ఇందిరా మహిళా శక్తి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మ హిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండల కేంద్రంలో నియోజకవరానికి చెందిన 4,916 స్వశక్తి సంఘాలకు 4.76 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిరక్షణపై కీలక సూచనలు చేశారు.
రోడ్డు భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు.
రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపడంతో మంగళవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
రామగుం డం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం ముట్టడికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునివ్వడంతో మంగళ వారం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చందర్తో పాటు పలువురు నాయకులు మంగళవారం ఉదయమే కళ్యాణ్నగర్ చౌరస్తా వద్ద వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. వారిని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్స్టేషన్కు తరలిం చారు.
బాలికల విద్య ద్వారనే మహిళా సాధికా రతను సాధించవచ్చని జిల్లా మహిళా సాధికా రిత కేంద్రం సమన్వయకర్త డా. దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ జాబు సుచరిత అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై మం గళవారం మూలసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు అవగాహన కల్పించారు.
రామగుండానికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బోనంజా ప్రకటించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రూ.17వేల కోట్ల పెట్టుబడులతో రెండు విద్యుత్ కేంద్రాల స్థాపనకు ఆమోద ముద్ర వేసింది. జీవిత కాలం ముగియడంతో మూతబడిన బీ థర్మల్ స్థానంలో ఎన్టీపీసీ సహకారంతో 800మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మానేరు పరివాహాక ప్రాంతాల నుంచి ఇసుక రవాణా దందా జోరుగా సాగుతోంది. ఒక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకొని కేసు పెడితే, విడిపించుకునేందుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అక్రమార్కులు ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది.
చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి.. ఉన్నత చదువులు చదుకోవాల్సిన యుక్త వయసులో చెల్లి, తమ్ముడు, వృద్ధులైన నానమ్మ, తాతయ్యల బాగోగుల, పోషణ చేసుకోవాల్సిన పరిస్థితి ఓ డిగ్రీ విద్యార్థినిది. తాను చదుకుంటూ తోబుట్టువులను చదివిస్తూ, నలుగురిని పోషిస్తోంది. ఇంటి పనులన్నీ చేస్తూ.. పాడి ఆవును చూసుకుంటూ చిన్న వయసులో కుటుంబ బాధ్యతను తన భుజాల మీద వేసుకొని మోస్తోంది.
కేవలం కుట్టుమిషన్, బ్యూటీషియన్ వంటి కోర్సులకే పరిమితం కాదని శిక్షణ ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తామంటున్నారు ఈ మహిళలు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఈ-ఆటో డ్రైవింగ్లో 14 మంది మహిళలు శిక్షణ పొందారు
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నాణ్యత లేకుండా కూలిన చెక్ డ్యామ్ల నిర్మాణాలపై విచారణ చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు.
దొంగతనం కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ సోమవారం తెలిపారు.
అహారపు అలవాట్లు.. శారీరక శ్రమ లేకపోవడంతో 30 ఏళ్ల వారిలో మధుమేహ లక్షణాలు వెలుగు చూస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ సర్వేలో జిల్లాలో ఒక్క ఏడాదిలోనే 4,497 మంది బాధితులను గుర్తించారు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లా వ్యాప్తంగా నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో పురోగతి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న క్షేత్రస్థాయిలో కదలిక లేదు. సకాలంలో ఇసుక, ఇటుక దొరకకపోవటం.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితుల వల్ల నిర్మాణాల్లో వేగం లోపించింది.
భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తోంది. జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో 100 మంది లైసెన్స్డ్ సర్వేయర్లతో చేపట్టనుంది. గతంలో ఒక సర్వే నంబరులో ఒకరికి మించి వ్యక్తులు చేరినప్పుడు పక్కన తెలుగు, ఆంగ్ల అక్షరాలు చేర్చి రికార్డుల్లో కొనసాగించేవారు