జిల్లాలో పలు చోట్ల నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందు బాటులోకి తీసుకువచ్చేందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిం చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గురుకుల పాఠశా ల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాత్త్రగా చర్యలు చేపట్టడంతోపాటు పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాజన్న సిరి సిల్ల జిల్లా కేంద్రంలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్లు భిక్షాటన చేశారు.
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని, కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అన్నారు. ప్రైవేట్ ఫంక్షన్హాల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల పూర్తి చేసుకున్న సం దర్భంగా ‘వికసిత్ భారత్ అమృతకాల సేవ, సుసరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు’ పేరుతో సమావేశం నిర్వహించారు.
కూచిరాజ్పల్లి శివారులో రియల్ ఎస్టేట్ దందా నడిపించడానికి ఎమ్మెల్యే పట్టణ శివారులో రింగ్రోడ్ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఇటీవల మంత్రి రింగ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన స్థలంలో గురువారం మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్లో సోదరుడికి వాటా ఉండటంతో రింగ్ రోడ్ను ఈ భూముల సమీపంగా తీసుకెళ్ళే విధంగా ప్లాన్ చేశారన్నారు.
ప్రతీ ఉద్యోగి ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలని ఆర్డీవో గంగయ్య తెలిపారు. గురువారం తహసీల్దార్ రాజయ్య ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధికారులకు, బిఎల్వోలకు, సూపర్వైజర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు.
హుజూరాబాద్, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాల ప్రజలకు హుజూరాబాద్ ఏరియా, జమ్మికుంట ఆసుపత్రులే పెద్దదిక్కు. ఈ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మూడేళ్లుగా ‘చేయూత’ కోసం ఎదురు చూస్తున్న హెచ్ఐవీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా హెచ్ఐవీ బాధితులకు ‘చేయూత’లో భాగంగా నెలకు రూ.2016 పింఛన్ చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఉమ్మడి జిల్లాలో 1706 మందికి ప్రయోజనం చేకూరనుంది.
కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల ఉపసంహరణ అనంతరం ఇంకా ఎవరి వద్ద అయినా ఆ నోట్లు మిగిలి ఉంటే వాటిని మార్చుకునే అవకాశం రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా తపాలాశాఖ ద్వారా కల్పించింది.
అగ్ని, రోడ్డు, భవనాలు, పరిశ్రమల్లో ప్రమాదాలు ఏర్పడితే ప్రాణ, ఆస్తిని రక్షించడానికి ఎస్డీఆర్ఎఫ్(స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ముందుంటుంది. ఇదే విభాగాన్ని ఇప్పుడు ఉమ్మడి జిల్లా కేంద్రంగా కరీంనగర్ అగ్నిమాపకశాఖలో సైతం ఏర్పాటు చేశారు.
జగిత్యాలకు చెందిన రేవెళ్ల రవీందర్(57) ఉపాధి కోసం ఇజ్రాయెల్ దేశానికి వెళ్లి గత నెల 16న గుండెపోటుతో మృతి చెందారు. యుద్ధం నేపథ్యంలో మృతదేహం అక్కడే ఉండగా కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు యుద్ధం ముగిసిన వెంటనే భారత ప్రభుత్వం స్వదేశానికి తెప్పించే ఏర్పాట్లు చేసింది.
జిల్లాలో అధ్వానంగా మారిన పారిశుద్ధ్యం, వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరాలు విస్తరిస్తున్నాయి. ఇందులో టైఫాయిడ్ కేసులు అధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికలతో పాటు జగిత్యాల పురపాలికలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తకాగా రిజర్వేషన్లపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది.
తమ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న బోయినపల్లి మండలంలోని మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల నిరీక్షణకు తెరదించేలా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్కుమార్ ఝాలు చర్యలు చేపడుతున్నారు.
పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. ఏళ్లుగా ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో కొన్నిచోట్ల గత ప్రభుత్వ హయాంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల పనులు పూర్తి చేశారు.
కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.