ఉమ్మడి అనంత జిల్లాలో మొక్కజొన్న సాగుచేసిన రైతులకు మద్దతు ధర అందని ద్రాక్షగా మారుతోంది. ఖరీఫ్లో సాగు చేసిన పంట చేతికొస్తుండగా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
మామూలు రాయి కాదిది.. త్రేతాయుగం, ద్వాపర యుగాలను కలిపిన రాయి మరి. అర్థం కాలేదు కదూ.. త్రేతాయుగం నాటి ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రాలను ఇముడ్చుకున్న రాయి ఇది.
సాఫ్ట్ టెన్నిస్ క్రీడలో జాతీయ స్థాయిలో బంగారు పతకాలు కొల్లగొడుతూ అంతర్జాతీయ స్థాయికి వేగంగా ఎదుగుతున్న గుంతకల్లు పట్టణ కుర్రాడు అరోన్ రొనాల్డిన్యో గురించి తెలుసుకుందాం రండి...
పురపాలికల్లో అత్యధికంగా వేధించే సమస్య చెత్త. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోవడం, చుట్టూ జనావాసాలు ఏర్పడటంతో దుర్వాసన, అపరిశుభ్రతతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు.
మూడు రోజులుగా రాత్రింబవళ్లు ఉప్పరహాళ్ సమీపంలోని ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జేసీబీ, హిటాచీలతో అక్రమంగా తవ్వుతూ.. మట్టి తరలిస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమైనది మన రాజ్యాంగమేనని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. దేశం పురోగతికి దిక్సూచిలా పని చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరిలోనూ రాజ్యాంగ స్ఫూర్తి ఉండాలన్నారు.
గత వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన శ్రీసత్యసాయి తాగునీటి పథకాన్ని కూటమి సర్కారు గాడిలో పెడుతోంది. గతంలో పోలిస్తే నిర్వహణ మెరుగుపడినప్పటికీ నిధుల విడుదల మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఈ-స్టాంప్ విక్రయాల్లో జరిగిన అక్రమాలపై నమోదైన కేసుల దర్యాప్తులో పురోగతిని తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
మండల పరిఽఽధిలోని తూ పల్లి పంచాయతీ పోరెడ్డివారిపల్లిలో బుధవారం ‘రైతన్నా మీకోసం’ కార్య క్రమం నిర్వహించారు. ఆర్డీఓ వీవీఎస్ శర్మ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ రెండో విడత రూ. 7వేలు వారి ఖాతాలో జమచేసిందన్నారు. జమ కాని రైతులు వ్యవసాయ కా ర్యాలయంలో అధికారులను సంప్రదించాలని సూచించారు.
పాత చట్టాలలో ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా రద్దు చేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని సీపీఎం పొలిట్ సభ్యుడు బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.
లాభదాయకమైన పంట లు సాగుచేసి అధిక ఆదాయాన్ని పొందాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రైతులకు సూచించారు. మండలం కేంద్రమైన బుక్కపట్నంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు.
మండలంలోని పోతుకుం ట బీసీకాలనీ వద్ద బుధ వారం వెళ్తున్న కారు ముందుటైరు పగలడంతో రోడ్డు పక్కన ఉన్న ద్విచ క్రవాహనాన్ని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. మా మిళ్లపల్లి నుంచి ధర్మ వరం వైపు వెళ్తున్న కర్ణాట కకు చెంది న ఓ కారు వెళ్తోంది. అయితే ఉన్నఫళంగా కారు ముందు టైరు పగిలి రోడ్డుపక్కకు దూసుకుపోయింది.
స్వచ్ఛత, పరిశుభ్రత అంటూ అధికారులు ఫొటోలకు ఫోజులు ఇస్తారు కానీ ఆచరణ, ఆమలు పట్టించుకోరని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో గ్రామాల్లో పరిశుభ్రత, చెత్త నుంచి సంపద సృష్టి, తద్వారా పంచాయతీల అభివృద్ధి అనే ప్రభుత్వ లక్ష్యాన్ని పాలకులు, అధికారులు తుంగలో తొ క్కేస్తున్నా రనే విమర్శలు వినవస్తున్నాయి.
శిథిలావస్థకు చేరిన కనేకల్ చెరువు హెచ్.ఎల్.సి అవుట్ ఫాల్ రెగ్యులేటర్ వంతెన గోడ బుధవారం పూర్తిగా కూలిపోయింది. అప్రమత్తమైన హెచ్.ఎల్.సి రెవెన్యూ పోలీస్ అధికారులు వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.