[05:40]రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా హరీష్కుమార్ గుప్తా శనివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 1 నుంచి ఆయన ఇన్ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
[05:43]అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన యువకుడి(27)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బాధితుడు ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కేరళలోని ఎర్నాకులానికి నెల రోజుల కిందట వెళ్లాడు.
[05:43]అక్రమ మైనింగ్కు పాల్పడి, ప్రజాధనానికి గండి కొట్టిన కేసులో కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని కోరడంలో ప్రజాసేవ కారణం కాదని.. గాలి జనార్దన్రెడ్డికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమంటూ సీబీఐ తెలంగాణ హైకోర్టుకు ఇటీవల నివేదించింది.
[05:39]రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో మురుగు, వరదనీటి ప్రవాహ కాలువల్లో పూడిక తొలగింపు పనులను వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు.
[05:39]ఎన్టీఆర్ ఇంట్లోనే తాను పుట్టానని, ఆయనే తనకు గురువు, దైవమని ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సినిమా రంగంలోకి వచ్చానని పేర్కొన్నారు.
[05:35]మేఘాలయలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న ఓ గుహలో అరుదైన చేపలను పరిశోధకులు కనుగొన్నారు. ఇతర గుహ జాతి చేపలకు భిన్నంగా వీటిల్లో వర్ణకవిధానం(పిగ్మెంటేషన్), కంటిచూపును నిలుపుకొనే శక్తి ఉంటుంది.
[05:35]మధ్యప్రదేశ్ రాష్ట్రం రాయ్సేన్ జిల్లాలోని ఈట్ఖేడీ గ్రామాన్ని స్థానికంగా ‘మినీ కేరళ’ అంటారు. కొన్ని దశాబ్దాల కిందట కేరళ నుంచి వచ్చి స్థిరపడిన మలయాళీ కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి.
[05:35]‘టైగర్ మ్యాన్’గా పేరొందిన వన్యప్రాణి సంరక్షకుడు, రచయిత వాల్మీక్ థాపర్ (73) కన్నుమూశారు. దిల్లీలోని తన నివాసంలో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
[05:34]శిర్డీలోని ద్వారకామాయిలో.. సాయిబాబా సంస్థాన్ ట్రస్టు భద్రతా సిబ్బందికి దొరికిన క్వీన్ విక్టోరియా చిత్రమున్న బంగారు గడియారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
[05:33]సంక్షోభాలు ఎదురైనప్పుడల్లా దేశాన్ని ఐక్యంగా, ధృడంగా ఉండేలా చేసిన ఘనత రాజ్యాంగానికే దక్కుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు.
[05:32]గర్భనిరోధక ఔషధాల్లో ఉపయోగించే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్ల ప్రభావంతో మహిళల్లో పక్షవాతం(స్ట్రోక్) వచ్చే అవకాశం ఉందని ఐరోపా దేశాల శాస్త్రవేత్తల బృందం తాజా అధ్యయనంలో తేలింది.
[05:30]అస్సాం ప్రభుత్వం విదేశీయులుగా అనుమానిస్తున్న వ్యక్తుల జాతీయతను నిర్ధరించకుండా, వారికున్న చట్టపరమైన రక్షణలను వినియోగించుకునే అవకాశం ఇవ్వకుండా నిర్బంధించి, పొరుగుదేశంలోకి నెట్టేస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
[05:28]వాతావరణ మార్పుల వల్ల హిమానీనదాలు కరిగిపోతున్నాయని, వాటిని కాపాడుకోవడానికి కర్బన ఉద్గారాలను తక్షణం, భారీగా తగ్గించాల్సింది సంపన్న, పారిశ్రామిక దేశాలేనని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కృతి వర్ధన్ సింగ్ శనివారం పిలుపు ఇచ్చారు.
[05:28]జగన్ భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
[05:28]కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసిన సాత్యకి సావర్కర్ తన తల్లి తరఫు వారి పేర్లను ప్రకటించాల్సిన అవసరం లేదని మహారాష్ట్రలోని పుణె ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అమోల్ శిందే శనివారం తేల్చిచెప్పారు.
[05:28]నాగాలాండ్లో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు శనివారం ముఖ్యమంత్రి నెఫ్యూ రియో నేతృత్వంలోని ఎన్డీపీపీలో చేరారు.
[05:26]ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
[05:27]‘పేదల ఇబ్బందులను తొలగించేలా చౌకధరల దుకాణాల్లో నెలలో 15 రోజులు రెండు పూటలా సరకులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీని వల్ల ప్రతి కుటుంబానికీ సరకులు అందుతాయి. వీలైనప్పుడు వెళ్లి తీసుకునేందుకూ ఆస్కారం ఉంటుంది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
[05:27]రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాల ద్వారా ఆదివారం నుంచి సరకులు పంపిణీ చేయనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ ఒకటి నుంచి దీనిని అమలు చేస్తున్నామన్నారు.
[05:25]మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని 30 ఏళ్ల పాటు సాహసోపేత నిర్ణయాలతో పాలించిన అహల్యాబాయీ హోల్కర్ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావో అన్నారు.
[05:24]వైకాపా హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష పత్రాల డిజిటల్ మూల్యాంకనం నిర్ణయానికి సంబంధించిన నోట్ఫైల్ కూడా మాయమైంది. ఏపీపీఎస్సీ అప్పటి కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు.. మాన్యువల్ బదులు డిజిటల్ వాల్యుయేషన్ చేయించారు.
[05:23]నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) నుంచి తొలిసారిగా 17 మంది మహిళా క్యాడెట్లు ఉత్తీర్ణత సాధించడం దేశ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టమని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా అభినందించారు.
[05:15]ఆపరేషన్ సిందూర్ గురించి వివరించడానికి, పాకిస్థాన్ ఉగ్రవాద అనుకూల తీరును ఎండగట్టడానికి వివిధ దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందాలకు భారీ మద్దతు లభిస్తోంది.
[05:19]రాష్ట్రంలో త్వరలో రెండో పైలట్ శిక్షణ కేంద్రం అందుబాటులోకి రాబోతోంది. కర్నూలు విమానాశ్రయంలో మరో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్టీఓ) ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది.
[05:34]పర్యటనకు వెళ్తూ రోడ్డు పక్కనున్న చెట్లను చూసి భయపడిన విచిత్ర ముఖ్యమంత్రి గతంలో ఉండేవారని, ఇప్పుడున్న సీఎం ప్రజల మనిషని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
[05:22]‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పశ్చిమ బెంగాల్లోని న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ ఆ ఆపరేషన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు అక్కడి పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో అక్కడ టీఎంసీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎంపీలు సనాతన ధర్మాన్ని వెక్కిరిస్తూ వ్యాఖ్యలు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రశ్నించారు.
[05:18]మెగా డీఎస్సీ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు అభ్యర్థులు మూడు, నాలుగు పోస్టులకు దరఖాస్తు చేశారు. వీరికి ఒక్కో పరీక్షకు ఒక్కోచోట కేంద్రం కేటాయించారు. శనివారం ఉదయం నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటున్న కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు చూసి ఆందోళన చెందుతున్నారు.
[05:18]పంచాయతీలు అంటే ఆస్తిపన్ను, ఇతర రుసుములు వసూలు చేసి సిబ్బందికి జీతాలు చెల్లించడం, పరిపాలన ఖర్చులకు సరిపెట్టుకోవడం, కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు చేయించడం అనే అభిప్రాయంతో ఉన్న సర్పంచులు, కార్యదర్శులు ఆ ఆలోచన నుంచి బయటపడేలా కేంద్రం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
[05:30]తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం తప్పిదమేనని, పార్టీ పెద్దల ఆదేశాల్లేకుండా అది జరిగే అవకాశం లేదని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది.
[05:15]ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది కొత్తగా మూల్యాంకన పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షల జవాబు పత్రాలను ఓఎంఆర్ షీట్తో కలిపి మూల్యాంకన పుస్తకంగా తీసుకొచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకాన్ని ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టులతోపాటు ఆరు మూల్యాంకన పుస్తకాలు ఉంటాయి.
[05:15]భారత్, పాకిస్థాన్ల మధ్య అణు యుద్ధం జరిగే ప్రమాదాన్ని వాణిజ్య హెచ్చరికల ద్వారానే అడ్డుకోగలిగానని, ఇది తనకెంతో గర్వ కారణంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
[05:14]చైనా నుంచి ఆర్థిక, సైనిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇండో పసిఫిక్ ప్రాంత మిత్రదేశాలను గాలికి వదిలేయబోమని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అభయమిచ్చారు.
