[03:27]తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తెరదించింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో తన వివాహం రద్దు చేసుకున్నట్లు ఆదివారం సామాజిక మాధ్యమం వేదికగా స్మృతి ప్రకటించింది.
[03:26]భారత్ కల భగ్నమైంది. సుదీర్ఘ విరామం తర్వాత జూనియర్ హాకీ ప్రపంచకప్ను సాధించాలన్న ఆశ తీరలేదు. ఆదివారం సెమీఫైనల్లో భారత్ 1-5తో డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ చేతిలో ఓడింది.
[03:24]యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్ను మట్టికరిపించింది. ఆదివారం ముగిసిన మ్యాచ్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసి..
[03:22]రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని.. వాళ్లిద్దరూ వన్డే ఫార్మాట్లో ఇలాగే స్థిరంగా రాణించాలని కోరుకుంటున్నానని కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు.
[03:20]దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ విజయానంతరం టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువ పేసర్ అర్ష్దీప్ కలిసి చేసిన రీల్ సామాజిక మాధ్యమాలను ఊపేసింది.
[03:17]అంతర్జాతీయ ఆర్చరీలో స్థిరంగా రాణిస్తున్న తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. మరోసారి సత్తా చాటింది. తైపీ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో జ్యోతి కాంస్యంతో మెరిసింది.
[02:06]దేశీయ విమాన ప్రయాణికుల విపణిలో 63% వాటా కలిగిన అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో.. పౌర విమానయాన తాజా నిబంధనల అమలులో విఫలమై, భారీ సంక్షోభాన్ని చవిచూస్తోంది.
[02:03]ఈ ఏడాది నవంబరులో తమ తనఖా (గృహ) రుణాల విలువ రూ.9 లక్షల కోట్లను అధిగమించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు.
[02:02]దేశీయ స్టాక్ మార్కెట్ల కీలక సూచీలు ఈవారం చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 9-10 తేదీల్లో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పరపతి విధాన సమావేశ నిర్ణయాలపై మదుపర్లు దృష్టి సారిస్తారు.
[02:00]పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టులో ఈవారం అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఉండటం, ఇప్పటికే పసిడి మోతాదుకు మించి పెరగడం ఇందుకు కారణాలుగా చెప్పొచ్చు.
[02:04]వినియోగదారు-కేంద్రీకృత, తెలివైన, స్వీయ ఆప్టిమైజింగ్ పంపిణీ నెట్వర్క్లను నిర్మించడంలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత అప్లికేషన్లు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్లాల్ ఆదివారం వెల్లడించారు.
[01:56]ఐపీఓకు ముందే సెకండరీ మార్కెట్ లావాదేవీల ద్వారా వేక్ఫిట్ ఇన్నోవేషన్స్లోకి రూ.186 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్టెడ్వ్యూ రూ.101 కోట్లు, వైట్ఓక్ రూ.72 కోట్లు, క్యాపిటల్ 2బి రూ.13 కోట్లు పెట్టుబడి పెట్టాయి.
[01:54]రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 0.25% తగ్గించిన నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) రెపో అనుసంధానిత రుణ రేట్లు (ఆర్ఎల్ఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
[01:51]‘దసరా’ విజయం తర్వాత కథానాయకుడు నాని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మోహన్బాబు, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
[01:50]రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం కథానాయికగా ప్రియా భవానీ శంకర్ను రంగంలోకి దించినట్లు సమాచారం.
[01:48]కథానాయకుడు వెంకటేశ్.. దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక.
[01:46]మన పనిని పది మంది మెచ్చుకున్నప్పుడు వచ్చే ఎనర్జీనే వేరని అంటోంది బాలీవుడ్ కథానాయిక కృతి సనన్. ఇటీవలే ధనుష్తో కలిసి ‘తేరే ఇష్క్ మే’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిందీమె. ఇందులో ముక్తి పాత్రలో తనదైన నటనతో మెప్పించింది.
[01:44]దర్శకుడిగా, నటుడిగా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన హీరోగా ‘ఖలీఫా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్నారు.
[01:42]ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ చిత్రం ఆఖరి క్షణంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి తననెంతో బాధించిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆదివారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
[01:40]సహాయ నటిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించారు ప్రగతి. ఇప్పుడామె క్రీడాకారిణిగానూ అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్నారు. తను తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ - 2025లో నాలుగు పతకాలు సాధించారు.
[01:38]‘‘పులి పంజా విసరడం ఆలస్యమవుతుందేమో కానీ.. ఈ మార్క్ లేట్ చేయడు’’ అంటూ రంగంలోకి దిగారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్. ఇదంతా ఆయన హీరోగా నటిస్తున్న ‘మార్క్’ సినిమా కోసమే. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
[23:13]ఇండిగో (IndiGo) విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం పట్ల వివరణ ఇవ్వాలని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
[22:26]విశాఖ నగరంలో జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వుడాపార్క్, శివాజీపార్కులో ఏర్పాటు చేసిన స్కేటింగ్ రింక్ల వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు.
[20:46]రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు.. ముఖ్యమంత్రిగా తనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy)ధన్యవాదాలు తెలిపారు.
[20:39]రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది నవంబరు ఐదో తేదీ వరకు ఉన్న వివరాలు పరిశీలిస్తే.. సగటున రోజుకు 50 ప్రమాదాలు జరుగుతుంటే.. వాటిలో 23 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
[19:58]అది ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బీజాపూర్ (Bijapur)జిల్లాలో మారుమూలన ఉన్న కొండపల్లి (Kondapalli) గ్రామం. ఒక్కసారిగా ఆ ఊర్లో పండగ వాతావరణం నెలకొంది.
[19:38]ఫిఫా ప్రపంచ కప్-2026కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఫిఫా అధికారికంగా ప్రకటించింది. జూన్ 11న మొదలై.. జులై 19న వరకు జరగనున్నట్లు పేర్కొంది. 39 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీకి కెనడా, మెక్సికో, యుఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
[00:05]నటుడిగానే కాదు, నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు పద్మనాభం (Padmanabham). రూ.60వేల అప్పు చేసి చివరి వరకూ ఇబ్బందులు పడ్డారు. ఫిబ్రవరి 20న పద్మనాభం వర్థంతి సందర్భంగా ఆయన కెరీర్లో చోటు చేసుకున్న సంఘటన..
[18:24]వంటగది ఆకలి తీర్చడమేకాదు.. ఔషధగనిగా ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. దీని శుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే.. సర్వరోగాలకు ముఖద్వారమవుతుంది. మరి మీ ఇంట్లో దీని పరిశుభ్రతెంతో పోల్చుకోండి.
[19:02]సాగర్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువే. కొలతలు వేసినట్లు ఆహారం తీసుకుంటారు. రోజూ వ్యాయామం చేస్తారు. బీపీ, షుగర్, బరువు చూసుకునే డిజిటల్ పరికరాలు కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు.
[00:06]భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీలను ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ (Sanjay Bangar) అభిప్రాయపడ్డాడు.
[17:32]‘సరిహద్దు రహదారులు.. జాతీయ భద్రతకు జీవనాధారాలు’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అత్యవసర సమయాల్లో సత్వరం స్పందించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని చెప్పారు.
[15:43]తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
[14:55]తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ దీక్ష ఫలించిన డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ‘విజయ్ దివస్’ వేడుకలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు.
[14:45]భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు పూర్తి చేసుకునే అవకాశముందని దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) పేర్కొన్నాడు.
[13:57]ఆర్జేడీ (RJD) పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్కు చెందిన ఓ ప్రైవేటు నివాసానికి సంబంధించిన ఇంటికి గత మూడేళ్లుగా కరెంటు బిల్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
[13:32]భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం విషయంపై కీలక ప్రకటన చేశారు. తన పెళ్లి రద్దయినట్లు ఆమె ఇన్స్టా స్టోరీలో ప్రకటించారు.
