వక్క పంట.. రైతులకు ఆదాయాన్ని ఇస్తూనే మహిళా కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. మడకశిర నియోజకవర్గంలో వక్క సాగుపై దాదాపు 4,200 మంది రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
వచ్చే ఏడాది 2025-26 సంవత్సరంలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ లాజర్ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో వచ్చే ఏడాది నిర్వహించే పదో తగరతి పరీక్షా కేంద్రంలో వసతులు, గదులు, బల్లలు, ఫ్యానలు, మంచి నీటి సౌకర్యంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ఆరా తీశారు.
స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మండల స్థాయి కార్యా లయాలన్నీ ఈ ఆవరణంలోనే ఉన్నాయి. దీంతో అన్ని శాఖల అఽధికారు లు ఇక్కడికి రోజూ వచ్చి పోతుంటారు. అదేవిధంగా ప్రతి నెలా మూడో వారం ఉద్యోగులందరూ. కార్యాలయాల పరిసరాలతో పాటు, గ్రామాలలో స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.
స్థానిక మార్కెట్యార్డ్ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ మంత్రి పల్లె రఘు నాథరెడ్డి మార్కెట్యార్డ్ చైర్మన, డైరెక్టర్లకు సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్యార్డ్లో తొలిసారిగా నూతన కమిటీ సమావే శాన్ని చైర్మన పూలశివప్రసాద్ అఽఽధ్యక్షతన గురువారం నిర్వహించా రు. మాజీ మంత్రి పల్లె ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు.
ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగిన డివిజన స్థాయి పోటీలను రెండో రోజు గురువారం ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓ బులరెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు స్వరూప అధ్యక్ష త వహించారు. అండర్-14, 17 బాలికల ఖోఖో విన్నర్స్గా గాండ ్లపెంట మండలం, రన్నర్స్గా కదిరి మండలం జట్లు నిలిచాయి. అండర్ -14, 17 బాలుర ఖోఖో విన్నర్స్గా గాండ్లపెంట మండలం జట్లు, అండర్ -14 రన్నర్గా తనకల్లు మండలం, అండర్-17 రన్నర్ గా కదిరి మండలం జట్టు నిలిచాయి.
మండలకేంద్రంలో పాడుబడిన పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో ముళ్లకంపలు, పిచ్చికంపలు పెరిగి పోవడంతో చుట్టుపక ్కల కాపురాలున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు పాములు బయటకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఇళ్లకు వాకిళ్లు వేసుకొని, బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు.
మత్స్యకారులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం అందేలా చర్యలు ఉంటాయని అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. బీమా, లోన్ సౌకర్యాలు పథకంలో ఉన్నాయని తెలిపారు.
ఛైర్మన్ పదవి నుంచి తలారి రాజ్ కుమార్ను తొలగిస్తూ.. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజ్ కుమార్ కౌన్సిల్ సమావేశాలు సరిగ్గా నిర్వహించడం లేదని తనపై ఆరోపణలు ఉన్నాయి.
జిల్లా ఖజానా కార్యాలయంలో ఓ అధికారి ప్రతి దానికి ధర నిర్ణయించి వసూలు దందాకు ఒడిగట్టాడు. తనకు సంబంధం లేని అంశాల్లోనూ తలదూర్చి ముడుపుల పందేరాన్ని సాగిస్తున్నాడు.
సుమారు పుష్కర కాలం దేశసేవలో జనాన్లుగా అలుపెరగకుండా శ్రమించారు. పదవీ విరమణ అనంతరం ఇతర ఉద్యోగ అవకాశాలు ఉన్నా.. అభిరుచి మేరకు స్వగ్రామంలో సేద్యం చేస్తున్నారు.
డ్వాక్రా సంఘాల్లో అక్రమాలు భారీగా పెరిగిపోయాయి. కిందిస్థాయి సిబ్బంది సంఘాలపై పెత్తనం చెలాయిస్తూ అవకతవకలకు పురికొల్పుతున్నారని పలువురు జడ్పీటీసీ సభ్యులు వాపోయారు.
పేరుకే జాతీయ రహదారులు. ఎక్కడ చూసినా గుంతలు. నిర్వహణ లోపంతో వాహన చోదకులు, ప్రయాణికులు నరకాన్ని చూస్తున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మీదుగా వెళ్లే జాతీయ రహదారి పరిస్థితి ఇది.
ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈనెల 10 నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలోని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది.
పచ్చదనం పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వం సమగ్రశిక్షా ఆధ్వర్యంలో గ్రీన్పాస్పోర్టు కార్యక్రమం చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో ఆర్భాటంగా పేరెంట్్స, టీచర్స్ మీటింగ్ నిర్వహించారు.
రాయదుర్గం- అనంతపురం జాతీయ రహదారిలోని కదరంపల్లి గ్రామ సమీపంలో ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ నూతనంగా నిర్మించిన టోల్ ప్లాజాను బుధవారం ప్రారంభించినట్లు మేనేజర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
సత్యసాయి శత జయంతి వేడుకలకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేకంగా 62 రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి.
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు స్వామివారి ఉత్సవమూర్తులతో యాగశాల ప్రవేశం చేసి నదీ జలాలతో అభిషేకించి, వాసుదేవ పుణ్యాహవాచన, రక్షాబంధన పూజలు నిర్వహించారు.
రాయదుర్గం పట్టణానికి చెందిన పలువురు మహిళలు మెప్మా సహకారంతో రుణాలు పొంది వ్యాపారాలు చేస్తున్నారు. ఇళ్లల్లో వస్తువులను సొంత బ్రాండ్లతో తయారు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు.
ప్రసిద్ధ నసనకోట ముత్యాలమ్మ ఆలయమే లక్ష్యంగా దొంగలు పెట్రేగి పోతున్నారు. హుండీని మంగళవారం రాత్రి అపహరించి, అందులో భక్తులు వేసిన నగదు రూ.1.5 లక్షలు అపహరించారు.
హిందూపురం గ్రామీణ మండలంలోని చౌళూరులో కల్తీ కల్లు తాగి 13 మంది ఆసుపత్రిపాలయ్యారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల్ని తొలుత ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
సిటిజన్ ఈకేవైసీ అప్లోడ్ చేయాలంటూ ఓ మహిళా పోలీసు ఓటీపీ కోసం పోన్ చేస్తే ఎంఈఓ-2 అసభ్యకరంగా తిట్టిన సంఘటన తాడిపత్రిలోని జయనగర్ కాలనీలో చోటుచేసుకుంది.