‘ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదు.. అంతా మరిచిపోయా.. రికార్డులు చూస్తేనే ఏ విషయమైనా చెప్పగలను. అంతకుమించి నేనేం చెప్పలేను..’ ఇదీ పోలీసు విచారణలో గుంటూరు జీజీహెచ్ విశ్రాంత పర్యవేక్షణాధికారి డాక్టర్ నీలం ప్రభావతి స్పందించిన తీరు.
రాష్ట్రంలో 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో జీఎస్డీపీలో 13.49 శాతం అనూహ్య వృద్ధి నమోదు చేసి, రూ.8.74 లక్షల కోట్లకు తీసుకెళ్లామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలోనూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ)లో కనీసం 100 నుంచి 300 పడకలతో మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
‘కూటమికి మన్యంలో ఓట్లు రాలేదు. మాకు తన, మన భేదం లేదు. ఎవరు ఏ పార్టీ వారైనా అభివృద్ధికి అడ్డంకి కాకూడదని అనుకున్నాం. మీరు ఓటు వేయకపోయినా మీ ప్రాంతంలో రూ.వెయ్యి కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించవద్దని.. 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు.
ఆక్వా ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాల భారాన్ని రైతుపైకి నెట్టకుండా.. వ్యాపారులు, ఫీడ్మిల్లులు, హేచరీలు బాధ్యత తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చాయి.