ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రైతులకు నష్టం జరగకుండా కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. పాఠశాలలో బాలికలు వాష్రూమ్లో ఉన్న సమయంలో ఆ పాఠశాలకు చెందిన ఆఫీసు సబార్డినేట్ రహస్యంగా వీడియోలు చిత్రీకరించడమే కాకుండా వాటి ఆధారంగా బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా లొంగుబాట పడుతున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ, అభయ్ 62 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో లొంగిపోయారు.
మహిళలు స్వయం ఉపాధిలో ముందుం డాలని విశ్వహిందు పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్ముళ్ల సత్యంజీ అన్నారు. మంగళ వారం శారదానగర్లోని విశ్వహిందు పరిషత్ భవన్లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
పోలీసు అమరవీరుల అజరామరమని ప్రతీ ఒక్కరు వారి సేవలను స్మరించుకోవాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి మండలాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
పత్తి కొనుగోళ్లలో అక్ర మాలకు చెక్ పెట్టేందుకు సీసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయా ధికారి భక్తి శ్రీనివాస్ అన్నారు.
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కాటన్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని మార్కెట్ చైర్మన్ వైనాల రాజు, అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీఎంఓ ప్రవీణ్రెడ్డి అన్నారు.
ఖరీఫ్ సీజన్కు సంబంధించి కొనుగోలు కేంద్రా లను ట్యాగ్ చేసిన మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటిక ప్పుడు తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
ఏటా రూ.లక్షలు సంపాదించే వ్యాపారులు.. సొంత భవనాలు, భూములు ఉండి.. నెలకు రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నవారు.. ఖరీదైన కార్లలో తిరిగేవారూ రేషన్ కార్డులు పొందారు.
బుడిబుడి అడుగులతో బడికి వెళ్లిన ఆ బాబు ఇంటికొచ్చాడు. పుస్తకాల బ్యాగ్ ఇంట్లో వేసి ఆడుకునేందుకు బయటకొచ్చాడు. ఆ సమయంలో తల్లి ఇంటి పనిలో నిమగ్నమై ఉంది. ఎటు వెళ్తున్నావు.. కన్నా అని పిలిచింది. కొన్ని నిమిషాలకే బాలుడు బస్సు కిందపడ్డాడు.
కరీంనగర్ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్మార్ట్ ప్రాజెక్టులకు గడువు ముగియనుంది. వరంగల్ నగరం కంటే కరీంనగర్ పరిధిలో ప్రారంభించిన అభివృద్ధి పనులు అత్యధికంగా పూర్తయ్యాయి. ఇందులో 12 ప్రాజెక్టులు కొనసాగుతుండగా వాటిని పూర్తి చేసేందుకు రెండు నెలల గడువు విధించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకంలో 5,691 యూనిట్లను లక్ష్యం కాగా ఇప్పటికీ 2,716 యూనిట్లు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి వందశాతం పూర్తిచేసే దిశగా అధికారులు కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
ఒకప్పుడు కళాశాలలో బోధకుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నా.. పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అన్ని అంశాలపై తరగతులను నిర్వహించటం, క్షేత్రశిక్షణ కలిసి వచ్చింది. మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి పొలాసలోనే ఒప్పంద టీచింగ్ అసోసియేట్గా చేరా.
ఏళ్లు గడుస్తున్నా జిల్లాలోని పలు గ్రామాలకు వానకాలంలో రవాణా కష్టాలు ఎదురవుతున్నాయి. రాకపోకలు సజావుగా సాగాలంటే ఆయా మార్గాల్లో అవసరమైన చోట వారధులు అవసరం ఉండగా.. నిధులు మంజూరైనా పనులు మొదలవటం లేదు.
జిల్లాలో టీఎస్బీపాస్ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. భవనాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాల లేఅవుట్ల అనుమతులకు ‘టీఎస్బీపాస్’ను 2020 నవంబరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం మున్సిపల్ అనుమతులు పొందిన అనంతరం నిర్మాణాలు చేపట్టాలి.
‘ప్రైవేటు ఆసుపత్రులు, మందుల దుకాణాలపై నిఘా పెంచాం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీ చేసి గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం’ అని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు.
సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు 150 మస్టర్ల కంటే తక్కువుంటే చర్యలు తీసుకోవడానికి సంస్థ సిద్ధమైంది. గతంలో 100 మస్టర్లలోపు ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకునే సింగరేణి.. దానిని 150కి తప్పనిసరి చేసింది. ప్రతి ఉద్యోగి ఏడాదిలో 150 పనిదినాలు తప్పనిసరిగా విధులు నిర్వహించాలి.
వేములవాడ నాంపల్లి గుట్టపై రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయంగా లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి కాళీయ మర్దనంలో స్వామివారిని దర్శించుకుంటారు.
పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుంచి అభ్యాస దీపికలను పంపిణీ చేస్తోంది. రాష్ట్ర విద్యా శిక్షణ, పరిశోధన సంస్థ రూపొందించిన ఈ అభ్యాస దీపిక పుస్తకాలు వెనుకబడిన విద్యార్థులకు చక్కటి వనరులు.