ఇనసర్వీస్ ఉపా ధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరుతూ ప్రదానమంత్రి నరేంద్రమోదీకి లేఖ పంపినట్లు డెమోట్రిక్ టీచర్స్ ఫెడరేషన (డీటీ ఎఫ్) జిల్లా అధ్యక్షుడు కట్టుబడి గౌస్ లాజం తెలిపారు. ఆయన గురు వారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యా యులకు టెట్లో మినహాయింపు ఇచ్చే విధంగా చూడాలని ప్రధానమం త్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రదానకు లేఖ రాశామన్నారు.
పట్టణంలోని శాంతి నగర్ మున్సిప ల్ ఉన్నత పాఠశాల లో పదో తరగతి చ దువుతున్న శంకరపు గణేశ రాష్ట్రస్థాయి సైన్స సెమినార్లో ప్రతిభ కనబరచారని ఆ పాఠశాల హెచఎం ఉమాపతి, సైన్స ఉపాధ్యాయులు ఎస్బీ రేఖ, ప్రదీప్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి గణేశను గురువారం పాఠశాల లో వారు అభినందించారు.
మండలకేంద్రం లోని పెడబల్లి రోడ్డులో మసీదు సమీపంలో మురుగునీరు రోడ్డుపై నిలు వ ఉంది.. దీంతో వాహనాల రాకపోకల సమయంలో ఈ నీరు పాదాచా రులపై ఎగిరిపడుతోంది. దీంతో మసీదులో ప్రార్థనలు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ముస్లింలు తెలిపారు.
పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ ఎదురుగా వడ్డే ఓబన్న విగ్రహం పక్కన పైపులైన లీకేజీ ఏర్పడింది. అది రోడ్డు మధ్యలో ఉంది. గత 20 రోజులుగా ఆ లీకేజీని తప్పించడానికి మూడు డివైడర్లను అడ్డం పెట్టారు. లీకేజీ ఏర్పడి 20 రోజులైనా మున్సి పాలిటీవారు మరమ్మతులు చేయడం పట్టించుకోలేదు.
పేదల వైద్యానికి కూటమి ప్రభు త్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నా రు. పట్టణంలోని ఆర్అండ్బీ బంగ్లాలో గురువారం రూ.46లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా యుడు పెద్ద పీట వేస్తున్నారన్నారు.
నగరాల్లో నలుగురు మిత్రులు కలిసి సరదాగా మాట్లాడుకోవడానికి, ఉరుకులు పరుగులతో అలసిన మనసుకు ఒత్తిడి తగ్గించుకునేందుకు, స్థిరాస్తి వ్యాపార లావాదేవీలకు టీ కేఫ్లు వేదికలవుతున్నాయి.
దేశవ్యాప్తంగా తాడిపత్రిలో లభించే గ్రానైట్ బండలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 25 ఏళ్లుగా ఇక్కడి పాలిషింగ్ యూనిట్లలో కోస్తున్న రంగు బండలు మన్నిక, నాణ్యతకు పేరు గాంచాయి.
గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. 2 వేల గ్యాలన్ల రక్తాన్ని శుద్ధిచేసి 60 వేల మైళ్ల దూరం పంపింగ్ చేయగలుగుతుంది. ఆధునిక మనిషి పరుగు వేగం అందుకునేందుకు అంతటి గుండెకు సైతం ఒత్తిడి పెరుగుతోంది.
నిరంతర ప్రయాణం.. సంవత్సరాలు పెరిగే కొద్దీ బస్సులు రిపేర్లు రావడం సాధారణం. ఎప్పటికప్పుడు సక్రమంగా చూసుకొని మరమ్మతులు సాగిస్తేనే బండి ముందుకు కదులుతుంది.
‘పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేస్తారని తెదేపా నాయకులు పదేపదే అంటున్నారు. దేవుడు కరుణించి నాకు అనుకూలిస్తే వారి కోరిక నెరవేరుస్తానని’ మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.
ప్రేమమూర్తి సత్యసాయి ఖ్యాతి ఖండాంతరాలు దాటేలా శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సెంట్రల్ ట్రస్టు ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పచ్చనిచెట్లతో ఆహ్లాదం పంచే కొండలు, గుట్టలను చూస్తే ఎవరికైనా మనసు పరవశించిపోతుంది. అక్రమార్కులకు వాటిని చూస్తే నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్లు స్థానిక నాయకులు..
ఆ ఇళ్లు ఆనందాలకు నెలవు.. ఉన్నంతలో హాయిగా జీవనం.. భార్య రెండో కాన్పులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి భర్త సంబరపడ్డాడు. ముద్దులొలికే బిడ్డను కనులారా చూడాలని ఆసుపత్రికి బయల్దేరాడు.