నగరంలోని వాణిజ్యసముదాయాలు, కమర్షియల్ బిల్డింగ్స్లో నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఆయా వాణిజ్య సముదాయాలు, బిల్డింగ్స్కు సంబంధించిన వాహనాలను పార్కింగ్ చేసేందుకు వదిలిపెట్టాల్సిన సెల్లార్లను దర్జాగా ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.
జిల్లాలో గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు అధికారికంగా ఖరారు అయ్యాయి. జిల్లాలోని 13 మండలాల్లో గ్రామ పంచా యతీల వారీగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష రిజర్వేషన్లు ప్రకటించారు. జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల్లో ఎస్టీ-6, ఎస్సీ-54, బీసీ-69, జనరల్-134 రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
చాలీచాలని సొమ్ముతో వంట సరుకులను తెస్తూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల అవస్థలు కాస్త తీరనున్నాయి. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం వంట ధరలు పెంచాలని నిర్ణయం తీసుకోగా విద్యాశాఖ అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి గెజిట్ జారీ చేశారు. గెజిట్లో పొరపాట్లు ఎలా ఉన్నా బీసీల ఆశలు గల్లంతయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగ, ఉపాధ్యాయ దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గర్రెపల్లి ప్రాథమిక పాఠశాలలో జరిగిన టీఆర్టీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు.
మహిళలను ఆర్థి కంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని బందంపల్లి స్వరూప గార్డెన్లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సింగరేణి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు కొరిమి రాజ్కుమార్, తుమ్మల రాజారెడ్డి, మాదాసు రామమూర్తి, వడ్డేపల్లి దాస్ డిమాండ్ చేశారు.
విద్యా విప్లవానికి నాందిగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిలుస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని రుక్మాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సోమవారం శంకుస్థాపన చేశారు.
మహిళలు మహాశక్తి ప్రతిరూపాలని, వారిని గౌరవించాలని ఎమ్మె ల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. సోమవారం జీడినగర్లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరెల పంపిణీ చేశారు.
కార్మికులకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటెటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ డిమాండ్ చేశారు.
పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో రూ.1.20కోట్లతో అధునాతనమైన పరికరాలను అందజేసి, వాటిని ఆయన ప్రారంభించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో ఆదివారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి అదే గ్రామానికి చెందిన శివరాత్రి అనిల్ (27) దుర్మరణం పాలయ్యాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన బుచ్చవ్వ ఈ నెల 17న తెల్లవారుజామున రోడ్డు పక్కన నిలుకొని ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందారు..
జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు రైల్వే గేటు కష్టాలు తప్పడం లేదు. ఏళ్లుగా అంతర్గాం, పాలకుర్తి, పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండల ప్రజలు గేటు కష్టాలు అనుభవిస్తున్నారు.
పంచాయతీల్లో సర్పంచులు, వార్డుల రిజర్వేషన్లు తేలడంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిచి సర్పంచులుగా ఉపసర్పంచులుగా అవకాశం దక్కించుకోవాలని చాలా మంది ఆరాటపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది.
జిల్లాలోని నగర, పురపాలికల్లో చిరు వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. అయిదేళ్ల నుంచి వారికి ప్రధానమంత్రి స్వనిధి రుణాలను అందిస్తోంది.
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, కస్తూర్బాగాంధీ బాలికలు, ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థి క్లబ్ల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఆర్థిక చేయూతను అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ధర్మపురి పురపాలికలో గతంలో చేసిన భువన్ సర్వేతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఇష్టారాజ్యంగా ఇంటి నిర్మాణ కొలతలను నమోదు చేయడంతో తమపై రెట్టింపు భారం పడుతోందని ప్రజలు వాపోతున్నారు.