[09:59]రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, రోప్వేలకు మార్గం సుగమమైందని... వరంగల్, ఆదిలాబాద్, రామగుండంలలో కొత్త విమానాశ్రయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వం పేర్కొంది.
[10:27]గువాహటిలో భారత్తో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ (Shukri Conrad) ‘గ్రోవెల్’ (సాష్టాంగపడటం) అనే పదం వాడటం టీమ్ఇండియా అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.
[09:01]కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు యువత వెళ్లి చదువుకోవడం సర్వసాధారణం. అందుకు భిన్నంగా హైదరాబాద్లోని పలు వర్సిటీలు, కళాశాలల్లో సీనియర్ సిటిజన్లు కనిపిస్తున్నారు.
[07:51]గోవాలోని ఓ నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Goa Nightclub Fire)పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
[06:29]సూడాన్లోని దక్షిణ కొర్డోఫాన్ రాష్ట్రంలో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) ప్రయోగించిన ఓ డ్రోన్ శిశుపాఠశాలపై పడటంతో 50 మంది చనిపోయారు.
[06:23]మాజీ ప్రధాని వాజ్పేయీ దేశానికి అందించిన సేవలు, సుపరిపాలనను నేటి తరానికి గుర్తుచేస్తూ.. అందరిలో స్ఫూర్తిని నింపేందుకు ఆయన శత జయంతి ముగింపు సందర్భంగా సుపరిపాలన బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
[06:17]ఉక్రెయిన్పై రష్యా ఆకస్మిక దాడి చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా, ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం.
[06:21]రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటుచేయించింది వైకాపా నేత, మాజీమంత్రి జోగి రమేషేనని (ఏ-18) సిట్ నిగ్గుతేల్చింది.
[06:22]కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఈ) చట్టమంటే.. వైద్య రంగాన్ని కార్పొరేట్కు అప్పగించడమేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు దిలీప్ భానుశాలి పేర్కొన్నారు.
[06:22]పలు సమస్యలతో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి సీఎం చంద్రబాబు శనివారం వినతులు స్వీకరించారు.
[06:21]భారతీయ కళలు, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ప్రక్రియలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
[06:20]గత వైకాపా ప్రభుత్వంలో వేెంకటేశ్వరస్వామి మీద నమ్మకం లేని గ్యాంగ్ని అందలం ఎక్కించి తిరుమల పవిత్రతను అప్పటి సీఎం జగన్ దిగజార్చారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు.
[06:21]రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, చింతూరు డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో విలీన మండలాలు కొత్త జిల్లాలోకి వెళ్లనున్నాయి.
[06:16]దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా సమీపంలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సాల్స్విల్ టౌన్షిప్లో అనుమతులు లేని ఓ బార్లో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు.
[06:10]కేంద్ర విత్తన చట్టం ముసాయిదాలో సవరణలు చేయాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, రైతు సంఘాల నాయకులు కేంద్రానికి సూచనలు చేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.అల్దాస్ జానయ్య పిలుపునిచ్చారు.
[06:10]కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తామని బీసీలను తీవ్రంగా మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేతలు విమర్శించారు. బీసీల రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని ఆత్మహత్య చేసుకున్న సాయిఈశ్వర్ చారి అంత్యక్రియలను వారు శనివారం జగద్గిరిగుట్టలో నిర్వహించారు.
[06:09]రైతులకు యూరియా కొరత రాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని, సీఎం రైతు వ్యతిరేక విధానాలతో రైతన్నలు నరకం చూస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.
[06:08]వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ వారంలో ప్రారంభిస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె.రమేశ్రెడ్డి తెలిపారు.
[06:07]తెలంగాణ పోలీస్శాఖకు హోంగార్డులు వెన్నెముకలా నిలుస్తున్నారని..పెద్దగా ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తున్నారని డీజీపీ బి.శివధర్రెడ్డి ప్రశంసించారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అంశాలతో త్వరలోనే వారు శుభవార్త వింటారని పేర్కొన్నారు.
