[10:10]లార్డ్స్ టెస్టు రెండో రోజు కూడా బంతి మార్పుపై భారత ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తంచేశారు. కేవలం పది ఓవర్లకే ఆకారం మారిపోవడం ఇప్పుడు మళ్లీ చర్చకు దారితీసింది.
[10:03]Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణంలో లేదని, అలాగే పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా లేవని ప్రాథమిక నివేదిక వెల్లడించింది.
[10:02]ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ మిస్టరీ- కామెడీ మూవీ ‘డిటెక్టివ్ ఉజ్వలన్’. ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే?
[08:25]Air India Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరి క్షణాల్లో కాక్పిట్లో ఏం జరిగిందన్న వివరాలను వెల్లడించారు.
[08:06]తొలిసారి లార్డ్స్లో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. సాధారణంగా ఇలాంటి గొప్ప మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కానీ, బుమ్రా మాత్రం కాస్త తక్కువగానే సంబరాలు చేసుకున్నాడు.
[06:51]‘పేద కుటుంబాలకు మేం ఏం చేయాలో చెప్పండి.. ఒక ప్రణాళిక ఇవ్వండి.. అమలు చేస్తాం’ అని జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. బంగారు కుటుంబాలకు మార్గదర్శులయ్యేందుకు మేము సైతం సిద్ధం అంటున్నాయి.
[05:47]కుక్కకాటుకు గురైన 92 ఏళ్ల వృద్ధురాలు రేబిస్ టీకా కోసం 20 కిలోమీటర్లు నడిచారు. ఒడిశాలో ఈ దయనీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు రెండు రోజులుగా సమ్మె బాట పట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
[05:14]రవాణా ఆధారిత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచనలు చేస్తోంది. నూతన ఎక్స్ప్రెస్ హైవే, డ్రైపోర్టు-పోర్టు రైలు మార్గాల నిర్మాణంతో ఎగుమతులు, దిగుమతుల్ని సులభతరం చేయవచ్చని భావిస్తోంది.
[05:14]మూసీ పునరుజ్జీవంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు రూ.4,100 కోట్ల రుణాన్ని ప్రపంచబ్యాంకు నుంచి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ(డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్) సిఫార్సు చేసింది.
[05:13]హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్రావే కారణమని.. ఆయనను రాష్ట్ర భాజపా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
[05:12]సైనిక నిఘా అవసరాల కోసం తొలిసారిగా ఒక స్వయంప్రతిపత్తి ఉపగ్రహ సమూహాన్ని భారత్ అభివృద్ధి చేస్తోంది. స్వీయ మేధస్సు కలిగిన ఈ శాటిలైట్లు భిన్నరకాల ముప్పులపై సొంతంగా కన్నేసి ఉంచగలవు.
[05:13]గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను భాజపా అధిష్ఠానం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజాసింగ్కు లేఖ ద్వారా సమాచారం అందించారు.
[05:12]ఫాస్టాగ్ అక్రమాలకు పాల్పడే వాహనదారులను బ్లాక్లిస్ట్ చేసే ఏర్పాట్లు చేసినట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) శుక్రవారం వెల్లడించింది.
[05:11]కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంట్లో భారీగా బయటపడటంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది.
[05:09]డీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్, ట్యాంపరింగ్కు అవకాశమివ్వకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.
[05:09]గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను అందించి వారి సొంత గ్రామాల్లోనే పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం కెపాసిటీ బిల్డింగ్ నెట్వర్క్ ఫర్ విలేజ్ ఇండస్ట్రీస్ స్కీమ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆపర్చ్యునిటీస్ నెట్వర్క్ (సీబీఎన్ విజన్) కార్యక్రమాన్ని చేపట్టనుంది.
[05:08]రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పునర్వ్యవస్థీకరణ సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి సహకార శాఖ కమిషనర్ అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.
[05:08]పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లుపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ జె.ఎస్. ఖేహర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ముందు శుక్రవారం హాజరై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
[05:08]ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 19న సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం ఆర్కేబీచ్ రోడ్డులో తలసీమియా రన్ (3కే, 5కే, 10కే) నిర్వహిస్తామని ట్రస్ట్ సీఈఓ కె.రాజేంద్రకుమార్ తెలిపారు.
[05:06]కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా తనవైపే మొగ్గు ఉందని ఓ సర్వే వెల్లడించిందంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పెట్టిన పోస్టుపై ఆ పార్టీ సీనియర్ నేత కె.మురళీధరన్ మండిపడ్డారు.
[05:05]ఎన్నికల సంఘం (ఈసీ) బిహార్లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణను న్యాయస్థానంలో సవాల్ చేసినప్పటికీ ఆ ప్రక్రియపై స్టే విధించాలని పిటిషనర్లు కోరలేదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తెలిపిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.
[05:06]మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి తన మాయాజాలంతో అనేక డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించి కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
[05:05]‘రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాలను అభివృద్ధి చేసి హైదరాబాద్ స్థాయికి తీసుకువస్తాం. గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేయడం వల్లే తెలంగాణ ఆదాయంలో 75% ఆ నగరం నుంచి వస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
[05:04]ఫ్రీహోల్డ్ భూముల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల నిలుపుదల గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. వైకాపా హయాంలో నిషిద్ధ జాబితా నుంచి ఎసైన్డ్ భూములను తప్పించడంలో భారీగా అక్రమాలు జరిగాయి.
[05:04]చెట్లను ఎక్కడికక్కడ నరికేస్తుండటంతో గూళ్లు కట్టుకోవడానికి పక్షులకు చోటే లేకుండా పోయింది. ఈ పరిస్థితులకు తగినట్లు అవీ తమ జీవనశైలిని మార్చుకున్నాయా అనిపిస్తోంది ఈ చిత్రాలను చూస్తుంటే..!
[05:03]గొంగళి పురుగును చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపం. అదే సీతాకోక చిలుకలా రంగులతో ఉంటే.. పరిశీలిస్తాం. అలాంటి అరుదైన ఓ గొంగళి పురుగు కాకినాడ జిల్లా తొండంగి మండల కేంద్రంలో కనిపించింది.
[05:00]దివ్యాంగుల పింఛన్ల తనిఖీని ప్రభుత్వం ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నా బోగస్ పింఛన్లు తొలగిపోకుండా దళారులు చక్రం తిప్పుతున్నారు. అర్హత లేకుండా పింఛను తీసుకుంటున్న వారిని సంప్రదిస్తూ.. పింఛను పోకుండా చూస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు.
[04:58]నాలుగు కిలోల మామిడి పళ్లు కొన్నాం... కానీ అవి అంత బరువున్నట్లు అనిపించట్లేదు! కిలో చింతపండు ప్యాక్ చేయిస్తే... ప్రతిసారీ పావుకిలో తేడా వస్తోంది! మిల్లీ గ్రాము నుంచి టన్నుల దాకా ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ కాటాలే... మరి అవి తేడా అనిపిస్తే ఎలా తనిఖీ చేయాలి? తేడా జరగకుండా ఎలా అడ్డుకోవాలి? తప్పు జరిగితే ఎవరిని సంప్రదించాలి?
[04:48]ఈ ఏడాది ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రకటించిన పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ 1,300 మంది ప్రభుత్వోద్యోగులను, దౌత్యవేత్తలను తొలగించనుంది.
[04:47]ఇరాన్ అణుకేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా చెప్తున్న మాటల్లో వాస్తవం లేదా..? శుద్ధిచేసిన యురేనియంను టెహ్రాన్ తిరిగి దక్కించుకోగలదా..? ఈ రెండు ప్రశ్నలకూ ప్రస్తుతం ‘అవును’ అనే సమాధానం వినిపిస్తోంది!
[04:49]మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని జప్తు చేసేందుకు సిట్ చర్యలు ప్రారంభించింది. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి నియంత్రణలో కొనసాగిన అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్ సంస్థల బ్యాంకు ఖాతాల్లోని రూ.32.86 కోట్ల జప్తు కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది.
[04:47]ఖతార్లోని అమెరికాకు చెందిన కీలకమైన వాయుసేన స్థావరంపై ఇటీవల ఇరాన్ చేసిన దాడిలో కమ్యూనికేషన్ పరికరాలను కలిగి ఉన్న జియోడెసిక్ డోమ్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల విశ్లేషణలో వెల్లడైంది.
[04:47]అక్రమ వలసదారుల పిల్లలు ప్రభుత్వ నిధులతో నడిచే ప్రీస్కూల్ కార్యక్రమమైన ‘‘హెడ్స్టార్ట్’’లో నమోదు కాకుండా ట్రంప్ యంత్రాంగం చర్యలు చేపడుతోందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల శాఖ ప్రకటించింది.
[04:42]దిల్లీలో ఎంపీలు, మాజీ ఎంపీలకు సేవలు అందించే కాన్స్టిట్యూషన్ క్లబ్ కోశాధికారిగా మహబూబ్నగర్ మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
[04:41]బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే హైకోర్టులో కేవియట్ దాఖలు చేసి ఆర్డినెన్స్ జారీ చేయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
[04:40]బీసీల ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వారికి 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు.
[04:40]స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేస్తే న్యాయపరంగా ప్రభుత్వం గట్టిగా పోరాడాలని బీసీ సంఘాలు సీఎం రేవంత్రెడ్డిని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.
[04:40]స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిల నిబద్ధతకు నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ స్పష్టంచేశారు.
[04:39]తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
[04:33]కల్తీ కల్లు ఘటనలో శుక్రవారం మరొకరు మృతి చెందడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. తాజాగా మరో ఏడుగురు ఆసుపత్రిలో చేరారు. దీంతో అస్వస్థతకు గురైన వారి సంఖ్య 58కి పెరిగింది.
[04:45]న్యాయాధికారుల ఇంటిపనులు ఆఫీసు సబార్డినేట్ల విధుల్లో భాగం కావంటూ పిటిషనర్ చేస్తున్న వాదనను అంగీకరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయాధికారుల ఇళ్లలో పనిచేసేందుకు కొంతమంది ఆఫీసు సబార్డినేట్లు ఉండే విధానం జిల్లా న్యాయవ్యవస్థలో ఉందని హైకోర్టు పేర్కొంది.
[04:46]తితిదేకు నకిలీ నెయ్యి సరఫరా కేసులో దర్యాప్తు నిర్వహించాలంటూ అదనపు ఎస్పీ జె.వెంకటరావును సీబీఐ డైరెక్టర్ ఆదేశించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపింది.
[04:43]ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా ఎంబీబీఎస్/బీడీఎస్ సీట్ల భర్తీకి వచ్చేవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.
[04:42]తిరుమల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో 40 ఏళ్లకు సరిపడా భద్రతా ప్రణాళికలు రూపొందించాలని తితిదే ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమలలో భద్రతా ప్రణాళికలపై ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులతో శుక్రవారం ఆయన స్థానిక అన్నమయ్య భవనంలో సమావేశం నిర్వహించారు
[04:41]విశాఖ హార్బర్కు కొద్ది రోజులుగా భారీ చేపలు వస్తున్నాయి. సాగరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు శుక్రవారం సాయంత్రం 20 నుంచి 50 కిలోల బరువుండే టూనా చేపలతో రేవుకు వచ్చారు.
[05:53]‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. రప్పా రప్పాలాడిస్తాం’ అని మాజీ మంత్రి, వైకాపా నేత ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొండపిలో జరిగిన వైకాపా నియోజకవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
[04:15]తెలంగాణను వచ్చే పదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
[06:34]హరియాణాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ (25)ను తండ్రి దీపక్ యాదవ్ (49) హత్య చేసిన కేసు మిస్టరీగా మారింది. తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే తండ్రి ఈ హత్యకు పాల్పడ్డారని మొదట వార్తలు వచ్చాయి.
[04:11]ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకం కింద ప్రభుత్వం రూ.344 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేయనుంది.
[04:10]భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మధుమేహంతో బాధపడుతున్న నలుగురు ఆ పీహెచ్సీలో ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునేవారు.
[04:11]‘రాష్ట్రవ్యాప్తంగా లక్షల కుటుంబాలకు కొత్త రేషన్కార్డులు ఇవ్వబోతున్నాం.. ఈ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది’ అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
[04:10]రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్న మేస్త్రీలు, ఆర్అండ్బీ శాఖలో కొత్తగా వచ్చిన ఇంజినీర్లు ఇటీవల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో శిక్షణ తీసుకున్నారు.
[03:57]విద్యుత్తు ట్రక్కు కొనుగోలు చేసేవారికి రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇచ్చే తొలి పథకాన్ని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి శుక్రవారం ఆవిష్కరించారు.
[03:55]అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, ఆరోగ్య సంరక్షణ రంగంలోకీ విస్తరిస్తున్నారు. తొలుత ముంబయి, అహ్మదాబాద్లలో 1000 పడకల ఆసుపత్రులను నిర్మించనున్నారు.
[03:54]మానవ శరీరంలో ప్రోటీన్లు ఎలా ప్రవర్తిస్తాయో కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసే కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థ ‘బయోఇము’ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. సాధారణ పద్ధతుల్లో ఈ అధ్యయనానికి ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది.
[03:53]మందులు ఎగుమతి చేసే ఫార్మా కంపెనీలు సీఓపీపీ (సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్) దరఖాస్తులను ఓఎన్డీఎల్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దాఖలు చేయాలని (ఆన్లైన్ సీఓపీపీ) నిర్ణయించడంపై ఫార్మెగ్జిల్ (ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్) ఆందోళన వ్యక్తం చేసింది.
[03:52]ఐటీ, వాహన, ఇంధన షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో, వరుసగా మూడో రోజూ సూచీలకు నష్టాలు కొనసాగాయి. టారిఫ్ సంబంధిత అనిశ్చితులు, మిశ్రమ అంతర్జాతీయ ధోరణులు ఇందుకు తోడయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 85.80 వద్ద ముగిసింది.
[09:22]మారుతున్న కాలంలో పెరుగుతున్న ప్రజల అవసరాలు, సమస్యలకు పరిష్కారం చూపగలగటమే ఇంజినీరింగు వ్యవస్థకు సార్థకత. కొవిడ్ మహమ్మారి విజృంభించిన కష్టకాలంలో శవాలకు అంత్యక్రియల సమస్యను దేశమంతా ఎదుర్కొంది.
[03:50]తన ప్లాట్ఫాంపై పనిచేస్తున్న ఆహార డెలివరీ సంస్థల కోసం రూ.100-150 కోట్ల ప్రోత్సాహక నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ మద్దతు ఉన్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్రతిపాదిస్తోంది.
[03:49]డిమార్ట్ బ్రాండ్పై సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్, జూన్ త్రైమాసికంలో రూ.772.81 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది.
[03:48]ఉత్తర - పశ్చిమ భారతదేశంలో డెయిరీ ఉత్పత్తులు విక్రయించే హెచ్ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ అనే సంస్థలో 100% వాటాను, రూ.271 కోట్లకు హైదరాబాద్కు చెందిన దొడ్ల డెయిరీ కొనుగోలు చేసింది.
[03:44]ఆపరేషన్ సిందూర్లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు ప్రణాళికాబద్ధంగా జరిగాయని జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ తెలిపారు. స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించి పాకిస్థాన్కు ముచ్చెమటలు పట్టించామని అన్నారు.
[03:43]పశ్చిమ కనుమల నుంచి కోయంబత్తూరు వరకు మేత భూముల్లో జీవాలు పెంచుతున్నారని.. ఖనిజ వనరుల దోపిడీతో ఆ భూములు ప్రభావితమవుతున్నాయని తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
[03:40]రాష్ట్రంలోని వ్యవసాయ అధికారులకు వాహన సౌకర్యంతో పాటు కార్యాలయాల్లో సిబ్బంది నియామకం, ఇతర సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర అగ్రిడాక్టర్ల సంఘం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరింది.
[03:39]విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. 67 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్కు తన 92 ఏళ్ల తల్లిని చూసుకోవడం ఇబ్బంది కావడంతో ఐదు రోజుల కిందట ఓ మహిళను కేర్టేకర్గా నియమించుకున్నారు.
[02:31]బుమ్రా అదరగొట్టాడు.. చకచకా వికెట్లు తీసి పైచేయి సాధించే అవకాశం కల్పించాడు. కానీ కింది వరుస బ్యాటర్లతో ఎక్కువ పరుగులు చేయించి పట్టు కోల్పోయే బలహీనతను భారత్ విడిచిపెడితేనా?
[03:37]ఫోన్ స్టోరేజ్ నిండిపోతే.. వెంటనే క్లియర్ చేస్తాం..! ఇంట్లో అక్కరకు రాని వస్తువులుంటే.. వాటినీ బయటపడేస్తాం..! మరి మన శరీరంలోని మలినాల సంగతేంటి?? పేగులు.. రక్తనాళాలు అనే తేడా లేకుండా.. పేరుకుపోతున్న అవశేషాలు.. రసాయన వ్యర్థాలను వంటింటి చిట్కాలు.. ఆహారపుటలవాట్లతో తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు!!
[03:23]‘ఏపీ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ (ఏపీఎస్బీసీఎల్) కేంద్రంగా చోటుచేసుకున్న ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ.. అప్పటి ఎండీకి మెమోలు జారీ చేసేవాణ్ని.. వాటిని ఎవరూ లెక్క చేసేవారు కాదు.
[06:49]గత వైకాపా ప్రభుత్వంలో అక్రమంగా నిలిపేసిన వాటితో పాటు కొత్త పింఛన్ల మంజూరుపై క్షేత్రస్థాయిలో భారీగా డిమాండ్ ఉంది. త్వరగా ఇవ్వాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది.
[06:50]భూతాపం, వాతావరణ మార్పులు... ప్రపంచ ప్రజలందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి. వర్షాలు, తుపాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలపై కచ్చితమైన ముందస్తు అంచనాలు లేకపోతే దేశాలకు దేశాలే అతలాకుతలమైపోతున్నాయి.
[03:30]ఆడపిల్లల పట్ల చులకన భావం ఉండకూడదని ముఖ్యమంతి చంద్రబాబునాయుడు హితవు పలికారు. ఆడపిల్లలను ప్రోత్సహించే విషయంలో మగవారిలో మార్పు రావాలని ఉద్బోధించారు.
[06:50]జనాభా తగినంతగా ఉంటేనే అన్ని రంగాల్లో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలో లోక్సభ సీట్లు పెరుగుతాయి.. కానీ దక్షిణాదిలో తగ్గిపోతాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
[03:22]ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్తారు. ఆధారాలు చెరిగిపోకుండా ఫొటో తీస్తారు. తర్వాత ఆ ప్రమాదం ఎలా జరిగింది? ఏ వైపు నుంచి ఏ వాహనం దూసుకొచ్చింది? ఎలా ఢీకొన్నాయి? ఆ వాహనాల రంగులు, వాటి నంబర్లు, ప్రమాదంలో ఏ వాహనం ఎంత దెబ్బతింది.. ఇలా అన్నీ నమోదు చేసుకుని కేసు డైరీలో రాస్తున్నారు.
[03:48]డీజీపీ హరీష్కుమార్ గుప్తా, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, చిత్తూరు ఎస్పీ మణికంఠ ముఖ్యమంత్రి చంద్రబాబు చెంచాలని, వీరితోపాటు మరి కొందరు కోటరీగా ఏర్పడి.. పోలీసుల మాదిరిగా కాకుండా రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వైకాపా నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
[02:26]భారత క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యుల ప్రయాణాలపై బీసీసీఐ పరిమితులు విధించడాన్ని చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమర్థించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో 1-3తో భారత్ ఓటమి తర్వాత కుటుంబ సభ్యుల ప్రయాణాల విషయంలో బీసీసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
[02:19]దక్షిణాఫ్రికా బ్యాటర్ వియాన్ ముల్డర్ తన మీద గౌరవంతో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును దాటకుండా ఆగిపోవడాన్ని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా తప్పుబట్టాడు.
[02:18]ఇటలీ అనగానే గుర్తొచ్చేది ఫుట్బాల్. ఆ దేశం సాకర్ కాకుండా క్రికెట్ ఆడుతుందని తెలిసినవాళ్లు చాలా తక్కువే. ఈ ఆటలో బుడిబుడి అడుగులు వేసే స్థితి నుంచి పరుగెత్తే స్థాయికి చేరింది.
[02:17]ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 టోర్నమెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ జంట కాంస్యం కోసం పోరాడనుంది. క్వాలిఫయింగ్లో రికార్డు స్కోరు సాధించిన జ్యోతి జంట.. సెమీస్లో 152-155తో నెదర్లాండ్స్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.
[02:16]ఇంగ్లాండ్పై చరిత్రాత్మక సిరీస్ విజయంతో జోరుమీదున్న భారత మహిళల జట్టు మరో గెలుపుపై గురిపెట్టింది. ఇప్పటికే 3-1తో సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. శనివారం అయిదో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్కు ఆఖరి పంచ్ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది.
[00:59]‘‘కెరీర్ను మంచి స్థాయికి తీసుకొచ్చి.. నాకు మొదటి విజయాన్ని అందించింది తెలుగు చిత్రపరిశ్రమ’’ అని అంటోంది శ్రుతిహాసన్. నటిగా తెరపై సందడి చేస్తూనే.. మరోవైపు గాయకురాలిగా కూడా సత్తా చాటిన కథానాయికీమె.
[00:52]‘కూలీ’ సినిమాతో బాక్సాఫీస్ బరిలో సందడి చేయనున్నారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించారు.
[00:55]ఇంట్లో సమస్య వస్తే...దాని కోసం సమాధిని తవ్వి తీయాల్సి వస్తే..అమ్మో అని భయపడిపోతాం. కానీ ఓ కుటుంబం ఆ సాహసం చేస్తుంది. పూర్వీకుల ఆత్మను శాంతింప జేయడానికి సమాధిని తవ్వుతుంది.
[00:51]కథానాయకుడు పవన్ కల్యాణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఓజీ’ పూర్తయింది. ‘‘ఫినిష్డ్ ఫైరింగ్’’ అంటూ ఈ విషయాన్ని ఆ చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
[00:10]ఎఫ్బీఐ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ (Kash Patel) బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉద్యోగులకు పాలిగ్రాఫ్ పరీక్షలు ముమ్మరం చేసినట్లు తెలిసింది.
[00:09]విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత విదేశాంగశాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.
[21:34]మయన్మార్లోని సగయింగ్ ప్రాంతంలోని ఓ బౌద్ధారామంపై జరిగిన వైమానిక దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికిపైగా గాయాలపాలైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
[20:15]మానవత్వం మంటగలిసింది. మద్యం మత్తులో అన్నపై తమ్ముడు అతి కిరాతకంగా దాడి చేస్తున్నా అక్కడున్నవారు చోద్యం చూస్తూ ఫొటోలు, వీడియోలు తీశారు తప్ప అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
[20:02]స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
[00:09]Amazon primeday sale: సాధారణ టీవీని స్మార్ట్టీవీలా మార్చేందుకు ఉపయోగించే ఫైర్టీవీ స్టిక్లపై అమెజాన్ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే ప్రైమ్ డే సేల్లో వీటిపై డిస్కౌంట్ అందిస్తోంది.
[19:26]నోటీసులు అందుకున్న దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లు 120 రోజులపాటు సెలవుల్లో ఉంటారని, ఆ తర్వాత అధికారికంగా ఉద్యోగం నుంచి వైదొలగాల్సి ఉంటుందని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది.
[19:10]లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, టీమ్ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లిష్ జట్టు 112.3 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌటైంది.
