Telangana: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికాభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ప్రధాన మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ స్కీం(పీఎంఎఫ్ఎంఈ) ద్వారా ఉపాధి కల్పించనుంది. దీని ద్వారా చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహం అందించనుంది.
సమాజంలో అణగారిన వర్గాలకు సేవలందించడమే అందరి లక్ష్యంగా మారాలని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం బోధన్ పట్టణ శివారులోని కమ్మసంఘ రజతోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు.
జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. గత మూడు నెలల కాలంలో 2.22 మీటర్ల లోతులోకి వెళ్లిపోయాయి. జిల్లాలోని 33 మండలాల్లో 81 ఫిజియోమీటర్స్ పెట్టిన ప్రాంతాల్లో భూగర్భజలశాఖ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
రానున్న రోజుల్లో భారాస ఉండదని గ్రామీణ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి అన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్ అమెరికాకు, హరీశ్రావు భాజపాకు ఎప్పుడు పోతారో తెలియదని, భారాస ఎమ్మెల్యేలు ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి బాటలు వేస్తాయి. ఆత్మరక్షణ క్రీడలో ప్రవేశం ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా తైక్వాండోలో నిరంతరం సాధన చేస్తూ.. రాటుదేలుతున్నారు జిల్లాకు చెందిన క్రీడాకారులు.
కామారెడ్డి జిల్లాకేంద్రంలోని శ్రీరాంనగర్కు చెందిన శ్రీనివాస్కు సంబంధించి ఇంటి పన్ను ఏడాదికి రూ.2600 విధించారు. ఈ ఇంటికి కుళాయి పన్ను ఏటా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల బల్దియా కార్యాలయానికి వెళ్లకుండానే అసెస్మెంట్ నంబరు ద్వారా ఆస్తి పన్ను చెల్లించారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేతలు గెలిచినందుకు చికెన్ వ్యాపారులు తమ అభిమానం చాటుకున్నారు. నిజామాబాద్ నగరం వీక్లీ మార్కెట్లో చికెన్ వ్యాపారులు ఆదివారం ఒక్కసారిగా ధర తగ్గించి అమ్మారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని ఏడు జోన్ల పరిధిలోని గురుకులాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు సత్తా చాటుతున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తోంది. దరఖాస్తులను ఆన్లైన్ చేస్తూ పరిష్కార మార్గాలను నిర్దేశిస్తూ అధికారుల్లో జవాబుదారీతనం నెలకొల్పేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన, ఓటమి చెందిన అభ్యర్థులు సమర్పించిన ప్రచార వ్యయాలపై ఎన్నికల సంఘం వ్యయపరిశీలకులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయా లెక్కలు ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు అనుగుణంగా లేనట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 3న పూర్తి చేశారు. ఫలితాల వెల్లడి తర్వాత ఈవీఎం యంత్రాలను తిరిగి స్ట్రాంగ్రూంలలో భద్రపరిచారు.
ప్రస్తుత యాసంగి పంటల సాగు నత్తనడకన సాగుతోంది. సీజన్ ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా కొన్ని పంటలైతే ఇంకా విత్తలేదు. మొక్కజొన్న, శనగ, జొన్న పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
విద్యుత్తు శాఖలో జరిగిన రూ.80 వేల కోట్ల నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డిలో భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లి శివారులోని గీతా కాన్వెంట్ హైస్కూల్ ఆవరణలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 42వ రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి.
నిజామాబాద్ ప్రధాన ప్రయాణ ప్రాంగణంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ..
సామాన్యులు ఒకనెల కరెంటు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే అపరాధ రుసుం వేసి బెదరగొట్టి వసూలు చేసే ట్రాన్స్కో అధికారులు ఆర్మూర్లో ఓ మాజీ ప్రజాప్రతినిధి రూ....
నిజామాబాద్ నాగారం: సామాన్యులు ఎవరైనా రెండు నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే ఇంటిముందు హంగామా చేసే విద్యుత్ శాఖ అధికారులు ఓ మాజీ ప్రజాప్రతినిధి ఏడాదిగా...
జక్రాన్పల్లి: పడకల్ గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ భూనీలా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో...