చరిత్రలో సెప్టెంబరు 17వ తేదీ ప్రసిద్ధమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా చేతివృత్తులవారు, హస్తకళాకారులు విశ్వకర్మ జయంతి జరుపుకొంటారు. ఇదేరోజు హైదరాబాద్ సంస్థానం నిజాం క్రూరపాలన, రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి పొందింది. సరిగ్గా ఈరోజే తన జీవితాన్ని దేశసేవకు, ప్రజాసేవకు అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మించారు.
దేశంలో నాణ్యమైన చికిత్సలు అందుబాటులో ఉన్నా, వాటికయ్యే వ్యయాన్ని భరించడం చాలామంది రోగులకు పెనుభారమవుతోంది. ఇలాంటి తరుణంలో కేంద్రం తాజాగా ప్రకటించిన జీఎస్టీ తగ్గింపుతో నాన్-క్లినికల్ వ్యయభారం తగ్గే అవకాశముంది.
యువతరాన్ని బలంగా ఆకర్షించే రంగాల్లో సినిమా ఒకటి. కాలేజీ రోజుల్లో చూసిన కొన్ని సినిమాలు నాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. నేనూ దర్శకుణ్ని కావాలని కలలు కనేవాణ్ని. మాదొక చిన్న పల్లెటూరు. పిల్లలు బడికి డుమ్మా కొట్టి సినిమాలకి వెళ్లొచ్చి వర్ణించి చెబుతుంటే ఆసక్తిగా ఉండేది.
నిజానిజాలతో నిమిత్తం లేని నిర్హేతుకమైన అభిప్రాయాలు ఆయా వ్యక్తులూ సమాజాలను ప్రగతి నిరోధక ప్రతీప శక్తులుగా మారుస్తాయి. చరిత్రను వక్రీకరిస్తూ, వర్తమానంలోని సమస్యలను భూతద్దంలో చూపిస్తూ, భవిష్యత్తు పట్ల భయాందోళనలను పెంచుతాయి.
భారతదేశ సైన్స్, టెక్నాలజీ రంగాలు, ప్రపంచ దౌత్యపరంగా గణనీయమైన పురోగతి సాధిస్తున్న ప్రస్తుత రోజుల్లోనూ వ్యవసాయానికి నీళ్లను అందించడం సాధ్యంకాని కలగానే మిగిలిపోయింది.
సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రా జ్యం నేడు జాతుల విముక్తి పోరాటాల పుణ్యమా అని పిడికెడు ప్రభావ ప్రాంతాలకు పరిమితమైపోయింది. నవ స్వతంత్ర దేశాలతో బ్రిటిష్ కామన్వెల్త్ ఏర్పాటు చేసి ఏదో రకంగా సంబంధ, బా�
వీరిద్దరి క్షీణత, హీనతలు ఏ విధంగా కనిపిస్తున్నాయో చర్చించేందుకు ముందు, కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఈ దశకు ఎందువల్ల చేరిందో అర్థం చేసుకోవటం అవసరం. రాహుల్, రేవంత్లను ఎంత విమర్శించినా మనం ముందుగా కొన్ని వి�
మన దేశంలో చట్టసభల భేటీలు నామమాత్రంగా మారుతున్నాయి. నిరవధిక నిరసనలూ, ఎడతెగని నినాదాలతో పార్లమెంట్ సమావేశాలు సైతం కళ తప్పుతున్నాయి. కీలక బిల్లులెన్నో లోతైన చర్చలకు నోచుకోకుండానే సభామోదం పొందుతున్నాయి.
జాతి కలహాలు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపుర్లో ప్రధాని మోదీ తాజాగా పర్యటించారు. మిజోరం, బిహార్, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాలనూ ఆయన చుట్టి వచ్చారు. ఇందులో భాగంగా మిజో, మణిపుర్ రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
సామాన్య జనజీవితాలను దుర్భరం చేసే అవినీతిని అరికట్టాలంటే- ప్రభుత్వం ఫలానా నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి, ప్రజాధనాన్ని అధికార యంత్రాంగం ఎక్కడ ఎందుకోసం ఎలా ఖర్చుపెడుతోంది, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకే అందుతున్నాయా...