగా కనిపిస్తాయి. ఎంత బరువైనా సునాయాసంగా లాగేస్తాయి.
[07:32]ఒక చేత్తో జాతీయ జెండా, మరో చేత్తో ‘ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలి- ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి’ అనే నినాదం ఉన్న ప్లకార్డుతో విశాఖ నుంచి అమరావతికి ఆటోడ్రైవర్ చింతకాయల శ్రీను పాదయాత్ర చేశారు.
[05:41]మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయరెడ్డి (ఏ31), కృష్ణమోహన్రెడ్డి (ఏ32), బాలాజీ గోవిందప్ప (ఏ33)లకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 6న డిఫాల్ట్ బెయిలిచ్చిందని..
[05:40]మచిలీపట్నంలోని రంగనాయక స్వామి దేవాలయ భూములను ఆక్రమించిన మాజీ మంత్రి పేర్ని నాని.. వాటిని ఆయన సతీమణి, మామ పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
[05:39]గెలిస్తే ముఖ్యమంత్రిగా ఉంటాం, ఓడిపోతే ఇంటికి పోతామంటే ప్రజాస్వామ్యంలో కుదరదని, ఈ విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్రెడ్డి, కేసీఆర్లది ఒకే తత్వమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు.
[05:37]ఘటనకు దారితీసిన పరిస్థితుల (సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్) ఆధారంగా ఏదైనా నేరంలో నిందితులకు శిక్ష విధించేటప్పుడు పంచ్శీల్ సూత్రాల్ని అనుసరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘పంచ్శీల్ ప్రూఫ్’గా ఇదివరకు కోర్టు ప్రకటించిన ఐదు బంగారు సూత్రాలను విస్మరించరాదని పేర్కొంది.
[05:34]గ్రామ పంచాయతీల్లో ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం సేకరించిన భూముల్లో వినియోగానంతరం మిగిలిన స్థలాలను, ఇతర అవసరాలకు కేటాయించకుండా ఉన్నట్లయితే వాటిని భూ యజమానులకు తిరిగి పంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
[05:34]అరవై ఏళ్ల కిందటి హిందీ బ్లాక్బస్టర్ చిత్రం ‘ఆరాధన’లో యువ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘మేరే సప్నోకీ రాణీ కబ్ ఆయేగీ తూ’ పాట అనుభూతులను పర్యాటకులకు దార్జీలింగ్ మళ్లీ అందించనుంది.
[07:39]గ్రూప్-1 పరీక్షల విధానంలో మార్పులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటి వరకు స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తుండగా, ఇకపై ఒక్క పేపర్గానే నిర్వహించాలని నిర్ణయించింది.
[05:29]పొద్దున అల్పాహారం తీసుకున్న కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తోందా? అరటి, బెర్రీలు, ఖర్జూరం లాంటి త్వరగా శక్తినిచ్చే పదార్థాలు తీసుకోవాలన్న కోరిక పుడుతోందా?
[05:29]ఓట్ల చోరీపై ‘హైడ్రోజన్ బాంబు’ లాంటి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఇటీవల రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది.
[05:31]కూటమి ప్రభుత్వంలో అమరావతి భవ్యమైన రాజధానిగా రూపుదిద్దుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బుధవారం అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన...
[05:29]ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ), లోకాయుక్త తదితర ముఖ్యమైన సంస్థలకు అధిపతులు(హెడ్స్) లేరని, ఖాళీలను భర్తీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
[05:28]ప్రధానమంత్రి మోదీ అనుసరిస్తున్న రాజకీయ విధానాలను ఆయన మాతృమూర్తే తప్పుబట్టినట్టుగా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో చిత్రీకరించిన వీడియోలను కాంగ్రెస్ తన సామాజిక మాధ్యమాలన్నింటి నుంచి తొలగించాలని పట్నా హైకోర్టు బుధవారం ఆదేశించింది.
