వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. కొమరవెళ్లి మల్లన్న వారంపట్నంను పురస్కరించుకుని వేములవాడ రాజన్నకు భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని టెస్కో జనరల్ మేనేజర్ అశోక్రావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో స్వశక్తి సంఘాలకు అందించే చీరల ఆర్డర్లను 129 మ్యాక్స్ సోసైటీలకు అందించే ఆర్డర్ కాపీని అందించారు.
పెద్దపల్లి ఐటీఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ ( అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు.
ఎన్నికల సమయంలో ఆర్టిజన్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అన్నారు. డిమాండ్లు పరిష్కరిం చాలని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వద్ద సోమవారం ఆర్టిజన్లు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు.
మండలంలోని నాగేపల్లి కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ తప్పిదం రైతులకు శాపంగా మారింది. బ్యాంకు లోని తమ అప్పును రెన్యూవల్ చేసుకున్న ఖాతాదారులకు పాత ఖాతాను మూసివేసి కొత్త ఖాతా నెంబరు జారీ చేయడంతో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు.
గతేడాది ఆగస్టు 24న కరీంనగర్ సమీపంలోని ఓ గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని 1098 సహాయ నంబరుకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. అప్రమత్తమైన జిల్లా సంక్షేమ అధికారి, బాలల పరిరక్షణ అధికారి, పోలీసులు, రెవెన్యూ అధికారులు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా దుకాణాలు నిర్మించి ఇస్తున్నారు. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా సమీకృత మార్కెట్లను నిర్మిస్తుండటం, స్థలాలు ఉన్న చోట్ల పక్కా నిర్మాణాలు చేపట్టడంతో సమస్యలు దూరమవుతున్నాయి.
ప్రభుత్వం ఉపాధ్యాయులకు కల్పించిన పరస్పర బదిలీల అవకాశం పలువురికి కలిసివస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు విద్యాశాఖ ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే కొందరు దీన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు.
రైతుభరోసా పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు ఊపందుకున్నాయి. సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం వ్యవసాయ క్లస్టర్ల వారీగా బృందాలను ఏర్పాటు చేసింది.
నిరుపేదలు ఏళ్లుగా ఎదురుచూస్తోన్న రేషన్ కార్డుల మంజూరుకు మోక్షం లభించనున్నది. ప్రభుత్వం ఈ నెల 26న అర్హులైన వారికి అందించటానికి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సర్వే చేస్తున్నారు.
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని వీధులకు సీసీ రోడ్ల కళ సంతరించుకుంది. పట్టణం ఏటేటా విస్తరిస్తున్నప్పటికీ చాలా వీధుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సింగరేణిలో విశ్రాంత కార్మికుల పింఛను సవరించడం లేదు. వేతనాలు పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా విశ్రాంత కార్మికులకు చెల్లించాల్సిన పింఛనుపై ఇంకా లెక్కలు తేలడం లేదు.
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని వీధులకు సీసీ రోడ్ల కళ సంతరించుకుంది. పట్టణం ఏటేటా విస్తరిస్తున్నప్పటికీ చాలా వీధుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో సమస్య తీరింది.
మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి గత ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల జలాశయం నిర్మాణం చేపట్టింది. దీనిలోకి మధ్యమానేరు ద్వారా గోదావరి జలాలను తరలించి తద్వారా సాగు భూములకు నీరందించాలన్నది లక్ష్యం.
శంకరపట్నం మండల ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి నమూనా లబ్ధిదారులు, ప్రజలకు తెలిసేలా స్థానిక అధికారులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.