గుత్తిలో గ్రామ రెవెన్యూ సహాయకులు రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నామిని వీఆర్ఏలను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని, మరణించిన వారి కుటుంబాల్లో వయసుతో నిమిత్తం లేకుండా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం రాయదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి పట్టణానికి వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు.. ఇద్దరు వ్యక్తులపైకి దూసుకెళ్లింది.
గత కొన్ని రోజులుగా టమాటా, ఉల్లి, చీనీ ధరలు పతనం కాగా తాజాగా అరటి ధరలు పడిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుసెనగ తర్వాత అరటి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు.
గత వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికను మరుగున పడేసింది. ప్రధానంగా గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి పురపాలికల్లోని దళిత కాలనీలు అధ్వానంగా ఉన్నాయి. అవి ఏళ్లుగా ప్రగతికి దూరంగా ఉంటున్నాయి.
కలిసికట్టుగా మనభూములను మనమే కాపాడు కుందాం, అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషిచేద్దాం అంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరెడ్డి పేర్కొన్నారు.
అసలే కరవు జిల్లా.. వర్షాలు అంతంత మాత్రమే. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి. భావితరాల కోసం నీటిని పొదుపుగా వాడుకోవాలి. నదులు, చెరువులు, కుంటలను కాపాడుకోవాలి. అయితే కొందరు ధన దాహంతో నదులు, కుంటల్లో ఇసుకను భారీగా తోడేస్తున్నారు.
మూడేళ్ల కిందట కొత్తగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో అధికారుల తీరు మారడం లేదు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలో దాదాపు 74 శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. వీటికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం లేదు.
తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడని కుమారుడు తన మిత్రులతో కలిసి దారుణంగా అతడిని హత్య చేసిన ఘటన అనంతపురం ఒకటో పట్టణ పరిధిలో జరిగింది.
పట్టణంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద వాహనాలు నిలపకుండా రెవెన్యూ అధికారులు తీసిన గుంతల తో దివ్యాంగుల ఉపాధికి ఆటకం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పలువురు దివ్యాంగులు ఆర్జీలను పూర్తిచేసి, లబ్ధిదారులకు అంది స్తుంటారు. దానితో వచ్చే ఆదాయం వచ్చేది. గుంతలు తీయడం వల్ల ది వ్యాంగులు కూర్చోవడానికి అవకాశం లేకుండాపోయింది.
ప్రపంచపు తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా పేరొందిన విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు విశ్వ కర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు.
తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో వందకొద్ది ఉన్న నాపరాళ్లు, గ్రానైట్ పరిశ్రమలు దివాలా తీయడానికి కారణాలు ఏంటని జిల్లా ఇండసీ్ట్రయల్ అధికారులు రవీంద్రారెడ్డి, ఎక్స్పోర్ట్ అధికారి శివరాం, వైష్ణవి బుధవారం ఆరా తీశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన కార్యక్ర మాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రారంభించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ సం యుక్త భాగస్వామ్యంలో నిర్వహంచనున్న ఈ కార్యక్రమ పోస్టర్లను జేసీ అభిషేక్ కుమార్, రాష్ట్ర నో డల్ ఆఫీసర్, అడిషనల్ డైరక్టర్ డాక్టర్ అనిల్కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఫైరోజ్బేగం, ఐసీడీఎప్ పీడీ ప్రమీల, డిప్యూటీ డీఎం హెచఓ డాక్టర్ పీఎస్ మంజువాణి, ఆర్డీఓ సువర్ణ, వైద్యాధి కారులు డాక్టర్ సునీల్ విడుదల చేశారు.
యూరియా వస్తోందని తెలుసుకున్న మండలపరిధిలోని కసముద్రం గ్రామ రైతులు బుధవారం స్థానిక సచివాలయం వద్ద ముందు గానే వేచివుండి తీసుకెళ్లారు. అయితే అవసరమైన రైతులు వేచి ఉన్నా అర్థముందని, అవసరం లేని వారు ఎక్కువగా వస్తున్నారని ఏఓ వెంకటరమణాచారి అన్నారు.
మండలవ్యాప్తం గా ఖరీఫ్లో ముందస్తుగా సాగుచేసిన కంది పంట కళకళలాడు తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పెంట ఏపుగా పెరిగింది. మండ లంలో ఈ ఏడాది వేరుశనగ కన్నా కందిపంట అత్యధికంగా సాగు చేసినట్లు వ్యవసాయాధి కారులు తెలుపుతున్నారు.