దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం, భక్తులకు ఎస్పీఎఫ్ (స్పెషల్ పోలీస్ ఫోర్స్) సిబ్బంది, హోంగార్డులు రక్షణ కల్పిస్తున్నారు.
జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ పురపాలికలు విస్తరిస్తూ.. కలిసిపోయాయి. త్వరలో జంట పట్టణాలుగా ఆవిర్భవించనున్నాయి. ఈ రెండు పురపాలికల పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
చిన్నారుల ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీవర్క్స్ సంస్థ కృషి చేస్తోంది. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనను వెలికితీయడమే లక్ష్యంగా నిర్మాణ, వ్యవసాయ రంగాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంచుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి జగిత్యాలలో కాతకు వచ్చింది. 1984లో మొట్టమొదట జపాన్లోని మియాజాకి ప్రాంతంలో పండించిన మామిడికి జపాన్తోపాటు కాలిఫోర్నియాలో మంచి డిమాండ్ ఉంది.
కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వినియోగం కూడా పెరుగుతోంది. కానీ సంరక్షణ చర్యల్లో ప్రజల బాధ్యతరాహిత్యం, అధికారుల నిర్లక్ష్యంతో విఫలమవుతున్నారు.
రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలకపోవడమే కాకుండా అకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టం కలిగిస్తున్నాయి. వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం మొలకెత్తుతోంది.
జై శ్రీరాం నినాదాల హోరుతో హిందూ ఏక్తా యాత్ర మారుమోగింది. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం సాయంత్రం కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర ఆద్యంతం హిందూ సంస్కృతి ఉట్టిపడేలా సాగింది.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజు బుధవారం అబూజ్ మఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరగడంతో ఆయన స్థానం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, సాహు, అభయ్ దక్కుతుందా అనే చర్చ ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో మొదలైంది.
చిగురుమామిడి, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమపథకాలు అమలు చేయడమే లక్ష్యం గా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రావాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు.
కరీంనగర్, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో రైల్వేలు అభివృద్ధి చెందాయని, ఇందుకు కరీంనగర్ రైల్వే స్టేషనే నిదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
సుభాష్నగర్, మే 22(ఆంధ్రజ్యోతి): అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు.
కరీంనగర్, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో స్వశక్తి మహిళా సంఘాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా ప్రభుత్వం మహిళా సంఘా లకు ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద యేటా కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు రాణించాలని కలెక్టర్ సూచించారు.
ఓదెల మండలం మీదుగా కాల్వశ్రీరాంపూర్ చివరి ఆయకట్టుకు నీరు చేరుకునేలా కాలువల్లో పూడికతీత పనులు పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం మండలంలోని డి-86 ఎస్సారెస్పి కాలువలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లోని కాలువలను, ఉప కాలువలను 20 రోజుల్లో శుభ్రం చేయాలన్నారు.
జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉద యం 8 గంటల వరకు అంతర్గాం మండలం ఆకెన పల్లిలో అత్యధికంగా 81.0 మిల్లీమీటర్ల వర్షం కురి సింది. రామగుండంలో 32.8 మిల్లీమీటర్లు, కమాన్ పూర్లో 14.8 మిల్లీమీటర్లు, ఈసాలతక్కళ్లపల్లిలో 11.3 మిల్లీమీటర్లు, ముల్కలపల్లిలో 10.5, మల్యాలపల్లిలో 10.0, పాలితంలో 8.3, కల్వచర్లలో 8.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
దండకారణ్యంలో ఉన్న మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం అపరేషన్ కగార్ పేరు తో నరమేధాన్ని సృష్టిస్తోందని, ఈ హత్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు.
ఎంవీ భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సం స్కర్త అని, హైదరాబాద్ సంస్థా నంలో సంస్కరణలకు కృషి చేసిన మహోన్న తుడని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం భాగ్యరెడ్డివర్మ జయంతి సందర్భంగా కమిషనరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు.