కార్పొరేషన్(కాకినాడ), జూలై 8(ఆంధ్రజ్యో తి): పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆర్థికంగా పైకి తేవడానికి పేదవాడిని పైకి తెద్దాం ప్రణాళిక ద్వారా పేదరిక నిర్మూలన, సమాజ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అందించేందుకు లక్ష్యంగా పెట్టుకుని సీఎం చంద్రబాబు పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాఖలైన మైనింగ్ దరఖాస్తులకు స్కెచ్లు విక్రయించి భారీగా వెన కేసుకున్న వ్యవహారంలో గలీజు సర్వేయర్కు ఉ చ్చు బిగుస్తోంది. ఒకరికి తెలియకుండా మరొ కరికి మైనింగ్ స్కెచ్లు విక్రయించడం, అటు భారీ మొత్తాల్లో డబ్బులు గుంజేసి స్కెచ్లు ఒకే వ్యాపారికి అందేలా చేసి అడ్డగోలు లబ్ది చేకూర్చిన సదరు సర్వేయర్ తీరుపై విచారణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు ఈ అక్రమా
పెద్దాపురం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): అధికారులంటే భయం లేదు... ప్రజలు గమనిస్తారన్న లెక్కేలేదు... రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ధైర్యమో లేక తమను ఎవరేం చేస్తారన్న ధీమా కాబోలు.... మట్టి మా ఫియా ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతో ంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మట్టి మాఫి యా రెచ్చిపోతోంది. పొలాల మెరక పేరుతో రైతు లతో దరఖాస్తు చేయించి అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నారు. 10వేల క్యూ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ, ఎస్సీ కార్పొరే షన్ల ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణ యూనిట్లకు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ తరహా రుణాలను ఐదేళ్లు పూర్తిగా నిలిపి వేసింది. అయితే కూటమి ప్రభుత్వం రావడంతో కార్పొరేషన్ రుణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంతా సంబరపడ్డారు. తీరా రుణాలు మంజూరైనట్టే అయి నిలిచిపోవడంతో అసలు వీటిని ఎప్పుడు తిరిగిస్తారో తెలియక పడిగాపులు కాస్తున్నారు .
దేశ కార్మికుల న్యాయమైన హక్కులను కాపాడేందుకు ఈ నెల 9న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీఎన్ పూర్ణిమరాజు అన్నారు. ఈ మేరకు మంగళవారం దివాన్చెరువులో పంచాయతీ వద్ద పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను బానిసలుగా చేయడమే కేంద్ర ప్రభుత్వం చర్య అని ఆరోపించారు.
రేపు నిర్వహించబోయే మెగా పీటీఎం 2.0ను విజయవంతం చేయాలని ఆర్జేడీ జి.నాగమణి ఉపాధ్యాయులకు సూచించారు. బిక్కవోలు ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వర్క్బుక్స్ పరిశీలించారు.
అమలాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి బయలుదేరే ఏసీ బస్సులకు ఈనెల 24వతేదీ వరకు ప్రత్యేక తగ్గింపు ధరలు ఇస్తున్నట్టు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి మంగళవారం తెలిపారు.
గోదావరి నదీ తీరం వెంబడి పర్యాటకరంగ అభివృద్ధిలో భాగంగా ఆరు అడ్వెంచర్ టూరిజం పాయింట్ల అభివృద్ధికి టెండర్లు పిలిచినట్టు కలెక్టర్ మహేష్కుమార్ వెల్లడించారు.
మండలంలోని జెడ్.రాగంపేట గ్రామంలో జాతీయ రహదారి నుంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు రూ. 60 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు.
జంట జబ్బులుగా పేరున్న మధుమేహం, అధిక రక్తపోటు రుగ్మతలతో జిల్లా ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) సర్వేలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తొలి ఏడాదిలో రోడ్లపై గుంతలు పూడ్చి.. ప్రజల ప్రయాణాలు సౌకర్యంగా మార్చిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది ఆయా రహదారుల ప్రగతికి పచ్చ జెండా ఊపింది.
ఇల్లు చూసి.. ఇల్లాలిని చూడు అన్నది నానుడి.గృహాన్ని చక్కదిద్దుకోవడంలో ఇల్లాలిది బృహత్తర బాధ్యత మరి. ఈ నేపథ్యంలో పల్లెల పరిశుభ్రతలో మహిళలను భాగస్వామ్యులను చేయాలని సర్కారు భావిస్తోంది.
గత ప్రభుత్వంలో వైకాపా నేతల అండతో పేదల భూములపై పెద్దలు వాలిపోయారు. ఎన్నికలకు కొన్ని నెలలు ముందు అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చని జీవో తెచ్చి చక్కబెట్టేశారు.
ముఖ్యమంత్రి ఈ నెల 1న మా ఇంటికి రావడంతో తమ జీవితాల్లో వెలుగు వచ్చింది. ఇది మరుపురాని సంఘటన అని’’ అని ఇటీవల కలెక్టర్ దత్తత తీసుకున్న కుటుంబంలోని యువకుడు మోహన్ అన్నారు.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, వీఎల్పురం, న్యూస్టుడే: వైకాపా అధినేత జగన్ తీరు మారకుంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఒకటి, రెండు సీట్లకే పరిమితం కావాల్సి వస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.