‘జీవితంలో అత్యంత లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్ ఏదీ?’ అని అడిగితే.. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్నవాళ్లు బాగా లాభం వచ్చిన కంపెనీ పేరు చెబుతారు. సంబంధం లేనివాళ్లు తాము కొన్న ప్లాట్ అనో.. బంగారం అనో అంటారు.
వివో కంపెనీ భారత్లో కొత్త 5జీ ఫోన్ను రిలీజ్ చేసింది. వివో ‘టీ4 లైట్' స్మార్ట్ఫోన్.. టీ4 సిరీస్లో బేసిక్ వెర్షన్గా చేరింది. ఇదే సిరీస్లో టీ4, టీ4 అల్ట్రా, టీ4ఎక్స్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ టీ4 లైట్ 5జీ ఫోన
రంగులు ప్రకృతిలో అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. వేవేల వర్ణాల్లో విరబూసే పువ్వులు, సీతాకోకచిలుకలు, రంగురంగుల గోడలు.. అందరినీ ఆకర్షిస్తాయి. సూర్యోదయం-సూర్యాస్తమయంలో ఆకాశంలో కనిపించే వర్ణాలు.. చూపులన�
మనదేశంలో ఎక్కడైనా సరే దుకాణాలు వాటి యజమానులు లేకుండా అసలు నడవవు. ఒకవేళ దీనికి భిన్నంగా జరిగితే అది కొనేవాళ్లపై ఎంతో నమ్మకం, గౌరవంతోనే జరగాలి. ఈశాన్య భారతదేశ రాష్ట్రం నాగాలాండ్లోని ద్జులెకె అనే పట్టణం ఇ�
నిజాం కాలం నుంచి ఇప్పటివరకు పరిపాలన కేంద్రంగా ఉన్న సుబేదార్ బంగ్లా ఇప్పుడు గత జ్ఞాపకాలను మనకు తెలియజేస్తున్నది. కొన్నేండ్లుగా ఈ బంగ్లానే హనుమకొండ జిల్లా కలెక్టర్ అధికారిక నివాసంగా ఉంది. పరిపాలన సౌలభ�
హీరో: చచ్చిపోతా అనొద్దు మేడమ్. హీరోయిన్: బతికి ఏం చేయాలి?హీరో: బతుకు కోసమే బతుకు మేడమ్. ఇటీవల వచ్చిన కుబేర సినిమాలో ఓ సన్నివేశం ఇది. అనుకున్నది జరగలేదనో, ఆర్థిక పరిస్థితులు బాగాలేవనో, వ్యక్తిగత సంబంధాలు �
మహాభారతంలో భీష్ముడి ప్రతిజ్ఞ గురించి విన్నారు కదా? నేటి డిజిటల్ ప్రపంచంలో కూడా ప్రతిఒక్కరూ అలాంటి గట్టి నిర్ణయం తీసుకోవడం అనివార్యం అంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. అప్పుడే నెటిజన్గా మీరు బాధ్
Ramayanam పదో తరగతి పరీక్షలు కాగానే ఓ నెల రోజులు చక్రవర్తి సార్ ట్యూషన్స్లో పాఠాలు చెప్పాను. ఆ తరువాత జూన్లో అనుకుంటా.. మా మేనత్త కొడుకు పెళ్లి అయింది.
నిజాం రాజ్యంలో దేశ్ముఖ్, పట్వారీ, పటేళ్ల నిరంకుశత్వం పల్లెల్ని పీడిస్తున్న కాలం అది. రజాకార్ల పదఘట్టనలో తెలంగాణ పల్లెలు భయంకరంగా నలిగిపోతున్న సందర్భమది. ఓ పండుగ, పబ్బం, అచ్చట, ముచ్చట జరుపుకోలేని దయనీయ స
జీవితం అంటే సవాళ్లు, విమర్శలు, ప్రతికూలతల సమాహారం. కానీ, వాటిని ఎలా సంబాళించుకుంటామనే దానిపైనే మనం జీవితంలో ఎంత అభివృద్ది చెందుతామనేది ఆధారపడి ఉంటుంది.
మంచి ప్రతిభ కనబరిచిన వారికే ఇప్పుడు పాఠశాలల్లో అడ్మిషన్. తల్లీతండ్రీ కూడా డిగ్రీలు పాసై ఉంటేనే బళ్లో చేరిక. అప్పుడు కూడా వాళ్లు పెట్టిన పరీక్షల్లో నెగ్గితేనే తరగతి గదికి తలుపులు తెరుచుకునేది. కానీ లద్ద
ముందుగా క్యాప్సికంను కడిగి సగానికి తరిగి పెట్టుకోవాలి. ఆలుగడ్డలను బాగా ఉడికించి చెక్కు తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా మెదిపి అందులో శనగపిండి, ఉప్పు, కారం, ధనియాలు-జీలకర్ర పొడితో పాటు క�
మీకో ట్విన్ సిస్టరో, బ్రదరో ఉన్నారనుకోండి... వాళ్లు ఎలా ఉంటారు? పోలికల్లో... అచ్చుగుద్దినట్టుగా మీలానే ఉంటారు. కానీ ప్రవర్తనా, ఆలోచనలూ మాత్రం భిన్నంగా ఉంటాయి. ఈ ‘డిజిటల్ ట్విన్స్’ అలాకాదు... అణువణువూ మీలానే ఉంటాయి, ఉండటం ఏంటీ- అది మీ ‘వర్చువల్ ప్రతిరూపం’ అయితేను.
పల్లెటూళ్ల నుంచి వైద్యం కోసం నగరానికి వచ్చే పేదలు ఎందరో. చికిత్స అయితేే... ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయించుకుంటారు. కానీ అన్నిరోజులు ఏదైనా రూమ్ తీసుకుని ఉండటం, ఆ ఖర్చుల్ని భరాయించడం అనేది వాళ్లకు తలకు మించిన భారమే. దీన్ని అర్థంచేసుకునే కొన్ని సంస్థలు అలాంటివారికి తాత్కాలిక ఆశ్రయాన్ని ఉచితంగా అందిస్తున్నాయి.
పాలరాతితో కట్టిన ఈ భవంతిని చూస్తుంటే ఏమనిపిస్తుంది. అదేదో... రాజుల కోటలా, చూడముచ్చటగా ఉంది కదా! ఇదొక గ్రామీణ, ప్రభుత్వ స్కూల్ అంటే ఆశ్చర్యం వేయక మానదు.
దీర్ఘాయుష్షుని ఇచ్చే ప్రతిదాన్నీ అమృతమనే చెబుతాయి మన పురాణాలు! లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం కాఫీని కూడా అలాంటి అమృతపానీయమే అనాలేమో.
కారణాలు ఏవైనా సరే... నేటి టీనేజీ పిల్లల్ని ఒత్తిడి చిత్తుచేస్తోంది. వాళ్లలో యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలకి దారితీస్తోంది. మనదగ్గరే కాదు ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. సాధారణంగా వీళ్లకి వ్యాధి తీవ్రతని బట్టి మానసిక వైద్యులు బిహేవియరల్ థెరపీతోపాటూ మందులూ ఇస్తుంటారు.
మనదేశంలో 22 శాతం మంది పీసీఓఎస్తో బాధపడుతున్నారని ఓ అంచనా. ఈ సమస్య ఉన్నవాళ్లలో గర్భవిచ్ఛిత్తి కలగడం, ముందస్తు ప్రసవాలు జరగడం వంటివి ఎక్కువగా ఉంటాయి. వీళ్లలో ఈ సమస్యలు తలెత్తడానికి ఓ బలమైన కారణాన్ని పసిగట్టారు చైనాలోని జీజాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.
అరవైలు దాటాక కొందరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. పాత జ్ఞాపకాలేవో నెమరేస్తూ చెప్పిందే చెబుతుంటారు. అది చూసి మిగతావాళ్లు విసుక్కుంటారుకానీ... వాళ్లని అలా మాట్లాడనివ్వడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు.
షణ్ముగ సుందరం క్రమశిక్షణకు మారుపేరు.... తెల్లారి ఐదున్నరకే సైకిల్ బెల్ మోగించుకుంటూ వచ్చి తాజా వార్తలతో న్యూస్పేపర్నీ, పాలప్యాకెట్నీ అందిస్తాడు. చెన్నైలోని గోపాలపురంలో ఉన్న ఎనిమిది వీధుల్లో ఉండేవారికి అతనంటే ఎంతో అభిమానం.
వస్తువు పాతదే అయినా కొత్త ఫీచర్లతో రావడమన్నది చూస్తూనే ఉన్నాం. అలా పెన్సిల్లోనూ కొత్త వెరైటీలూ ఎన్నో ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పటిలా పెన్సిల్ని చెక్కనవసరం లేకుండానే లెడ్తో రాసుకునే పెన్నులు.
పూరీలూ, వడలూ, బజ్జీల్లాంటివి నూనెలో వేయించి తీస్తున్నప్పుడు చేతికి వేడి తగులుతుంది. ఏ కాస్త నీటి చుక్కలు మరిగే నూనెలో పడ్డా నూనె పైకి చిందుతుంది. అందుకే కొంతమంది నూనెలో ఆహార పదార్థాలు వేయించేప్పుడు ఇబ్బంది పడుతుంటారు.