[05:27]ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో అక్టోబరు 2వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న స్వచ్ఛథాన్ (మారథాన్ రన్నింగ్)కు కామారెడ్డి జిల్లా రవాణాశాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న గుగ్గిలం అశోక్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు.
[05:25]గ్రామ పంచాయతీల్లోనూ భవన నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులిచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో అమలులో ఉన్న డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్)ను పంచాయతీలకూ అనుసంధానించనున్నారు.
[05:23]ఏపీని డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా మార్చేందుకు వినూత్న విధానాలను అనుసరిస్తున్నామని, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ సాకారంలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ పిలుపునిచ్చారు.
[05:15]భారత ప్రధాని నరేంద్రమోదీ.. స్వదేశంలో అత్యంత గౌరవాన్ని పొందడంతోపాటు ప్రపంచ వేదికపైనా ఎంతో ప్రఖ్యాతి సంపాదించుకున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు.
[05:20]‘అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునే నైతిక హక్కుందా? ఈ విషయంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, పార్లమెంటులోనూ చర్చ జరగాలనేది నా అభిప్రాయం’ అని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.
[05:18]మహిళలు, గర్భిణుల ఆరోగ్యం దేశ బలానికి పునాది అని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా స్థాయి స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు,
[05:15]భక్తుల సౌకర్యార్థం డిసెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈ నెల 18వ తేదీ (గురువారం) ఉదయం 10 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటి ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోసం 20న ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
[05:14]గత 23 నెలలుగా సాగుతున్న యుద్ధంలో అతలాకుతలమైన గాజాపై దాడిని మరింత విస్తృతం చేసి మారణహోమం సాగిస్తున్న ఇజ్రాయెల్ను కట్టడి చేసేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) నడుం బిగించింది.
[05:14]కేవలం మామోగ్రామ్, వయసు రికార్డుల ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయగల ఓ కృత్రిమ మేధస్సు (ఏఐ) పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు.
[05:05]నివాసం రాష్ట్రం మారితే.. వాహనం రీరిజిస్ట్రేషన్ తప్పనిసరి. అలాంటప్పుడు పాత లైఫ్ట్యాక్స్ తిరిగి పొందడానికి తొలి రిజిస్ట్రేషన్ జరిగిన రాష్ట్రంలో దరఖాస్తు చేసుకోవాలి.
[05:04]యువత.. స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం కంటే చర్చా వేదికల ద్వారా రియల్టైమ్ సంభాషణలు జరపాలని, యువ సంసద్ లాంటి వేదికలు అందుకు సరైనవని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు.
[05:04]ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణం(పీఎంఏవై-జీ) పథకం ద్వారా పేదల ఇళ్లకు అందించే నిధుల కోసం చేపట్టే సర్వే గడువును కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రమే పొడిగించింది.
[05:00]సెప్టెంబరు 17.. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
[05:03]ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
[09:24]భారీ వర్షాలు, నిర్వహణ లోపాలతో గుంతలమయమైన బెంగళూరు రహదారులు జాతీయస్థాయి చర్చకు తెరతీశాయి. ఈ అంశంపైనే బెళ్లందూరు ఔటర్ రింగ్రోడ్డులో ఉన్న ‘బ్లాక్బక్’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజి చేసిన ఎక్స్ పోస్టుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
[09:04]రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ సముదాయ (గవర్నమెంట్ కాంప్లెక్స్) సూక్ష్మ నమూనాను ప్రభుత్వం తయారు చేయించింది. హైదరాబాద్లో తయారైన నమూనా గురువారం విజయవాడ రానుంది.
[05:10]ప్రధాని మోదీ 75వ .జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
[05:09]రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ తిరిగిచ్చిన స్థలాలకు యాజమాన్య హక్కుల్ని దఖలు పరుస్తూ అందజేసే 9.24 ఫారంలోని ఏడో కాలమ్ను తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
[05:08]రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం రూపకల్పన తుదిదశకు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు వంగలపూడి అనిత, సవిత, ఎన్ఎండీ ఫరూక్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ బుధవారం సమావేశమయ్యారు.
