మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, సాధికారత సాధన కోసం ఎన్డీయే ప్రభుత్వం గుంతకల్లులోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలో గుంతకల్లుతోపాటు శృంగవరపుకోటలోని కళాశాలలను పీఎం ఉష పథకం కింద ఎంపిక చేసి అమలు చేయడం ప్రారంభించింది.
ప్రసిద్ధ పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఏటా లక్ష మంది వరకు భక్తులు దర్శించుకుంటుంటారు. వారిలో ఏడాది కాలంలో దాదాపు 20 వేల మంది వరకు తలనీలాలు సమర్పిస్తుంటారు.
ధికారుల్లో ముందుచూపు కొరవడింది. కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. వారి నిర్వాకం.. నిర్లక్ష్యం మూలంగా ఒకే రోజులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో కీలకమైన హెచ్ఎల్సీ ప్రధాన కాలువ, పీఏబీఆర్ కుడి కాలువ గట్లు తెగిపోయాయి.
పట్టణంలోని కోటవీధికి చెందిన మఠం కుమారస్వామి అయ్యప్ప దీక్షతో 11 ఏళ్లుగా ప్రతిఏటా సైకిల్పై శబరిమలకు వెళ్లి వస్తున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువులు, అయ్యప్ప స్వాములు కుమార స్వామిని రాయదుర్గం నుంచి శబరిమలకు సాగనంపారు.
మండలపరిధిలోని కోటపల్లి గ్రామ సచివాలయం వద్ద సమాచార హక్కు చట్టం బోర్టును అఽధికారులు ఏర్పాటు చేశారు. అందులో ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన అధికారుల పేర్లు, బదిలీ అయిన అధికారుల పేర్లే ఇప్పటికీ కనిపిస్తు న్నాయి. ఏడాది కాలంగా పేర్లను మార్చకపోవడాన్ని చూసి పలువురు ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే ఇజ్తమా ఏర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆది వారం పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కదిరిలోని బైపాస్ రోడ్డులో ముస్లింలు ఇజ్తమా నిర్వహిస్తున్నారు. అందుకు కావలసిన మైదానం, ఏర్పాట్లును ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు.
పట్టణంలోని కేశవనగర్లో వెల సిన అయ్యప్పస్వామి ఆలయ గురుస్వామి, అయ్యప్ప మాలధారుల ఆధ్వ ర్యంలో ఆదివారం స్వామి గ్రామోత్పవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూల విరాట్కు అభిషేకాలు చేశారు. అనంత రం అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి, పల్లకిలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు.
మం డలంలోని నేమకల్లులో గత ఏడాది నవంబరు 30న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజావేదిక నిర్వహించారు. గ్రామ అభివృద్ధి.. సమస్యల పరిష్కారంపై ఆ వేదికపై అనేక హామీలిచ్చారు. దీంతో తమ గ్రామ దశ తిరుగుతుందని ఆ గ్రామస్థులు ఆశించారు. అయితే ఏడాదైనా వాటి అమలుపై జిల్లా అధికారులు ఏ మాత్రం చొరవ చూపలేదు.
దారులు, ప్రభుత్వ భూములేకాదు తుదకు వంకలు, వాగులను కూడా వదలడంలేదు. కా లువల పక్కన కొంత భూమి ఉంటే... ఆ భూమితో పాటు కాలువ ఉన్న భూమినే కబ్జాచేసి భవనాలు నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంలో కబ్జాదారుల కన్నుపడితే ఏదీ వదలరనే విమర్శలు వినవస్తు న్నాయి. ఒకప్పుడు చెరువులు, కుంటలు పొంగిపొర్లినపప్పుడు ఆ నీరు వెళ్లేందుకు వంకలు, వాగులు ఉండేవి.
తెదేపా మద్దతుదారులుపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఎర్రంపల్లి గ్రామానికి చెందిన తెదేపా మద్దతుదారులకు అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకులకు మధ్య రహదారి విషయంలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఇంటర్మీడియట్లో ఉత్తమ ఉత్తీర్ణత శాతం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్ప్-2026కు శ్రీకారం చుట్టింది. నవంబరు 24న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహిళలు స్వయం ఉపాధి సాధించాలనే ఉద్దేశంతో ఉచితంగా కుట్టు శిక్షణ అందించారు. అదే తీరులో ఉచితంగా మిషన్ పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో మహిళలు ఆసక్తి కనబరిచారు.
వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఆర్థిక వెసులుబాటు కల్పించేలా స్మార్ట్ స్ట్రీట్లు ఏర్పాటు. కేవలం అనంతపురం నగరాన్ని మాత్రమే జిల్లాలో ఎంపిక చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపాన 44వ జాతీయ రహదారిపై దట్టమైన పొగముంచు కమ్మేసిన కారణంగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు ఏఎస్సై నూర్ మహమ్మద్ పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల కిందట భార్య అనారోగ్యంతో మృతిచెందగా భర్తే తన ఇద్దరు ఆడబిడ్డలకు అన్నీ తానై పోషిస్తూ వచ్చారు. ఉన్నంతలో అల్లారు ముద్దుగా పెంచుతూ వారి బంగారు భవితకు అహర్నిశలు శ్రమిస్తూవచ్చాడు.