Telangana: కాళేశ్వరంకు పోయిన వాళ్ళందరూ నాస్తికులే అని.. అందుకే గుడి యొక్క సాంప్రదాయాలను పాటించలేదని బీఆర్ఎస్ నేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గర్భగుడి లోపలికి వెళ్లేముందు ఎలా ఉండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలీదా అని ప్రశ్నించారు. గర్భగుడిలోకి వెళ్లే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాలని గుడి వద్ద బోర్డు ఉంటుందన్నారు.
రెండు వందలకుపైగా దేశాలు 11వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న అతిపెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభం కాబోతోంది. ఇందులో మన దేశ క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధిస్తారో త్వరలోనే తేలనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గత ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టగా ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. నిధుల కొరతతో చాలా పాఠశాలల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి.
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోపాటు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్(ఎన్క్వాస్) ద్వారా ఎంపిక చేసిన ఆసుపత్రులకు కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది.
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు.
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు.
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవే ర్చాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి పట్టణంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం రాస్తా రోకో ధర్నా నిర్వహించారు.
గత వారంరోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి నగరంలోని బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారింది. కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తారు రోడ్డు దెబ్బతిన్నది. పద్మనగర్ శివాజీ జంక్షన్లో ఏర్పడ్డ భారీ గుంతలతో రోడ్డు ప్రమాదకరంగా మారింది.