[07:10]పరిపాలనా కేంద్రంగా సాగుతున్న విజయవాడను మావోయిస్టులు షెల్టర్జోన్గా చేసుకోవడం..పెద్దసంఖ్యలో ఇక్కడి పరిసర ప్రాంతాల్లో తలదాచుకోవడం కలకలం సృష్టించింది.
[06:05]కర్నూలు(వెంకటరమణ కాలనీ), న్యూస్టుడే: విద్యుత్ వినియోగదారులపై రూ.12,717 కోట్ల ట్రూఅప్ భారాలు వేయాలన్న ప్రతిపాదన తిరస్కరించాలని ప్రజాసంఘాలు, విద్యుత్ నిపుణులు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని కోరారు.
[05:26]మండల-మకరవిలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజుల్లో(సోమవారం, మంగళవారం)నే దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
[05:32]శ్రీసత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
[05:30]దేశ వైమానిక పరిశ్రమల రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూరులో స్థలం కొరత, వ్యయాలు భారీగా పెరిగిపోవడం, రద్దీ లాంటి కారణాలతో విస్తరణ కష్టంగా మారిందని, ఇప్పుడు పెద్ద పరిశ్రమలన్నీ దానికి సమీపంలోని శ్రీసత్యసాయి జిల్లాపై దృష్టిపెడుతున్నాయని రేమండ్ గ్రూప్నకు చెందిన జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ లిమిటెడ్ ఎండీ గౌతమ్ మైనీ తెలిపారు.
[05:24]ఎర్రకోట సమీపాన కారుబాంబుతో దాడికి పాల్పడి మారణహోమం సృష్టించిన డాక్టర్ ఉమర్ నబీ.. ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేలా రూపొందించిన వీడియో సందేశం దర్యాప్తు అధికారులకు లభ్యమైంది.
[05:23]ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను ధ్వంసం చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కుటిల పన్నాగం పన్నిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
[06:49]తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీలు శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారని ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన ఆరోపణలు చేశారు.
[05:21]ఓట్ల చోరీ పాన్ ఇండియా అంశమని, దానిపై జాతీయ పార్టీలు.. ఇతర పార్టీలతో చర్చలు జరపాలని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సూచించారు.
[05:20]బిహార్లో 20వ తేదీన ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై కసరత్తు సాగుతోంది. మంత్రివర్గ కూర్పుపై ఎన్డీయే కూటమిలో ప్రధాన పార్టీలైన భాజపా, జేడీయూ మధ్య చర్చలు జరుగుతున్నాయి. స్పీకర్ పదవి విషయంలో రెండు పార్టీలూ పట్టుదలగా ఉన్నాయి.
[05:19]చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థించడం, వాటికి సహాయపడటం వంటి వాటికి సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేయొద్దని దేశంలోని ప్రైవేటు టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ హెచ్చరిక జారీచేసింది.
[05:18]చాలాకాలంగా భద్రతా బలగాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా ఉన్న హిడ్మాను పట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల అధికారులకు స్పష్టమైన డెడ్లైన్ విధించినట్లు సమాచారం.
[05:17]వన్యప్రాణుల కారణంగా సంభవించే పంట నష్టానికి ఖరీఫ్ సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద పరిహారం చెల్లించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
[05:16]దేశరాజధాని దిల్లీలో పేలుడు ఘటన మరవకముందే మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపాయి. పలు కోర్టులు, విద్యాసంస్థలు లక్ష్యంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
[05:14]ఎన్ఐఏ, యూఏపీఏ, మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం (ఎంసీఓసీఏ) వంటి ప్రత్యేక చట్టాల కింద నమోదైన కేసుల్ని ఆరు నెలల్లో పరిష్కరించేందుకు దేశవ్యాప్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
[05:13]దేశ రాజధానిలో 2020లో జరిగిన అల్లర్లకు సంబంధించి నిర్బంధంలో ఉన్న జేఎన్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్ తదితరులకు బెయిలు ఇవ్వొద్దని దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును గట్టిగా కోరారు.
[05:13]సమాచార భద్రత కోసం ఎటువంటి వివరాల్లేకుండా కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్తోనే కొత్త ఆధార్ కార్డును ప్రవేశపెట్టాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) యోచిస్తోంది.
[05:12]వాతావరణ మార్పుల నిరోధానికి సవరించిన జాతీయ నిర్దేశిత లక్ష్యాలను(ఎన్డీసీ) డిసెంబరులో సమర్పిస్తామని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం తెలిపారు.
[05:11]దేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో గుజరాత్లోని సూరత్-వాపి మధ్య నడుస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం రైల్భవన్లో విలేకరులకు తెలిపారు.
[05:10]మహారాష్ట్రలోని నాగ్పుర్ కేంద్ర కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న పదిమంది ఖైదీలు నాలుగు రోజులు శ్రమించి మినీ రాయ్గఢ్ కోటను నిర్మించారు. తాము గతంలో ఎప్పుడూ ఆ కోటను చూడకపోయినా ఇంటర్నెట్లోని ఫొటోల ఆధారంగా అచ్చు గుద్దినట్టుగా ప్రతిరూపాన్ని సృష్టించారు.
[05:05]ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు తాను చెత్త కిడ్నీని దానం చేశానని ఆరోపిస్తున్న వారితో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య స్పష్టం చేశారు.
[05:04]అధిక దిగుబడినివ్వడంతోపాటు వంటకాలకు మంచి రుచిని జోడించే ‘సాస్-కెవు’ అనే కొత్త అల్లం రకాన్ని నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
[04:59]మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్వాంటెడ్ మద్వి హిడ్మా (51) భద్రత బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.
[05:04]మోదీ సర్కారుకు అనుకూలంగా వ్యాఖ్యలుచేస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.
[04:48]మాజీ ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్లో మంగళవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోలేదు.
[04:46]వెనెజువెలాపై సైనిక చర్య చేపట్టే విషయాన్ని తోసిపుచ్చలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వెనెజువెలా అధ్యక్షుడు నికొలాస్ మదురోతో మాట్లాడేందుకు తాను సిద్ధమేనని, అయితే ఆ దేశ భూభాగంపై సైనిక చర్యను కూడా కాదనలేమని ట్రంప్ అన్నారు.
[04:44]ధాన్యం విక్రయించినట్లు నకిలీ రైతుల వివరాలు నమోదు చేసి.. రూ.2 కోట్లు కాజేసేందుకు సహకరించినట్లు కేసు నమోదైన ముగ్గురు వ్యవసాయాధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
[04:23]కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలు, భారత పత్తి సంస్థ(సీసీఐ) తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
[04:19]ప్రజలే కేంద్రంగా.. వారి సౌలభ్యమే లక్ష్యంగా పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన మెరుగైన పరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
[04:17]తెలంగాణ ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన 18 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలుచేసిన అఫిడవిట్లో సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉన్న ఎస్ఎల్పీ గురించి ప్రస్తావించకపోవడంపై మంగళవారం...
[07:04]న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
[04:16]బరువెక్కిన హృదయాలు... ఉబికివస్తున్న కన్నీళ్లు... ఏ ఇంటికి వెళ్లినా వేదనే... ఎవరిని కదిలించినా అంతులేని ఆవేదనే... సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతి చెందిన 45 మంది కుటుంబాల్లో పరిస్థితి ఇది.
[04:21]రైల్లో ఏసీ బోగీల్లో బెడ్ రోలర్గా పనిచేస్తూ రాత్రి సమయాల్లో ప్రయాణికుల సెల్ఫోన్లను దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ రైల్వే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
[04:21]తల్లి లేని ఇద్దరు బాలికలను మభ్యపెట్టి.. బాగా చూసుకుంటామని నమ్మించి.. వారితో వ్యభిచారం చేయించిన భార్యాభర్తలకు పోక్సో న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగారవాసం, రూ.23 వేల జరిమానా విధించింది.
[04:22]డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరానికి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను గోదావరిలోకి తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
[04:13]‘అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో ఉంటూ కుటుంబ సభ్యులతో జల్సాలు చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడబెట్టుకొని కార్లలో తిరుగుతున్నారు.
[04:10]తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలను వదులుకోవడంతోనే భారత రాష్ట్ర సమితి గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిందని.. సీనియర్ నాయకులను కాదనుకొని కేసీఆర్ తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
[04:08]‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా డిసెంబరులో ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అర్థరహితం. ప్రభుత్వ వాదనకు హేతుబద్ధత లేదు.
[05:51]సరైన తిండి లేక అనారోగ్యానికి గురై దివ్యాంగుడైన కుమారుడు మృతిచెందాడు.. అతన్ని ఖననం చేయడానికి తండ్రి చేతిలో చిల్లిగవ్వ లేదు.. మృతదేహాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లాడు..
[03:35]మావోయిస్టు పార్టీలో మద్వి హిడ్మా(51) 36 ఏళ్ల ప్రస్థానం ఆద్యంతం సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచింది. దళసభ్యుడిగా చేరి.. దండకారణ్య దళపతిగా ఎదగడం వెనక ఆయన చేసిన భారీ ఆపరేషన్లు కీలకంగా నిలిచాయి.
[03:32]నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేసే పేరుతో ఈపీసీ పద్ధతిలో గుత్తేదారులకు ప్రభుత్వం పనులు అప్పగించింది. కానీ ఏళ్లపాటు పనులు నత్తనడకన సాగుతుండటంతో ఖజనాపై భారీగా భారం పడుతోంది.
[03:24]కార్తిక మాసం సందర్భంగా సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దంపతులు హైదరాబాద్లోని నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేకం నిర్వహించారు.
[03:07]సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ధోరణి వల్ల.. దేశీయంగానూ ఐటీ, లోహ, భారీ యంత్ర పరికరాల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.
[03:06]మోసాలను నిరోధించేందుకు వ్యవస్థలోని అన్ని విభాగాలను అనుసంధానించే ‘నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్’ను ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి సూచించారు.
[03:06]భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతౌల్యంగా ఉంటే ‘మీరు ఒక మంచి వార్త వింటార’ని వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
[03:05]జంతు ఔషధాల విభాగానికి చెందిన సీక్వెంట్ సైంటిఫిక్లో.. బల్క్ ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్స్) ఉత్పత్తి చేసే యాష్ లైఫ్సైన్సెస్ విలీనానికి మార్గం సుగమమైంది.
[03:37]కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు అంతటా ఉండగా.. అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో నెలకొల్పిన 1,800కు పైగా గ్లోబల్ కేపబులిటీ కేంద్రా (జీసీసీ)ల్లో ఏఐ నిపుణులకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని మానవ వనరుల సంస్థ ఎన్ఎల్బీ సర్వీసెస్ తాజా నివేదిక వెల్లడించింది.
[02:19]రేసింగ్.. ఈ పేరు చెప్పగానే వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కార్లే గుర్తొస్తాయి! ఆ రేసులు చూడ్డానికి ఎంతో రోమాంచితంగా ఉంటాయి.. కానీ పోటీపడాలంటేనే ఎంతో ధైర్యం కావాలి. ప్రమాదాలను ఎదుర్కొనే స్థైర్యం ఉండాలి.
[02:20]‘‘ఇప్పటి వరకు మన సినిమాల్లో రాని క్లైమాక్స్ను ‘రాజు వెడ్స్ రాంబాయి’లో చూస్తారు. ఇది కచ్చితంగా ‘ప్రేమిస్తే’, ‘బేబి’, ‘సైరత్’ తరహాలో మంచి కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుంది’’ అన్నారు అఖిల్ రాజ్ - తేజస్విని. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రాన్ని సాయిలు కంపాటి తెరకెక్కించారు.
