Bear Attack: సత్యసాయి జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. రాత్రి సమయంలో ఓ స్కూల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఉమ్మడి అనంత జిల్లాలోని వాగులు, నదులపై ఉన్న లోలెవెల్ వంతెనలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మోస్తరు వర్షం కురిసినా వంతెనలపైనుంచి ప్రవాహం సాగుతోంది. చెరువులు నిండి మరువలు పారే సమయంలో వాటి దిగువన ఉన్న వంతెనలపై మరింత ప్రమాదకరంగా మారుతోంది.
‘‘ సూర్యుడు ఎక్కడుంటే అక్కడే పొద్దుతిరుగుడు పువ్వులు అటు తిరుగుతుంటాయి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి కొంతమంది నాయకులు వాలిపోతుంటారు. మన కోసం అంగీ చించుకున్నోళ్లు, కట్టె పట్టుకుని నిలబడిన వాళ్లకు న్యాయం చేద్దాం’’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కాజేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదంతా తనకల్లు మండలంలోని బొంతలపల్లి పంచాయతీలో అన్నమయ్య జిల్లా ములకలచెరువు వద్ద తితిదే ఫంక్షన్ హాల్ పక్కన జరుగుతోంది.
అనంతపురం నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బెంగళూరులో పని చేసేవారు. ఏడాదిగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అతనికి ఇరవై రోజుల క్రితం రూ.20 లక్షల రుణం ఇస్తామంటూ ఓ ప్రకటన కనిపించింది.
అడవుల్లో వన్యప్రాణుల స్వేచ్ఛాయుత వాతావరణానికి భంగం వాటిల్లింది. ఏటా వేసవిలో నిప్పు రాజుకుని పచ్చదనం హరించుకుపోతోంది. అడవి జంతువులకు మేత, నీళ్లు దొరకుండా పోతున్నాయి. దీనికితోడు వన్యప్రాణుల కోసం అటవీశాఖ చేపట్టే సంరక్షణ చర్యలు నామమాత్రంగా మారాయి.
నార్పల, బుక్కరాయసముద్రం మండలాల్లో రైతులు సాగు చేసిన దానిమ్మ తోటలకు వైరస్, బ్యాక్టీరియా తెగుళ్లు వ్యాపించడంతో కాయల నాణ్యత తగ్గిపోయింది. మార్కెట్లో వ్యాపారులు దానిమ్మకాయలు కొనుగోలు చేయడం లేదు.
అమరాపురం గ్రామానికి చెందిన దీక్షిత్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి జాతీయ స్థాయిలో 30వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగించే పద్మ, ఈశ్వరప్పలకు ఇద్దరు కుమారులు కాగా దీక్షిత్ రెండోవాడు.
రామగిరి, చెన్నేకొత్తపల్లి, రొద్దం మండలాలతోపాటు మరో ఏడు మండలాల్లో 2700 మంది రైతులతో సేంద్రియ సాగును టింబక్టు కలెక్టివ్ సంస్థ కొనసాగిస్తోంది. రసాయనిక ఎరువులు, మందులు వినియోగానికి కొంతైనా అడ్డుకట్ట వేయాలని రెండు దశాబ్దాల క్రితం సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టింది.
స్కాంలు, శాంతిభద్రతల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. గురువారం అనంతపురంలో నిర్వహించిన జిల్లా మహానాడులో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తమ కుటుంబంలోని మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ.. అసత్య ప్రచారం చేస్తున్నాడనే కారణంగా యువకుడిని అన్నదమ్ములు హత్య చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు. గురువారం పట్టణంలోని పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ వైద్యవిద్యార్థినులు చెల్లించిన మెస్బిల్లుల మొత్తాన్ని పక్కదారి పట్టించిన అంశానికి సంబంధించి అకౌంటెంట్ వాణిపై ఎట్టకేలకు కేసు నమోదైంది.
జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నా రు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక, ఎగుమతుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వర్షకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై జిల్లాకేంద్రం కరణం సుబ్బమ్మనగర్లో సామాజిక ఆరోగ్య అధికారి నగేష్ ప్రజలకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు