వేములవాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రా మాల్లో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యం గా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని శాస నసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించా రు.
జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించా లని ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమ అగ్రవాల్ కోరారు.
ఓదెల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొలనూర్ రైల్వేస్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని బుధ వారం నాయకులు సికింద్రాబాద్లో రైల్వేచీఫ్ ప్రిన్సిపాల్ ఆపరేటింగ్ మేనేజర్ పద్మజకు వినతిపత్రాన్ని అందజేశారు.
కళ్యాణ్నగర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసు పత్రి ఆర్ఎంవో రాజు తనభార్య శివానీని మొదటికాన్పుకోసం ప్రభుత్వ జనరల్ఆసుప త్రిలో బుధవారం చేర్పించగా శివాని మగ శిశువుకు జన్మనిచ్చింది.
పెద్దపల్లిటౌన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీసీల ప్రయోజనాలను విస్మరించొద్దని, తక్షణమే 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీ నాయకులతో కలిసి బీసీ జేఏసీ జిల్లాచైర్మన్ దాసరి ఉష జీవో ప్రతులను దహనం చేశారు.
గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నోడల్ అధికారులు తమ విధులపై పూర్తి అవగాహన కలిగి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
స్వదేశీ ఉత్పత్తులతో మేకిన్ ఇండియాను ప్రోత్సహించినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ల రమేష్ అన్నారు.
జిల్లా కేంద్రంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు అనుమతుల ప్రకారం పార్కింగ్ కోసం వదలాల్సిన స్థలాలు వదలకపోవడంతో వాహనాలన్నీ రోడ్ల మీదనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధిగా వాహనాలు నిలిపేందుకు స్థలం ఉండాల్సి ఉండగా,
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తూ వారు సేవా భావంతో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు స్కౌట్, గైడ్స్ శిక్షణ దోహదపడుతుంది. దీనిని మరింత పెంచేందుకు సమగ్రశిక్షా రాష్ట్ర అధికారులు ముందుకొచ్చారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు ఎన్నికల సంఘం గంట మోగించింది. మూడు విడతలుగా జిల్లాలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 316 గ్రామపంచాయతీలు,
ప్రస్తుత ఆధునిక కాలంలో పిల్లలు అత్యంత సున్నిత మనస్కులుగా మారుతున్నారు. బడికి వెళ్లాలని, తల్లిదండ్రులు మందలించారనో.. తోటి విద్యార్థుల ఎదుట ఉపాధ్యాయుడు కోపగించాడనో.. మిత్రులు పోట్లాడారనో..
అందరికీ ఇష్టమైన కూరగాయ టమాట. కూర ఏదైనా అందులో టమాట ఉంటేనే రుచికరం. నిత్యావసరమైనా స్థానికంగా సాగు లేక ఏపీలోని అనంతపురం నుంచి జగిత్యాలకు దిగుమతి చేసుకుంటున్నారు. అంటే దాదాపు 600 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకు రావాల్సి వస్తోంది.
జగిత్యాల పట్టణం, పరిసర గ్రామాల్లో చెరువుల ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పట్టణం చుట్టూ ఉన్న ఏడు చెరువులు అక్రమ నిర్మాణాలతో క్రమంగా కుచించుకుపోతున్నాయి. స్థానికంగా మోతె చెరువు, రాజుల చెరువు,
పదోతరగతి పరీక్షల మూల్యాంకన జవాబు పత్రాల అమ్మకాల్లో అవినీతి బండారం బయటపడింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అప్పుడు ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్గా వ్యవహరించిన ప్రస్తుత సూపరింటెండెంట్ ఎన్.నరసింహ స్వామిని సస్పెండ్ చేస్తూ...
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల కావడంతో పల్లెల్లో సందడి మొదలైంది. జిల్లాలో 385 పంచాయతీల పరిధిలో 3,536 వార్డులుండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి స్థానాల్లో ఎస్టీ మహిళకు 10, ఎస్టీ జనరల్కు 17 రిజర్వ్ చేశారు.
మంథని పురపాలికలో అమృత్-2.0 పథకం కింద చేపట్టిన పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. గుత్తేదారుకు నోటీసులు జారీ చేసినా ముందుకు సాగటం లేదు. రూ.12.10 కోట్ల వ్యయంతో వాటర్ ట్యాంకు,
సుదీర్ఘ కాలంగా రామగుండం ప్రాంత ప్రజల పోరాటాలు, ఉద్యమాలు ఫలించాయి. ఈ ప్రాంతంలో 800 మెగావాట్ల జెన్కో విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం మంగళవారం లభించింది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అర్బన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తనిఖీ బృందం నిశితంగా పరిశీలిస్తోంది. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో ప్రయోగాత్మకంగా పది ఇళ్లు(పునాది, గోడలు, స్లాబ్) మూడు కేటగిరీల వాటిని సందర్శించారు.
రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇందుకు అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాత్రి వేళ వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
రాజన్న ఆలయ పరిపాలనలో అవకతవలకలకు అడ్డుకట్ట పడటం లేదు. ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం తూతూమంత్రంగా అంతర్గత బదిలీలతో సరిపెడుతున్నారు. దీనికి నిదర్శనం గతనెల ఆలయ స్టోర్స్ నుంచి అర్ధరాత్రి సామగ్రిని తరలిస్తున్న వ్యవహారం బయటపడింది.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాముపపల్లిలో చింతకుంట్ల సుకృత(49) అనే మహిళ ఇటీవల పొలం వద్ద మంటల్లో కాలిపోయి మృతిచెందిన ఘటనకు సంబంధించి పోలీసులు మృతురాలి భర్తను మంగళవారం అరెస్టు చేశారు.
విశ్వవిద్యాలయాలు.. భావిభారత పౌరులను తయారు చేసే ప్రాంగణాలు. అలాంటి చోట అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. శాతవాహన విశ్వవిద్యాలయంలో భారాస ప్రభుత్వ హయాంలో అవకతవకలు,