[02:17]కోల్కతాలో మంగళవారం టీమ్ఇండియా నెట్స్లో ఓ వ్యక్తి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కారణం అతడు రెండు చేతులతోనూ బౌలింగ్ చేయడమే. బెంగాల్ స్పిన్నర్ కౌశిక్ మైతీ చాలాసేపు భారత ఆటగాళ్లకు బంతులేశాడు.
[02:15]ప్రపంచ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది.. మంగళవారం మహిళల 54 కేజీల సెమీఫైనల్లో ప్రీతి 4-0తో ప్రపంచ ఛాంపియన్ హంగ్ హిసావో (చైనీస్ తైపీ)ని కంగుతినిపించి తుది పోరుకు అర్హత సాధించింది.
[02:14]ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. మంగళవారం పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో.
[02:16]‘‘నేను ఎవరిలా పాడలేను.. నాకు నేను నిజాయతీగా ఉండటం వల్లే ప్రేక్షకులు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నా’’ అన్నారు ప్రముఖ గాయని ఉషా ఉతుప్. క్లాసికల్ అయినా.. వెస్ట్రన్ అయినా ఈమె మైక్ పట్టుకున్నారంటే అన్ని వయసుల వారు డ్యాన్స్ చేయాల్సిందే.
[02:14]‘‘నేను ఇప్పటి వరకు వరుసగా మాస్ సినిమాలు చేశాను. కానీ, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చాలా భావోద్వేగభరితమైన సినిమా. నేను ఈ చిత్రానికి ఫీల్ అయినంత ఎమోషన్ను ఇంతవరకు ఏ సినిమాకీ అనుభూతి చెందలేద’’న్నారు హీరో రామ్.
[02:13]డెఫ్లింపిక్స్లో హైదరాబాదీ షూటర్ ధనుష్ శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన అతడు మరో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
[02:12]రైజింగ్ స్టార్స్ ఆసియాకప్లో భారత్-ఎ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గ్రూప్-బిలో తన ఆఖరి మ్యాచ్లో ఆ జట్టు మంగళవారం 6 వికెట్ల తేడాతో ఒమన్పై విజయం సాధించింది.
[02:12]‘‘ప్రేమకథలకు ఎప్పుడూ కాలం చెల్లద’’న్నారు కథానాయకుడు నాగచైతన్య. ఓ సరికొత్త ప్రేమకథతో వస్తున్న ‘ప్రేమంటే’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించారు.
[02:10]ఆసియా ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం ఢాకా నుంచి దిల్లీకి రావాల్సిన విమానం రద్దవడంతో భారత ఆర్చర్లు అవస్థల పాలయ్యారు.
[02:11]నందమూరి బాలకృష్ణ - నయనతారలది వెండితెరపై విజయవంతమైన జోడీ. వీళ్లిద్దరి నుంచి వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ మంచి విజయాలందుకున్నాయి. ఇప్పుడీ ఇద్దరూ జంటగా మరోసారి మురిపించేందుకు సిద్ధమవుతున్నారు.
[02:08]వరల్డ్కప్ ఆఫ్ స్నూకర్లో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ పంకజ్ అడ్వాణీకి షాక్ తగిలింది. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో అతడు 0-4తో పాకిస్థాన్కు చెందిన అస్జాద్ ఇక్బాల్ చేతిలో ఓడిపోయాడు.
[02:08]‘‘ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి చిత్రంతోనూ ఏదోక కొత్త కథ చెప్పే ప్రయత్నమే చేశా. ‘పాంచ్ మినార్’లోనూ అలాంటి ఓ కొత్తదనం ఉంది’’ అన్నారు రాజ్తరుణ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని రామ్ కడుముల తెరకెక్కించారు.
[02:06]‘‘సినిమాపై నమ్మకం ఉంటే భయం ఉండద’’న్నారు కథానాయకుడు అల్లరి నరేశ్. ‘12ఏ రైల్వే కాలనీ’పై ఆ నమ్మకం ఉందని.. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన.. కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ తెరకెక్కించారు.
[02:06]‘తన తల్లి రక్షణతోనే అతని ముఖంలో గర్వం కనిపించిందంటున్నారు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్. ఆయన ప్రధాన పాత్రలో సైనికుడిగా నటిస్తున్న చిత్రం ‘120 బహదూర్’. రెజాంగ్ లా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా రూపొందుతోందీ చిత్రం.
[01:58]‘‘మీరందరూ మీ బాణసంచాతో ఆడుకోవడం ముగించినట్లయితే.. ఇక టపాసుల మోత నేను మొదలుపెడతా’’ అంటున్నారు రణ్వీర్ సింగ్. మరి ఆయన టపాసుల మోతకు కారణమేంటో తెలుసుకోవాలంటే ‘ధురంధర్’ సినిమా చూడాల్సిందే.
[23:03]Arthashala: చిన్న వయసులోనే ఆర్థిక అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్-భటాపారా జిల్లాలోని పండిట్ చక్రపాణి శుక్లా పాఠశాలలో అర్థశాల అనే ల్యాబ్ ఏర్పాటు చేశారు.
[00:08]Bullet Train: బుల్లెట్ రైలు తొలి పరుగు 2027 ఆగస్టులో ఉంటుందని కేంద్రం మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇది సూరత్ నుంచి వాపి మధ్య 100 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుంది.
[20:51]సాధారణంగా ఏ టెస్టు మ్యాచ్లోనైనా లంచ్ బ్రేక్ తర్వాత టీ విరామం ఉంటుంది. కానీ, నవంబర్ 22 నుంచి గువాహటిలో భారత్, సౌతాఫ్రికా (IND vs SA) మధ్య జరగనున్న రెండో టెస్టులో ఇది రివర్స్ కానుంది.
[00:12]Trump gift to Saudi: ట్రంప్ సౌదీకి F-35 యుద్ధ విమానాలను విక్రయించడానికి సిద్ధమయ్యారు. అయితే, ఇజ్రాయెల్ దీనిపై పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. దీని వెనక ఉన్న కారణాలేంటో చూద్దాం..
[18:33]విద్యార్థులు, చిన్నారులు, డీజే దగ్గర డాన్స్ చేస్తున్న యువత, వ్యాయామం చేస్తున్నవారు ఇలా ఎందరో హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటి వరకు నవ్వుతూ కనిపించిన వారు క్షణాల్లో కుప్పకూలుతున్న వైనం చూస్తున్నాం.
[18:19]X Faces Outage: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్ (గతంలో ట్విటర్)’ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫీడ్ చూడలేకపోతున్నామని, పోస్ట్ చేయలేకపోతున్నామని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
[17:49]పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పేరు మార్చి చేపడుతోందని, ఆ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించామని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
[16:46]Eli Lilly- Alzheimer: అల్జీమర్స్ చికిత్సకు సంబంధించి ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా) రూపొందించిన ఔషధానికి జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు మంజూరు చేసింది.
[16:20]Two wheeler ABS: టూవీలర్స్ అన్నింటిలో 2026 జనవరి 1 నాటికి ABSను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. కానీ, కంపెనీలు అందుకు సిద్ధంగా లేకపోవటంతో వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
[15:27]Oppo Find X9 Series: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఫైండ్ X9 సిరీస్లో రెండు ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ X9 5జీ, X9 ప్రో 5జీ పేరిట వీటిని విడుదల చేసింది.
