[14:24]ఇటీవల ప్రధాని ప్రసంగాన్ని థరూర్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో సొంత పార్టీ నేతలకు థరూర్ పరోక్షంగా చురకలంటించారు.
[14:18]సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా (Team India) ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. న్యూజిలాండ్తో స్వదేశంలో ఓటమి తర్వాత.. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల సిరీస్ నెగ్గి దారిలోపడ్డట్టే కనిపించారు. అంతకు ముందు ఇంగ్లాండ్ గడ్డ మీద పోరాట పటిమతో సిరీస్ను సమం చేసుకుని ఫర్వాలేదనిపించుకున్నారు. కానీ భారత జట్టు మళ్లీ గాడి తప్పింది. దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ను కోల్పోయింది.
[14:16]దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కోచ్గా కొనసాగాలా.. వద్దా..? అనే విషయంలో బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుందన్నాడు. ఇండియన్ క్రికెట్కే ప్రాధాన్యమని, వ్యక్తులకు కాదని చెప్పాడు.
[12:54]దిల్లీ పేలుడులో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్కు చెందిన షోయబ్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్టు చేశారు.
[12:39]టీ20 వరల్డ్కప్ 2026 ఫైనల్ మ్యాచ్ను అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు నిన్న (మంగళవారం) విడుదలైన షెడ్యూల్లో ప్రకటించారు. అయితే దీన్ని శివసేన నేత ఆదిత్య ఠాక్రే తప్పు పడుతున్నారు. దీన్ని పక్షపాత చర్యగా ఆయన అభివర్ణించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రశ్నించారు.
[11:20]గువాహటి టెస్ట్లో టీమ్ఇండియా ఓటమి అంచున ఉంది. 27/2 ఓవర్నైట్ స్కోర్తో అయిదో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా చకచకా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టీ బ్రేక్ సమయానికి 47 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది.
[10:27]గువాహటి వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్లో తలపడుతున్నాయి. 27/2 ఓవర్నైట్ స్కోర్తో టీమ్ఇండియా అయిదో రోజు ఆటను ప్రారంభించింది. 31.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్ (8*), రవీంద్ర జడేజా (0*) ఉన్నారు.
[10:20]2021 తర్వాత నుంచి అఫ్గాన్తో సంబంధాల పునరుద్ధరణకు చేసిన యత్నాలు విఫలమైనట్లు పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ జియోన్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
[09:44]భారత మహిళల క్రికెట్ జట్టు (Team India) సభ్యురాలు స్మృతి మంధాన (Smriti Mandhana) తండ్రి శ్రీనివాస్ ఆదివారం గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
[08:55]అమెరికా ఫెడర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరక్టర్గా ఉన్న భారత సంతతికి చెందిన కాష్ పటేల్ను ఆ బాధ్యతల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలను వైట్హౌస్ ఖండించింది.
[07:46]టీమ్ఇండియా (Team India) ఇప్పటికే కోల్కతా టెస్ట్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసింది. ఈ సిరీస్లో 0-1తో వెనుకబడి ఉంది. ప్రస్తుతం గువాహటి టెస్ట్లోనూ ఓటమి అంచున ప్రయాణిస్తోంది. ఇంతకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో కోచ్గా గౌతమ్ గంభీర్ను (Gautam Gambhir) తప్పించాలనే వాదనలు ఊపందుకున్నాయి. అయితే టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. (Suresh Raina) గౌతమ్ గంభీర్కు మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్గా తన పని తాను చేస్తున్నాడన్నాడు.
[05:51]నకిలీ మద్యం కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రామును నాలుగు రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
[05:49]డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఏటా సంక్రాంతి పర్వదినాల్లో నిర్వహిస్తున్న జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
[05:49]వయసు పెరుగుతున్నా తనలోని జ్ఞానతృష్ణ తరిగిపోదని నిరూపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి.
[05:20]వేడి సాంబారు గిన్నెలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాములలో ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్కి గ్రామానికే చెందిన మదిరి ప్రవీణ్కుమార్ దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తె ప్రేరణతో కలిసి వెళ్లారు.
[05:17]వచ్చేఏడాది ఏప్రిల్లో తమ దేశంలో పర్యటించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
[05:19]అక్రమంగా నగదు లావాదేవీలు, సొమ్ము బదిలీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వింజో గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ.527 కోట్ల విలువైన చరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు.
[05:18]దేశ భద్రతా రహస్యాలను పాకిస్థాన్కు చేరవేశారన్న కేసులో నేరం రుజువు కావడంతో మరో ఇద్దరు నిందితులకు 71 నెలల చొప్పున సాధారణ జైలుశిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది.
[05:16]ముగ్గురు అన్నదమ్ములకు ఇల్లు శుభ్రం చేస్తుండగా అటక మీద కనిపించిన ‘సూపర్మ్యాన్’ కామిక్స్ పుస్తకం మొదటి సంచిక ఈ నెల టెక్సాస్లో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో 9.12 మిలియన్ డాలర్లు (రూ.81.25 కోట్లు) పలికింది.
[05:15]ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలకు ఇల్లే అతి ప్రమాదకరమైనదిగా మారింది! భర్త, సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
[05:14]బుర్ఖా ధరించి పార్లమెంటుకు వచ్చిందన్న కారణంతో ఓ మహిళా సెనేటర్పై నిషేధం విధించారు. ఆస్ట్రేలియాలో బుర్ఖాను నిషేధించాలంటూ ఆమె తీసుకొచ్చిన ప్రతిపాదనను తోటి సెనేటర్లు అంగీకరించకపోవడంతో దీనికి నిరసనగా పౌలిన్ హాన్సన్(71) అనే మహిళా సెనేటర్ సోమవారం బుర్ఖాతో పార్లమెంటుకు వచ్చారు.
[05:13]వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా భారత్-కెనడా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇరుదేశాల మధ్య 2.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25వేల కోట్లు) యురేనియం ఒప్పందం చేసుకున్నట్లు కెనడా మీడియా వర్గాలు వెల్లడించాయి.
[05:12]రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి సాధనకు అమెరికా తీసుకుంటున్న చొరవ ఫలించే సూచనలు కనిపిస్తున్నా, రెండు దేశాల మధ్య దాడులు మాత్రం ఆగడంలేదు. ఉక్రెయిన్పై రష్యా సోమవారం రాత్రి 22 క్షిపణులు, 460 డ్రోన్లను ప్రయోగించింది.
[05:09]మారుతున్న ప్రపంచ పరిస్థితులు, పరిణామం చెందుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో భారత్ సకారాత్మక దృక్పథంతో భవిష్యత్తులోకి దూసుకుపోయేందుకు సిద్ధం కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
[05:06]బాలీవుడ్ ప్రముఖనటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ (44) తన భర్త పీటర్ హాగ్పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని కేసు పెట్టారు. ముంగళవారం ముంబయిలోని ఓ జ్యుడీషియల్ మెజిస్ట్రేటు ముందుకు ఈ పిటిషను వచ్చింది.
[05:05]భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం సంవిధాన్ సదన్ (పాత పార్లమెంటు భవనం) లోని చారిత్రక సెంట్రల్ హాల్లో జరగనున్న కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వం వహిస్తారు.
[05:04]ఆఫ్రికాలోని ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో.. దాని బూడిద మేఘాలు భారత్ వైపు కదిలి వచ్చాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులతో పాటు ఆయా రాష్ట్రాలపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందనే కథనాలు వచ్చాయి.
[05:04]తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదన్న కారణంగా పాకిస్థాన్కు చెందిన ఓ ప్రేమజంట కాలినడకన గుజరాత్లోని కచ్కు చేరుకున్న ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. పోపట్(24), గౌరి(20)లది అంతర్జాతీయ సరిహద్దుకు 8 కి.మీ. దూరంలో ఉన్న పాకిస్థాన్లోని మిథి గ్రామం.
[05:03]సైన్యంలో ఒక రెజిమెంటుకు నాయకత్వం వహిస్తున్న అధికారి... ఆ రెజిమెంట్కు సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి నిరాకరించడం ఆర్మీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
[04:56]సత్యం, న్యాయం, విశ్వాసాల పరిరక్షణను తన ధర్మంగా సిక్కుల తొమ్మిదో పవిత్ర గురువు తేగ్ బహాదుర్ భావించారని, వాటి కోసం ప్రాణత్యాగం చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు.
[04:54]ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ (52) మృతిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జుబిన్ ప్రమాదంలో చనిపోలేదని.. ఆయన్ను కుట్రపూరితంగా హత్య చేశారని అసెంబ్లీలో వెల్లడించారు.
[04:52]పెద్దపేగు క్యాన్సర్కు చౌకలో, ప్రభావవంతమైన ఔషధాన్ని కనుగొన్నట్లు రవూర్కెలాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (ఎన్ఐటీ) శాస్త్రవేత్తలు తెలిపారు. లాంగ్ పెప్పర్ (పిప్పళ్లు)లో ఉండే ఓ మూలకం క్యాన్సర్ను ఎదుర్కోవడంలో తోడ్పడుతుందని గుర్తించారు.
[04:51]ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ప్రసిద్ధి. ఇప్పుడు ఈ ప్రాంతం ఆధునిక వ్యవసాయంతో ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. లక్క సాగు స్థానిక రైతులకు గణనీయమైన లాభాలను తెచ్చిపెడుతోంది.
[04:48]పోలీసు కస్టడీలో జరిగే హింస, మరణాలు వ్యవస్థకే ‘మచ్చ’ అని, వీటిని దేశం సహించదని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలీసు స్టేషన్లలో సీసీటీవీలు పనిచేయకపోవడాన్ని సుమోటో కేసుగా తీసుకున్న న్యాయస్థానం మంగళవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
[04:50]ఛత్తీస్గఢ్లో హోంవర్క్ చేయలేదని అయిదేళ్ల బాలుడిని ఇద్దరు టీచర్లు చెట్టుకు వేలాడదీసి దారుణమైన శిక్ష విధించారు. సూరజ్పుర్ జిల్లా నారాయణ్పుర్లోని ప్రయివేటు పాఠశాలలో ఈ అమానవీయ ఘటన జరిగింది.
[04:47]ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఆందోళన బాట పట్టారు. మంగళవారం బిన్గావ్లోని చందపారా నుంచి 24 పరగణాల జిల్లాలోని ఠాకుర్నగర్కు 3 కి.మీ. పాదయాత్ర చేపట్టారు.
[04:45]మీ రోజువారీ వ్యవహారశైలిని నిర్ణయించేది ఉదయమే అని మీకు తెలుసా? ఆ సమయంలో పాటించే చిన్నచిన్న అలవాట్లే మీరు చలకీగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. దాంతో రోజంతా ఆ భావన కొనసాగి మీ పనితీరు, వ్యవహార తీరు మెరుగ్గా ఉంటాయి.
[04:27]‘పరిశ్రమలకు చెందిన 9,263.71 ఎకరాలను ఇతర అవసరాల వినియోగం(కన్వర్షన్) కోసం అనుమతించి రూ.40 వేల కోట్లు రాబట్టాలని 2022లోనే అప్పటి భారత రాష్ట్ర సమితి మంత్రివర్గ ఉపసంఘమే నిర్ణయించిందని, దాన్నే మేం అమలు చేస్తుంటే కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావులు ధ్వజమెత్తారు.
[04:24]రాష్ట్రంలో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు ఈసారి తమ వివరాల సవరణకు అవకాశముండదు. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో విద్యార్థి పేరు, తండ్రి పేరు, గ్రూపు, మాధ్యమం, భాషా సబ్జెక్టులు తదితర వివరాల్లో తప్పులు దొర్లుతుంటాయి.
[04:29]స్పష్టమైన ప్రణాళికతో, పకడ్బందీగా కృషి చేస్తే. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది.. కానీ ఇందుకు సుస్థిరమైన, నిర్మాణాత్మకమైన, కష్టతరమైన సంస్కరణలను ఏళ్ల తరబడి సమన్వయంతో అమలు చేయాల్సి ఉంటుందని హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బి) పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ముసాయిదా నివేదిక పేర్కొంది.
[04:16]ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి చలానాలు విధిస్తూ.. తరువాత అందులో రాయితీలు ఇవ్వడం.. చట్ట పరిణామాలపై ఉన్న భయాన్ని బలహీనపరచడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాయితీలు ఇవ్వడం ట్రాఫిక్ క్రమశిక్షణరాహిత్యాన్ని పెంచుతుందని పేర్కొంది.
[04:14]నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు పున్న కైలాష్ నేతను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం లేఖ రాయడం కలకలం సృష్టించింది.
[04:20]తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్న జిల్లా డైరెక్టరేట్లను 33కు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
[04:17]రాష్ట్రంలో నాసిరకం చెక్డ్యాంల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. లేఖ ప్రతులను మంగళవారం మీడియాకు విడుదల చేశారు.
[04:16]ఆమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఇంటికి పెద్ద కుమార్తె. తల్లి సంపాదనే జీవనాధారం. అమ్మానాన్నలు ప్రణీత అని నామకరణం చేశారు. పేరుకు తగ్గట్లుగానే ఎన్ని కష్టాలున్నా తల్లి నుంచి ఆమెకు ప్రోత్సాహం లభిస్తోంది.
[03:58]శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా తితిదే చర్యలు చేపట్టింది.
[03:57]మంగళవారం రాత్రి 10 గంటలు.. ఇద్దరు సహాయకులను వెంటపెట్టుకుని ఓ వృద్ధుడు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లో తనకు వైద్యం చేయమంటూ అక్కడి వైద్యులు, సిబ్బందిని అభ్యర్థించారు.
[04:00]వైకాపా ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణాల్లో ఆ పార్టీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సంబంధీకులకు చెందిన రాక్రీట్ (గుత్తేదారు) సంస్థ రూ.80 కోట్ల అవినీతికి పాల్పడినట్లు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
[03:57]‘భారతదేశ ఆర్థికవ్యవస్థ ఎంత వృద్ధి చెందినా ఆ ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా అన్నదే ముఖ్యం. ఆ ఫలాలు అందరికీ అందాలంటే నాణ్యమైన ఉద్యోగాలు అందరికీ దక్కాలి.
[03:57]సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని రెండు, మూడ్రోజుల్లో పరిష్కరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
[03:59]వైకాపా అధికారంలో ఉన్న సమయంలో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు రాముకు విడతల వారీగా ముడుపులు ఇచ్చినట్లు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్రావు పోలీసు కస్టడీలో వెల్లడించాడు.
[02:53]చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరో సమరానికి సిద్ధమవుతున్నాయి. 2026 టీ20 ప్రపంచకప్లో గ్రూప్-ఎలో ఉన్న ఈ జట్లు ఫిబ్రవరి 15న తలపడతాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ షెడ్యూలును మంగళవారం ఐసీసీ ప్రకటించింది.
[02:48]సిరీస్ పోతుందని ముందే తేలిపోయింది. టీమ్ఇండియా కనీసం వైట్వాష్ అయినా తప్పించుకుంటుందేమో అని చూస్తే.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. డ్రా చేసుకోవడానికి ప్రత్యర్థే అవకాశమిచ్చినా.. మన బ్యాటర్లు ఉపయోగించుకుంటేనా?
[02:46]ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను కోతలు భారత ఆదాయ వృద్ధిని దెబ్బ తీసినందున, ఆర్థిక వ్యవస్థకు విధాన మద్దతు అందించే అవకాశాలు తగ్గాయని అమెరికా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్స్ మంగళవారం పేర్కొంది.
[02:44]విమానాల ఇంజిన్లకు నిర్వహణ, మరమ్మతు, సమగ్ర సేవలు (ఎంఆర్ఓ) అందించేందుకు ఫ్రాన్స్కు చెందిన శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటయింది.
[02:43]రక్షణ, అంతరిక్ష రంగాల నావిగేషన్ సిస్టమ్స్లోకి ప్రైవేటు రంగ సంస్థల ప్రవేశం ఆహ్వానించదగిన పరిణామమని భారత అంతరిక్ష మండలి (ఇస్రో) ఛైర్మన్ నారాయణన్ అన్నారు.
[02:43]ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, 10 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు ఆఫర్ ఇవ్వగా.. ఇప్పటికే 50 కోట్లకు పైగా షేర్లను అమ్ముతామంటూ వాటాదార్ల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
[02:34]ఐటీటీఎఫ్ ప్రపంచ యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ(రొమేనియా)లో తొలిసారిగా భారత అండర్-19 జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది.
[02:28]భారత్కు 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులు నెల కిందే దాదాపు ఖాయమైన సంగతి తెలిసిందే. భారత్ బిడ్ను బుధవారం గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్ వార్షిక సర్వసభ్య సమావేశంలో లాంఛనంగా ధ్రువీకరించనున్నారు.
[01:41]‘‘ఒక సినీ ప్రేమికుడిగా ఓ అభిమాని గొప్పదనాన్ని చాటి చెప్పే చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’’ అన్నారు నటుడు ఉపేంద్ర. ఆయన ప్రత్యేక పాత్ర పోషించిన ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించారు.
[01:40]కొత్త వారం.. కొత్త ముచ్చట్లతో ఓటీటీలు రెడీగా ఉన్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు వినోదాలు పంచడానికి సిద్ధమయ్యాయి.
[01:35]‘‘బిగించి గొంతు ఊపిరాపకే.. శిక్షించబోకే చిన్నదానికే. ఇక చాలే ఈ పూటకి.. దిగి రావే నా మాటకి..’’ అంటూ తను మనసిచ్చిన ప్రేయసిని బుజ్జగిస్తూ ప్రేమ పాటలు పాడుతున్నారు శివకార్తికేయన్.
[01:33]శక్తిమంతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఖాతాలో ఇప్పుడు మరో చిత్రం చేరింది.
[00:20]భారత తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందేభారత్’ రూపకల్పనలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) మాజీ జీఎం సుధాంశు మణిది కీలక పాత్ర. లఖ్నవూలోని చార్బాగ్ స్టేషన్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు వెళ్లిన ఆయన.. తనకు మిశ్రమ ప్రయాణ అనుభవం ఎదురైనట్లు తెలిపారు.
[00:09]Bharti Airtel: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్లో (Airtel) బుధవారం బ్లాక్డీల్ జరగనుంది. భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిత్తల్ ఫ్యామిలీ ఆఫీసుకు చెందిన ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ (ICIL) ఈ బ్లాక్డీల్ ద్వారా తన వాటాను తగ్గించుకోనుంది.
[00:15]మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో టికెట్ ధరలు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) పెంచినట్లుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది.
[00:19]BHIM యాప్లో యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్ అనే ఫీచర్ వచ్చేసింది. దీనితో ప్రధాన యూజర్ తనకు నమ్మకమైన వాళ్లకు తన అకౌంట్ నుంచి డబ్బు చెల్లించే అనుమతి ఇవ్వొచ్చు.
[00:12]ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు చర్యలు చేపడుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు.
[20:53]అత్యంత అరుదుగా వచ్చే బబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్తో బాధపడుతున్న రెండున్నరేళ్ల చిన్నారికి న్యూరో ఎండోస్కోపిక్ సర్జరీతో నూతన జీవితాన్ని అందించినట్లు సికింద్రాబాద్ మెడికవర్ వైద్య నిపుణులు వెల్లడించారు.
[19:54]మహిళలు, బాలికలపై ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నిమిషానికి ఒక మహిళ లేదా బాలిక ఇంట్లో వాళ్ల వల్లే హత్యకు గురవుతోందని వెల్లడించింది.
[19:03]రాము ఒక వెబ్సైట్లో కనిపించిన ఉద్యోగ ప్రకటన నచ్చి దానికి ఆన్లైన్లో దరఖాస్తు చేస్తుకున్నాడు. రోజులు, వారాలు గడిచిపోయాయి కానీ ఆ కంపెనీ నుంచి అతనికి ఎలాంటి సమాధానం రాలేదు.
[00:09]టీమ్ఇండియాకు శుభవార్త. గాయం బారినపడిన బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడంపై దృష్టిసారించాడు. అతను జిమ్లో నెమ్మదిగా కసరత్తులు చేయడం ప్రారంభించాడు.
[17:58]అమెరికాలో స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్(56) అనే వ్యక్తి చాట్జీపీటీని విశ్వసించి, అదే వాస్తవమనే స్థితికి చేరారు. అది చెప్పిందని కన్నతల్లినే మట్టుబెట్టాడు.
[17:24]కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండగకి 18 ఏళ్లు నిండిన 1.30కోట్ల మంది మహిళలకు చీరలు అందిస్తే.. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎస్హెచ్జీ గ్రూప్లో ఉన్న 46లక్షల మందికే చీరలు ఇస్తున్నారని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి నేత హరీశ్రావు విమర్శించారు.
[16:56]దిల్లీ పేలుడు కేసులో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఉగ్రవాదుల నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
[16:48]తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఐ- బొమ్మ కేసుకు సంబంధించి నిందితుడు ఇమంది రవి నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సైబర్క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.
[16:12]దక్షిణాఫ్రికాతో జరుగుతున్న (IND vs SA) రెండో టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. 26/0 ఓవర్నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన సఫారీల జట్టు 260/5 వద్ద డిక్లేర్ చేసింది.
[15:17]Tata Sierra: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ (TMPV) తన ఐకానిక్ మోడల్ సియారాను (Tata Sierra) మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
[14:58]HAMMER Weapon: భారత్లో హామర్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ తయారీకి ఫ్రాన్స్తో ఒప్పందం కుదిరింది. ఈ ఆయుధ వ్యవస్థను ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వినియోగించిన సంగతి తెలిసిందే.
[14:51]భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ను ముగించింది. 26/0 ఓవర్నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన సఫారీల జట్టు 260/5 వద్ద డిక్లేర్ చేసింది.