[06:21]‘‘రాజధాని రైతుల త్యాగఫలంతోనే అమరావతి నిర్మాణం జరుగుతోంది. 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో సుమారు ఎకరం భూమి కేటాయించి తుళ్లూరు సబ్ డివిజినల్ పోలీస్ అధికారి (ఎస్డీపీవో) కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
[06:21]పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని వివిధ దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానించారు.
[06:20]ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని దుబాయ్ పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు.
[06:19]రాష్ట్రంలో తిరిగే ప్రైవేటు టూరిస్ట్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఏపీ ప్రైవేటు టూరిస్ట్ బస్సు యజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
[06:18]అనంతపురంలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘రెవెన్యూ క్రీడల’ పండుగకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు.
[06:18]మద్యం కుంభకోణం కేసులో విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో రెండో రోజు వైద్య చికిత్స అందించారు.
[05:44]ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మంగళవారం మావోయిస్టులకు చెందిన ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీని డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) బలగాలు ధ్వంసం చేశాయి.
[06:14]రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దశల వారీగా ఎంఎస్ఎంఈ పార్కులు/ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించి మొదటి దశలో 56 పార్కులను అభివృద్ధి చేస్తోంది.
[06:14]గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో మరమ్మతులు, మౌలిక సౌకర్యాల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.113 కోట్లు మంజూరు చేశారని మహిళా శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
[06:13]విజయవాడలో డిసెంబరు 12 నుంచి 14వ తేదీ వరకూ ‘ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో-2025’ను నిర్వహించనున్నట్లు ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు.
[06:13]రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు వివరించి.. వారి ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
[06:13]సీనరేజ్ ఫీజుల చెల్లింపు విషయంలో గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ యూనిట్ల యాజమాన్యాలకు, సీనరేజ్ వసూళ్ల గుత్తేదారులకు మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, వారం రోజుల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
[05:33]కెనడాలో భారతీయ విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ఉన్నతవిద్య చదివేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగురిలో ముగ్గురు విద్యార్థుల వీసాలను కెనడా అధికారులు తిరస్కరించారు. ఇలా ఆగస్టు నెలలో 74 శాతం దరఖాస్తులు ఆమోదం పొందనట్లు కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంటు గణాంకాలు పేర్కొంటున్నాయి.
[05:30]బిహార్లో గత ఇరవై ఏళ్లలో కనీవినీ ఎరగని విజయాన్ని ఎన్డీయే కూటమి ఈసారి సాధించబోతోందని, ఓటర్లు ఆ మేరకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ‘ఆటవిక రాజ్య’ నేతలు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
[05:29]తమ దేశంలో ఔట్సోర్సింగ్ విదేశీయులపై 25% పన్ను విధించాలని అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టిన అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత (హైర్) చట్టంపై మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
[05:28]విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వంటి ముఖ్యమైన సమస్యల నుంచి యువత దృష్టి మళ్లించడానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని లోక్సభ విపక్షనేత రాహుల్గాంధీ ఆరోపించారు.
[05:26]బిహార్లో ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒసామా షాహాబ్ గెలిస్తే అది హిందువుల ఓటమే అవుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు. ఒసామా షాహాబ్ పేరే ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్లా ఉందని అన్నారు.
[05:23]భారత సంతతికి చెందిన న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి జొహ్రాన్ మమ్దానీ (డెమోక్రటిక్ పార్టీ)పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
[05:23]భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి గిడియాన్ సార్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారం, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
[05:21]‘కల్మేగీ’ టైఫూన్ ఫిలిప్పీన్స్లో విధ్వంసం సృష్టించింది. కనీసం 26 మందిని పొట్టనపెట్టుకుంది. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. పెద్దసంఖ్యలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపైకి చేరుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అనేక కార్లు నీటమునిగాయి.
[05:20]ఉక్రెయిన్కు చెందిన డ్రోన్లు రష్యన్ భూభాగంలో దాదాపు 1,300 కిలోమీటర్ల మేర చొచ్చుకుపోయి ఓ పరిశ్రమపై దాడికి పాల్పడ్డాయి. రష్యా అధికారులు మంగళవారం వెల్లడించారు.
[05:19]అమెరికాలో మంగళవారం అనేక పదవులకు జరిగిన ఎన్నికలు ప్రత్యేకతను చాటుకున్నాయి. హైదరాబాద్లో జన్మించి అమెరికాకు వలస వచ్చిన గజాలా హాష్మీ వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి పోటీ పడ్డారు.
[05:17]సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
[05:15]ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) రెండో విడత మంగళవారం ప్రారంభమైంది. 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీల్లో) దీనికి ఎన్నికల సంఘం (ఈసీ) శ్రీకారం చుట్టింది.
[05:13]బిహార్ శాసనసభ ఎన్నికల తొలిదశకు ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగు జరగనుంది. దీనికి ఎన్నికల సంఘం తరఫున ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు.
[05:11]ఛత్తీస్గఢ్లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. లోకోపైలట్ సహా ఎనిమిది మంది మృతి చెందారు. సహాయక లోకో పైలట్తో పాటు 14 మంది గాయపడ్డారు.
[05:12]హిమాలయ పర్వతశ్రేణుల్లో వెలసి దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్లోనూ మద్యం వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పెళ్లిళ్లలో మద్యం మత్తులో వివాదాలు సర్వసాధారణంగా మారుతున్నాయి.
[05:11]ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నారాయణ్పట్నా బ్లాకు పరిధిలోని గడబగూడ వంద గడపలున్న చిన్న గిరిజన గ్రామం. గత రెండేళ్లలో ఈ గ్రామంలో ఎక్కువ సంఖ్యలో యువకులు పలు కారణాలతో మృత్యువాతపడ్డారు.
[05:09]తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా జవ్వాదుకొండ తాలూకా కోవిలూర్ గ్రామంలోని తిరుమూలనాథర్ సన్నిధి, రాజగోపురం చాలాకాలంగా శిథిలమై ఉన్నాయి. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.49 కోట్లు కేటాయించింది.
[05:07]క్యూఎస్ ఆసియా ర్యాంకింగుల్లో మన దేశంలోని 5 ఐఐటీలు, దిల్లీ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని ఐఐఎస్సీ.. టాప్ 100లో నిలిచాయి. దిల్లీ, మద్రాస్, బొంబాయి, కాన్పుర్, ఖరగ్పుర్ ఐఐటీలు ఈ జాబితాలో చోటు సంపాదించిన వాటిలో ఉన్నాయి.
[05:06]కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్సింగ్ తరఫున బిహార్లోని మోకామాలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
[04:56]సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడులో 54 మంది మృతి చెందిన సంఘటనపై దర్యాప్తు పురోగతి నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
[04:53]కమీషన్లు దండుకోవడానికే ఎస్ఎల్బీసీ పనులను తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, తెదేపాల హయాంలోనే ఎస్ఎల్బీసీకి నష్టం జరిగింది.
[04:52]రాష్ట్రంలోని 6 వేల కళాశాలల్లో చదువుతున్న 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల రూ. 8 వేల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో రెండు రోజులుగా కళాశాలలు మూసివేసినా ప్రభుత్వం పట్టించుకోదా అని ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు.
[04:52]రాష్ట్రంలో ఉన్నత విద్యా కళాశాలల బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆర్థిక, విద్య, సంక్షేమ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం సాయంత్రం చర్చించారు.
[04:49]పంటలు చేతికొచ్చి కోతలు మొదలైన వేళ హఠాత్తు వర్షాలు అన్నదాతలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. మంగళవారం కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
[04:46]‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్ జారీ చేసిన సీఆర్పీసీ 41ఏ నోటీసును సవాల్ చేస్తూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెల్లపల్లిలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు మూసివేసింది.
[04:51]రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ రెండోరోజు మంగళవారం కొనసాగింది. కళాశాలలు మూతపడటంతో మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన బీఫార్మసీ పరీక్షలు అధిక శాతం విద్యాసంస్థల్లో జరగలేదు.
[04:42]ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అనుమానిత ఈ-లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించనుంది. రెండు నెలలుగా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కేరళకు చెందిన ఆడిట్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను నిర్వహించింది.
[04:38]రాష్ట్రంలోని కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి నిధుల సమీకరణపై ప్రత్యామ్నాయ మార్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు గత నెల 28న జీఓ-19 జారీ చేశారు.
[04:39]ఈ చిత్రంలో కనిపిస్తున్న రోడ్డు గత ఏడాది కొత్తగా నిర్మించగా.. వరదల ఉద్ధృతికి ఇలా ఛిద్రమైంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వంతెన వద్ద గోదావరి నది పోటెత్తింది.
[04:35]జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాజపాకు జనసేన మద్దతు ప్రకటించింది. మంగళవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావులతో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ హైదరాబాద్లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు.
[04:34]కీలక రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంవో) పోస్టులను వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు పదోన్నతులతో భర్తీ చేసింది. పలు జిల్లాలకు డీఎంహెచ్వోలనూ నియమించింది.
[04:33]‘వందేమాతరం’ 150 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని జార్ఖండ్, ఒడిశా, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలకు తాను ఇన్ఛార్జ్గా నియామకమవ్వడం ఆనందంగా ఉందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ తెలిపారు.
[04:33]తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో చేపట్టిన శాసనమండలి భవన పునర్నిర్మాణ పనులను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే ఆ భవన ప్రారంభోత్సవం జరగనుందని ఆయన పేర్కొన్నారు.
[04:31]రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలైన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(ఎస్హెచ్ఆర్సీ) సుమోటోగా కేసు విచారణ చేపట్టింది.
[04:40]హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 10 నుంచి 22వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రక్షణ పౌరసంబంధాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
[04:22]నిత్యం పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులు మల్లఖంబ్ విన్యాసాలతో అదరగొట్టారు. యోగా, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్ల కలయికతో కూడిన ఈ ప్రాచీన యుద్ధ క్రీడలో తమ ప్రావీణ్యం ప్రదర్శించి ఔరా అనిపించారు.
[04:20]కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి రైతులు ఆగమాగమయ్యారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడిసిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు.
[04:18]‘కాంగ్రెస్ మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టి అమలు చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసులపై పోరాడుతూనే ఉంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని అధికారికంగా వ్యతిరేకించిన తొలి రాష్ట్రం తెలంగాణ’ అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
[04:14]ఈడబ్ల్యూఎస్ పటిష్ఠ అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని పలువురు రెడ్డి, ఓసీ సంఘాల ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ‘రెడ్ల నిరసన దీక్ష’ చేపట్టారు.
[04:10]పత్తి కొనుగోళ్లను ఎకరానికి ఏడు క్వింటాళ్లకు పరిమితం చేస్తూ సీసీఐ జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర రైతుల పాలిట అశనిపాతంలా మారాయి. రాష్ట్రంలో సీజన్ ఆరంభంలో వర్షాభావం... ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
[04:19]భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ యాజమాన్యం గ్రేడ్-4 ఆర్టిజన్ల నియామకానికి నిర్వహించిన పరీక్షను రద్దు చేసింది. ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది.
[04:07]‘‘మీ గురించి మీరేమనుకుంటున్నారు? పార్టీ క్రమశిక్షణ పాటించాలని తెలియదా? పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీ పరిస్థితేంటి? సొంతంగా పోటీచేస్తే డిపాజిట్ అయినా దక్కేదా? ఎంపీతో మీకేమైనా సమస్య ఉంటే సీఎం దృష్టికి తేవాలి లేదా పార్టీ వేదికపై ప్రస్తావించాలి.
[03:55]తెదేపా కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం నిర్వహించిన 70వ ప్రజాదర్బార్కు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.
[03:44]కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు. మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించారు.
[03:22] విమాన టికెట్ల బుకింగ్, రిఫండ్లకు సంబంధించి వినియోగదారులకు మేలు చేసే పలు చర్యలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రతిపాదించింది.
[03:21]దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2,582.10 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
[03:19]పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను దుర్వినియోగం చేయడం ద్వారా మదుపర్లను వరేనియం క్లౌడ్ లిమిటెడ్ అనే సంస్థ మోసం చేసినట్లు ఎన్ఫోర్స్మేట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో తేలింది.
[03:18]వాట్సప్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) జారీ చేసిన నిషేధాజ్ఞల్లో కొంత భాగాన్ని అప్పిలేట్ ట్రైబ్యునల్ అయిన ఎన్సీఎల్ఏటీ పక్కనపెట్టింది.
[03:18]ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ఆర్థిక సంఘటితానికి, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనలు సరికాదని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు.
[02:41]ఒకప్పుడు కనీస వసతులు లేక, చెప్పుకోదగ్గ మ్యాచ్ ఫీజులూ అందక ఇబ్బంది పడ్డ భారత మహిళా క్రికెటర్లు.. గత కొన్నేళ్లలో కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకున్నారు.
[02:38]అర్జెంటీనాలో ‘మెస్సి ఆఫ్ చెస్’గా పేరు తెచ్చుకున్న 12 ఏళ్ల ఒరో ఫాస్టినో.. భారత సీనియర్ క్రీడాకారుడు, గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతిని నిలువరించి ఆశ్చర్యపరిచాడు.
[02:18]ఇటీవలే ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించి.. ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ సంస్థ నుంచి రానున్న కొత్త చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. అఖిల్ ఉడ్డేమారి, తేజస్వినీ రావ్ జంటగా నటించిన ఈ సినిమాని సాయిలు కంపాటి తెరకెక్కించారు.
[02:11]ఇటీవల కేరళ ప్రభుత్వం 55వ రాష్ట్రీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ‘భ్రమయుగం’ సినిమాకు గాను అగ్రహీరో మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.
[02:05]ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా తెరపైకి రావాల్సిన ఆల్ఫా అమ్మాయిలు వచ్చే ఏడాది వేసవికి అలరించడానికి సన్నద్ధమవుతున్నారట. బాలీవుడ్ అందాల తార అలియా భట్, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆల్ఫా’ సినిమా గురించే ఇదంతా.
[02:03]ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సంక్రాంతి బరిలో సందడి చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ, ఇది మరోసారి వాయిదా పడనున్నట్లు కొన్నిరోజులుగా ప్రచారం వినిపిస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది.
[02:00]‘‘అందర్నీ ఆకట్టుకునే ఆసక్తికర కథాంశంతో రూపొందిన చిత్రం ‘శంబాల’. ఇది కచ్చితంగా ఏ ఒక్కరినీ నిరాశపరచదు’’ అన్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని యుగంధర్ ముని తెరకెక్కించారు.
[01:59]‘‘దీపావళి పండక్కి అందరికీ వినోదం అందించాలనే లక్ష్యంతో ‘కె-ర్యాంప్’ చేశాం. ఆ నమ్మకం నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఆయన.. యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మించారు.
[01:57]‘ప్రేక్షకులకు ఓ గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించే సినిమా ‘జటాధర’. దీంట్లో ధన పిశాచి నేపథ్యంలో వచ్చే సీక్వెన్స్లన్నీ అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి’’ అన్నారు నిర్మాత ప్రేరణ అరోరా.
[01:56]వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్భయ అత్యాచారం కేసు ఇన్వెస్టిగేషన్, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సాగే హత్యలకు సంబంధించిన కేసుల దర్యాప్తు కథాంశాలతో రూపొందీ గత రెండు సీజన్లుగా ప్రేక్షకులకు థ్రిల్ని పంచింది ‘దిల్లీ క్రైమ్’ వెబ్సిరీస్.
[00:09]2025 వన్డే ప్రపంచ కప్లో టీమ్ఇండియా (Team India) ఛాంపియన్గా నిలిచి భారత మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టించింది. హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కెప్టెన్సీలో భారత అమ్మాయిలు ఫైనల్లో సఫారీలను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచారు.
[00:11]టెక్నాలజీ ఉపయోగించి.. తప్పుడు వార్తలు వ్యాప్తి కాకుండా చూడాలన్న సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు.
[00:06]వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
[20:27]ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఫేజ్-2.. తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
[19:57]Royal Enfield Bullet 650: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650ని (Royal Enfield Bullet 650) ఆవిష్కరించింది. ఇటలీలోని మిలాన్లో జరుగుతున్న మోటార్ సైకిల్ ఎగ్జిబిషన్ EICMA 2025 వేదికగా దీన్ని పరిచయం చేసింది.
[20:07]విదేశాల్లో స్థిరపడిన పారిశ్రామికవేత్తలు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
[19:36]ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌకను లేదా జలాంతర్గామిని భారత నౌకాదళంలోకి చేర్చుతున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి వెల్లడించారు.
[18:39]బిహార్ రాజకీయం ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత సంక్లిష్టంగా, ఆసక్తికరంగా మారింది. అక్కడ నేతలకన్నా ఆయా ప్రాంతాల ప్రాధమ్యాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అంశం ప్రభావం చూసే అవకాశం కనిపిస్తోంది.
[18:18]అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ (84) కన్నుమూశారు. న్యుమోనియా, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
[18:30]క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోనట్లయితే ఎంత నష్టం జరుగుతుందో ఈ ఘటనే ఉదాహరణ. పెట్రోల్ పోయించినపుడు చాలామంది కార్లోంచే కార్డు లిచ్చేస్తారు.
[18:17]అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. గోవాకు చెందిన శిబూ, జనేష్ను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు వారిని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు.
[17:36]బిహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల (Assembly Elections) ప్రచార గడువు నేటితో ముగిసింది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు గురువారం (నవంబర్ 6న ) పోలింగ్ జరగనుంది.
[16:21]తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న వివాదంపై మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది.
[16:02]Hinduja Group Chairman: ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి హిందుజా (85) కన్నుమూశారు. లండన్లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
[15:21]భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ను ముద్దాడిన వేళ వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కానీ, ఒకప్పుడు మహిళల క్రికెట్ అంటే అందరికీ చిన్నచూపే. ఎన్నో సవాళ్లను దాటుకుని నేడు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో సవాళ్లు, ఎంతో శ్రమ దాగి ఉంది.
[15:14]టీమ్ఇండియా (Team India) మహిళల వన్డే వరల్డ్ కప్ను సొంతం చేసుకుని దశాబ్దాల నాటి కలను సాకారం చేసుకుంది. ఈ విజయంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలకపాత్ర పోషించింది.
[13:04]అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం పాక్ కాదని.. అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశంగానూ తాము ఉండబోమని పాక్కు చెందిన ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.
[13:10]టీమ్ఇండియా (Team India) మహిళల వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన తమ రాష్ట్ర క్రికెటర్లైన హర్మన్ ప్రీత్ కౌర్, అమన్జ్యోత్ కౌర్కు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) రూ.11 లక్షల రివార్డ్ను ప్రకటించింది.
[12:32]రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) అన్నారు. తుళ్లూరులో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.
[12:18]అమెరికా సెనెట్లో ఇటీవల ప్రతిపాదించిన అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత (హైర్) బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థికవ్యవస్థ దెబ్బతింటోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు.
[11:27]ఇస్లాం ఛాందసవాదుల ఒత్తిడికి తలొగ్గుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశంలోని పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
[10:48]నగరంలోని ఓ వైద్యుడి ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ముషీరాబాద్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న జాన్పాల్ అనే వైద్యుడు దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
[10:40]గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. 11 మందిని అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
[09:49]కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది.
