జగిత్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్ నుంచి అయోధ్య, వారణాసి, ప్రయాగ్రాజ్ సూపర్ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు.
లేబర్ కోడ్ల అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణలు డిమాండ్ చేశారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు మడివి హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులను ఈ నెల 18న మారెడ్మిల్లిలో బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హతమార్చారని పలు ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.
సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడు కలు ఘనంగా నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్క ర్రావుభవన్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక కుటుంబాల సమ్మేళ నానికి హాజరయ్యారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల మానేరు వాగుల్లోని ఎనిమిది చెక్ డ్యాములు కృంగిపోయాయని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గుంపుల వాగులో కృంగిన చెక్ డ్యామును ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు పరిశీలించారు.
జమ్మికుంట మండల పరిధిలోని శంభునిపల్లి- ఓదెల మండలం గుంపుల చెక్ డ్యాం కూల్చివేత బాధాకరమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ పేర్కొన్నారు.
అమ్మా, నాన్న అనే పిలుపు కోసం తపన పడే కొందరు దంపతుల అవకాశాన్ని కొందరు దళారులు ఆసరాగా చేసుకుంటున్నారు. అభం, శుభం తెలియని పసిబిడ్డలను అంగట్లో సరకుల మాదిరిగా క్రయవిక్రయాలు జరుపుతున్నారు.
చొప్పదండి పరిధి వెదురుగట్టలో మట్టి దందా జోరుగా సాగుతోంది. గుట్టలను తవ్వి విలువైన ఎర్రమట్టిని టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చొప్పదండి, ఎలిగేడు మండలాల పరిధి శివారు ప్రాంతాల్లో వెదురుగట్ట ఉండడంతో రెండు వైపులా నుంచి తరలిస్తున్నారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియమితులయ్యారు. ఈ స్థానం కోసం 54 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఎలాంటి అర్జీ పెట్టుకోని ఎమ్మెల్యేకు పార్టీ జిల్లా సారథిగా అధిష్ఠానం అవకాశాన్నిచ్చింది.
జిల్లాలో 63వ నంబరు జాతీయ రహదారి ప్రమాదాలకు కేంద్రంగా మారింది. మెట్పల్లి మండలం బండలింగాపూర్ శివారు నుంచి ధర్మపురి మండలం రాయపట్నం వరకు మలుపులు, ఇరుకు కల్వర్టులతో ప్రయాణం బెంబేలెత్తిస్తోంది.
బాలబడుల్లో లబ్ధిదారులకు సమతుల ఆహారం చేరువ చేయాలన్న సంకల్పంతో సర్కారు పోషణ వాటికల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఆ దిశగా అధికార యంత్రాంగం ఇప్పటికే చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత చదువుల వైపు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్)’ కార్యక్రమం దోహదపడుతుంది.
‘‘ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో వేర్వేరు అయిదు ఇళ్లలో ఈ నెల 15న దొంగలు పడ్డారు. తాళాలను పగులగొట్టి దోచుకున్నారు. అందరి ఇళ్లలో కలిపి రూ.లక్ష వరకు నగదు, రూ.2.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు.’’
ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల్లో టెట్(ఉపాధ్యాయ అర్హత) దడ పుట్టిస్తోంది. ప్రతీ ఒక్కరూ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులు కలవర పడుతున్నారు.
ప్రస్తుత తరుణంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలతోపాటు నైపుణ్యంలోనూ అమ్మాయిలు ముందు వరుసలో ఉంటున్నారు. గతంలో వంటింటికే పరిమితమైన వారు ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులతో పోటీపడుతూ పలు వేదికలపై సత్తా చాటుతున్నారు.