సూచిక 
ప్రముఖ మాధ్యమాల నుండి వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.సంపాదకీయం
  రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయాన్ని ఆధునిక బాట పట్టించడం, సాగుదారుల రాబడిని పెంచడం నేడు అత్యావశ్యకం. ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో రాష్ట్రం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఇలాంటి తరుణంలో సేద్య రంగానికి ప్రపంచస్థాయి దిశా నిర్దేశం చేసేందుకు నేటి గ్లోబల్ సమ్మిట్లో ‘ది రేర్ స్ట్రాటజీ- విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతుల ఆదాయం పెంపు’పై చర్చలు సాగనుండటం శుభ పరిణామం.
  అమ్మాయిలు ‘స్టెమ్’ విద్యలో రాణిస్తున్నా, ఉద్యోగాల్లోకి అడుగుపెట్టే దశలో మాత్రం వెనకబడుతున్నారు. చదువుతో పాటు వారికి తగిన మద్దతు, సామాజిక అంగీకారం, వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం అత్యావశ్యకం. విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషిచేస్తే అన్నిచోట్లా మహిళలు నిలదొక్కుకోగలుగుతారు.
  పునరుత్పాదక ఇంధనాలు, విద్యుత్ వాహనాలు, రక్షణ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కీలకం. వీటి విషయంలో స్వావలంబన దిశగా భారత్ తొలి అడుగువేసింది. అరుదైన లోహాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు తాజాగా రూ.7,280 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది సాకారమైతే చైనా వంటి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
  ‘చాదస్తపు మొగుడు చెబితే వినడు..’ అని సామెత. అటువంటివాళ్లు ప్రభుత్వాఫీసుల్లో ఎక్కువ. పెన్షన్ మంజూరు చేయాలంటే మనిషి జీవించి ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలి. ‘ఈ ఏడాది సర్టిఫికెట్ ఉంది సరే, నిరుటిది లేదే! అప్పుడు నువ్వు బతికున్నట్లు సాక్ష్యం ఎక్కడ?’ అని ప్రభుత్వాధికారి అడిగినట్లు సినిమాల్లో హాస్య సన్నివేశాలు కల్పిస్తారు.
  దేశీయంగా అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో నేరపూరిత నిర్లక్ష్యం ఎంతోమంది ప్రయాణికులను ముప్పుతిప్పలు పెడుతోంది. 63శాతం మార్కెట్ వాటాతో భారతీయ పౌరవిమానయాన రంగంలో గుత్తాధిపత్యం చలాయిస్తున్న ఆ సంస్థ ముందస్తు సమాచారం లేకుండా అయిదారు రోజులుగా బోలెడు సర్వీసులను ఇష్టారీతిగా నిలిపేస్తూ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది.