నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం.. కుమారుడు, భార్యతో కలిసి గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం బోధన్ మండలం పెగడపల్లి శివారుకు వెళ్లారు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్కు పసుపు పోటెత్తింది. సీజన్ ప్రారంభమైన తర్వాత సోమవారం మొదటిసారి అత్యధికంగా 23,744బస్తాల పసుపు వచ్చింది. కొన్ని రోజులుగా పసుపు ధర క్వింటాలు రూ.10వేలకు
నగరపాలక సంస్థ పరిస్థితి అధ్వానంగా మారింది. ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోవడం.. కాల్వలు నిండి మురుగు రోడ్లపై ప్రవహించడం.. వీధి దీపాలు లేవని ఫిర్యాదులు చేసినా స్పందించకపోవడం.. ఇలా అనేక సమస్యలతో నగరవాసులు కష్టాలు పడుతున్నారు.
విధి నిర్వహణలోని పోలీసులపైకి కారు దూసుకొచ్చి ఓ కానిస్టేబుల్ దుర్మరణం చెందగా.. మరొకరికి గాయాలైన ఘటన గాంధారి మండలకేంద్రంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది.
స్వయం సహాయక సభ్యులైన మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద పలు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించింది.
విద్యుత్తు వినియోగంలో దరఖాస్తు చేసుకున్న కిలోవాట్ల పరిధి దాటకుండా చూసుకోవాలి. లేదంటే వినియోగదారులు అదనంగా డెవలప్మెంట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లాలో ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఇంటర్ ప్రధాన పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ సారి ప్రథమ సంవత్సరంలో సాధారణ 6828, వొకేషనల్లో 1915, ద్వితీయ సంవత్సరంలో 8339, వొకేషనల్ 1390 మంది పరీక్షలకు నమోదు చేసుకున్నారు.
పురపాలికల్లో ఆయా విభాగాల పనితీరుపై ఇకపై పర్యవేక్షణ పెరగనుంది. పని విభజన ద్వారా పాలన సులువవనుంది. ఇటీవల విధుల్లో చేరిన వార్డు అధికారులకే కీలక బాధ్యతలు అప్పగించారు.
పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ యంత్రాంగం తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.