[09:43]మహిళల వన్డే వరల్డ్ కప్ను తొలిసారిగా భారత జట్టు (Team India) కైవసం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే టీమ్ఇండియా విజయోత్సవ ర్యాలీ ఇప్పుడే జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
[08:23]మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమ్ఇండియా (Team India) 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారతజట్టు విశ్వవిజేతగా నిలిచింది.
[07:52]అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా మతం గురించి చేసిన వ్యాఖ్యలను భారతీయ- అమెరికన్ అయిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు.
[06:45]తనకు అవార్డుల కంటే నటన బాగుందని ప్రశంసలు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో లాబీయింగ్కు ఆస్కారం ఉందని చెప్పారు.
[06:45]ఔషధాల కోసం ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నాయి. ఓ మందు తయారు చేయాలంటే ట్రిలియన్ల సంఖ్యలో ఉన్న మాలిక్యూల్లపై వేట కొనసాగించాల్సి ఉంటుంది.
[06:51]జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమాల అమలు తీరు పరిశీలనకు 12 మందితో కూడిన కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) బృందం సోమవారం రాష్ట్రానికి వచ్చింది.
[06:50]వైకాపా మద్దతుదారులు తన స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన యశోద వాపోయారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
[06:49]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరిసింది. 2025-26లో ఇప్పటివరకు పనిదినాల వినియోగంలో దేశంలో మూడో స్థానంలో నిలిచింది.
[07:48]పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది.
[06:48]అణుధార్మికతతో కూడిన అరుదైన ఖనిజాలు ఉండే బీచ్శాండ్ తవ్వకాల కోసం మరో 5 వేల హెక్టార్లలో లీజులు పొందేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు చేస్తోంది.
[06:49]పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
[06:44]గుజరాత్లోని సూరత్కు చెందిన వ్యాపారవేత్త బాబూభాయ్ జిరావాలా (ఛాద్వాడియా).. 290 మంది రైతుల అప్పులను తీర్చారు. దశాబ్దాలుగా అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్న వారి కష్టాన్ని చూసి చలించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు.
[06:44]వ్యక్తిగత పని అనో, ఉద్యోగమనో, వ్యాపారమనో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఓ వైపు పాఠశాలలకు పిల్లల్ని సిద్ధం చేస్తూనే వారికి అల్పాహారం వండుతూ తీరిక లేకుండా ఉంటారు.
[06:43]ఎందుకూ పనికి రావని పక్కన పడేసే వాహనాల టైర్లను సరికొత్తగా వినియోగించవచ్చని నిరూపించారు గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు.
[06:42]తిరుమలలో ఓ విదేశీ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీలంకకు చెందిన నెట్బాల్ ప్లేయర్ తార్జిని శివలింగం సోమవారం సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
[06:42]ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్ఐఆర్)పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ప్రక్రియ ఊహించిన దాని కన్నా బాగా జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మద్రాసు హైకోర్టుకు తెలిపింది.
[06:36]నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది.
[06:19]కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనకు అసలు కారణాలు తనకు తెలియవని.. వైకాపా ప్రతినిధులు ఇచ్చిన స్క్రిప్టే చదివానని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల తేల్చిచెప్పారు.
[06:03]ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది.
[06:02]శ్రీసత్యసాయి జిల్లా నీలకంఠాపురం ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల పరిధిలో ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో 5 లక్షల మందికి ఐదేళ్లలో అంధత్వ నివారణే లక్ష్యంగా పనిచేస్తామని ఎల్వీపీఈఐ ఛైర్మన్ జి.ఎన్.రావు అన్నారు.
[06:40]పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు.
[05:58]ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీలకు చెందిన వాటాలను వై.ఎస్.విజయమ్మ, చాగరి జనార్దన్రెడ్డిల పేరుతో బదలాయింపుపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) గత నెల 14న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సోమవారం మరోసారి పొడిగించింది.
[05:58]జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడైన ప్రతాప్రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్కు లీజుల మంజూరులో పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సీబీఐ సోమవారం హైకోర్టుకు నివేదించింది.