వేములవాడ రాజన్న ప్రసాదం లడ్డూ ఇది. ఇందులో కిస్మిస్, కాజు, ఇలాచీల జాడ తక్కువగానే కనిపిస్తోంది. ధర మాత్రం లడ్డుకు రూ.20. కొన్నిసార్లు అప్పటికప్పుడు తయారు చేస్తూ కౌంటర్లకు తెస్తుండటంతో చేతికి చేరే లోపు విచ్చుకుపోతోంది.
స్వశక్తి సంఘాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే సభ్యత్వం లేని మహిళలను చేర్పిస్తూ కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తుండగా మరోవైపు నిర్వహణను మరింత పటిష్ఠం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గోదావరి తీర ప్రాంతాలతో పాటు వాగుల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలించొద్దని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్ర స్థాయి యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.
ఎవరో ఒకరు తోడుంటే కానీ అడుగు కూడా వేయలేరు. సొంత అవసరాలు కూడా తీర్చుకోలేరు. ఇలా ప్రత్యేకావసరాలు కలిగిన శారీరక, మానసిక, వైకల్యం ఉన్న దివ్యాంగ చిన్నారులకు భరోసా కల్పించడం కోసం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచుతున్నామని గృహ నిర్మాణ సంస్థ పీడీ రాజేశ్వర్ తెలిపారు. ఇళ్లు మంజూరై నిర్ణీత వ్యవధిలో పనులు మొదలు పెట్టుకొని లబ్ధిదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి రద్దు చేస్తున్నామన్నారు.
సర్పంచులు లేక గ్రామాల్లో పాలన గాడి తప్పింది. ప్రత్యేకాధికారులున్న ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలో నూతనంగా ముగ్గురు మండల పంచాయతీ అధికారులు ఇటీవల బాధ్యతలు చేపట్టారు.
వాతావరణంలో మార్పులు, కాలుష్య కారకాలతో పిల్లలు, వృద్ధులు నిమోనియా బారినపడుతున్నారు. వైరస్, బ్యాక్టీరియా లక్షణాలు సోకి ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పుట్టిన బిడ్డకూ లక్షణాలు సోకడం ఆందోళన కలిగిస్తోంది.
ఇంటర్ పూర్తయిన తరువాత చాలా మంది విద్యార్థులు డిగ్రీలో ఉపాధి లభించే కోర్సులను ఎంపిక చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. విపణిలో త్వరగా ఉపాధి లభిస్తుందని కామర్స్ కోర్సు తీసుకుంటున్నారు.
ఓ ఇంటి యజమాని ఏళ్ల తరబడి నివాసం ఉంటూ అన్ని రకాల పత్రాలు ఉండగా ఇంటినంబరు ఆన్లైన్లో కనిపించడం లేదని, విజిలెన్స్ అధికారులు ఇంటికి వచ్చి ఇంటి నంబరు తొలగించారని సోమవారం ప్రజావాణిలో అర్జీ సమర్పించారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆలయంలోని కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఇవాళ దేవుడి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు.
పోలీస్ సిబ్బందికి విధి నిర్వ హణలో శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్లో సిబ్బందికి వ్యక్తిగత భద్రత, స్వీయ క్రమశిక్షణ, ప్రవర్తన నియామవళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రైతులు ఆయిల్ పామ్ సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి కమలాకర్రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్లో సిరిపురం పర్శరాములుకు చెందిన ఆయిల్ ఫామ్ సాగును వారు మంగళవారం పరిశీలించారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నాలాలను ఆధునిక పద్ధ తిలో నిర్మిస్తున్నారు. నాలాల్లో చెత్త వేయకుండా నాలాల పైకప్పు పెన్సింగ్ వేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధి లో ఆధునికీకరిస్తున్న అన్నీ ప్రధాన నాలాల్లో ఇదే విధా నాన్ని కొనసాగిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జాతీయ యువజన ఉత్సవాలను అదనపు కలెక్టర్ దాసరి వేణు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పులమాలలు వేసి నివాళులర్పించారు.
తుఫాను వల్ల పంటలను కోల్పో యిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తా మని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. కొలనూర్లో మీస అర్జున్ రావు, గొట్టేముక్కుల సురేష్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు.