పిట్ట కొంచెం కూత ఘనం. చిన్న పిల్లల్లో ఉన్న అసామాన్య ప్రతిభను వర్ణించేందుకు ఈ సామెత ఉపయోగిస్తుంటాం. అది ఇప్పుడు తెలుసుకోబోయే బుడ్డోడికి సరిగ్గా సరిపోతుంది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఊపందుకుంటున్న వేళ తెలంగాణకు రసాయన ఎరువులు సరఫరా చేయాలని కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిషన్రెడ్డి, బండి సంజయ్కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాశారు.
జూన్లో శ్రీవారిని భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు. నూతనంగా తీసుకొచ్చిన క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ఎంత మంది వచ్చినా.. అత్యంత కచ్చితత్వంతో వేగంగా దర్శనాలకు వెళ్లే అవకాశం కలిగింది.
వన్యప్రాణులు, పర్యావరణ భద్రత, అటవీ సంరక్షణ చట్టం సవరణ బిల్లు (ఎఫ్సీఏఏ)-2023కు సంబంధించి నమోదైన కేసుల్లో కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సలహాలను అనుమతించవద్దని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్కు 60 మంది మాజీ అధికారులు లేఖ రాశారు.
ఉత్సాహం ఉరకలెత్తే వయసు.. కానీ ఎందుకో ఎక్కడలేని చికాకు.. ప్రతి క్షణం సంతోషంగా సాగిపోవాల్సిన సమయం.. కానీ ఆనందమంతా ఆవిరైన భావన.. కొండల్ని పిండిచేసే యవ్వనం.. కానీ శరీరాన్ని ఆవహించిన నిస్సత్తువ.. నేటి యువతలో కనిపిస్తోన్న లక్షణాలివి!
వందలకొద్దీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... ఏడాదిన్నర పాలనలో అనేక అంశాల్లో ప్రజల్ని మోసం చేసిందని, తన పరిపాలన వైఫల్యాల్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు విమర్శించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో వల్లె వేసిన అబద్ధాలనే మళ్లీ ప్రచారం చేస్తున్నారని భారాస సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు.
సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అప్రమత్తమైంది. గ్యాస్, రసాయనాలు, వాయువుల లీకేజీలను గుర్తించి, సరిచేసే పరీక్షలను ఆరు నెలలకోసారి చేయాలని అన్ని పరిశ్రమలను మంగళవారం ఆదేశించింది.
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో బూత్ స్థాయి అధికారుల(బీఎల్వోల) వ్యవస్థ ప్రక్షాళనకు జిల్లా ఎన్నికల అధికారి అయిన జీహెచ్ఎంసీ కమిషనర్ నడుం బిగించారు. అందులో భాగంగా బీఎల్వోలుగా పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు.
కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి బీఎస్సీ (ఉద్యాన, అటవీ), ఎమ్మెస్సీ (ఉద్యాన) కోర్సుల్లో మొత్తం 13 బంగారు పతకాలకు గానూ.. విద్యార్థినులు 12 పతకాలను కైవసం చేసుకున్నారు.
భూముల సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత భూయజమానులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారులు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్- 2047’ లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు..విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.
తెలంగాణలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(వ్యవసాయ, ఉద్యాన), బీవీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు.
తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించగా.. వాటిని ఏ అవసరాలకు ఖర్చు చేస్తారు..? న్యాక్ గ్రేడ్ ఎలా పెరుగుతుంది..? అని సాంకేతిక విద్యాశాఖ.. వర్సిటీలను అడుగుతోంది.
రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలపై విధించిన జరిమానాల చెల్లింపునకు ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)కు మైనింగ్ లీజుదారుల నుంచి స్పందన కొరవడుతోంది.
రాష్ట్ర మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ప్రధాన అధికారి హరిసింగ్కు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్(భారాస) ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు కరీంనగర్ జిల్లా విద్యావిభాగం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు ఆశించిన స్థాయిలో లేదని, మొక్కల పెంపకం మందకొడిగా కనిపిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేసీఆర్, జగన్ల మధ్య జరిగిన చర్చల అనంతరమే గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నిర్ణయం జరిగిందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
పదేళ్ల భారాస పరిపాలనలో.. నదీజలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, రాష్ట్రానికి కేసీఆర్ దగా చేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు అధికారమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తానని భాజపా రాష్ట్ర నూతన సారథి ఎన్.రామచందర్రావు అన్నారు. విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశానన్నారు.
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ధాటికి మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, కర్మాగారం యాజమాన్యం సమన్వయంతో రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో భూదాన్ భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టరాదన్న ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రతివాదులైన ఐఏఎస్, ఐపీఎస్, వారి బంధువులు, ఇతర ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన నిర్మాణాలపై నివేదిక సమర్పించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జూరాల జలాశయం దిగువన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవల జూరాల గేట్ల సమస్యపై పరిశీలనకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి స్థానిక నాయకులు సమస్యను వివరించడంతో వంతెన మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ మొద్దునిద్రను లేపింది, ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరగని పోరాటం చేసింది.. భారాసనేనని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
హైదరాబాద్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో కన్నుమూశారు. ప్రముఖ ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్ ప్రసిద్ధి. కాకినాడలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న రోజుల్లోనే ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఈ విద్యను నేర్చుకున్నారు. 1970 దశకం నాటికి స్వతంత్రంగా రెండు మూడు గంటలపాటు ప్రేక్షకులను కదలనీయకుండా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి ఎదిగారాయన. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన ప్రదర్శనల ద్వారా తన ప్రత్యేకతను చాటి ప్రజల హృదయాల్లో నిలిచిన పట్టాభిరామ్ అపురూప చిత్రాలు కొన్ని మీకోసం!
తెలంగాణలో భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తుపై సమగ్ర పరిశీలన ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు.
పోలవరం-బనకచర్లపై కేంద్రానికి మన అభ్యంతరాలను తెలిపామని తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమని వాదించామన్నారు.