అర్బన్ నక్సల్స్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. వారిని చూసి మోసపోవద్దంటూ ప్రజలకు హితవు పలికారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పైరవీలు చేసుకుంటూ వారు ఆస్తులు పోగేసుకుంటున్నారని విమర్శించారు.
కళాశాల విద్య, పరిశ్రమల అవసరాలకు మధ్య అవకాశాలు కోల్పోతున్న యువతలో నైపుణ్య వికాసం పెంపొందించి ఉద్యోగ భద్రత కల్పించేందుకు టాస్క్(తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) అండగా నిలుస్తోంది.
అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. జగిత్యాలకు చెందిన సౌజన్య (27) వివాహం పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్తో గతేడాది మార్చి 22న జరిగింది.
2022లో ఓ ప్రజాప్రతినిధి వాహనంలో జిల్లాసుపత్రి నిధుల నుంచే వేర్వేరు సందర్భాల్లో డీజిల్ పోయించారు. ఆ ఏడాది రూ.44,536కు సంబంధించిన బిల్లుల సమర్పణలో ఆసుపత్రి సిబ్బంది జాప్యం చేశారు.
ఉమ్మడి జిల్లాలో గత పది రోజులుగా చలి తీవ్రత కొనసాగుతుండగా మంగళవారం మరింత అధికమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్కు చేరగా మిగిలిన జిల్లాల్లోనూ దాదాపు అదే పరిస్థితి.
రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ విద్యను పూర్తిచేసిన యువ వైద్యులు పేదలకు వైద్యం అందించేం దుకు ముందుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
కేజీబీవీలో చదివే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఎల్లంపల్లిలోని కేజీబీవీ పాఠశాల, అంతర్గాంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ర్థుల బోధన శైలి, పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ వైద్యులకు సూచించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సందర్శించారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలనికలెక్టర్ కోయ శ్రీ హర్ష పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్ట రేట్ సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సంద ర్భంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ డి వేణు, డీసీపీ కరుణాకర్లతో కలిసి అధి కారులు, కలెక్టరేట్ సిబ్బందిచే మాదకద్ర వ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించారు.
కొత్త నిబంధనలు ఎత్తివేసి, పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో అధికారులతో మాట్లాడి రాజీవ్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.