[05:13]ఎవరి ఆదేశాలతో మద్యం కుంభకోణం కుట్ర చేశారని పోలీసులు ప్రశ్నించగా, అసలు కుట్ర జరిగిందో లేదో తమకెలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ము ఎవరికి చేర్చారని ప్రశ్నిస్తే.. వాటితో మాకేంటి సంబంధమన్నారు.
[05:13]గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా చేసిన ప్రతిపాదనపై హమాస్ స్పందించింది. నిర్దిష్ట సంఖ్యలో పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా.. 10 మంది సజీవులైన ఇజ్రాయెలీ బందీలతోపాటు 18 మృతదేహాలను అప్పగించేందుకు అంగీకరించింది.
[05:12]హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు, పని చేసేందుకు, సందర్శించేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సామాజిక మాధ్యమ ఖాతాల పరిశీలనకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది.
[05:11]ఫెడరల్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిలిపేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కాలిఫోర్నియాలోని అప్పీల్స్ కోర్టు నిరాకరించింది.
[05:12]వంద ఎకరాల టేకు వనాన్ని వైకాపా నాయకులు ఆక్రమించేశారు. చెట్లనూ కొట్టేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసనూరు, కందుకూరు గ్రామాల పరిధిలోని ఈ భూములు కబ్జాకు గురికావడం సంచలనంగా మారింది. ప్రజాప్రతినిధి అండదండలతో అక్రమార్కులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రూ.25 కోట్ల విలువైన ఈ భూకుంభకోణానికి పాల్పడ్డారు.
[05:10]బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతికి దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో తమ సంస్థ పాలుపంచుకుందని ముంబయి ఉగ్రదాడి సూత్రధారి హాఫిజ్ సయీద్కు చెందిన జమాత్-ఉద్-దవా (జేయూడీ) సంస్థ నేతలు పేర్కొన్నారు.
[05:07]ఇది వాట్సప్ లోకం. చాలామంది దానిని చూడకుండా ఎక్కువసేపు ఉండలేరు. అందుకే సైబర్ నేరగాళ్లు దానిపై కన్నేశారు. ఆదమరిస్తే వాట్సప్ను కొట్టేస్తున్నారు. అంటే అందులోని ఫోన్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు, వృత్తిపరమైన...వ్యక్తిగతమైన సమాచారం అంతా చోరీ చేయడం అన్నమాట.
[05:08]తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సన్నాహక బాంబు పేలుళ్లు (ట్రయల్ బ్లాస్ట్లు) జరిపి.. ఆ వీడియోలను విదేశాల్లోని హ్యాండ్లర్లకు పంపించి, దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కావాల్సిన నిధుల్ని సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్ ఉర్ రెహ్మాన్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.
[05:10]మెగా డీఎస్సీ పరీక్షలను జూన్ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మొదట జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చినా.. అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున, దీన్ని జూన్ 30కి కుదించారు.
[05:05]బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 37 పాములు, తాబేళ్లను శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన షేక్ నిజాముద్దీన్, షేక్ అల్తాఫ్ అలీ బ్యాంకాక్ నుంచి స్వదేశానికి బయలుదేరారు.
[04:54]భారత్ తరఫున మిస్ వరల్డ్ 2025లో ప్రాతినిధ్యం వహించిన 21 ఏళ్ల నందిని గుప్తాకు ఫైనల్స్లో నిరాశ ఎదురైంది. టాప్ 20 వరకు వెళ్లినా.. ఆ తదుపరి ముందుకు వెళ్లలేకపోయింది.
[04:52]మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు భారాస, తెలంగాణ జాగృతి రెండు కళ్లలాంటివని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 4న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడతామని ప్రకటించారు.
[05:12]దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2025 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి.
[04:54]రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటుచేయాలని.. ఈ మేరకు పూర్తిస్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
[05:05]ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్ పోలీస్స్టేషను మెస్లో ఓ మహిళపై వంటవాడు ముకేశ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వీడియోలు తీసి కొంతకాలంగా బాధితురాలిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. విసిగి వేసారిన మహిళ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి ఆట కట్టించారు.
[05:04]పాకిస్థాన్ గూఢచర్యానికి సంబంధించి విచారణలో ఉన్న కేసులో మరొకరిని శనివారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుణ్ని హసిన్ (42)గా గుర్తించారు. పాకిస్థాన్ గూఢచారులకు భారతీయ సిమ్ కార్డులు సరఫరా చేసిన కేసులో ప్రధాన నిందితుడైన కాసింకు ఇతను సోదరుడు.
[05:04]జీఎస్టీ చెల్లింపుల్లో కుంభకోణం చోటుచేసుకుందనే అభియోగంతో నమోదైన కేసులో మలివిడత దర్యాప్తు దిశగా సీఐడీ దృష్టి సారించింది. 30 మంది వాణిజ్య పన్నులశాఖ అధికారులను జూన్ 3 నుంచి మూడు రోజులపాటు విచారించనుంది.
[05:03]పేదల ఆదాయం, జీవనప్రమాణాలు పెరిగి 2029 నాటికి పేదరికం లేని సమాజం ఏర్పడాలని.. ఆర్థిక అసమానతలు తొలగాలనే లక్ష్యంతో పీ4 అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ, తాను, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆలోచించేది రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్నారు.
[04:20]అవినీతి ఆరోపణలతో పదవీ విరమణ రోజే ఓ ప్రభుత్వ వైద్యురాలు సస్పెండయ్యారు. తమిళనాడులోని తెన్కాశి జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు శ్రీపద్మావతి రోగులకు ఆహారం అందించడానికి ఆకుకూర కొనుగోలులో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చింది.
[04:19]తమిళనాడులో కొవిడ్ సోకి ఓ యువకుడు మృతిచెందాడు. సేలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల వివరాల మేరకు.. మేట్టూరుకు చెందిన యువకుడు (25) కొన్ని రోజుల కిందట జ్వరం రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
[04:18]శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని పెట్రోలు బంకులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పంపు బాయ్గా పనిచేస్తున్న బాబాఫకృద్దీన్ డబ్బులు తక్కువగా జమ చేశారన్న అభియోగంతో బంకు మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కొట్టారు.
[04:15]ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం ఆరు పతకాలు (3 రజతాలు, 3 కాంస్యాలు) ఖాతాలో చేరాయి. మొత్తంగా 24 పతకాలతో (8 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యాలు) రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో మన దేశానికి ఇది ఉత్తమ ప్రదర్శన.
[04:17]రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5న ఏపీ లాసెట్-2025ను నిర్వహించనున్నట్లు ఆ సెట్ ఛైర్పర్సన్ ప్రొఫెసర్ వి.ఉమ తెలిపారు.
[04:13]ఇంగ్లాండ్ లయన్స్తో తొలి అనధికార టెస్టులో భారత్-ఎ అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్లో 557 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్నైట్ స్కోరు 409/3తో రెండో రోజు, శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. మరో 142 పరుగులు జోడించి లంచ్ తర్వాత ఆలౌటైంది.
[04:11]సింగపూర్ ఓపెన్లో సాత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఈ భారత జోడీ 21-19, 10-21, 18-21తో మలేసియాకు చెందిన ఆరోన్ చియా, సో వూయి ఇక్ జోడీ చేతిలో పరాజయంపాలైంది.
[04:10]ఫ్రెంచ్ ఓపెన్లో ఇటలీ స్టార్ యానెక్ సినర్ దూసుకెళ్తున్నాడు. ఈ టాప్సీడ్ అలవోకగా ప్రిక్వార్టర్స్లో ప్రవేశించాడు. శనివారం పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో అతడు 6-0, 6-1, 6-2తో లెహెకా (చెక్)ను చిత్తు చేశాడు.
[04:08]క్రికెట్లో ప్రాథమిక అంశాలు చాలా కీలకమని కౌంటీల్లో ఆడినప్పుడు అర్థం అయిందని యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అన్నాడు. ‘‘ఇప్పటిదాకా ఏడు కౌంటీ మ్యాచ్ల్లో ఆడా. ఇదో గొప్ప అనుభవం.
[04:07]64 గడుల బోర్డు ముందు గంటలు గంటలు గడిపే చెస్ తారలకు కాసేపు విరామం. తుపాకులు చేతబట్టారు. పొడవాటి బూట్లు తొడిగారు. స్టయిల్గా పెద్ద టోపీలు పెట్టారు. కౌబాయ్, కౌగర్ల్స్ మాదిరిగా మారిపోయారు.
[03:30]విమానాల తయారీలో బోయింగ్ (అమెరికా), ఎయిర్బస్ (ఐరోపా) ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలుగా కొనసాగుతున్నాయి. 90% మార్కెట్ వాటా ఈ సంస్థలదే. ఎంబ్రాయర్ (బ్రెజిల్) కూడా కొంతమేర మార్కెట్ను పొందింది. పొరుగుదేశమైన చైనా కూడా గతేడాది సొంత విమానాన్ని ఆవిష్కరించింది.
[03:27]నగదు రహిత చెల్లింపులు బాగా పెరిగాయి. వీటిని నిర్వహించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) యాప్లు, వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక సేవలను తీసుకొస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది బ్యాంకు ఖాతాలో ఎంత నగదు నిల్వ ఉందో తెలుసుకోవడం.
[03:26]ముడి పామాయిల్, ముడి సోయాబీన్ నూనె, ముడి సన్ఫ్లవర్ నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20% నుంచి 10 శాతం తగ్గించి, 10 శాతానికి పరిమితం చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
[03:25]అమెరికాలోకి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై గతంలో విధించిన 25% టారిఫ్ను రెట్టింపు చేసి 50 శాతానికి చేరుస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. పెన్సిల్వేనియా ఉక్కు కార్మికులతో మాట్లాడుతూ ఉక్కు అంశాన్ని, తన సామాజిక మాధ్యమం ట్రూత్లో అల్యూమినియం అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
[03:23]రాబోయే అయిదేళ్లలో (2030 నాటికి) దేశీయ గనులు, నిర్మాణ సామగ్రి (ఎంసీఈ) రంగం 19% వార్షిక వృద్ధి రేటుతో 45 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3,85,000 కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది.
[03:22]ఈ ఏడాదితో పాటు వచ్చే సంవత్సరంలోనూ దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిరేటు నమోదు చేయొచ్చనే ఆశాభావాన్ని ప్రపంచవ్యాప్త ముఖ్య ఆర్థికవేత్తలు వ్యక్తం చేశారు.
[03:22]టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,166 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల నష్టం రూ. 7,674.6 కోట్లు కావడం గమనార్హం. ఇదే సమయంలో ఆదాయం మాత్రం 3.8% పెరిగి రూ.11,013.5 కోట్లకు చేరింది.
[03:21]రుణ వడ్డీ రేట్ల విషయంలో పారదర్శకత పెంచడం, ద్రవ్య విధాన ప్రక్రియను మరింత సరళం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక చర్యలు చేపట్టనుంది.
[03:20]బ్యాంక్ రుణాల్లో మహా నగరాల (మెట్రోల) వాటా గత ఆర్థిక సంవత్సరం చివరకు 58.7 శాతానికి పరిమితమైంది. అయిదేళ్ల క్రితం ఇది 63.5 శాతమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
[03:18]కెనరా బ్యాంకు ఖాతాదార్లకు శుభవార్త. అన్నిరకాల పొదుపు (సేవింగ్స్) బ్యాంకు ఖాతాలు, శాలరీ అకౌంట్లు, ఎన్నారైల ఎస్బీ అకౌంట్లు, మరికొన్ని ఇతర ఖాతాలకు కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.
[01:14]కళా విభాగానికి ప్రత్యేకమైన కళని తీసుకొచ్చిన అనుభవశాలి ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి. వర్తమానమైనా గతమైనా... చరిత్ర అయినా, కాల్పనిక ప్రపంచమైనా... కథ సాగే ఆ కాలాన్ని ఒడిసిపట్టి తన కళతో పక్కాగా ఆవిష్కరిస్తారు.
[01:11]‘‘రీరిలీజ్ సినిమాల్ని వారాంతాల్లో కాకుండా వారం ఆరంభంలో విడుదల చేస్తే కొత్త చిత్రాలకు మంచిది. ఎందుకంటే మన తెలుగు సినిమాల్ని ఇంకో తెలుగు సినిమాతో మనమే చంపుకోవడం సరికాదు.
[01:03]అందం, అభినయంతో బాలీవుడ్ కుర్రకారుని ఉర్రూతలూగించే కథానాయిక దిశా పటాని. ఇటీవలే ‘కంగువా’ అనే తమిళ చిత్రంలో మెరిసిన ఆమె.. ఇప్పుడు హాలీవుడ్లో తొలి అడుగు వేయడానికి సిద్ధమైంది.
