రాష్ట్ర వ్యాప్తంగా 10న నిర్వహిస్తున్న మెగా పీటీఎం (పేరెంట్ టీచర్ మీటింగ్) 2.0 కార్యక్రమంలో భాగంగా కొత్తచెరువులో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ రానున్నారని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు.
సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించే గుంతకల్లు బ్రాంచి కెనాల్ మరమ్మతు పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లపాటు నిర్లక్ష్యానికి గురికావడంతో కాలువ బలహీనపడింది.
జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపరాదు. కానీ చోదకులు నిబంధనలు పట్టించుకోకుండా హఠాత్తుగా ఆపడంతో వెనక వచ్చే వాహనాలు తాకి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
సదరం శిబిరంలో వైకల్య ధ్రువపత్రం పొందేందుకు దరఖాస్తు చేసుకొన్న దివ్యాంగులు నాలుగు గంటలు వైద్యాధికారి కోసం నిరీక్షించి నీరసించారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి మాతాశిశు కేంద్రంలో సదరం శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు.
ఇళ్లలోకి ప్రవేశించి బంగారు నగలు, నగదు, చరవాణులు, ల్యాప్ట్యాప్లను చోరీ అంతర్రాష్ట్ర దొంగను టూటౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. సీఐ మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు.
మైలాపురంలో కొలగానహళ్లి సర్పంచి కావలి శృతి మామ అనంతరాజుపై హత్యాయత్నం, ప్రత్యర్థులైన లోకేష్రెడ్డి, ఆయన కుమారుడు విజయకుమార్రెడ్డి ఇళ్లపై సోమవారం రాత్రి జరిగిన ప్రతీకార దాడుల నేపథ్యంలో మంగళవారం.
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
కళ్యాణదుర్గం పట్టణం 15వ వార్డులోని సిద్ధప్పవంక కాలనీలో నివాసం ఉంటున్న సతీష్- నందినీ దంపతుల కుమార్తె శ్రీప్రియ(10) గతంలో ఆడుకొంటుండగా కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది.
పేద విద్యార్థుల చదువుకు చేయూత అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హుల జాబితాలో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. అర్హులమైనప్పటికీ..
పట్టణంలోని గీతానగర్కు చెందిన వడ్డీ వ్యాపారి చింతా రమాదేవి హత్య కేసులో నిందితుడు యలమకూరు రాజశేఖర్ను మంగళవారం ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, నియోజకవర్గంలో నిత్యం కూటమి కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ రాఘవేంద్ర రెడ్డి పాలన నచ్చి, నియోజకవర్గం పెద్దకడబూరు మండలం పులికనుమకు చెందిన 20 కుటుంబాల వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
అనంత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈఏడాది ఆరంభం నుంచి మే వరకు 385 ప్రసవాలు జరగ్గా అందులో 229 సిజేరియన్లు చేశారు. మరో వైద్యశాలలో నమోదైన కాన్పులు 116 కాగా సిజేరియన్లు 102 చేయడం గమనార్హం.