[02:02]కెనడాలోని సుషి రెస్టారెంట్లో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని టిక్టాక్ వేదికగా పంచుకున్నారు. ‘మీ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా వెక్కిరిస్తారా’ అంటూ ఆమె మండిపడ్డారు.
[01:59]ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంతో ఏపీ సహా నాలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఆయా రాష్ట్రాల్లో రైల్వేశాఖ అధికారులు హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
[01:59]ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని నాటునాటు (Naatu Naatu) పాట చిత్రీకరించిన ఉక్రెయిన్లోని జెలెన్స్కీ అధికార నివాసం ఎదుట కొందరు సైనికులు నాటునాటు పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
[23:33]స్పెయిన్లో ఓ చర్చిలో లైంగిక వేధింపుల కేసులో 927 మంది నుంచి సాక్ష్యాధారాలు సేకరించినట్లు స్పెయిన్ రోమన్ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ తాజా నివేదికలో వెల్లడించింది.
[23:20]పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పలు కేసుల్లో ఊరట లభించింది. శుక్రవారం ఆయన లాహోర్లోని పలు న్యాయస్థానాల్లో హాజరుకాగా.. ఆయన ముందస్తు బెయిల్ గడువును పొడిగిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చాయి.
[23:07]జపాన్లో జననాల రేటు 2022లో రికార్డు స్థాయిలో అత్యంత కనిష్ఠానికి (1.26) పడిపోయింది. ప్రస్తుతం 12.5 కోట్లకుపైగా ఉన్న జపాన్ జనాభా.. 16 ఏళ్లుగా క్షీణిస్తూ వస్తోంది.
[01:59]తన పేరుని మార్చుకోవడానికి గల కారణాన్ని తాజాగా నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) బయటపెట్టారు. దినేశ్ నాయుడు నుంచి విశ్వక్గా మారడం వెనుక ఉన్న కథను ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
[02:01]భారత్లో యాపిల్ (Apple) ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలోనే కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో భారత్లో మరో మూడు కొత్త ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లను (Apple Retail Stores) ప్రారంభించాలని నిర్ణయించింది.
[22:21]ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
[21:58]శాసనసభ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జులై 31లోగా దీనికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
[02:02]సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషిచేస్తున్నామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కు ప్రజలెవరూ ఆన్సర్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
[21:35]గగన్యాన్ ప్రాజెక్టు (Gaganyaan) ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్న వ్యోమగాములకు ఎలాంటి ఆహారం ఇస్తారన్న దానిపై ఇస్రో చీఫ్ సోమనాథ్ పలు విషయాలు వెల్లడించారు.
[21:25]జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహిపై ఈనెల 14 నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అన్నవరం సత్యదేవుని చెంత పూజలు నిర్వహించిన తర్వాత యాత్ర మొదలవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.
[21:15]జర్మనీలో ఏడాదిన్నరగా చిక్కుకుపోయిన చిన్నారి అరిహా షా కేసుకు సంబంధించి.. వారి తల్లిదండ్రులకు అపాయింట్మెంటు ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్కు లేఖ రాశారు.
[20:48]దేశంలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో ఐటీఎన్ఎల్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల అవగాహనతోనే ఈ మోసం జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
[20:37]మనోజ్ బాజ్పేయి (Manoj Bajpayee) ప్రధాన పాత్రలో నటించిన ‘బందా’ (Bandaa) చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఓటీటీ నుంచి థియేటర్లోకి అడుగుపెట్టిన తొలి చిత్రంగా ఖ్యాతి సొంతం చేసుకుంది.
[01:57]కొరియర్ చేసిన తన పార్శిల్ను వెతికే క్రమంలో సైబర్ మోసం బారిన పడ్డారో ముంబయి వ్యక్తి. రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి ఆయన వద్ద నుంచి ఓ సైబర్ నిందితుడు రూ.లక్ష కాజేశాడు.
[20:06]పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఎన్ఏబీపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. అరెస్టు వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ.. ఈ న్యాయ ప్రక్రియను ప్రారంభించారు.
[19:53]సుచిత్ర నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన బాలానగర్ ఐడీపీఎల్ వద్ద జరిగింది.
[19:42]Manipur Violence: మణిపుర్(Manipur)లో కేంద్రమంత్రి అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఘర్షణల్లో భాగంగా లూఠీ అయిన ఆయుధాలు వెనక్కి వస్తుండటమే అందుకు కారణం.
[18:55]మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని సీబీఐ కోర్టు తెలిపింది.
[18:33]పురుషులకు ఎలాంటి కష్టాలు ఉంటాయి? వాటి నుంచి బయటపడడం ఎలా? తదితర ఆసక్తికర అంశాలతో రూపొందిన చిత్రం.. మెన్టూ (#Mentoo). థియేటర్లలో ఇటీవల విడుదలై సందడి చేసిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి రానుంది.
[18:35]ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Kamal Haasan) పుట్టినరోజు సందర్భంగా కమల్ హాసన్ (Kamal Haasan)ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
[18:32]ఎలన్ మస్క్ (Elon Musk) తన కుమారుడి వచ్చిన సందేహాన్ని ట్విటర్లో పోస్ట్ చేయగా, దానికి దిల్లీ పోలీసులు (Delhi Police) రిప్లయ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
[17:56]Swaraj Tractors: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్నకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ మరో కొత్త రేంజ్ ట్రాక్టర్లను తీసుకొచ్చింది. టార్గెట్ పేరిట తీసుకొస్తున్న ఈ ట్రాక్టర్లు ఉద్యానపంటల సాగులో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
[17:30]అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కొన్ని గంటలు చూసొచ్చేందుకు ఆప్ నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు దిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. అయితే, ఇందుకు కొన్ని షరతులు విధించింది.
[17:13]‘11th అవర్’, ‘నవంబర్ స్టోరీ’ తదితర వెబ్సిరీస్లతో అలరించిన ప్రముఖ హీరోయిన్ తమన్నా.. మరో సిరీస్తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఆ వివరాలపై ఓ లుక్కేయండి..
[17:16]న్యాయ ప్రక్రియను అనుసరించి బ్రిజ్భూషణ్పై (Brij Bhushan Sharan Singh) చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ( Anurag Thakur) వెల్లడించారు.
[16:48]పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోడెల శివరామ్తో తెదేపా త్రిసభ్య బృందం చర్చలు ముగిశాయి. కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి ఇన్ఛార్జి ఇవ్వటంపై కోడెల శివరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
[16:36]భారత్తో డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్ తెలిపాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా లైయన్ (83 వికెట్లు) కొనసాగుతున్న విషయం తెలిసిందే.
[16:25]ఎన్నికల ముందు తాము ఇచ్చిన ఐదు గ్యారంటీలను (5 Guarantees) ఈ ఏడాదిలోనే అమలు చేసేందుకు కేబినెట్ నిర్ణయించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
[16:22]Electric 2 wheeler sales data: దేశీయ విద్యుత్ ద్విచక్ర వాహనాల విక్రయాలు మే నెలలో తొలిసారి లక్ష మార్కు దాటాయి. సబ్సిడీలో కోత వల్ల విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
[16:12]Wrestlers Protest: 1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కపిల్ సేన.. రెజ్లర్లకు ఓ విన్నపం చేసింది. పతకాలను గంగానదిలో కలిపే ఆలోచనను విరమించుకోవాలని, తొందరపాటు నిర్ణయం వద్దని కోరింది.
[15:57]రెజ్లర్ల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు మహారాష్ట్ర భాజపా ఎంపీ ప్రీతమ్ ముండే అన్నారు. ఏ మహిళ ఫిర్యాదు చేసినా.. తొలుత దానిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
[15:56]Mysterious sounds: కేరళ (Kerala)లోని ఓ గ్రామంలో వస్తోన్న భారీ వింత శబ్దాలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ మిస్టరీ ధ్వనులకు కారణమేంటనేది అంతు చిక్కడం లేదు.
[15:44]Stock Market: సెన్సెక్స్ (Sensex) 118.57 పాయింట్ల లాభంతో 62,547.11 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 46.35 పాయింట్లు లాభపడి 18,534.10 దగ్గర ముగిసింది.
[15:39]ఉక్రెయిన్-రష్యా యుద్ధం చైనాపై ఏమాత్రం ప్రభావం చూపలేదని ఐఐఎస్ఎస్ సంస్థ నివేదిక పేర్కొంది. తైవాన్ ఆక్రమణ విషయంలో చైనా మనసు మారలేదని దీనిలో వెల్లడించింది.
[15:21]బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ (Sara Alikhan)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరలవుతోంది. తన తాజా చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె ఈ విషయాన్ని పంచుకుంది.
[15:25]తన బ్యాగులో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికురాలు ముంబయి విమానాశ్రయంలో కలకలం సృష్టించారు. పరిమితికి మించి లగేజీకి ఛార్జీలు చెల్లించమన్నందుకే ఆమె ఈ విధంగా వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు.
[15:13]క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై డేవిడ్ వార్నర్ (David Warner) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఏ చర్యల వల్ల తన ప్రదర్శనపై పెను ప్రభావం పడిందని గుర్తు చేసుకున్నాడు.
[15:00]ఫోన్ట్యాపింగ్ ఆరోపణలతో ఓ వార్తా సంస్థపై వేసిన కేసులో కోర్టుకు హాజరుకానున్న ప్రిన్స్ హ్యారీ (Prince Harry).. కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు.
[14:59]AWS: క్లౌడ్ సేవల మౌలిక వసతులపై భారత్లో 2030 నాటికి 12 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇటీవల ప్రకటించింది. ఈ తరుణంలో ఏడబ్ల్యూఎస్ ఇండియా హెడ్ పునీత్ చండోక్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
[14:30]విద్యార్థులపై భారం తగ్గించేందుకు గానూ సిలబస్ను హేతుబద్దీకరిస్తున్న NCERT.. తాజాగా పదో తరగతి సిలబస్ నుంచి పిరియాడిక్ టేబుల్ (Periodic Table)ను తొలగించింది. దీనిపై నిపుణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో NCERT స్పందించింది.
[14:20]టీ20లను ఆస్వాదించిన క్రికెట్ అభిమానుల కోసం టెస్టు పోరు సిద్ధమైంది. మరో ఐదు రోజుల్లో ఆస్ట్రేలియా - భారత్ (AUS vs IND) జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా తుది జట్టులో ఎవరుంటారనేదానిపై ఆసీస్ తీవ్రంగా చర్చిస్తోంది.
[14:10]రష్యాలోని సంప్రదాయ చర్చి వర్గాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పుతిన్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు ఉక్రెయిన్, రష్యా పరస్పరం డ్రోన్ దాడులను తీవ్రతరం చేశాయి.
[14:00]ICICI Bank: విశాఖ సహా దేశవ్యాప్తంగా మొత్తం మూడు ప్రాంతాల్లో టాటా మొమోరియల్ ట్రస్ట్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,200 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
[13:44]Wrestlers protest: తనకున్న మద్దతు చూపించుకునేందుకు ర్యాలీ నిర్వహించాలని తలపెట్టిన బ్రిజ్భూషణ్కు అనుమతి రాలేదని తెలుస్తోంది. దాంతో ఆయన తన ర్యాలీని కొన్ని రోజుల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.
[13:14]తమ దేశంలో పౌరులు వినియోగిస్తున్న ఐఫోన్లను హ్యాక్ (Hacking) చేసి అమెరికా (USA) గూఢచర్యానికి పాల్పడుతోందని రష్యా (Russia) ఆరోపించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
[12:55]బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రామ్ (Ram pothineni) ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ ఈ మూవీపై ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
[11:50]తెలంగాణ.. అనేక రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటోంది అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజ్భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆమె మాట్లాడారు.
[12:05]ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ - కె’ (Project K)పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపాయి.
[11:37]బ్రిజ్భూషణ్ (Brij Bhushan)పై గత నెల దిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అందులోని అంశాలు తాజాగా బయటికొచ్చాయి. ఆయనపై మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు.
