[02:56] సిమెంటు పరిశ్రమ భారీ విస్తరణ బాటలో సాగుతోంది. కొన్ని సంస్థలు కొత్త యూనిట్లు స్థాపిస్తుండగా, మరికొన్ని సంస్థలు ఇప్పటికే ఉన్న యూనిట్లలో సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి. దీని కోసం కంపెనీలు దాదాపు రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుండగా,...
[02:54] సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు లాభపడ్డాయి. బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి విజయం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం సెంటిమెంట్ను బలోపేతం చేసింది.
[02:45] టాటా గ్రూప్లో అంతర్గత పదవీ వ్యవహారాలు ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. గతేడాది అక్టోబరులో రతన్ టాటా మృతి అనంతరం, కీలకమైన టాటా ట్రస్ట్స్ పగ్గాలు చేపట్టిన నోయల్ టాటాకు, కొందరు ట్రస్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లు ఉంది.
[02:47] అంతర్జాతీయ కంపెనీల గ్లోబల్ కేపబులిటీ కేంద్రాల (జీసీసీ)కు కేంద్రంగా మారుతున్న భారత్లో 2030 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 28-40 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని టీమ్లీజ్ సంస్థ తాజా నివేదికలో అంచనా వేసింది. ప్రతి 5 కొత్త ఉద్యోగాల్లో ఒకటి తాజా ఉత్తీర్ణులకే లభిస్తాయని తెలిపింది.
[02:43] ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి, వినియోగ దేశమైన భారత్.. వచ్చే దశాబ్దంలో చమురు గిరాకీ వృద్ధికి సరికొత్త చోదకంగా మారనుంది. వర్ధమాన దేశాల్లో, భారత్లోనే ఇంధనానికి వేగవంత వృద్ధి కనిపించనుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది.
[02:41] అమెరికా విధించిన అధిక టారిఫ్ల ప్రభావాన్ని భారతీయ ఎగుమతిదార్లు తట్టుకునే నిమిత్తం రూ.45,000 కోట్ల విలువైన రెండు పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఎమ్ఎస్ఎమ్ఈలు, తొలిసారి ఎగుమతి చేసేవారు,..
[02:40] మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఉన్నతాధికారులకు సంబంధించి, పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయంలో మరింత పారదర్శకత తీసుకురానున్నారు. ఇందుకోసం విస్తృత స్థాయి సంస్కరణలను సెబీ ప్యానెల్ ప్రతిపాదించి, తమ నివేదికను సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండేకు అందజేసింది.
[02:38] అగ్రశ్రేణి ఔషధ కంపెనీ లుపిన్ లిమిటెడ్కు అనుబంధ సంస్థ అయిన లుపిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో క్యాన్సర్ మందులు ఉత్పత్తి చేసే యూనిట్ను ప్రారంభించింది.
[02:32] అంకుర సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల నుంచి రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు, జన్సమర్థ్ పోర్టల్లో ప్రత్యేక సౌలభ్యాన్ని ఆర్థిక శాఖ అందుబాటులోకి తెచ్చింది. స్టార్టప్ కామన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్గా వ్యవహరించే దీనిని పీఎస్బీల సమీక్షా సమావేశంలో ప్రారంభించారు.
[02:31] గిరిజనులు తయారు చేసే వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించే ప్రణాళికపై తమ మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని వాణిజ్య, పరిశ్రమల శాఖ పీయూశ్ గోయల్ తెలిపారు. ఇ-కామర్స్ / అంతర్జాతీయ గిడ్డంగుల్లో ఆయా ఉత్పత్తుల ప్రదర్శన ద్వారా ప్రోత్సాహం కల్పిస్తామన్నారు.
[02:31] ఈ ఏడాది అక్టోబరులో రిటెయిల్ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ఠమైన 0.25 శాతంగా నమోదైంది. జీఎస్టీ రేట్ల కోతతో పాటు కూరగాయలు, పండ్ల ధరలు తగ్గడం ఇందుకు కారణం.
[02:29] బొగ్గును గ్యాస్గా మార్చే (గ్యాసిఫికేషన్) వ్యాపారంలోకి అడుగుపెట్టే యోచనలో ప్రభుత్వరంగ ఇంధన దిగ్గజ సంస్థ ఎన్టీపీసీ ఉన్నట్లు తెలుస్తోంది. సింథటిక్ గ్యాస్గా పేర్కొనే దీన్ని, రాబోయే 3-4 ఏళ్లలో ఏటా 5-10 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
[02:28] సౌర విద్యుత్, టెలికాం, రైల్వే విభాగాల్లో మౌలిక వసతులు కల్పించే బొండాడా ఇంజినీరింగ్.. మహారాష్ట్రలోని హింగోలి, ధులే, సంభాజీనగర్, జుల్గావ్ ప్రాంతాల్లోని పారడైమ్ ఐటీ, మహాజెన్కో కోసం 56.9 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపింది.
[02:27] ఏషియన్ పెయింట్స్, జులై- సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,018.23 కోట్ల ఏకీకృత నికర లాభం ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.693.66 కోట్ల కంటే ఇది 46.8% అధికం. విక్రయాల ద్వారా ఆదాయం రూ.8,003.02 కోట్ల నుంచి 6.38% పెరిగి రూ.8,513.70 కోట్లకు చేరింది.
[20:15] Smartphone market share: దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల హవా కొనసాగుతోంది. ఆ దేశానికి చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో మార్కెట్ వాటా పరంగా అగ్రస్థానంలో నిలిచింది.
[16:39] Weight loss drug: బరువు తగ్గించేందుకు ఉపయోగించే వెగోవీ ఔషధ ధరను దేశంలో తగ్గిస్తున్నట్లు డెన్మార్క్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం నోవో నార్డిస్క్ ప్రకటించింది.
[16:02] Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికాతో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న అంచనాలతో సెంటిమెంట్ బలపడింది.
iPhone Pocket: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఓ వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. అయితే ఈసారి ఐఫోన్ కాదు. ఐఫోన్ క్యారీ చేసేందుకు ఒక పాకెట్ను తీసుకొచ్చింది.