‘శ్రీరామ జయరామ జయజయ రామా..’ నామస్మరణతో కొండగట్టు మారుమోగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన, వాహనాలలో తరలివస్తున్న దీక్షాపరులతో అంజన్న క్షేత్రం కాషాయవనంగా మారింది.
బాలికల వసతి గృహాల్లో పురుషులు పని చేయకూడదనే నిబంధన ఉంది. గతంలో ఈ నిబంధనను పక్కాగా అమలు చేశారు. కస్తూర్బా సహా ఇతర సంక్షేమ పాఠశాలల్లో, గురుకులాల్లో కొన్నాళ్లు వారి నియామకం విషయంలో ఉన్నతాధికారులు ఆచితూచి వ్యవహరించారు.
ఎట్టకేలకు కరీంనగర్ రైల్వేస్టేషన్ అభివృద్ధి జరిగింది. ఏళ్లుగా ఈ స్టేషన్ ఉన్నప్పటికీ పూర్థిస్థాయిలో ప్లాట్ఫాంలు లేక, రైళ్ల రాకపోకలు లేక అసౌకర్యంగా ఉండేది.
విద్యార్థులకు శారీరక, మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని చెప్పే ప్రభుత్వం ఆచరణలో నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీల కొరతను తీర్చకపోవడం.. క్రీడా సామగ్రి అందజేయకపోవడం.. పాఠశాలల్లో సరైన క్రీడా సదుపాయాలు లేకపోవడం..
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉన్న మహిళా సంఘాలకు బ్యాంకర్ల సాయంతో అధికారులు రుణాలు మంజూరు చేస్తున్నారు. ఏటా ప్రభుత్వం లక్ష్యం విధించడం.. అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పించడం, తిరిగి చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవడం పరిపాటిగా మారింది.
డిగ్రీ పట్టా చేతికందిన వెంటనే యూపీఎస్సీ పరీక్షల వేటలో పడ్డారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో రెండుసార్లు మెయిన్స్ వరకు వెళ్లారు. ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పరీక్షలో మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లగా.. రెండో ప్రయత్నంలో విజయం సాధించారు.
వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలకు మరింత పదును పెట్టేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. బడుల పునఃప్రారంభానికి ముందే పూర్తి చేసేలా తగిన కార్యాచరణ రూపొందించి అమలు పరుస్తోంది.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోంది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియల్లో అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టింది.
జిల్లాలో ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ధరణి చట్టాన్ని సవరించి భూ భారతి చట్టాన్ని అమల్లోకి తీసుకవస్తున్న నేపథ్యంలో సర్వేయర్ల అవసరం పెరగనున్నది. భూముల రిజిస్ట్రేషన్లకు అధీకృత మ్యాప్ జత చేయాలని చట్టంలో మార్పులు చేయడంతో సర్వేయర్లకు డిమాండ్ పెరగనున్నది. ప్రభుత్వ పరంగా తక్కువ మంది మాత్రమే సర్వేయర్లు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లను ఎంపిక చేసి వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది.
జగిత్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆగస్టులో ఎంబీబీఎస్ మరో బ్యాచ్కు భవనాలు అవసరం కానున్నాయి. నిధులు లేకపోవడం వల్ల పనులు నిలిచిపోయినట్లు వైద్య కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల భవనాల పనులకు గత ప్రభుత్వం రూ.132 కోట్లు నిధులు మంజూరు చేసింది. 2022 డిసెంబరు 7వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్ భూమి పూజచేసి పనులు ప్రారంభించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్ర గురువారం కరీంనగర్లో జరగనున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పన్నెండేళ్లుగా ఏక్తా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ఆనవాయితీలో భాగంగానే గురువారం భారీ ఎత్తున నగరంలో ఏక్తా యాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి 50 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు.
ఉరుములు, మెరుపులు, పిడుగులతో కురుస్తున్న అకాల వర్షాలు కర్షకులను కలవర పెడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వర్షపు జల్లులు జడివానగా మరికొన్ని చోట్ల కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యంతో దిగాలు పడుతున్నారు. వాతావరణంలో ఒకవైపు మార్పులు వచ్చి 40గరిష్ట డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా ఉక్కపోత మాత్రం వదలడం లేదు. బుధవారం సరాసరి 20.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
తెలంగాణ రాష్ట్రంలో 17 నెలలుగా అధి కారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేని దయనీయమైన పరి స్థితులలో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు.
విద్యార్థుల, ఉద్యోగుల భవిష్యత్తు నిర్మాణంలో ప్రాథమిక విద్య పునాదిరాయి లాంటిదని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం సెయింట్జార్జ్ పాఠశాలలో జరుగుతున్న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, వీణవంక మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు.
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను మూడు పద్ధతుల్లో వేరు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం నగరంలోని 12వ డివిజన్ భగత్నగర్లో పర్యటించారు. పలు కాలనీల్లో పాదయాత్రగా పారిశుధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు.
Minister Ponnam Prabhakar: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
కరీంనగర్ పట్టణంలోని రాజీవ్ చౌక్లో ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం శంకుస్థాపన చేశారు.