రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో ఆదివారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి అదే గ్రామానికి చెందిన శివరాత్రి అనిల్ (27) దుర్మరణం పాలయ్యాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన బుచ్చవ్వ ఈ నెల 17న తెల్లవారుజామున రోడ్డు పక్కన నిలుకొని ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందారు..
జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు రైల్వే గేటు కష్టాలు తప్పడం లేదు. ఏళ్లుగా అంతర్గాం, పాలకుర్తి, పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండల ప్రజలు గేటు కష్టాలు అనుభవిస్తున్నారు.
పంచాయతీల్లో సర్పంచులు, వార్డుల రిజర్వేషన్లు తేలడంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిచి సర్పంచులుగా ఉపసర్పంచులుగా అవకాశం దక్కించుకోవాలని చాలా మంది ఆరాటపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది.
జిల్లాలోని నగర, పురపాలికల్లో చిరు వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. అయిదేళ్ల నుంచి వారికి ప్రధానమంత్రి స్వనిధి రుణాలను అందిస్తోంది.
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, కస్తూర్బాగాంధీ బాలికలు, ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థి క్లబ్ల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఆర్థిక చేయూతను అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ధర్మపురి పురపాలికలో గతంలో చేసిన భువన్ సర్వేతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఇష్టారాజ్యంగా ఇంటి నిర్మాణ కొలతలను నమోదు చేయడంతో తమపై రెట్టింపు భారం పడుతోందని ప్రజలు వాపోతున్నారు.
జగిత్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్ నుంచి అయోధ్య, వారణాసి, ప్రయాగ్రాజ్ సూపర్ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు.
లేబర్ కోడ్ల అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణలు డిమాండ్ చేశారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు మడివి హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులను ఈ నెల 18న మారెడ్మిల్లిలో బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హతమార్చారని పలు ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.
సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడు కలు ఘనంగా నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్క ర్రావుభవన్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక కుటుంబాల సమ్మేళ నానికి హాజరయ్యారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల మానేరు వాగుల్లోని ఎనిమిది చెక్ డ్యాములు కృంగిపోయాయని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గుంపుల వాగులో కృంగిన చెక్ డ్యామును ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు పరిశీలించారు.