[01:03]‘96’, ‘సత్యం సుందరం’ లాంటి బలమైన భావోద్వేగాలు నిండిన చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించారు దర్శకుడు సి.ప్రేమ్కుమార్. ఇప్పుడాయన తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు.
[00:03]ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులను అధిగమించిన థాయ్లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్శ్రీ (Opal Suchata Chuangsri) 72వ ‘మిస్ వరల్డ్ 2025’ (Miss World 2025) కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె నేపథ్యాన్ని ఓ సారి పరిశీలిస్తే..
[21:24]కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసుకుంటున్నారని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు.
[19:50]బెయిల్పై బయటకు వచ్చే డ్రగ్ స్మగ్లర్ల కదలికలను గుర్తించేందుకు గాను వారి కాళ్లకు జీపీఎస్ ఆధారిత చైన్లను అమర్చేందుకు పంజాబ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
[19:28]పాకిస్థాన్తో ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. వెంటనే వాటిని అధిగమించి.. శత్రుమూకలపై తీవ్రంగా విరుచుకుపడ్డామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.
[19:01]ప్రపంచ సుందరి-2025 ఫైనల్ పోటీలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ తారల ప్రదర్శనల నడుమ హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరుగుతున్నాయి.
[17:31]అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)ని దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తాజాగా కలిశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
[17:24]విక్కీ కౌశల్ (Vicky kaushal) హీరోగా నటించిన ‘ఛావా’ (Chhaava)తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar). వరుస సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఆయన గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారట. ఇదే విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
[00:06]పోర్చుగీస్ వాళ్లకు సెల్ఫోన్ వాడటం పెద్దగా ఇష్టం ఉండదని, దాని వల్ల సూసేగాడ్ దెబ్బతింటుందని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో భాగంగా సరికొత్త అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
[16:36]జూన్ 1 నుంచి ప్రతీ పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు.
[16:13]ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బుమ్రా ప్రదర్శన గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మాట్లాడాడు.
[15:40]మంచు విష్ణు కీలక పాత్రలో నటించిన ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా చిత్ర బృందం బెంగళూరులో జరిగిన ఈవెంట్లో పాల్గొంది.
[15:31]వర్కింగ్ అవర్స్ కారణంగా దీపికా పదుకొణె ఓ ప్రాజెక్ట్ను వదులుకున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ కొందరు దీనిపై స్పందించారు.
[15:04]ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సరైన మిడిలార్డర్ లేకపోవడం వల్లే గిల్ సేన ఓటమి పాలైందని టామ్మూడీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
[14:57]పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని తెలిపారు.
[14:13]టెస్ట్ క్రికెట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా టీమ్ఇండియా శుభ్మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో గిల్ మీద చాలా బరువు బాధ్యతలున్నాయని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు.
[13:59]మే చివరి వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, వెబ్సిరీస్లు సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి
[12:14]ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. ఈ విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు గంభీర్ ఇచ్చిన సమాధానంపై టీమ్ఇండియా మాజీ పేసర్ అతుల్ వాసన్ అసంతృప్తి వ్యక్తంచేశాడు.
[11:09]శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబయి చేతిలో గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన అభిమానులు, ఆ జట్టు ఆటగాళ్ల కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
[10:01]AskDISHA 2.0: రైలు టికెట్ బుకింగ్, క్యాన్సిల్ లాంటి సేవల్ని మరింత సులభతరం చేసేందుకు ఐఆర్సీటీసీ ఆస్క్ దిశా 2.0 వర్చువల్ అసిస్టెంట్ తీసుకొచ్చింది. అదెలా పనిచేస్తుందంటే?
[08:26]ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ దంపతులకు సంబంధించి ఇటీవల వైరల్ అయిన వీడియోపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
[07:52]సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ‘ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా’లను రైల్వేశాఖ ఏర్పాటు చేయనుంది. దేశంలో పైలట్ ప్రాజెక్టు కింద హౌరా, సెల్దా, దిల్లీ, ముంబయి, ధనపూర్, చెన్నైలతో పాటు సికింద్రాబాద్నూ రైల్వే ఎంపిక చేసింది.