[18:31]‘ప్రపంచంలోనే అత్యంత పేదవాడు’ అని ముద్ర పడింది. అలాగని మురికివాడల్లో నివసించడు. చిరిగిపోయిన దుస్తులు కట్టుకోడు. అతి సాధారణ మనిషిలా పారిస్ వీధుల్లో తిరుగుతుంటాడు. అతడే జెరోమ్ కెర్వియల్ (Jerome Kerviel).
[18:01]ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. వీటికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా షేర్ చేస్తూ ప్రభుత్వ టీచర్లు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు.
[17:43]ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
[17:37]కూకట్పల్లి పరిధిలో జరిగిన కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంది. బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్వో వేణుకుమార్పై సస్పెన్షన్ వేటు వేసింది.
[16:35]రంగరాయ వైద్య కళాశాల(Rangaraya medical college)లో విద్యార్థినులకు లైంగిక వేధింపుల ఘటనలో బాధ్యులను సస్పెండ్ చేశామని కాకినాడ (Kakinada) జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు.
[16:21]జులై 13న జరిగే మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
[15:56]భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాదాలను తొలగించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
[15:43]ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ కపిల్ శర్మకు చెందిన కాప్స్ కేఫ్ రెస్టరంట్పై కెనడాలో జరిగిన కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ దాడి తన పనే అని మోస్ట్వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ప్రకటించాడు.
[14:51]బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు, జాగృతి విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు.
[14:08]టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు బ్రియాన్ లారా పేరిట ఉంది. దక్షిణాఫ్రికా ఆటగాడు వ్యాన్ ముల్డర్కు అవకాశం వచ్చినా వద్దని వదిలేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
[14:06]బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ (Mahesh kumar Goud) అన్నారు.
[13:58]జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శుక్రవారం రూ.5 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు.
[13:58]ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ అది చేసింది.. ఇది చేసిందంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ధ్వజమెత్తారు.
[13:38]తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం కురిపించాడు. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్తోపాటు ఫీల్డింగ్ చాలా బాగుందని తెలిపాడు.
[13:48]పెట్టుబడిదారుల నుంచి వేల కోట్లు మోసం చేసిన కేసులో పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ను ఉత్తరప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు.
[13:37]విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ప్రస్తుత రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
[13:32]‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు నటి శ్రుతి హాసన్. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
[13:25]Modi-Congress: రిటైర్మెంట్పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. అవి మోదీ గురించేనంటూ ఎద్దేవా చేసింది.
[13:17]ప్రత్యర్థి దేశాలను బెదిరించేందుకు అమెరికా (USA) చేపట్టే ఆర్థిక చర్యలే.. వాటిని డాలర్ ప్రత్యామ్నాయం వైపు నెడుతున్నట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇనీషియేటీవ్ అనే సంస్థ అభిప్రాయపడింది.
[12:43]ఢాకా వేదికగా మరో రెండు వారాల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీ జరగనుంది. అయితే, అక్కడి రాజకీయ అనిశ్చితి కారణంగా ఇప్పుడు పరిస్థితి సందిగ్ధంలో పడింది.
[12:10]ఎయిర్ ఇండియా విమానం ఏఐ-171 ప్రమాదంలో ఇంధనం సరఫరా చేసేందుకు వినియోగించే స్విచ్లను ఆఫ్ చేసినట్లు సందేహాలను వ్యక్తం చేస్తూ అమెరికా పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
[11:20]ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను జపాన్ అభివృద్ధి చేసింది. ఒక్క సెకన్లోనే నెట్ఫ్లిక్స్ లైబ్రరీలో ఉన్న డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చట..!
[11:18]భారత ప్రధాన కోచ్ పదవి అందుకొన్న తర్వాత గౌతమ్ గంభీర్ టీ20 ప్రపంచకప్ను అందించాడు. అయితే, అంతకుముందు ఆసీస్, న్యూజిలాండ్ చేతిలో టెస్టులను ఓడిపోయింది.
[10:56]ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచుకునేందుకు అనుమతివ్వాలని ఆయా కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.