విశాఖ ఉక్కు కర్మాగారంలో గత మూడేళ్లలో 1,987 మంది ఉద్యోగ విరమణ చేయగా 106 మందిని కొత్తగా నియమించినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్సింగ్ కులస్థే తెలిపారు.
నిధుల వినియోగ ధ్రువపత్రాలను (యూసీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సకాలంలో సమర్పించకపోవడంతోనే గిరిజన ఉప ప్రణాళికకు నిధుల విడుదల నిలిచిపోయిందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకసింగ్ సరుతా తెలిపారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని ఆసుపత్రుల్లో రోగులకు భోజనం (డైట్) అందించేందుకు పిలుస్తున్న టెండర్లకు స్పందన కనిపించడం లేదు. ఒకటి, రెండు సార్లు పిలవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్-1 తుది కీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. తొలి విడత పరీక్షలు ఈనెల 1న ముగిసిన సంగతి తెలిసిందే.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా తిరుమల వెంకన్న దర్శనంలో భక్తులకు ప్రత్యేక సేవలందించనుంది. ఏపీఎస్...
రాంగ్కాల్ ద్వారా పరిచయమైన ఓ మహిళను పెళ్లి చేసుకునేందుకు అక్రమంగా దేశంలోకి చొరబడిన పాకిస్థాన్ పౌరుడు.. తొమ్మిదేళ్లు ఆమెతో సహజీవనం చేసి, నలుగురు పిల్లలను కని పారిపోయే క్రమంలో పట్టుబడ్డాడు.
విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి కోలగట్ల అలన మీనాక్షికి రూ.కోటి ఆర్థిక సాయం, విశాఖలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.
సంక్షేమం, వ్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా తెలంగాణ ప్రభుత్వం 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. సుమారు ఇరవై శాతం నిధులను సబ్బండ వర్గాల సంక్షేమానికి కేటాయించింది.
హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉన్న వ్యక్తిపై దారిదోపిడీ కేసు పెట్టి, ఛార్జిషీటు దాఖలు చేసిన కాకుమాను ఎస్సై రవీంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.రాంగోపాల్ ఉత్తర్వులు జారీచేశారు.
ఆలయ పాలకవర్గాల్లో ఓ ధర్మకర్తగా నాయీబ్రాహ్మణులను నియమించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 610 ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉండగా, వీటన్నింటిలో నాయీ బ్రాహ్మణుల నుంచి ఒకరు చొప్పున సభ్యుడిగా చేర్చాలని పేర్కొంది.
అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అమ్ముకున్నాక రకరకాల కిరికిరులు పెట్టి వాటి యజమానుల హక్కులను హరించే బిల్డర్లకు షాకిచ్చేలా మద్రాసు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నూరు శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి...
ప్రభుత్వం మనదే కదా అనే ధీమాతో వారు కాంట్రాక్టు పనుల్లోకి దిగారు. పార్టీ ప్రతిష్ఠను కాపాడాలని ఉన్నదంతా పెట్టారు. అప్పులు చేసి మరీ ఖర్చు చేశారు. చివరికి నమ్మి నట్టేట మునిగారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. అప్పుల కుప్పయింది.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (నరేగా)లో మెటీరియల్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భవన నిర్మాణాలకే కేటాయించడంతో గ్రామీణ రహదారులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణకంటే మిన్నగా వేతనాలిస్తామని, అందరికీ న్యాయం చేస్తామని పాదయాత్ర సందర్భంగా సెల్ఫీలు తీసుకుని మరీ హామీనిచ్చిన ముఖ్యమంత్రి జగన్.
రంగులు వేసి బయట జిగేలుమనిపించారు. లోపల అరకొర వసతులతో ఉసూరుమనిపిస్తున్నారు. ఇదీ టిడ్కో ఇళ్ల పరిస్థితి. నంద్యాలలో 3 చోట్ల 10,000 టిడ్కో గృహాలను నిర్మిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో సుమారు 60శాతం మందికి జనవరి నెల జీతం ఇంతవరకు అందనేలేదు. ఫిబ్రవరి ఆరో తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సర్వీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన అన్ని రకాల సెలవులు సచివాలయాల ఉద్యోగులకూ వర్తిస్తాయని పురపాలకశాఖ ఒక వైపున చెబుతూనే...ఇంకో వైపున పన్నుల బకాయిలు వసూలు చేసే వరకు సెలవుల్లేవని పుర, నగరపాలక సంస్థల్లో అధికారులు ఆదేశాలివ్వడం చర్చనీయాంశమవుతోంది.
విశాఖకు రాజధాని తరలింపు పనులపై స్థానిక జిల్లా యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని త్వరలో విశాఖకు తరలిపోతుందని, తాను అక్కడి నుంచే పాలన సాగిస్తానని సీఎం జగన్ ఇటీవల దిల్లీలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ప్రకటించారు.
ప్రకాశం జిల్లాలో గంటల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి.
Srisailam శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, ఎస్పీలను ఈవో లవన్న ఆహ్వానించారు.
పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. 2024 జూన్ నాటికి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలని...
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సినీనటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడే బరిలో నిలుస్తానని ఆయన స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి తాను పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారాన్ని అలీ ఖండించారు.
రాష్ట్రం వైపు నుంచి భూసేకరణకు మేము డబ్బులివ్వడం లేదని రైల్వే సాకులు చెబుతోందన్నారు. అయితే ఇవన్నీ 2014 కుముందు మంజూరయిన వాటి గురించి కేంద్రం చెబుతోంది...
Adani ఇంటర్ మాత్రమే చదివిన అదానీకి ష్యూరిటీ లేకుండా వేల కోట్ల రుణం ఎలా ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని ఆ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం కీలక వివరాలను వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు 2024 మార్చి నాటికి పూర్తిచేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. అయితే గోదావరి వరదలు సంభవించిన కారణంగా జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఇంద్రారెడ్డి ఆయన భార్య శివలింగేశ్వరి పిల్లలు సాయిరెడ్డి, జితిన్ రెడ్డిగా గుర్తించారు.
కొద్దిరోజులుగా సైక్లింగ్ చేస్తూ అనేక రాష్ట్రాలలో పర్యటిస్తున్న ఆశా లక్ష్యం నెరవేరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని సీఎం...
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీపై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సాధినేని యామినీ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో బాదుడేబాదుడు అన్నాడని.. సీఎం అయ్యాక గుంజుడేగుంజుడు ప్రారంభించారని విమర్శించారు.