జమ్మికుంట మండల పరిధిలోని శంభునిపల్లి- ఓదెల మండలం గుంపుల చెక్ డ్యాం కూల్చివేత బాధాకరమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ పేర్కొన్నారు.
అమ్మా, నాన్న అనే పిలుపు కోసం తపన పడే కొందరు దంపతుల అవకాశాన్ని కొందరు దళారులు ఆసరాగా చేసుకుంటున్నారు. అభం, శుభం తెలియని పసిబిడ్డలను అంగట్లో సరకుల మాదిరిగా క్రయవిక్రయాలు జరుపుతున్నారు.
చొప్పదండి పరిధి వెదురుగట్టలో మట్టి దందా జోరుగా సాగుతోంది. గుట్టలను తవ్వి విలువైన ఎర్రమట్టిని టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చొప్పదండి, ఎలిగేడు మండలాల పరిధి శివారు ప్రాంతాల్లో వెదురుగట్ట ఉండడంతో రెండు వైపులా నుంచి తరలిస్తున్నారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియమితులయ్యారు. ఈ స్థానం కోసం 54 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఎలాంటి అర్జీ పెట్టుకోని ఎమ్మెల్యేకు పార్టీ జిల్లా సారథిగా అధిష్ఠానం అవకాశాన్నిచ్చింది.
జిల్లాలో 63వ నంబరు జాతీయ రహదారి ప్రమాదాలకు కేంద్రంగా మారింది. మెట్పల్లి మండలం బండలింగాపూర్ శివారు నుంచి ధర్మపురి మండలం రాయపట్నం వరకు మలుపులు, ఇరుకు కల్వర్టులతో ప్రయాణం బెంబేలెత్తిస్తోంది.
బాలబడుల్లో లబ్ధిదారులకు సమతుల ఆహారం చేరువ చేయాలన్న సంకల్పంతో సర్కారు పోషణ వాటికల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఆ దిశగా అధికార యంత్రాంగం ఇప్పటికే చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత చదువుల వైపు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్)’ కార్యక్రమం దోహదపడుతుంది.
‘‘ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో వేర్వేరు అయిదు ఇళ్లలో ఈ నెల 15న దొంగలు పడ్డారు. తాళాలను పగులగొట్టి దోచుకున్నారు. అందరి ఇళ్లలో కలిపి రూ.లక్ష వరకు నగదు, రూ.2.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు.’’
ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల్లో టెట్(ఉపాధ్యాయ అర్హత) దడ పుట్టిస్తోంది. ప్రతీ ఒక్కరూ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులు కలవర పడుతున్నారు.
ప్రస్తుత తరుణంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలతోపాటు నైపుణ్యంలోనూ అమ్మాయిలు ముందు వరుసలో ఉంటున్నారు. గతంలో వంటింటికే పరిమితమైన వారు ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులతో పోటీపడుతూ పలు వేదికలపై సత్తా చాటుతున్నారు.
ఇనస్టాగ్రామ్ ద్వారా నిరుద్యోగుల వివరాలను సేకరించి దుబాయ్ పంపిస్తానని మోసం చేస్తున్న ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కాకినాడ ప్రాంతానికి చెందిన డానియల్ కెవిన ఎడ్విన అనే సైబర్ మోసగాడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నేత కార్మికులు తయా రుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రం లోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలు స్తున్నాయని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
రాజీమార్గమే రాజమార్గంగా డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని గోదావరిఖ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
రైతులకు సాగునీరు అందించ డమే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం ఓదెల మండలం మడకలో 42ఆర్ కెనాల్ నుంచి పొత్కపల్లి పరిసర ప్రాంతాలకు సాగు నీరందించడానికి, పొత్కపల్లి ఊర చెరువులోకి నీరు వెళ్ళడానికి కాల్వ తవ్వకం పనులను ప్రారంభించారు.
సుభాష్నగర్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య మహిళ క్యాంపులో మహిళలకు రీ స్త్ర్కీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను డిసెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ‘షీ లీడ్స్’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వేణు సంబంధిత అదికారులను, సెంటర్ ఇంచార్జిలను ఆదేశించారు. జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తూకాలను పరిశీలించారు.
’మేం చదును చేసుకుంటే... మీరు మట్టి తీస్తారా‘ అంటూ పారుపల్లి పంచాయతీ పరిధి శాలగుం డ్లపల్లి రైతులు నిలదీశారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులకు సం బంధించి మట్టి తవ్వకాల కోసం శనివారం వచ్చిన వారిని రైతులు అడ్డుకు న్నారు.