[05:07]‘చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ విద్యార్థినిని పుర్రె చిట్లేలా ఉపాధ్యాయుడు కొట్టడం ఎంతో బాధాకరం. గతంలో మాదిరి దండించే విధానాన్ని విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు.
[04:59]ఆర్ఆర్ఆర్ భూసేకరణలో ఎలైన్మెంట్ మార్పుతో ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
[04:59]‘ఎంతో మంది త్యాగాల వల్లే నిజాం అకృత్యాల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని, విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాల’ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు కోరారు.
[04:59]నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.. దేశంలోని అనేక ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసిందని వక్తలు అభిప్రాయపడ్డారు.
[06:40]యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిసి ఒక్క బస్తా అయినా దొరుకుతుందని ఆశగా వెళుతుండగా.. అనుకోని ప్రమాదంలో ఓ రైతు భార్య మృత్యువాత పడిన ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాల్రావ్పేటలో చోటుచేసుకుంది.
[05:00]సెప్టెంబరు 17.. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
[04:58]భూమి, భుక్తి కోసం ఆనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించేలా రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఆపాలని సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారాట్ హితవు పలికారు.
[04:56]సర్వీస్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, పీఆర్టీయూ టీఎస్, తపస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విన్నవించారు.
[04:56]ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1,000, మిగతా షోలకు ప్రస్తుతమున్న ధరలపై అదనంగా సింగిల్ స్క్రీన్లలో రూ.125 చొప్పున, మల్టీప్లెక్స్ల్లో రూ.150 చొప్పున పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది.
[04:55]‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్లోని అమీర్పేట సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, అంజిరెడ్డి ప్రారంభించారు.
[04:54]తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకల ప్రాధాన్యంపై కవులు, కళాకారులు, గాయకులు రచనలతో పాటు ప్రదర్శనలు చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.
[04:57]విద్యుత్శాఖ ఇంజినీర్లు పలువురు క్షేత్రస్థాయిలో బినామీ గుత్తేదారులను ఏర్పాటు చేసుకుని మరీ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. కొత్త కరెంటు కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ లైన్లు, స్తంభాల మార్పు వంటి పనులకు ఇష్టారీతిన అంచనా వ్యయాలు తయారు చేస్తూ..
[04:53]ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు బయలుదేరిన ఏడుగురు మరో పది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనగా రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టిప్పరు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి ప్రాణాలను బలిగొంది.
[04:52]పన్ను చెల్లింపుల్లో అవకతవకలపై వచ్చిన ఆరోపణలను నిర్ధారించుకునేందుకు బంగారం వ్యాపారం నిర్వహించే కాప్స్ గోల్డ్తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి, దాని అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్నుశాఖ బుధవారం సోదాలు చేపట్టింది.
[04:52]ఉపగ్రహ అనువర్తన సిస్టమ్ ఆన్ చిప్(ఎస్వోసీ)ని ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేస్తోంది. 4జీ, 5జీ, ఉపగ్రహ కమ్యూనికేషన్లను ఒకే ప్లాట్ఫామ్లో అనుసంధానం చేస్తూ స్వదేశీ పరిజ్ఞానంతో ఈ చిప్ను రూపొందిస్తున్నారు.
[04:51]రాష్ట్రంలో కేవలం 13 శాతం ఆసుపత్రుల్లోనే ఆరోగ్యశ్రీ సేవలు ఆగాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. మిగిలిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సమ్మెకు దూరంగా ఉన్నట్లు వెల్లడించింది.
[06:22]విశాఖ నగరంలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రుషికొండలోని గీతం కళాశాల విద్యార్థి, తగరపువలసలోని ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థిని భవనాల పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.
[04:49]రూ.50 వేల అప్పు విషయమై ఏర్పడిన వివాదం రెండు ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పణిదం గ్రామంలో చోటుచేసుకుంది.
