బుక్కరాయసముద్రం, నార్పల మేజర్ పంచాయతీల్లోని ఖాళీ స్థలాలను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. అరికట్టాల్సిన పంచాయతీ, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు.
పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు పదిరోజుల పాటు వైభవంగా నిర్వహించారు. దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వారితోపాటు దేశ, విదేశాల నుంచి దాదాపు 8.50 లక్షల మంది వేడుకల్లో పాల్గొన్నారు.
పీఏబీఆర్ కుడి కాలువ గేట్ల (షట్టర్లు) మరమ్మతు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ గేట్ల మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా రూ.29 లక్షలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
‘కొందరు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతలేని తనంతో అర్జీల పరిష్కారంలో నాణ్యత కొరవడింది. బాధితుల నుంచి అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తోంది. ఇక నుంచి ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు.
పసిబిడ్డ మృతి చెందిన యాభై రోజుల తర్వాత శిశుగృహ ఘటన బాధ్యులపై జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. కేంద్రంలో పని చేస్తున్న మొత్తం ఏడుగురిని తొలగిస్తూ కలెక్టర్ ఆనంద్ సోమవారం.
జిల్లాలోనే పెద్ద చెరువుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పరిగి చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.1.80కోట్లు కేటాయించింది. ఆ నిధులతో పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలోని పంపనూరు హంద్రీనీవా కాలువలో సోమవారం చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మండలం పీటీఆర్ పల్లికి చెందిన రామాంజనేయులు మండలం వై.కొత్తపల్లిలో నివాసం ఉంటున్నాడు.
అనంతపురం నగరంలో సాయినగర్ మూడో క్రాస్లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై దాడి చేసిన ఘటనలో రెండో పట్టణ పోలీసులు ఏడుగురిని సోమవారం అరెస్టు చేశారు.
మండలం లోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో వెలసిన శ్రీమద్దానేశ్వ రస్వామి దేవాలయంలో సోమవారం మార్గశిర మాసంలో ల క్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
ఇప్పటికే అయ్యప్ప మాల ధారణ అన్నిచోట్ల ప్రారంభమైంది. అయ్యప్ప మాలధారులు దీక్షలో ఉన్న రోజుల్లో నిత్యాన్నదానం అందించి ఆదర్శంగా నిలుస్తోంది ముదిగుబ్బ శ్రీపంచగిరీశ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ. గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోం ది.
తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన వంతుగా సొంత నిధులు రూ. 70వేలతో పూర్వ విద్యార్థి, జనసేన మండల కార్యదర్శి కొండబోయన సతీష్ డయాస్ నిర్మాణ పనులను చేపట్టారు.
రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ధర్మవరం రూరల్, కదిరి, కొత్తచెరువు, అమడగూరు, గాండ్లపెంట, నంబులపూలకుంట, ఓబుళదేవర చెరువు, నల్లమాడ మండలాల్లో వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు సోమవారం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సత్యసాయిబాబా సేవలు మరువలేనివని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని యాదవవీధిలో సత్యసాయిబాబా శతజయంతి సందర్బంగా జనసేన పార్టీ నాయకుడు రాజు ఆధ్వర్యంలో చీరల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని సోమవారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్ర మాలకు ముఖ్యఅతిఽథులుగా జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చేనేతప్రముఖులు, టీడీపీ నాయకులు సంధా రాఘవ హాజరయ్యారు.
కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన పరిగి చెరువును కొందరు ఆక్రమించుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ వ్యాపారులు చెరువును చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హిందూపురం కార్యాలయానికి చెందిన పలుశాఖల అధికారులతో ప్రజాదర్బార్ నిర్వహించారు.