ఎంతో కష్టపడి, భూమికి నాలుగు వేల మీటర్ల ఎత్తులో... ఏటవాలుగా ఉన్న హిమాలయ పర్వతాల్ని ఎక్కుతున్న వీరంతా ఏ పర్యటకులో, సాహసికులో అనుకుంటే పొరపాటే. వీళ్లంతా ‘కీడాజడీ’ అనే పురుగులని పట్టడానికి వెళ్తున్న గ్రామస్థులు.
అల్లం... ఘాటుగా ఉంటుందని తెలుసు, కానీ కాస్త తియ్యగానూ మరికాస్త పుల్లగానూ కూడా ఉండే రకాలు తెలుసా? రూపురేఖల్లో ఒక్క గోధుమ రంగు మాత్రమే కాదు, ఎర్రగానూ నల్లగానూ ఇంకా ఎన్నో రంగుల్లోనూ పండటం చూశారా? మసాలా వాసనలోనే కాదు, గుబాళించే పరిమళాలలోనూ దొరుకుతుందని విన్నారా? అందరికీ అంతగా తెలియని ఆ అల్లం వెరైటీలేంటంటే...
ఇంట్లో జరుపుకునే ప్రతి వేడుకకూ సరిపోయే బ్యాక్డ్రాప్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. రంగుల పూలు మొదలు మిరుమిట్ల లైట్ల దాకా అన్ని రకాల థీమ్లతో ఈ బ్యాక్డ్రాప్స్ ట్రెండ్ నడిచింది.
ఒక పనిని తక్కువ సమయంలో చేస్తూనే, శ్రమనూ తగ్గించేలా ఉంటే- ఆ కిచెన్ వస్తువు గృహిణులకు ఎంతో నచ్చేస్తుంది కదా! ఇక్కడున్న స్టీల్ మీట్ బాలర్ స్పూన్ కూడా అలాంటిదే.
పెళ్లీపేరంటాలకు చక్కటి రంగున్న పట్టుచీరతో ముస్తాబవుతూ... ఆధునిక ఫంక్షన్లకు మెరుపుల ట్రెండీవేర్తో రెడీ అయ్యే ఈతరం- కాస్త ఆ అభిరుచుల్ని పక్కన పెట్టేసి, ఈమధ్య అన్నిరకాల వేడుకలకీ ఆర్గంజానే మొదటి ఛాయిస్ అంటోంది. అటు సంప్రదాయ కళతోనూ, ఇటు ట్రెండీ లుక్కుతోనూ అలరిస్తూ ఎత్నిక్ కమ్ మోడ్రన్ ఫ్యాబ్రిక్గా ఫ్యాషన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్న ఆ ఆర్గంజా విశేషాలేంటో చూద్దాం పదండి!
మామూలుగా ఎవరైనా పదిహేనేళ్లకి పదో తరగతి ముగిస్తారు. కానీ ఆయనేమో పదమూడేళ్లకి బాలకార్మికుడై... కళ్లాల్లోనూ కల్లుదుకాణాల్లోనూ కూలీనాలీ చేస్తూ 18 ఏళ్లకిగాని హైస్కూల్లో చేరలేకపోయాడు. 22 ఏళ్లకి టెన్త్ పాసయ్యాడు. అలాంటి వ్యక్తి జగతి మెచ్చే వైద్యుడు కావడం, ప్రపంచ ప్రఖ్యాత ల్యాప్రోస్కోపిక్ సర్జన్లలో ఒకడిగా పేరుతెచ్చుకోవడం ఎంత ఆశ్చర్యకరం! పట్టుదల ఉంటే అద్భుత విజయాలు ఎవరికైనా సాధ్యమేనని నిరూపించిన ఆ డాక్టర్... సి.పళనివేలు. ఆ ప్రయాణం ఆయన మాటల్లోనే...
‘అందంలో సహజత్వం.. తెగింపులో సాహసం.. ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్యం.. కన్నప్పకి సర్వస్వం.. చెంచు యువరాణి నెమలి’ - అంటూ చిత్రబృందం ఆమెను పరిచయం చేసిన తీరుకు తగ్గట్టుగానే తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించింది ప్రీతి ముకుందన్.
‘కుహూ... కుహూ’- మొబైల్కు ఏదో సమాచారం వచ్చిన గుర్తుగా, కనిపించని పావురం కుహు కుహులు అవి. కంపెనీ నుంచి వచ్చి స్నానంచేసి, టీవీ రిమోట్ కోసం చూస్తున్నాడు ఉపేంద్ర. పదిరోజుల నుండి ఇంట్లో భార్య సౌశీల్య లేదు.