వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే పసికందు చనిపోయిందని.. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకున్నా ఆ మంత్రుల మనసు కరగలేదు. భారీ జన సమూహంలో అతికష్టం మీద బిడ్డ మృతదేహాన్ని చూపిస్తూ అభ్యర్థిస్తున్నా రోడ్�
నగరానికి కృష్ణాజలాలను సరఫరా చేసేందుకు ముడినీటిని సేకరించే నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)లోని సిస్టర్న్ (చిన్న రిజర్వాయర్) వద్ద లీకేజీలు పెరగడంతో మరమ్మతులు చేపట్టా�
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగమార్గం తవ్వకం పనులను మన్నెవారిపల్లి వైపు నుంచి చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నల్గొండ జిల్లాకు తాగు, సాగు నీటిని అందించాలనే లక్ష్యంతో మొత్తం 43.931 కిలోమీటర్ల పొడవు సొరంగమార్గం పనులు చేపట్టేందుకు 2005లో పనులను ప్రారంభించారు.
వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్లో నిర్వహించబోతున్న బహిరంగసభకు రేవంత్ రెడ్డి సర్కారు ఆర్థిక సహకారం అందిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, భారాస ఎందుకు పోటీ చేయడంలేదో ఆ పార్టీలు ప్రజలకు చెప్పాలని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం కొడంగల్లోని అప్పాయిపల్లి రైతులు రెండో రోజు శుక్రవారం కూడా ఆందోళన చేపట్టారు. గురువారం భూమిని చదును చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు శు�
సమాజంలో తలెత్తే అన్ని రకాల వివాదాలను సామరస్యంగా పరిష్కరించి మనుషుల మధ్య బంధాలను బలోపేతం చేసేందుకు కమ్యూనిటీ పెద్దలు బాగా పనిచేయగలరని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారంలో వెనకబడ్డామని, క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరిగి అందరికీ చెప్పాలని తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు.
రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల�
మహిళా స్వయం సహాయక సంఘాలతో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించే విషయమై అనిశ్చితి నెలకొంది. సంఘాలకు భూములు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
ప్రాంతీయ వలయ రహదారి(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం పనుల బిడ్లను తెరవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు టెండర్ల గడువును దశలవారీగా పొడిగించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్లాంటి నగరాలకే పరిమితం కాకుండా... అధికారులు ప్రతి జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల వద్దకు నేరుగా వెళ్లాలని, శాంపిళ్లను సేకరించి అక్కడికక్కడే పరీక్షించి... కల్తీ జరిగితే తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
కాంగ్రెస్ 16 నెలల పాలనలో కరువు ఏర్పడిందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశ�
అత్యవసర సమయంలో ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ఉస్మానియా వైద్యులను సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన హేమంత్(22) శిర్డీ వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో గత నెల 29న హైదరాబాద్కు చేరుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మావోయిస్టులు కాల్పుల విరమణ పాటించాలని, ఆదివాసీల భాగస్వామ్యంలో శాంతి చర్చల ద్వారా బస్తర్ను కాపాడాలని వక్తలు డిమాండ్ చేశారు.
ఉదయాన్నే మీరు టాయ్లెట్లో ఎంతసేపు ఉంటున్నారు... కమోడ్పై కూర్చుని చాలాసేపు గడిపేస్తున్నారా... దానివల్ల తీవ్ర సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు.
తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలకు మెరుగైన రాకపోకలకు, ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా కాజీపేట- బల్లార్షా మధ్య చేపట్టిన రైల్వే మూడోలైను ఏర్పాటులో వంతెన నిర్మాణాలు ప్రధాన ఆటంకాలుగా మారాయి.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం అల్లిగూడెం అటవీ గ్రామం. ఇటీవల తెల్లవారుజాము సమయంలో గ్రామంలోని ఓ గర్భణికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు.
రేపటి తెలంగాణ కోసం మహిళా నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మహిళల్లో నాయకత్వ పటిమను పెంపొందించి.. తెలంగాణ భవిష్యత్తు తరాలు సుభిక్షంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకు
గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేల మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలో పడ్డాయని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు.
గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని సీఎం రేవంత్రెడ్డిని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
తుంగభద్ర డ్యాంకు సంబంధించి వచ్చే సీజన్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ సాధ్యం కాదని.. ఒక పంటకే సాగునీరు ఇవ్వగలరని ప్రాజెక్టుల మెకానికల్ నిపుణులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు వెల్లడించారు.
జాతీయ ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం వేతనాన్ని రోజుకు రూ.300కి పెంచినా తెలంగాణలో 2024-25లో సగటున రూ.213 మాత్రమే లభించిందని ‘లిబ్టెక్ ఇండియా’ అధ్యయనం వెల్లడించింది.
రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలు ‘డీమ్డ్ టు బి వర్సిటీ’లుగా అనుమతించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని తాజాగా కోరిన నేపథ్యంలో ఆ వర్సిటీలకు అనుమతి ఇవ్వొద్దని కాళోజీ వర్సిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ యూజీసీకి లేఖ రాసినట్లు తెలిసింది.