[11:46]Employee: అనారోగ్య కారణాలు చెబుతూ ఓ ఉద్యోగి రోజుకి ఆరు గంటలు టాయిలెట్లో గడపడం కంపెనీ గమనించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై అతడు కోర్టును ఆశ్రయించాడు.
[11:22]డబ్ల్యూటీసీ ఫైనల్స్లో తుదిజట్టు ఎంపిక భారత్కు కత్తిమీద సాములా మారనుంది. ముఖ్యంగా పంత్ గైర్హాజరీతో కీపర్ ఎంపిక రోహిత్కు సవాలుగా మారనుంది. ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడూతూ కీపర్ ఎంపికపై తన అభిప్రాయం వెల్లడించాడు.
[10:55]Foxconn: బెంగళూరు సమీపంలో ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన పనులు వేగవంతమవుతున్నాయని మంత్రి పాటిల్ తెలిపారు. కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.
[10:28]వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం ఓటమి ఖాయమని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయన్నారు.
[10:08]తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
[09:58]తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
[09:28]Stock Market: ఉదయం 9:17 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 206 పాయింట్ల లాభంతో 62,635 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 65 పాయింట్ల లాభంతో 18,553 దగ్గర కొనసాగుతోంది.
[09:25]ఎంతోమంది పోరాటయోధుల ప్రాణ త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. అలాంటి త్యాగధనులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు.
[09:23]Debt ceiling crisis: ఎట్టకేలకు గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుపై అమెరికా ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయి. దీంతో అగ్రరాజ్యం దివాలా గండం నుంచి గట్టెక్కింది.
[09:12]ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు వేదికైన లండన్లోని ఓవల్ మైదానంలో టెస్టుల్లో ఆస్ట్రేలియా రికార్డు పేలవం. ఇది భారత్కు కలిసొచ్చే అంశం.
[08:05]నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగించామని.. మనసా, వాచా, కర్మణా సకల జనులు పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.
[04:48]కొనుగోలు కేంద్రం చేతులెత్తేయడంతో నెల రోజులుగా ధాన్యం కుప్ప పోసి ఎదురుచూసిన అన్నదాతల పాట్లు చెప్పనలవి కావు. అకాల వర్షాలు, తూకం వేసిన ధాన్యం తరలింపునకు లారీలు రాకపోవడం వంటి సమస్యలతో తిప్పర్తి
[08:30]రాజస్థాన్లోని అజ్మేర్ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం ఓ స్వీపర్కు నలుగురు ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు ప్రసవం చేశారు. ప్లాట్ఫాంను శుభ్రం చేస్తున్న సమయంలో పూజ అనే స్వీపర్కు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చి విలవిల్లాడింది.
[04:53]‘దశాబ్దాలుగా పరిపాలించిన పార్టీలు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులను మేం తొమ్మిదేళ్లలో చేసి చూపించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయాలి. ప్రజారవాణాను మెరుగుపరచాలి.
[05:04]రోజులాగే ఆ ముగ్గురు జీవాలను మేపేందుకు పొలం బాట పట్టారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండటంతో వాటికి ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో వ్యవసాయ బావిలోకి తరలించే క్రమంలో ముగ్గురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.
[04:51]ఆర్థిక చెల్లింపుల సంక్షోభం నుంచి అమెరికాకు అతి పెద్ద ఉపశమనం లభించింది. అదనపు అప్పులకు రిపబ్లికన్ల ఆధిపత్యమున్న ప్రతినిధుల సభ ఆమోదం తెలపడంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
[04:51]ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు సంబంధించిన కీలక విషయాలను దక్షిణ కొరియా నిఘాసంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్ఐఎస్) బయటపెట్టింది.
[04:49]విద్వేషాలు పెంచేవారికి, కుట్రదారులకు, వారి సహాయకులకు ప్రసార సమయం కేటాయించకుండా బహిష్కరించాలంటూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) దేశంలోని శాటిలైట్ టీవీ ఛానళ్లను కోరింది.
