సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి మార్మోగింది. పట్టణ వీధులన్నీ కిటకిటలాడాయి. ప్రశాంతి నిలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హిల్వ్యూ స్టేడియంలో సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్వర్ణరథంపై సత్యసాయి బాబా చిత్రపటాన్ని ...
ప్రజల ఆరోగ్యం బాగు కోసం ఫ్లోరైడ్ రహిత నీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకా న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంక్రింద రూ. 2లకు 20 లీటర్ల శుద్దినీటిని పంపిణీచేసే విధంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఓబుళదేవరచెరువు సమీపంలోని ఆకుతోటపల్లి వద్ద తాగునీ టి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యంత్రాలను సమకూర్చింది.
పంచాయతీ అధికా రులు, పాలకుల నిర్లక్ష్యా నికి అద్దంపట్టే విధంగా మండలంలోని వేపరాల్ల గ్రామంలోని తాగునీటి ట్యాక్ దర్శనమి స్తోందని గ్రామ స్థులు విమర్శిస్తున్నారు. వేపరాల్ల పంచాయతీలో సుమారు వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని పంచాయతీ తాగునీటి ట్యాంక్ నీటినే వారు తాగడానికి వినియోగిస్తారు.
మండలంలోని వేపరాల యూపీ పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఈ ఏడాది అప్గ్రేడ్ చేశారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 270 మంది విద్యార్థులు ఉన్నారు.
మండల పరిధిలోని మహమ్మదాబాద్ మూడు రోడ్లు కూడలిలో హోటల్ యజమానులు ఏర్పాటుచేసుకున్న తాగునీటి పైప్లైన పగిలింది. ఈ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డు పక్కనే తక్కువలోతులో పైప్లైన ఉండడంతో ఆ వాహనాలు వెళ్లినప్పుడు పైప్లైన పగిలిపోయే అవకాశం ఉంది. గతంలోనూ ఈ సంఘటన జరిగింది.
జిల్లా కేంద్రమైన పుట ్టపర్తి ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మించిన సాయి గోకులం పార్క్ను, ప్ర యాణికుల సౌకర్యార్థం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో నిర్మించిన బస్సు షెల్టర్ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ప్రారంభించారు.
మండలంలోని వెంకటాపురం(నల్లగుట్లపల్లి)గ్రామానికి చెందిన బీరే కరుణాకర్ నాయుడు స్వగృహంలో శనివారం అర్ధరాత్రి విద్యుతషాట్ సర్క్యూట్ అయింది. ఈ ప్రమాదంలో రూ. 3లక్షలు నష్టం వాటిల్లినట్లు బాఽధి తుడు వాపోయాడు. వెంకటాపురానికి చెందిన బీరే కరుణాకర్ నా యుడు, కుటుంబసభ్యులు ప్రతి రోజులాగానే శనివారం రాత్రి ఆరు బయట నిద్రించారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. లోకేశ్ను ప్రజలు, కార్యకర్తలు కలిసి.. తమ సమస్యలు విన్నవించుకున్నారు. వీటిని పరిష్కరిస్తానని వారికి మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
అనంతపురంలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి హల్చల్ చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ను ధ్వంసం చేయించారు. ఆస్పత్రిని అప్పగించాలని దాదాపు 30 మంది రౌడీమూకలతో బాధితురాలు, మహిళ లాయర్ శ్రీలత బెదిరించినట్లు తెలుస్తోంది.
భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వమని సత్యసాయి చాటి చెప్పారని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక బోధనలతో ప్రజలకు ముక్తిమార్గం చూపడమే కాకుండా ఆర్తులకు, దీనులకు సత్యసాయి బాబా అండగా నిలిచారు. మానవసేవే మాధవసేవ అంటూ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.
ఏదైనా ఆలయాలకు వెళ్లినపుడు భక్తులు అక్కడి ప్రసాదం కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులూ దానికే ప్రాముఖ్యం ఇస్తారు.
రబీ సీజన్లో అన్ని రకాల పంటల కలిపి సాధారణ సాగు విస్తీర్ణం లక్ష్యం 2,64,935 ఎకరాలు. ఇంత వరకు 1,04,505 ఎకరాల్లోనే సాగయ్యాయి. అందులో ప్రధాన పంట పప్పుసెనగ.
పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా, పట్టపగలే పెన్నా నది నుంచి అక్రమార్కులు టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలించేస్తున్నారు.
జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికలు ఈసారి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అన్ని పదవులకు తీవ్రమైన పోటీ నెలకొన్న కారణంగా ఎవరిని అందమెక్కించాలో అర్థం కాలేదు. ప్రధానంగా అధ్యక్ష, కార్యదర్శుల పదవుల కోసం ఎంతోమంది పోటీ పడుతున్నారు.
మండలంలోని గోళ్ల గ్రామం వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తోడళ్లుల్లు శనివారం రాత్రి దుర్మరణం చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు..