ప్రకృతి పాఠశాలలో పాటను దిద్దుకున్న సహజకవి అందెశ్రీ. పరిసరాల్లోని పరిణామాలకు పాటగా పరిఢవిల్లిన ప్రజాకవి ఆయన. పసితనం నుంచే పశువుల కాపరిగా పనిచేసినా, రోజువారీ కూలీగా, తాపీ మేస్త్రీగా శ్రమించినా మనసు మాత్రం పదాల చుట్టూ పరిభ్రమించేది. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఊహ తెలియని వయసులో తల్లిదండ్రుల ప్రేమకు దూరమై అనాథైన ఆయనకు పాట తొలి ఊరటనిచ్చింది.
వాతావరణ మార్పుల నిరోధానికి గడచిన 33 ఏళ్లలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 29 శిఖరాగ్ర సభలు జరిగాయి. కానీ, పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. బ్రెజిల్లోని బెలెంలో ఈనెల 10-21 తేదీల మధ్య తలపెట్టిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్-30) మహాసభలో ప్రపంచ దేశాల నాయకులు మళ్లీ చర్చోపచర్చలు సాగించనున్నారు. ఈసారైనా కర్బన ఉద్గారాల కట్టడికి సమర్థ కార్యాచరణ చేపడతారేమో చూడాలి.
ప్రస్తుతం అంతా హైపర్ కనెక్టడ్ సొసైటీ. ఎవరు ఏ వేడుక చేసుకున్నా, ఏ వెకేషన్కి వెళ్లినా సోషల్మీడియా పుణ్యమా అని ప్రపంచమంతా తెలిసిపోతుంది. దాంతో చాలామందిలో మనం ఆ ఫంక్షన్ చేసుకోలేకపోతున్నామే, ఆ ప్రదేశాలకు వెళ్లలేకపోతున్నామే అన్న మథనం మొదలవుతుంది. వాళ్లలా జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నామన్న ఆందోళన మొలకెత్తుతుంది.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ వ్యాఖ్యానించినట్లు- మన ఇష్టాయిష్టాలను బట్టి స్నేహితులను ఎంచుకోగలం కానీ, ఇరుగుపొరుగులను మనం ఎంపిక చేసుకోలేం! ఆయా రాజ్యాల్లో పరిస్థితులు నానాటికీ అస్థిరమవుతుంటే- అవి మనకు ఏమాత్రం సంబంధం లేని విషయాలని అనుకోలేం! ప్రజాస్వామ్యం మేడిపండు చందమైన సరిహద్దు దేశాల్లో మతతత్వ శక్తులు, ముష్కర మిన్నాగులు...
మైనారిటీల పట్ల నిజమైన అభిమానం ఉండటం వేరు. వారిని వాడుకుని వదిలేయడం వేరు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి తరహాకు చెందిన నేత అయితే, కాంగ్రెస్ రెండో రకానికి చెందిన పార్టీ అని చెప్పాలి. స్వరాష్ర్టాన�
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగడం ద్వారా తీవ్ర నష్టాన్ని చవిచూసే అవకాశమ
ఫ్రస్ట్రేషన్లో అరిచే అరుపులకు, తిట్టే తిట్లకు ప్రజలు ప్రభావితం కారు. ఓట్లు పడవు. ఇది డిజిటల్ యుగం. ఎవరైనా పొరపాటు ఒక్కసారే చేస్తారు. పొరపాటు జరిగిందని తెలిశాక, దాన్ని సరిదిద్దుకొనే అవకాశం కోసం చూస్తారు.
‘ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కాదు, ఓ సర్కస్ కంపెనీ’ - ఇది మేం అంటున్న మాట కాదు, యావత్ తెలంగాణ ప్రజలు తమ మనస్సుల్లో గూడుకట్టుకున్న బాధను దిగమింగుకొని అంటున్న మాటలు. రాష్ట్రంలో అధికారంలోకి వ