[04:49]పాకిస్థాన్ ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి రుణ సేకరణ కోసం గతంలో చేసుకొన్న ఒప్పందం పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈ ఒప్పందం గడువు దాదాపు ముగింపునకు వచ్చింది.
[04:49]తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ వంటి అసమర్థ సీఎం మరెవరూ ఉండరని తెదేపా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు.
[04:49]భూముల విలువలు పెంచినప్పుడల్లా.. పుర, నగరపాలక సంస్థల్లో ఆస్తి పన్ను పెరగదనే హామీని ప్రజలకు ప్రభుత్వం ఎందుకివ్వడం లేదని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు ప్రశ్నించారు.
[04:49]‘మీరు ప్రవేశపెట్టిన మద్యం విధానం అంత మంచిదైతే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? దీనికి నిర్ధిష్టమైన సమాధానం ఇవ్వండి’ అని దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను హైకోర్టు ప్రశ్నించింది.
[07:28]పత్తికొండలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా పోలీసులు ఓ యువకుడిని చేతులతో నెట్టేసి, మోకాళ్లతో తన్నిన ఘటన చోటుచేసుకుంది. సభలో అతడు తాను నిల్చున్న ప్రదేశం నుంచి ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించాడు.
[05:06]కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)లోని మెడికల్ వార్డు ఐసీయూలో విద్యుత్తు షార్ట్సర్క్యూట్ కారణంగా పొగలు వ్యాపించి.. రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
[04:43]అసహజ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి లాల్చంద్ కటారుచక్పై చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ సూచించారు.
[04:43]అంగారక గ్రహంపైకి రెండో యాత్ర చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు రచిస్తోంది. సంబంధిత మిషన్ ప్రస్తుతం అధ్యయన దశలో ఉన్నట్లు ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త, యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్ ఎం.శంకరన్ గురువారం తెలిపారు.
[04:43]పోక్సో కేసుల్లో విచారణ నిమిత్తం సీబీఐ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే నోటిఫికేషన్ జారీ ప్రతిపాదనకు ఆమోదం తెలియజేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ఇచ్చిన ఆదేశాలపై ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
[04:38]దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కి 3 దశాబ్దాల క్రితం లభించిన వృద్ధి అవకాశం వంటిది ఇప్పుడు ఫార్మా పరిశ్రమకు కనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.
[04:34]మద్యం కేసు విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చే సమయంలో భద్రతా సిబ్బంది తనపై చేయిచేసుకున్నారంటూ దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా చేసిన ఆరోపణలపై ఇక్కడి రౌజ్ ఎవెన్యూకోర్టు స్పందించింది.
[06:45]పశ్చిమగోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం ఆందోళనలకు దారితీసింది. వైకాపా నాయకులు ఇటీవల పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూర్చున్న పల్లకీని జనసేన అధినేత పవన్ కల్యాణ్, మరికొందరు మోస్తున్నట్లు కార్టూన్ ఉండటం అభ్యంతరకరంగా ఉందని జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మే 26న కలెక్టర్ పి.ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు.
[04:32]హిందూ దేశాన్ని తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ‘సెంగోల్’ చేతపట్టుకుని పార్లమెంటులో మతపెద్దలతో కార్యక్రమాన్ని నిర్వహించారని, ఇది ‘నవ భారత్’కు చిహ్నమని సీపీఎం విమర్శించింది.
[04:32]దేశ వృద్ధి ప్రస్థానంపై అపనమ్మకం కలిగించేలా నిరాశావాదంతో, ద్వేషంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారనీ, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 7.2% వార్షిక వృద్ధి గణాంకాలే ఆయనకు జవాబు అని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
[04:32]వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు వ్యవహారంపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడు బుద్ధా వెంకన్న అన్నారు.
[04:32]మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మరోసారి ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త పదవికి ఏప్రిల్ 29న రాజీనామా చేసిన ఆయన మే 2న సీఎంతో భేటీ అయ్యారు.