[04:47]తాను ఇవ్వాల్సిన బాకీ డబ్బుల గురించి మాట్లాడాలని నమ్మకంగా రప్పించి, ఇద్దరిని బావిలోకి తోసి హత్య చేసిన ఉదంతం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో చోటుచేసుకుంది.
[05:47]కృష్ణా బేసిన్లో అదనపు నీటి వినియోగానికి, కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
[04:36]క్షేత్రస్థాయి పరిస్థితులకు, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా రూపొందించనున్న తెలంగాణ విద్యా విధానం(టెప్) దేశానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులు, విద్యావేత్తలకు సూచించారు.
[04:38]బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ ఫెస్టివల్ను ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది.
[04:30]రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చేవారికి వంద రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ప్రణాళిక అమలు చేస్తున్నామని.. ఐదుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సలహా మండలిని ఏర్పాటుచేశామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
[04:41]‘కూటమి ప్రభుత్వ పాలనలోని అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక జగన్ విషం కక్కుతున్నారు. యూరియా కొరత, ఉల్లి ధరల పతనం, వైద్య కళాశాలలు, తిరుమల అంశాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు.
[04:40]అదనపు అంతస్తులు, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులపై చర్యలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్ హెచ్చరించారు.
[07:47]ఏనుగులదిన్నెపాడు(వై.డి.పాడు)... ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని ఓ చిన్న పంచాయతీ. దీని పరిధిలోని కుగ్రామం చట్లమిట్ట నుంచి మెగా డీఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయులుగా ఐదుగురు ఎంపికయ్యారు.
[04:37]‘పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
[04:34]ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న మూడు సాగునీటి ప్రాజెక్టులు 83%కి పైగా పూర్తయినట్లు కేంద్ర గణాంకశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కేంద్ర నిధులతో చేపట్టిన రూ.150 కోట్లకు మించిన ప్రాజెక్టుల పురోగతిని కేంద్ర గణాంకశాఖ తాజాగా వెల్లడించింది.
[04:26]అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. వారం లేదా పది రోజులు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవలే సూపర్సిక్స్- సూపర్హిట్ సంబరాన్ని నిర్వహించిన ఉత్సాహంతో సమావేశాలకు కూటమి సన్నద్ధమవుతుండగా..
[04:07]ఆస్ట్రేలియా మహిళలతో వన్డే సిరీస్లో భారత జట్టు బలంగా పుంజుకుంది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ బుధవారం రెండో వన్డేలో 102 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
[03:47]భారత స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్లో జావెలిన్ త్రో ఫైనల్కు చేరుకున్నాడు. మరో భారత ఆటగాడు సచిన్ యాదవ్ కూడా తుది 12 మందిలో చోటు దక్కించుకున్నాడు.
[03:37]టీ20 ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం. బ్యాటర్, ఆల్రౌండర్ జాబితాలో ఇప్పటికే మనోళ్లు అగ్రస్థానంలో ఉండగా.. బౌలర్ల ర్యాంకింగ్స్లో మేటి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలిసారి ప్రపంచ నంబర్వన్ ర్యాంకు సాధించాడు.
[03:29]ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సి తాను సంతకం చేసిన 2022 ప్రపంచకప్ జెర్సీని పంపాడు.
[03:22]జీఎస్టీ సంస్కరణల వల్ల బీమా ప్రీమియం తగ్గనుందని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనూజ్ త్యాగి స్పష్టం చేశారు. ఇందువల్ల మరింతమంది బీమా పాలసీలు తీసుకుంటారని ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలివీ..
[03:17]వచ్చే అయిదేళ్లలో దేశీయంగా కంపెనీలు 800 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.70 లక్షల కోట్ల)కు పైగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ అంచనా వేసింది.
[03:15]అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలీకృతం అవుతాయనే ఆశలకు తోడు, ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత సంకేతాలతో మన సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, బ్యాంకింగ్, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
[03:11]యెస్ బ్యాంక్లో 13.18% వాటాను జపాన్ సంస్థ సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్ఎంబీసీ)కు విక్రయించడాన్ని పూర్తిచేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బుధవారం ప్రకటించింది.
