కొత్త నటీనటులతో తెరకెక్కిన మేమ్ ఫేమస్ చిత్ర బృందం ఇందూరులో సందడి చేసింది. యూత్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేపట్టిన సినిమా యాత్రలో భాగంగా గురువారం జిల్లా కేంద్రానికి వారు చేరుకున్నారు.
యూపీహెచ్సీ స్థాయిలో స్పెషాలిటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సాయంత్రం క్లీనిక్లు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. నెలకొల్పిన తర్వాత ఒకటి, రెండు నెలలలోపే మూతపడ్డాయి.
కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనుల్లో భాగంగా జక్రాన్పల్లి మండలం చింతలూర్ వాగులో ఏర్పాటు చేసిన డెలివరీ పాయింట్లో మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తిచేస్తామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు కాయకల్ప పురస్కారాలను తాజాగా కేంద్రం ప్రకటించింది. కామారెడ్డికి వైద్యకళాశాల మంజూరైన నేపథ్యంలో వచ్చే ఏడాది జిల్లా ఆసుపత్రికి కాయకల్ప పురస్కారం ఉండదు.
చిన్న రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయి... స్వరాష్ట్ర సాధనకు ఉపయోగపడిన నినాదమిది. తెలంగాణ సిద్ధించాక ప్రజల సంక్షేమం కోసం సర్కారు తపించింది. పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సర్కారు తొమ్మిదేళ్లలో విప్లవాత్మక, చెప్పుకోదగ్గ మార్పులకు నాంది పలికింది.