భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు.
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు.
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.
గడీల దొరలకు గరీబోళ్ల బిడ్డకు మధ్య లోక్సభ ఎన్నికల పోటీ జరుగుతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీ ఓటరును కలిసి కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడాను వివరించాలని, నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విరక్తి పెరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు.
దేవుళ్లను అడ్డుపెట్టుకొని బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని, బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి ఒక్క పైసా తేలేదని, బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కే ఢిల్లీలో కొట్లాడే సత్తా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
హరీష్రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని ఇస్లాం నగర్లో గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారని గుర్తు చేశారు.
లోక్సభ ఎన్నిక ల నివేదికలను సకాలంలో సమర్పించాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సమన్వ యంతో పని చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్బాబు అన్నారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ చేసిందేమి లేదని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి జరిగిందని, అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, తెలంగాణ కోసం ఉండేది బీఆర్ఎస్ పార్టీ అని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.
జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ మార్కెట్లో గత ప్రభుత్వం హ యాంలో గోడలపై ఏర్పాటు చేసిన ప్రచారపు రాతలు, రాజకీయ నేత ల బొమ్మలు అదేవిధంగా ప్రదర్శిస్తున్నారంటూ ఓ వ్యక్తి సీ-విజిల్ యాప్న కు ఫిర్యాదు చేశారు.