[04:47] అంతర్జాలం.. ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక సదుపాయం. ఇది ఎంత సౌకర్యవంతమో అంతలా ప్రమాదకరంగానూ మారిందని పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి.
[04:47] అక్రమార్కుల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఎలాగైనా సరే దానిని సొంతం చేసుకుంటున్నారు. యథేచ్ఛగా అందులో పంటలు సాగు చేస్తున్నారు.
[04:47] వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు జమునా రాఠోడ్, భర్త వెంకట్(వైద్యుడు)తో కలసి సోమవారం ఆ పార్టీలో చేరారు.
[04:47] ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందు కేంద్రం కుట్ర చేసిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టించటం దీనికి నిదర్శనమన్నారు.
[04:47] చుట్టూ అటవీ ప్రాంతం. మధ్యలో నర్సింగ్ పాఠశాల. ఎప్పుడు ఏమవుతుందో తెలియక దినదిన గండంగా మారింది విద్యార్థినుల పరిస్థితి. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం శోచనీయం.
మండలంలోని క్రిష్ణాజీవాడి గ్రామశివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మీపతి(55) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
తమ రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహిళలు రొడ్డెక్కిన స్పందించకపోవడం విచారకరమని బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి వెంకటరమణరెడ్డి అన్నారు.
పొగాకు నియంత్రణపై జూనియర్,డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.