[08:38]పాలసీదారులు బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా బీమాసుగమ్ అధికారిక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) నేతృత్వంలో బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ (బీఎస్ఎఫ్ఐ) దీన్ని ఆవిష్కరించింది.
[02:57]దేశీయంగా నిర్వహిస్తున్న బంకుల కోసం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు రవాణా చేసేందుకు నాలుగు విదేశీ నౌకలను వినియోగించుకునేందుకు నయారా ఎనర్జీకి భారత అధికార వర్గాలు అనుమతి ఇచ్చాయి.
[02:51]జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల దేశీయంగా స్వచ్ఛ ఇంధన సరఫరాలు వేగవంతం అవ్వడంతో పాటు, 2030కి జతచేరే 300 గిగావాట్ల పెట్టుబడి సామర్థ్యంపై రూ.1.5 లక్షల కోట్ల వరకు ఆదా అవుతుందని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ తెలిపింది.
[02:50]కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, 3 సంవత్సరాల వ్యవధిలో తన ఉద్యోగుల జీతం రూ.31,000 చొప్పున పెంచాలని నిర్ణయించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వ్యవధిలో జీతం పెంపు అమలు కానుంది.
[02:48]కంపెనీ ప్రారంభ దశలో పెట్టుబడులు పెట్టిన వారికి, కొన్ని సందర్భాల్లో అనూహ్య లాభాలు వస్తుంటాయి. సిలికాన్ వ్యాలీకి చెందిన వెంచర్ క్యాపిటల్ దిగ్గజ సంస్థ యాక్సెల్.. 2 కంపెనీల పెట్టుబడులపై భారీ ప్రతిఫలాన్ని ఆర్జించింది.
[02:46]విద్యుత్తు వాహనంతో స్మార్ట్ వాచ్ను అనుసంధానం చేయడం కోసం లైఫ్స్టైల్ బ్రాండ్ నాయిస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టీవీఎస్ మోటార్ తెలిపింది. ఇందువల్ల నాయిస్ స్మార్ట్ వాచ్ను ప్రత్యేక ఎడిషన్ టీవీఎస్ ఐక్యూబ్ విద్యుత్తు స్కూటర్కు అనుసంధానించుకోవచ్చు.
[02:12]అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్హాసన్ కలిసి నటించే సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేమికులు. కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ కలయికలో సినిమాపై కమల్హాసన్ ఇటీవల జరిగిన సైమా వేడుకలో స్పష్టతనిచ్చారు.
[02:08]హిందీ కథానాయకుడు అభిషేక్ బచ్చన్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారా? ప్రభాస్ సినిమాలో ఆయన నటించనున్నారా? అంటే ఔననే అంటున్నాయి హిందీ చిత్ర పరిశ్రమ వర్గాలు.
[02:07]విజయ్ ఆంటోనీ సినిమాలు తెలుగులో సందడి చేస్తూనే ఉంటాయి. ‘బిచ్చగాడు’ తర్వాత ఆయన తెలుగు కథానాయకుల్లో ఒకరిగా మారిపోయారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘భద్రకాళి’ ఈ శుక్రవారం రానున్న సందర్భంగా విజయ్ ఆంటోనీ బుధవారం విలేకర్లతో ముచ్చటించారు.
[02:05]సినీ ప్రయాణంలో రోజులు గడుస్తున్న కొద్దీ.. తన పాత్రల ఎంపికలో మార్పు స్పష్టంగా తెలుస్తోందని అంటోంది కథానాయిక మాళవిక మోహనన్. ఇటీవలే ‘హృదయపూర్వం’తో ప్రేక్షకుల్ని పలకరించిందీ తార.
[02:04]ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’. నిత్యామేనన్ కథానాయిక. సత్యరాజ్, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్, షాలినీ పాండే తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
[02:03]బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హోమ్బౌండ్’. నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.
[23:35]ఏపీ హోం మంత్రి అనిత ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కొండపై జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.