శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ సంక్షేమ పథాన్ని సూచిస్తోంది. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది.
ఇది ముప్కాల్ మండల తహసీల్దార్ కార్యాలయం. స్థానికంగా గ్రామాభివృద్ధి కమిటీకి చెందిన భవనంలో కొనసాగుతోంది. సరైన సౌకార్యలు లేని కారణంగా సిబ్బంది కష్టంగా విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో గురువారం ఉదయం నుంచి నిరంతరాయంగా ముసురు కొనసాగుతూనే ఉంది. పలు మండలాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం పడింది.
అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన జీర్ల చిన్నమల్లయ్య(53)ను ఈ నెల 19న అదే గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులు హత్య చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ఫలాలు చాలా మందికి అందడం లేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే వంట గ్యాస్ సరఫరా చేస్తామని ప్రకటించారు.
చరవాణులు మానవ జీవితంలో భాగమయ్యాయి. ఏవైనా వస్తువులు లేకపోయినా ఉంటున్నారు కానీ చరవాణి లేకుండా నిమిషం ఉండలేక పోతున్నారు. అలాంటి చరవాణి పోతే పరిస్థితి ఏంటీ..
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మూడో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హమాల్వాడికి చెందిన వేణుకుమార్ ఈ నెల 23న కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లారు.
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి.
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు.
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.