[04:32]దిల్లీ మద్యం కుంభకోణంలో కొందరు కీలక వ్యక్తుల పాత్ర గురించి చెప్పడానికే ఆ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారినట్లు కనిపిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
[03:33]సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. గుండెపోటు బారిన పడ్డవారిలో మేధో సామర్థ్యాలు వేగంగా క్షీణిస్తాయని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు.
[03:55]సూడాన్లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అక్కడి ప్రజల పాలిట శాపమైంది. అంతర్యుద్ధం కారణంగా లక్షల మంది ప్రజలు వలసబాట పట్టారు.
[03:55]అమెరికాలోని కొలరాడో రాష్ట్రం కొలరాడో స్ప్రింగ్స్లో అమెరికా వైమానిక దళ అకాడమీలో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు.
[03:55]పొరుగు దేశం నేపాల్తో స్నేహ బంధాన్ని మరింత దృఢపర్చుకోవాలనుకుంటున్నట్లు భారత్ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్యనున్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు పురాతనమైనవే కాకుండా బలమైనవనీ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
[01:58]జూన్ 23, 2013.. ధోని సారథ్యంలోని టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తేదీ. అది జరిగి.. ఇప్పుడు పదేళ్లు కావస్తోంది. మధ్యలో రెండు వన్డే ప్రపంచకప్లు వెళ్లిపోయాయి. నాలుగు టీ20 పొట్టి కప్పులూ జరిగాయి. ఓ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా నిర్వహించారు.
[08:40]ఐపీఎల్లో రెండు నెలల పాటు తెల్ల బంతులతో ఆడి ఇప్పుడు ఆస్ట్రేలియాతో జూన్ 7న ఓవల్లో ఆరంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఎర్ర బంతులతో ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాడు ఆల్రౌండర్ అక్షర్ పటేల్.
[01:45]ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి టీమ్ఇండియా కొత్త జెర్సీల్లో కనిపించనుంది. ఇటీవల కిట్ స్పాన్సర్గా బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న అడిడాస్.. ఈ కొత్త జెర్సీలను గురువారం ఆవిష్కరించింది.
[01:46]ఫ్రెంచ్ ఓపెన్లో ఇగా స్వైటెక్ (పోలెండ్) దూసుకెళ్తోంది. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ పెద్దగా కష్టపడకుండానే మూడో రౌండ్ చేరింది. గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్సీడ్ స్వైటెక్ 6-4, 6-0తో క్లెయిర్ లూ (అమెరికా)ను ఓడించింది.
[03:49]ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే డీఎంకేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీలో ప్రభుత్వాధికారుల నియామకాలు, బదిలీలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
[04:57]ఉన్నత చదువులు చదివిన గ్రామీణ యువత ఉద్యోగాలు లేక హైదరాబాద్లో వలస కూలీలుగా మారుతున్నారని, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులైన కేటీఆర్, కవిత, హరీశ్రావు, సంతోష్లకు మాత్రం పదవులు దక్కాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
[03:49]బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్కుమార్ ఈ నెల 12న పట్నాలో నిర్వహిస్తున్న విపక్షాల సమావేశానికి హాజరవుతామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
[03:49]మహిళా రెజ్లర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు.
[02:16]సమంత, విజయ్ దేవరకొండ ‘ఖుషి’ కోసం తుర్కియేలో ఆటపాటలతో సరదాగా గడిపేస్తున్నారు. మధ్యలో చిత్రీకరణ నుంచి కాస్త విరామం దొరకడంతో ఈ ఇద్దరూ ఎంచక్కా లంచ్కు వెళ్లిపోయారు.
[02:12]‘‘మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’’ అంటున్నారు బెల్లంకొండ గణేష్. ఆయన హీరోగా రాకేష్ ఉప్పలపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సతీష్ వర్మ నిర్మించారు.
[02:13]మంచి పాట ఏదైన వినిపిస్తే నేల మీద కాలు నిలువదు. అదే పాటకు నచ్చిన వ్యక్తితో కలిసి స్టెప్పులేస్తే ఆ ఆనందమే వేరు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్కు తాజాగా అలాంటి ఆనందమే కలిగింది.
[02:16]‘‘2018’ సినిమా చూస్తున్నంత సేపు నేనొక తుపాన్లో ఉన్నట్లు అనిపించింది. దీంట్లో ఫైట్లు లేవు, డ్యాన్సులు లేవు. కేవలం బలమైన భావోద్వేగాలే ఉన్నాయి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్.
[08:53]తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. స్మగ్లర్లు రెండు పడవల్లో శ్రీలంక నుంచి భారత్కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా మే 30వ తేదీన ఒక్కసారిగా అధికారులు ప్రత్యక్షమయ్యారు.
[03:51]జంతర్మంతర్వద్ద ఆందోళన చేసుకునేందుకు రెజ్లర్లకు అనుమతివ్వాలని, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండు చేసింది.
[03:51]‘మీరు ప్రవేశపెట్టిన మద్యం విధానం అంత మంచిదైతే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? దీనికి నిర్దిష్టమైన సమాధానం ఇవ్వండి’ అని దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను హైకోర్టు ప్రశ్నించింది.
[03:51]ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి డ్రైవింగ్ లైసెన్సు గడువు ముగిసిందన్న కారణంతో బాధిత కుటుంబానికి బీమా సంస్థ పరిహారం చెల్లించనంటే కుదరదని బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.
[03:51]ఓ దళితుడు మంచి దుస్తులు ధరించి, కళ్లద్దాలు పెట్టుకున్నందుకు ఓర్వలేక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన గుజరాత్ పాలన్పుర్ ప్రాంతంలోని మోటా గ్రామంలో చోటుచేసుకుంది.
[05:06]టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇంతక్రితం దాకా టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలు లీకైన విషయం వెలికి రాగా ఇప్పుడు పరీక్ష కేంద్రం నుంచి వాట్సప్లో కూడా బయటకు వచ్చినట్టు సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది.
[03:51]టీవీఎస్ మోటార్ , ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ తమ విద్యుత్తు స్కూటర్ల ధరలను పెంచాయి. జూన్ 1 నుంచి ఫేమ్-2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిన నేపథ్యంలో తమ ఐక్యూబ్ స్కూటర్ ధరలు వేరియంట్ను బట్టి రూ.17,000-22,000 వరకు పెరగనున్నట్లు టీవీఎస్ మోటార్ తెలిపింది.
[03:51]దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్, మన విపణిలో ఓఎల్ఈడీ టీవీలను ఆవిష్కరించింది. వీటిని భారత్లోనే తయారు చేయనున్నట్లు శామ్సంగ్ ఇండియా వెల్లడించింది.
[03:51]ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బ్యాంకింగ్, లోహ, ఇంధన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డాలర్తో పోలిస్తే రూపాయి 35 పైసలు బలపడి 82.40 వద్ద ముగిసింది.
[03:51]కృత్రిమ మేధ(ఏఐ) తమ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతుందేమోనని భారత్లోని 74 శాతం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మైక్రోసాఫ్ట్ తన సర్వేలో పేర్కొంది. గురువారం వెలువడ్డ ఈ సర్వే ‘మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2023’ ప్రకారం..
[03:51]వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు వరుసగా మూడో నెలా రూ.1.50 లక్షల కోట్లను అధిగమించాయి. గతేడాది మే నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే, ఈ ఏడాది మే నెలలో వసూళ్లు 12% పెరిగి రూ.1.57 లక్షల కోట్లకు చేరాయి
[03:51]వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు గురువారం ప్రకటించాయి. హైదరాబాద్లో ఈ సిలిండర్ ధర రూ.85 తగ్గి, రూ.1991కి పరిమితమైంది.
[03:51]ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశ వృద్ధిరేటు 6.5- 6.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ సంఘం సీఐఐ అధ్యక్షుడు ఆర్.దినేశ్ అంచనా వేశారు. ప్రభుత్వ మూలధన వ్యయాలకు తోడు దేశీయంగా పటిష్ఠంగా ఉన్న ఆర్థిక కార్యకలాపాలు ఇందుకు అండగా నిలుస్తాయని అన్నారు.