వాట్సప్లో వచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.6 లక్షల నగదును పోగొట్టుకున్నాడు.
పంచాయతీ ఎన్నికల మూడోవిడత నామినేషన్ పత్రాల పరిశీలన ముగిసింది. పెద్దకొడప్గల్ మండలంలోని నాలుగు గ్రామ పంచాయితీల సర్పంచి, 14 మంది వార్డు సభ్యుల నుంచి ఒక్కొక్క నామినేషన్ రావడంతో దాదాపు ఆయా స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది.
చేసే పనిని బట్టి గుర్తింపు వస్తుందంటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వారికి మాత్రం.. తాము చేస్తున్న పని, అభిరుచే ఇంటి పేర్లుగా మారాయి. అసలు ఇంటి పేరు చెబితే గుర్తించరు కానీ, వారు చేస్తున్న పని.
ఏ అండా లేని అభాగ్యులు వారు. ఆకలి పస్తులతో కొందరు, తీవ్ర అనారోగ్యంతో మరికొందరు నడిరోడ్లపైనే సొమ్మసిల్లి పడిపోతున్నారు. చలితీవ్రత పెరగడంతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
నిజామాబాద్ నగరానికి ముఖద్వారాలుగా నిలిచే మార్గాల్లో.. వివిధ ప్రధాన కూడళ్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. అక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు గతంలో ఏర్పాటు చేసిన సిగ్నళ్లను వినియోగంలోకి తేవడం లేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీఓటు విలువైనదే. ఒక్క ఓటు అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేస్తుంది. అయితే చాలా మంది సొంత గ్రామంలో ఉన్నా.. పొరుగు గ్రామం, పట్టణంలో నివసిస్తున్నా ఓటు వేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు.
ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జానకంపేట, అభంగపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించారు.
విద్యా విధానంలో మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. వార్షిక పరీక్షల తర్వాత విద్యార్థులకు ఇచ్చే మార్కుల జాబితా పత్రాల్లో మార్పులు జరగనున్నాయి. ఏటా పిల్లలకు అందించే పత్రాల్లో ఫలితాలతో పాటు ప్రతిభా నైపుణ్యాలను జోడించనున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లపై అభ్యర్థులు దృష్టిసారించారు. ఆయా గ్రామాల్లో ఉద్యోగస్థులు, సైన్యంలో పనిచేస్తున్న వారి వివరాలు తెలుసుకొని ఓటు అభ్యర్థిస్తున్నారు.
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు శనివారం ఉదయం సెల్ టవర్ ఎక్కడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని సెల్ టవర్ను పవన్ అనే యువకుడు ఎక్కారు.
హిందూ దేవుళ్లపై రేవంత్రెడ్డికి ఎందుకు కోపమని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిలదీశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని రేవంత్రెడ్డి అన్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్లను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.