[06:06]నిర్ణీత సమయానికి రావాల్సిన ఆర్టీసీ బస్సు రాలేదా? దూరప్రాంత బస్సు బాగా ఆలస్యంగా వెళుతుందా? లోపల సీట్లు సౌకర్యంగా, పరిశుభ్రంగా లేవా? వర్షం నీరు లోపలకు వస్తుందా? డ్రైవర్, కండక్టర్ దురుసుగా వ్యవహరిస్తున్నారా? మీరు ఎక్కాల్సిన స్టాప్లో బస్సు ఆపలేదా? ఇలాంటి సమస్యలు ప్రయాణికులకు ఎదురవుతూనే ఉంటాయి.
[06:04]ఒక పల్లె నుంచి ఒకరు ఇద్దరు కాదు.. 29 మంది దేశ సరిహద్దు రక్షణ విభాగాల్లో పనిచేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామం ప్రత్యేకత ఇది.
[08:02]కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందగా... చేతిలో చిల్లిగవ్వ లేక ఆయన అంత్యక్రియలనూ చేయలేని దైన్యం ఆ కుటుంబానిది. మృతదేహంతోనే మూడు రోజులు ఇంట్లో గడిపారు.
[06:16]అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసులో కీలక నిందితుడైన వంకరెడ్డి మాధవరెడ్డి కోసం సీఐడీ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
[06:16]మాజీ ప్రధాని వాజ్పేయీ శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 11 నుంచి భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించనున్న ‘అటల్- మోదీ సుపరిపాలన యాత్ర’ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆహ్వానించారు.
[06:16]రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నెలకొల్పుతున్న ప్రభుత్వం... ఆ టెక్నాలజీల్లో నిపుణులైన మానవ వనరుల్ని సిద్ధం చేసేందుకు ప్రారంభిస్తున్న కోర్సుకు విశేష స్పందన లభించింది.
[06:15]దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
[05:51]గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికలకు మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. సర్పంచి, వార్డు పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు స్థానికంగా ఇంటింటికీ ప్రచారం చేస్తూనే.. మరోవైపు గ్రామంలో ఓటుండీ.. పట్టణాలు, నగరాల్లో నివసించే ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
[05:48]నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం (బీకే), వంగురోనిపల్లె, కల్ములోనిపల్లె, ప్రశాంత్నగర్ పంచాయతీలకు మూడో విడతలో నిర్వహించే ఎన్నికలను ప్రజలు బహిష్కరించారు.
[05:47]గ్రామపంచాయతీ ఎన్నికల మూడో దశలో పోటీకి ఆశావహులు భారీ సంఖ్యలో ముందుకొచ్చారు. మూడో విడతలో 4,158 గ్రామపంచాయతీల్లోని సర్పంచి పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా... 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి.
[05:50]వైకాపా అధ్యక్షుడు జగన్కు.. సొంత బాబాయి హత్యే చిన్న విషయమైనప్పుడు, తిరుమల పరకామణిలో చోరీ ఘటన పెద్ద విషయం ఎలా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు.
[06:30]‘రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి నాలుగైదు మార్గాల్లో సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నా. దాని ప్రకారం ఇంకా 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉంది.
[02:00]పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టులో ఈవారం అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఉండటం, ఇప్పటికే పసిడి మోతాదుకు మించి పెరగడం ఇందుకు కారణాలుగా చెప్పొచ్చు.
[05:33]దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం(2026-27)లో ప్రతిష్ఠాత్మక న్యాయవిద్య విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్-2026) ఆదివారం జరగనుంది.
