వర్షాకాలంలో రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ను త్వరలోనే జమ చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
మా ఊరి సర్పంచి రిజర్వేషన్ ఏది ఖరారవుతుందోననే ఉత్కంఠ గ్రామాల్లో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల దిశగా ఏర్పాట్లు చేస్తుండటంతో పాత రిజర్వేషన్ల విధానానికి యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
నానాటికీ పెరుగుతున్న ప్రజల ఆసక్తిని గమనించి మహిళా సంఘం ద్వారా అక్వేరియంలో పెంచే చేప పిల్లల వ్యాపారానికి వీలుగా కరీంనగర్లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ సన్ప్రీత్సింగ్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో పారిశుధ్యం పెంపునకు ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించింది.
రోడ్డు ప్రమాదం, అగ్నిప్రమాదం, గొడవ, దాడులు, పేకాట, వ్యభిచారం, గుడుంబా, గంజాయి, డ్రగ్స్, పోకిరీల వేధింపులు, ఎటువంటి సమస్య అయినా ఆపదలో గుర్తుకు వచ్చేది డయల్ 100 టోల్ఫ్రీ నెంబర్. డయల్ 100తో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత అంశాల్లో పారదర్శకత పెంచేలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతిగా మార్చారు. తాజాగా భూసమస్యల పరిష్కారానికి లైసెన్సడ్ సర్వేయర్లను నియమించిన ప్రభుత్వం సమగ్ర స్థాయిలో భూ సర్వేకు నిర్ణయించింది.
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడికి వెళ్ళిన నాయ కులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవా రం ఓసీపీ-3 ఎస్అండ్డీ సెక్షన్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
అయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వచ్చే అవకా శం ఉందని పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీని వాస్, కుడుదుల వెంకన్నలు వెల్లడించారు. అయిల్ పామ్ సాగుపై పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు.
దేశంలో అట్టర్ ప్లాప్ సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచాడని, ప్రజల కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బయోమెడికల్ వ్యర్థా లను మున్సిపల్ వ్యర్థాలతో కలిపితే కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ అరుణశ్రీ పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహ కులకు సూచించారు. శుక్రవారం రామగుండం మున్సిపల్ పరిధి లోని ఆసుపత్రి నిర్వాహకులతో ఎన్టీపీసీలోని ఈడీసీ మిలీనియం హాల్లో ప్రభుత్వ, ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్లు, డెంటల్ క్లినిక్స్, స్కాన్ సెంటర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.