[15:24]Credit Score: క్రెడిట్ స్కోర్ ఎంత బాగున్నా ఒక్కోసారి బ్యాంకులు లోన్ అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తుంటాయి. దీని వెనక ఉన్న కారణాలేంటో తెలుసుకోవాలి.
[13:59]రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ నిర్వహిస్తున్న అతిపెద్ద వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారా. కొన్ని వేల ఎకరాల్లో విస్తరించిన అభయారణ్యంలో 2 వేలకు పైగా జంతువులు ఆవాసం ఉంటున్నాయి. ఈ కేంద్రానికి సంబంధించిన విశేషాలతో ‘వంతారా సాంక్చురీ స్టోరీస్’ పేరుతో ఓ డాక్యమెంటరీ సిద్ధమైంది.
[13:54]రెండో టెస్ట్లో ఒకవేళ గిల్ ఆడకుంటే అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్కు (Ruturaj Gaikwad) అవకాశం కల్పించాలని టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడుతున్నాడు.
[13:32]అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర లడ్డా తెలిపారు.
[13:19]తాను, తన సోదరిలా తమ తల్లిదండ్రులు కూడా మానసిక వేధింపులకు గురవుతున్నారని.. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని లాలూప్రసాద్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
[12:57]కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ శుభ్మన్ గిల్ (Shubman Gill) గాయపడిన విషయం తెలిసిందే. అతడు రెండో టెస్ట్ మ్యాచ్లోనూ ఆడేది అనుమానంగానే ఉంది.
[11:51]కేంద్ర, రాష్ట్ర తప్పుడు విధానాలు, సీసీఐ తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
[11:35]కోల్కతా టెస్ట్ మ్యాచ్ ఓటమితో టీమ్ఇండియా ఉలిక్కిపడింది. విజయానికి చేరువగా వచ్చి చతికిలపడింది. స్వదేశంలో సింహనాదం చేసే భారతజట్టు.. సఫారీల చేతిలో ఓటమి పాలైంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్లో ఫైనల్కు అర్హత సాధించాలంటే.. ఇకపై టీమ్ఇండియాకు ప్రతి మ్యాచూ కీలకమే.
[11:05]అది 1963 జనవరి 27.. దిల్లీలోని నేషనల్ స్టేడియంలో ‘ఏ మేరీ వతన్కే లోగోన్’ అంటూ పాడిన లతా మంగేష్కర్ ఆర్ధ్రత నిండిన స్వరంతో.. అక్కడ ఉన్న ప్రతీఒక్కరి కళ్లూ చెమర్చాయి.
[10:35]భారతీయులకు వీసా రహిత ప్రవేశాలను ఇరాన్ నిషేధించడంతో ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది.
[10:23]ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఓటీటీలో ఆసక్తికర సినిమాలు, సిరీస్లు రెడీ అవుతున్నాయి. ఎప్పుడు ఏ చిత్రం రాబోతోందో మీరే చూసేయండి.
[09:42]కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ జరిగింది. ఈ మ్యాచ్లో 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత జట్టు 93 రన్స్ వద్దే చతికిల పడింది. దీంతో సఫారీల జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు.
[08:58]కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్ పిచ్పై ఆరోపణలు వస్తున్న వేళ క్యురేటర్ సుజన్ ముఖర్జీ స్పందించాడు. తనకు చెప్పినట్లుగానే తాను పిచ్ తయారుచేసి ఇచ్చానని వివరించాడు. ఇందుకోసం తాను పూర్తి అంకితభావంతో పనిచేశా అన్నాడు. అందరికీ అన్నీ తెలియవని ఆయన పేర్కొన్నాడు.
[07:22]కాకతీయులు నిర్మించిన ఆలయాలంటే వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం గుర్తుకువస్తాయి. ఆ కాలంలో కట్టిన.. నిర్మాణం, శిల్పకళపరంగా ఆస్థాయి ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది ఖమ్మం జిల్లా కూసుమంచిలోని చారిత్రక గణపేశ్వరాలయం.