[05:20]విమానయాన సిబ్బంది పనిగంటలపై పరిమితులు (ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్-ఎఫ్డీటీఎల్) విధిస్తూ 2024 జనవరిలో జారీచేసిన నిబంధనలను ఈ నవంబరు 1 నుంచి అన్ని విమానయాన సంస్థలు సరిగా అమలు చేసినప్పటికీ ఒక్క ఇండిగోతోనే సమస్య వచ్చిందని పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
[05:16]ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతోంది. ఆ సంస్థ విమాన సర్వీసులకు వరుసగా ఐదో రోజూ తీవ్ర అంతరాయం కలిగింది. 800కు పైగా విమానాలను ఆ సంస్థ శనివారం రద్దు చేసింది. ఈ సంఖ్యను రానున్న రోజుల్లో గణనీయంగా తగ్గిస్తామని తెలిపింది.
[05:20]విదేశాల నుంచి ప్రయాణికులతో హైదరాబాద్కు టేకాఫ్ తీసుకున్న రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు సందేశాలు వచ్చిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం చోటుచేసుకుంది.
[05:14]రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ నివాళులర్పించారు.
[05:13]ప్రపంచంలో కోట్ల మందిని కాలుష్యం ఇబ్బంది పెడుతోంది. దిల్లీలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే గుజరాత్లోని జూనాగఢ్లో మాత్రం కాలుష్య జాడలే లేవు.
[05:11]బానిస మనస్తత్వం నుంచి పదేళ్లలో మనదేశం బయటపడేలా చూడాలని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రతిరంగం ఆ దిశగా వెళ్తూ సరికొత్త ఘనతలు సాధిస్తోందన్నారు. శనివారం దిల్లీలో ‘హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్’లో ఆయన ప్రసంగించారు.
[05:09]పశ్చిమబెంగాల్లో బాబ్రీ తరహా మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సమస్యాత్మక ప్రాంతమైన ముర్శిదాబాద్ జిల్లాలోని బెల్డంగా ప్రాంతంలో శనివారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బహిష్కృత ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
[06:53]ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బెగూనియా ప్రభుత్వ యూజీ ఎగువ ప్రాథమిక పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని వసతి గృహంలో మంచానికి గొలుసుతో బంధించారు.
[05:08]ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోపై ఎంగేజ్మెంట్ చేసుకున్న అంకిత్, శ్వేతా సింగ్ల జంట ఉత్తరాఖండ్లోని దేహ్రాదూన్లో ఉన్న త్రియుగినారాయణ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు.
[04:36]రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠ్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్కు విశ్వనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సోమ, మంగళవారాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న రెండు రోజుల సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో సమిట్ ప్రాంగణంతోపాటు నగరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు.
[04:41]తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘గ్లోబల్ సమిట్-2047’ ప్రాంగణం వద్ద వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుకానున్న స్టాళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల వివరాలను ఆడియోవీడియో(ఏవీ) తెరల(స్క్రీన్లు)పై ప్రదర్శించనున్నారు.
[04:40]ఒకేసారి నాలుగు సమావేశమందిరాల్లో 4 సెషన్స్ జరుగుతాయి. మొదటి దాంట్లో ‘ది జస్ట్ ట్రాన్సిషన్ ఇన్ టూ 2047- పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్’ అనే అంశంపై చర్చలు.
[04:37]ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట సంకటంగా మారింది. సాంకేతిక కారణాలు, ప్రతికూల వాతావరణం అంటూ చెప్పిందే చెబుతూ ఇండిగో సంస్థ పదుల సంఖ్యలో విమానాలను రద్దు చేస్తుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
[04:43]ఏపీ చేపడుతున్న పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు(పీఎన్ఎల్పీ)ను అడ్డుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
[04:33]ఈ చిత్రంలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఫొటో దిగినట్లు ఉంది కదా. అయితే, అందులో ప్రత్యేకతేముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. వారందరూ ఫొటో దిగడం లేదు.. ఓ విద్యార్థి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు.
[04:32]సంక్షేమ పథకాలు అందించడంలో ఇప్పటికే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా చేశామని.. రానున్న పదేళ్లలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ నమూనాగా నిలిచేలా అభివృధ్ధి పథకాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.