తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జిల్లాస్థాయి మినీ మహానాడు శుక్రవారం రాజమహేంద్రవరంలో జరగనుంది. జేఎన్ రోడ్డులో గల చెరుకూరి కన్వెన్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు శాఖ అధికారులు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పుష్కరాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఆరు ఉప విద్యుత్తు కేంద్రాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
సర్కారు ఆసుపత్రుల్లో పుట్టిన చిన్నారుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ బేబీ కిట్లు సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వేలమంది బుజ్జాయిలకు మేలు చేకూరనుంది.
పాడి రైతులకు మేలు చేస్తున్నామన్న ముసుగులో అమూల్ సంస్థతో గత వైకాపా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అట్టహాసంగా ప్రారంభించిన ్ఞజగనన్న పాలవెల్లువ్ఠకు రూ.కోట్ల నిధులు కుమ్మరించింది. నిర్దేశిత కేంద్రాలకు పాలు ఇవ్వాలని రైతులు, అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
భూగర్భ జల నిల్వల పెంపే లక్ష్యంగా చేపట్టిన పంట సంజీవని కుంటల పనులు మందకొడిగా సాగుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో కుంటల తవ్వకానికి సుమారు ఐదు సెంట్లు భూమి కేటాయించాల్సి రావడంతో సన్న, చిన్న కారు రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించినట్లు వ్యవసాయ, సహకార, మత్స్యశాఖల మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
అన్నవరం దర్శనానికి వస్తుండగా ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది గాయపడిన విషయం తెలిసిందే. బాధితులంతా ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
కాకినాడ జిల్లా అన్నవరం ఆలయానికి స్వచ్ఛంద సేవకు వచ్చిన పలువురు సేవకులకు చేదు అనుభవం ఎదురైంది. వారిపై ఆలయ ఏఈవో కొండలరావు దురుసుగా ప్రవర్తించి, సేవ నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారని సేవాబృందం ఆరోపించింది.
అత్తింట్లో వేధింపులు తాళలేక పిల్లలను తీసుకుని పుట్టింటికొచ్చేసినా ఇక్కడకు వచ్చి కొడుతున్నారని వివాహిత పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. సీతానగరం ఎస్సై డి.రామ్కుమార్ గురువారం అందించిన వివరాలిలా ఉన్నాయి.
కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి.నారాయణ భరోసా ఇచ్చారు. కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో గురువారం తెదేపా జిల్లా మహానాడు నిర్వహించారు.
జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలు పొందిన అనర్హుల లెక్క తేలింది. అర్హత లేకున్నా వైకాపా నాయకులు, కార్యకర్తలకు స్థలాలు కట్టిబెట్టినట్లు స్పష్టమైంది. గత పాలనలో ఆ పార్టీకి సంబంధించిన వారికి పెద్దసంఖ్యలో ఇళ్ల స్థలాలు కేటాయించారు.
అన్నవరం దేవస్థానంలో పలు వసతి సముదాయాలు, ఇతర భవనాల భద్రతపై అధికారులు దృష్టి సారించడం లేదు. కొండపై సెంటినరీ కాటేజీలు, ఇతర భవనాల పటిష్ఠతపై ఇంజినీరింగ్ బృందం నివేదిక సమర్పించినా చర్యలు శూన్యం.
తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు కేశవరం, జెడ్.మేడపాడు రైల్వే పైవంతెనల నిర్మాణానికి మోక్షం కలగనుంది. నిత్యం పనులపై రాజమహేంద్రవరం వెళ్లే మండపేట, రామచంద్రపురం, అనపర్తి నియోజకవర్గాలకు చెందిన వ్యాపారులు, విద్యార్థులకు, ఇది శుభవార్త.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్ర స్థాయిలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ఇప్పటికే జీవో విడుదల చేసింది.
కోనసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, మౌలిక వసతులు.. ఇలా అన్ని రంగాల్లో ముందంజలో నిలబెడతామన్నారు.
నోరూరించే పూతరేకుల తయారీకి ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురంలో మళ్లీ నాణ్యతలేని నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శ్రీలక్ష్మి డ్రైఫ్రూట్స్ గొడౌన్ వద్ద ఆటోలో కల్తీనెయ్యి దిగుమతి అయినట్లు గురువారం గ్రామస్థులకు సమాచారం అందడంతో వెళ్లి పరిశీలించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతూ రెండు దశాబ్దాల క్రితం నిర్మితమైన దిండి-చించినాడ వశిష్ఠ వారధిపై విద్యుత్తు వెలుగులు లేక చీకట్లో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా మారుతోంది.
గత నాలుగు దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని, ఎవరూ అధైర్యపడకుండా మొక్కవోని దీక్షతో పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
ఆత్రేయపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది పూతరేకులే.. రోజూ కోట్లాది రూపాయల వ్యా పారం.. ఆ వ్యాపారానికి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ, ఎస్పీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వ నున్న స్వయం ఉపాధి రుణ యూనిట్లకు బ్రేక్ పడింది. వీటిని తక్షణం నిలిపివేయాలని ప్రభు త్వం ఆదేశించింది.
జిల్లా కలెక్టరేట్ బొమ్మూరులో ఉంటుందనే అభిప్రాయం కలెక్టర్ వ్యక్తం చేశారు. కలెక్టర్ క్యాంపు ఆఫీసులో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం విలేకరులు అడిగిన పలు ప్రశ్న లకు స్పందించారు.
పిఠాపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్లో 216వ హైవేపై పాదగయ సెంటర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మోటార్సైకిళ్లపైకి దూసుకెళ్లడంతో ధ్వంసమై ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బుధవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ సంఘటన వాహనదారులను భీతావాహు
పిఠాపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. చిత్తూరులో జరిగిన ఆంధ్ర రాష్ట్ర 10వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల చాంపియన్షిప్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు పాల్గొన్నాయి. వరుసగా ఐదోసారి బాలబాలికల వి
సాధారణ సమయాల్లో అదో ఖాళీ భవనం. అక్కడ ఎలాంటి సందడి ఉండదు. అదే అధికారులు తనిఖీలకు వస్తున్నారంటే మాత్రం ఆగమేఘాలపై ఓ కళాశాల పేరున బోర్డు, విద్యార్థులు కూర్చునే బల్లలు, కుర్చీలు, బ్లాక్ బోర్డులు, అధ్యాపకులు, విద్యార్థులు.. ఇలా అందరూ సిద్ధమైపోతారు..
సెజ్ రైతుల భూములకు గ్రహణం వీడడంలేదు. ఏళ్లుగా ఊరిస్తున్న ఉచిత రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కదలిక లేదు. గత వైకాపా ప్రభుత్వం నమ్మించి వారి ఆశలపై నీళ్లు చల్లింది.. రీ సర్వేలోనైనా అర్హులైన రైతులకు యాజమాన్య హక్కులు దక్కేవీలున్నా సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి.
ఆర్కిడ్స్.. అత్యంత ఆకర్షణీయమైన పూలు. చూడగానే మానసిక ఆహ్లాదాన్ని కలిగించే విరులు ఇవి.. ఖరీదైనవిగానూ పేరుపొందాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వీటి సాగు అంతంతమాత్రంగానే ఉండటంతో పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
అన్నవరం సత్యదేవుని సేవల్లో వైదిక బృందం, అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. గత వైకాపా పాలనలో సంప్రదాయానికి భిన్నంగా, వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
నూరేళ్లకు మించి సేవలందించిన కాటన్ అక్విడక్టు అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. పూర్వం రాజోలు దీవిగా వ్యవహరించే సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాలతో పాటు పి.గన్నవరం మండలంలోని అయిదు గ్రామాల ప్రజలకు గోదావరి జలాలు అందించేందుకు కాటన్ మహాశయుడు 1852లో పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరి నదిపై ఈ కట్టడం నిర్మించారు.
ఎందరో పండితులను తీర్చిదిద్దిన బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి మంచిరోజులు రానున్నాయి. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చొరవతో 1985లో 45 ఎకరాల విస్తీర్ణంలో సాహిత్య పీఠం, తెలుగు వర్సిటీ బొమ్మూరులో ఏర్పాటు చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీలు) సేవలు, పనితీరు ఆధారంగా వాటికి మార్కులు కేటాయిస్తున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడి నుంచి, మాతా, శిశు ఆరోగ్యం వరకు 11 అంశాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు, సమస్యలను లెక్కించి జిల్లాల వారీగా ర్యాంకులు ఇస్తున్నారు.
సముద్రంలో రాకాసి కెరటాల తాకిడికి సాధారణ పడవ బోల్తా పడి ఉప్పాడ పంచాయతీ నాయకర్ కాలనీకి చెందిన మేరుగు శ్యామ్ (20) గల్లంతుకాగా, మరో ఇద్దరు ఈదుకుంటూ హోప్ ఐలాండ్ చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు.
ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటనకు సంబంధించి రాజోలు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాలను ఎస్సై బి.రాజేష్కుమార్ వెల్లడించారు.
ఇటీవల పదోతరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి లోకేశ్ మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో సన్మానించారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేట బొప్పన సావిత్రమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కణితి.
ప్రభుత్వ సొమ్ము వెచ్చించి ఏ అభివృద్ధి చేసినా అది ప్రజలకు మేలు చేసేలా ఉండాలే తప్ప..ఇబ్బందులు సృష్టించకూడదు. వైకాపా ప్రభుత్వ హయాంలో ‘రుడా’ నిధులు రూ.1.50 కోట్లతో బిక్కవోలు మండలం బలభద్రపురంలో చేసిన ఊర చెరువు పనులు ఇందుకు దర్పణం.
మండపేట, న్యూస్టుడే : సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆ అన్నదమ్ములు ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందుతూ చదువులో దూసుకుపోతుంటే.. బిడ్డల కలలు నెరవేర్చేందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో శ్రమించారు.
ఎట్టకేలకు నాలుగు వరుసల (గామన్) వంతెన నిర్వహణ పనులు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం రెండు వైపులా రాకపోకలను వదలడంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఊపిరి పీల్చుకున్నారు.
పట్టణాల్లో పెరుగుతున్న నిర్మాణాలు, ఆధునికీకరణ వంటి అంశాల నేపథ్యంలో పన్ను విధింపుపై సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పట్టణ ప్రణాళికా విభాగం ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం సర్వేకు సిద్ధమవుతోంది.
చారిత్రక, సాంస్కృతిక, కళా రాజధాని రాజమహేంద్రవరానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగామని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల సందడి మొదలైంది. మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో బుధవారం బదిలీల జీవో, షెడ్యూలు విడదలైంది.
భక్తులకు పూర్తిస్థాయిలో అన్నప్రసాదం అందజేయాలి. లేదనటానికి వీల్లేదని కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నా అన్నవరంలో మాత్రం అధికారులకు శ్రద్ధ లేదు. ఉదయం అల్పాహారం వితరణ మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నారు.
గత ఏడాది ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెంలో దీపావళి ముందు రోజు సాయంత్రం 5 గంటల సమయంలో బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడింది. దీంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు.
కాజులూరు మండలం అయితపూడిలో భారీ చోరీ జరిగింది. సుమారు 140 గ్రాముల బంగారు వస్తువులు దొంగల పాలయ్యాయి. తాళం వేసి ఉన్న ఇంటి నుంచి దొంగలు ఈ పనికి పాల్పడ్డారు.
వైకాపా ప్రభుత్వంలో తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ‘ఇంటింటికీ రేషన్’ పేరుతో సరకుల పంపిణీకి తెరలేపి రూ.కోట్లలో ప్రజా ధనం వృథా చేశారు. ఎండీయూ వాహనాలు ఎప్పుడు వస్తాయా.. అని గ్రామాల్లోని ప్రజలు వీధి చివర్లో ఎదురుచూసేవారు.
శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలను పెంచి పెద్ద చేయడం, రోజువారీ వారి బాగోగులు చేసుకోవడం తల్లిదండ్రులకు సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. వారి కోసం సమయం, డబ్బు వెచ్చించడంతో పాటు మానసికంగా ఒత్తిడిని సైతం భరించాల్సి ఉంటుంది.
అన్నవరం సత్యనారాయణ స్వామిని ఏపీ రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ ఈవో సుబ్బారావు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు.
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కూరగాయల మార్కెట్కు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభిం
Annavaram Temple: కాకినాడ అన్నవరం సత్యదేవుడి కొండపై తెలంగాణకు చెందిన మహిళా భక్తులకు తీవ్ర అవమానం జరిగింది. స్వామి వారి సేవకు రావాలని అనుకుని దేవస్థానం అధికారులను సంప్రదించగా.. 20 మంది వరకు అనుమతిస్తామని సమాచారం ఇచ్చారు.