చనిపోయిన ఏనుగు కడుపులోంచి తీసేకొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తూనే ఉన్నాయి. వాటిని చూసి పశువైద్యులు నిర్ఘాంతపోయారు. కుళ్లిన అవయవాలు చూసి వారి గుండె తరుక్కుపోయింది.
అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దక్షిణ రైల్వేలో పునరాభివృద్ధి పనులు జరిగిన 13 స్టేషన్లను రాజస్థాన్లోని బికనీర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీసీ ద్వారా ప్రారంభించారు. దక్షిణ రైల్వేలో జరిగిన కార్యక్రమానికి రైల్ యూజర్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు, ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
రాష్ట్రంలో తెలుగు సహా ఇతర భాషలు మాట్లాడే ప్రజలే మైనారిటీలని నామ్ తమిళర్ కట్చి ప్రధాన సమన్వయకర్త సీమాన్ తెలిపారు. రాజాజీ రోడ్డులోని నావికాదళ సిబ్బంది సంక్షేమ కేంద్రం ప్రాంగణంలో జరిగిన ‘వళక్కాడువోం వారుంగళ్’ సదస్సులో ప్రత్యేక ఆహ్వానితులుగా సీమాన్ పాల్గొన్నారు.
తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కర్ణాటక వాసులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన 12మంది ఒకే వ్యాన్లో తమిళనాడులోని వేలాంగణ్ణికి పర్యాటకానికి బయలుదేరారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పేరు వింటేనే డీఎంకే వారికి నిద్ర పట్టడంలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ తెలిపారు. పార్టీ మీడియా విభాగ రాష్ట్ర, జిల్లా నిర్వాహకుల సమావేశం చెన్నైలో బుధవారం సాయంత్రం జరిగింది.
రాష్ట్రంలో ఎవరైనా రూ.100 ఉంటే పోస్టర్లు అంటించవచ్చని మంత్రి కేఎన్ నెహ్రూ అన్నారు. తిరుచ్చి కలైజ్ఞర్ అరివాలయంలో పార్టీ నిర్వాహకులతో గురువారం సమావేశం జరిగింది. కేఎన్ నెహ్రూతో పాటు మరో మంత్రి అన్బిల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నై నగరంలో మెట్రో రెండో దశ పనులు మూడు వేర్వేరు మార్గాల్లో జరుగుతున్నాయి. ముందుగా రెండో దశలోని నాలుగో మార్గం పూనమల్లి నుంచి లైట్హౌస్ వరకు రానున్న మార్గంలో పోరూరు వరకు ఈ ఏడాది చివరికల్లా సేవలందించాలనే లక్ష్యంతో పనులు జోరందుకున్నాయి.
పెరంబలూర్ సమీప అణుక్కూర్ కుడిక్కాడు గ్రామానికి చెందిన వినోద్, శివప్రియ దంపతులు. భర్త విదేశాల్లో పని చేస్తుండగా శివప్రియ 3 ఏళ్ల కుమార్తె తన్వికాతో కలిసి నివసిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ప్రకాష్ (35), అంకమ్మ భార్యాభర్తలు. వీరికి కుమారుడు వెంకటేష్(9) ఉన్నాడు. ప్రకాష్ దంపతులు అదే ప్రాంతానికి చెందిన బాతులు మేపుతున్న ముత్తు దంపతుల వద్ద రూ.15 వేలు అప్పుగా తీసుకున్నారు.
రాష్ట్రంలో నాలుగు జిల్లాలో జరిపిన క్యాన్సర్ పరీక్షల్లో 361 మందిలో వ్యాధి నిర్ధారణ అయింది. 70,849 మందిలో ప్రారంభ లక్షణాలు గుర్తించారు. రాష్ట్రంలో క్యాన్సర్ను ప్రారంభంలో గుర్తించి చికిత్స అందించేందుకు క్యాన్సర్ పరీక్షల పథకాన్ని 2023లో ప్రభుత్వం ప్రారంభించింది.