[07:18]అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘జాతీయ స్పెల్లింగ్ బీ’ పోటీల్లో ఈ ఏడాది కూడా భారత-అమెరికన్ విద్యార్థుల హవా కొనసాగింది. ఈ పోటీల్లో హైదరాబాద్ మూలాలున్న బాలుడు సత్తాచాటాడు.
[06:11]పాకిస్థాన్ దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టిన భారత సరిహద్దు భద్రతా దళాల (బీఎస్ఎఫ్)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రశంసలు కురిపించారు. ఇటీవల చేపట్టిన సైనిక ఆపరేషనులో పాక్లోని 118 పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయన్నారు.
[06:10]తమిళనాడులో 2023 నాటి నాడీ సంబంధ ఇన్ఫెక్షన్ విజృంభణకు మూలాన్ని పరిశోధకులు గుర్తించారు. ఒక దంత వైద్యశాలలో వాడిన కలుషిత సెలైన్ ఇందుకు కారణమని తేల్చారు.
[06:09]భారత్లోని అంటువ్యాధుల నిఘా కార్యక్రమం కింద 2018-2023 కాలంలో గుర్తించిన సాంక్రమిక రుగ్మత విజృంభణల్లో 8 శాతం.. జంతువుల నుంచి మానవుల్లోకి వచ్చినవేనని తాజా విశ్లేషణ పేర్కొంది.
[06:09]సొమ్ము కోసం సొంత మనవడినే అపహరించి పోలీసులకు దొరికిపోయాడు ఓ తాత. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాయ్సేన్ జిల్లాలో సంచలనం కలిగించింది. సిల్వానీ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవేంద్ర పటేల్ (కాంగ్రెస్ పార్టీ) అత్యంత సమీప బంధువు యోగేంద్ర పటేల్.
[06:07]అర శతాబ్దికి పూర్వం 1971నాటి భారత్-పాకిస్థాన్ యుద్ధంలో భారత వైమానిక దళానికి చెందిన భుజ్ వైమానిక క్షేత్రం (ఎయిర్ స్ట్రిప్)పై పాకిస్థానీ జెట్ యుద్ధ విమానాలు బాంబులు కురిపించాయి.
[06:06]గుజరాత్లోని తాపీ జిల్లా సరిహద్దు గ్రామమైన గైస్వర్.. అటు మహారాష్ట్రలోని ఖోకర్వాలా గ్రామాల మధ్య ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంది. పచ్చికబయళ్లలో ఉన్న ఆ ఇంట్లో 70 ఏళ్ల గిరిజన మహిళ మాగనిబెన్ నివసిస్తోంది. భర్త మరణం తర్వాత గత 20 ఏళ్లుగా ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.
[06:05]సర్పంచి ఎన్నికలంటే గ్రామాల్లో హడావుడి మామూలుగా ఉండదు. గుజరాత్లోని జునాగఢ్ జిల్లా సెల్రా గ్రామంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. 78 ఏళ్లుగా ఏకగ్రీవమే. గుజరాత్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటీవలే ఎన్నికల నగారా మోగింది.
[06:04]నడవటం సంగతి అలా ఉంచితే.. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న వారందరికీ దివ్యాంగుల సాధికారత శాఖ చేయూతను అందించింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందించి స్వయంఉపాధితో సొంతకాళ్లపై నిలబడే మార్గాలను చూపించింది.
[06:02]గాజాలో మానవతా సంక్షోభాన్ని టెల్ అవీవ్ నివారించకపోతే ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ పేర్కొన్నారు. గాజాలో ఆకలి సంక్షోభం తీవ్రమవుతున్న వేళ, అంతర్జాతీయ సమాజం స్పందించాల్సి ఉందని అన్నారు.
[06:00]ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందేనని ఇండోనేసియాకు చెందిన ప్రముఖ ముస్లిం నేతలు స్పష్టం చేశారు. శాంతి, అభివృద్ధి సాధనకు భారత్, ఇండోనేసియా దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని అభిలషించారు.
[05:56]సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన జస్టిస్ ఎన్.వి.అంజారియా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్, జస్టిస్ ఏ.ఎస్.చందూర్కర్లు శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు.
[05:54]వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్)కు సంబందించి సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్15న నిర్వహించదలచిన నీట్-పీజీ 2025ని ఒక షిఫ్ట్లోనే ముగించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎన్.వి.అంజారియా ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది.