ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు నూతనంగా ఏర్పాటు చేసిన 342వ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే అటు కడప, ఇటు శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు ఎన్హెచ్ 342 రహదారి కీలకంగా మారనుంది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో చెత్త పన్ను విధించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా ముక్కుపిండి వసూలు చేయాలని ధర్మవరం మున్సిపాలిటీ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
అనంత నగరంలోని కేఎస్ఎన్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలకు స్వయంప్రతిపత్తి (అటానమస్) హోదా దక్కింది. యూజీసీ కార్యదర్శి అజయ్కుమార్జోషి, ఉప కార్యదర్శి గోపీచంద్ మీరుగు గత నెల 31న ఎస్కేయూ రిజిస్ట్రార్కు ఉత్తర్వులు పంపారు.
జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని డి.హీరేహాళ్ మండలంలో 69.8 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది.
భిక్షాటకులకు, అనాథలకు తిండి పెట్టలేదు కానీ నాయకులు, అధికారులు మాత్రం బిల్లుపెట్టారు. పట్టెడు మెతుకులను ఏనాడూ పెట్టకుండా ఏడు నెలల్లో తాము గుత్తిలోని పట్టణ నిరాశ్రయుల వసతిగృహంలో రోజూ 70 మంది వృద్ధులు, అనాథలకు భోజనం పెట్టామని బుకాయిస్తున్నారు.
విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. గొంతు తడుపుకొనేందుకు ప్రజలు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.
జిల్లాలో భూముల ధరలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ భారీగా పెంచేసింది. అనంతపురం సమీపంలో అత్యధికంగా 400 శాతం పెంచి పడేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో 30 నుంచి 100 శాతం వరకు ధరలు పెంచారు. పట్టణాల పరిధిలో 30 నుంచి 40 శాతం పెంచారు. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరకు సమానంగా రేట్లను నిర్ణయించారు.
కర్ణాటకలో అప్పర్భద్ర ప్రాజెక్టు అక్రమ నిర్మాణంపై పోరాడుతామని, ఏపీ రైతు ప్రయోజనాల దృష్ట్యా వెనక్కు తగ్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.
జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ఉగ్ర రూపానికి జనం విలవిల లాడుతున్నారు. రెండు నెలలుగా ఎంతోమంది వడదెబ్బ బారిన పడ్డారు.
డీఆర్డీఏలో దొంగలు పడ్డారు. మహిళా సంఘాల సొమ్ముకు ఎసరు పెట్టారు. అక్కచెల్లెమ్మల శ్రమను దోచుకున్నారు. ఏకంగా రూ.30 కోట్లకుపైగా పొదుపు నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది
నిర్మాత కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ‘ఐ క్యూ’ సినిమా మంచి సందేశాత్మకంగా ఉందని సినీనటుడు సుమన అన్నారు. ఐ క్యూ సినిమా విడుదల సందర్భంగా నగరంలోని శాంతి థియేటర్లో శుక్రవారం సినిమాను ప్రదర్శించారు.
జిల్లా స్థాయి ట్రాక్టర్స్ మెగా మేళాలో వ్యవసాయ శాఖ అధికారులు షో చేశారు. 2022-23లో వైఎస్సార్ యంత్రసేవ పథకం కింద సీహెచసీ ద్వారా రైతు బృందాలకు ట్రాక్టర్లు, ట్రాక్టర్ పరికరాలు మంజూరు చేశారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గాల పరిశీకులు, రాష్ట్ర నాయకులతో సమావేశం జరిగింది
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ తమ్ముడు అధికారులతో కుమ్మకై ్క టెండర్లు వేస్తాడు. అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత పనులు చేయకుండా వదిలేస్తాడు. అందుకే అతన్ని బ్లాక్...
హిందూపురానికి చెందిన శ్రీరాములు వెన్నెముక సమస్యతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. కలుషిత నీరు తాగడం కారణంగా సమస్య తలెత్తినట్లు డాక్టర్లు...
కళ్యాణదుర్గం: సచివాలయ సేవలు ప్రజలందరికీ అందించాలని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ సూచించారు. కళ్యాణదుర్గం మండలం నారాయణపురం...
ఇళ్లు లేని పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలసి బైఠాయించారు.
ఇటీవల జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడం సహజంగా మారుతోంది. మండలవ్యాప్తంగా కొండలు, గుట్టలు అధికంగా ఉన్నాయి. వన్యప్రాణులకు అక్కడ రక్షణ కరువైంది. నెమళ్లు, జింకలు ఆహారం, నీరు లేకపోవడంతో గ్రామాలబాట పడుతున్నాయి.
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును విమర్శించే స్థాయి బొమ్మనహాళ్ వైసీపీ నాయకులకు లేదని తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండాపురం కేశవరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ బలరామిరెడ్డి పేర్కొన్నారు.
భారతజాతి స్ఫూర్తి ప్రదాత శివాజీ అని పలువురు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ పామిడి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శివాజీ పట్టాభిషేక మహోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతపురం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇవాళ ఘనంగా చేసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్ట దినోత్సవం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
వేసవిలో రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను యాత్రలకు పంపాలన్న రైల్వే బోర్డు నిబంధనలు గుంతకల్లు రైల్వే డివిజన్లో గత ఎనిమిది సంవత్సరాలుగా అమలు కావడంలేదు.
తహసీల్దార్ల బదిలీల్లో అధికార వైకాపా రాజకీయ సిఫార్సులకే పెద్దపీట వేసినట్లు స్పష్టమైంది. తమకు అనుకూలంగా ఉన్న వారిని కదిలించలేదు. చెప్పిన మాట వినని వారిపై బదిలీ వేటు వేయించారు.
ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ధర్మవరం పట్టణానికి చెందిన ఆరు వేల మందికి ఒకటిన్నర సెంటు ప్రకారం పట్టణ సమీపాన ఉన్న పోతులనాగేపల్లి వద్ద స్థలాలు ఇచ్చారు. ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉన్నాయి.
జయమంగళి నదిలో అనుమతులు ఇవ్వని సర్వే నంబర్లలో కాంట్రాక్టు సంస్థ ప్రవేశించి అడ్డుగోలుగా ఇసుకను తోడేస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రీచ్ నుంచి ఇసుక తరలించాలనే నిబంధన ఉన్నా.. 24 గంటల పాటు నిరంతరాయంగా తరలిస్తున్నారు.
సాంఘిక సంక్షేమశాఖలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకే దిక్కులేదు[. నెలలు గడుస్తున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఓవైపు నియామక ఉత్తర్వులు ఇవ్వరు.. మరోవైపు గతంలో పనిచేసిన సమయానికి వేతనాలు ఇవ్వకపోగా తాజాగా పనిచేసిన వారికీ వేతనాలు ఇవ్వలేదు.
ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ప్రజలు ఆరోగ్యంతో పాటు రాగులు, జొన్నలు పండించే రైతులను ప్రోత్సహించి పంట ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్కుమార్ పేర్కొన్నారు.
జర్మనీలోని బెర్లిన్లో జరగనున్న వేసవి ప్రత్యేక ఒలింపిక్స్కు ఆర్డీటీ దివ్యాంగులు నలుగురు ఎంపికయ్యారు. ఆర్డీటీ పాఠశాలలో చదువుతున్న వీరు వివిధ అంశాల్లో ప్రత్యేక ఒలింపిక్స్కు అర్హత సాధించారు.