మహిళల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ అన్నారు. నర్సింహులపేటలోని రైతు వేదికపై మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను సోమవారం పంపిణీ చేశారు.
వచ్చే విద్యా సంవత్సరంలో వరంగల్ జిల్లా నర్సంపేటలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా ఉన్నతీకరిస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు.
వరంగల్ నగర శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో యథేచ్ఛగా అనధికారిక లేఅవుట్లు వెలుస్తున్నాయి. దీంతో గ్రేటర్ వరంగల్ భారీగా ఆదాయం కోల్పోతుంది. లేఅవుట్ అనుమతుల ద్వారా ఏటా రూ.2-3 కోట్ల ఆదాయం రావాలి. వాస్తవానికి రూ.కోటి దాటడం లేదు.
ప్రతి జిల్లాకు మూడు చొప్పున ఉమ్మడి వరంగల్లో 18 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ (వైఐఐఓఈ)గా విద్యాశాఖ మార్చింది. దీంతో విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఉన్నత చదువు, ప్రభుత్వ ఉద్యోగం, ప్రవేశాలు.. ఇలా దేనికైనా దరఖాస్తు చేయాలంటే కులం, ఆదాయ, నివాస ధ్రువీకరణ, తదితర పత్రాలు తప్పనిసరి. వీటి కోసం ఇక నుంచి రోజుల తరబడి వేచి చూడటం, ‘మీ సేవ’ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం ఉండదు.
వస్తు రవాణాలో నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై రవాణాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. రాష్ట్రంలో చెక్పోస్టులను ఎత్తేసిన ప్రభుత్వం, వాటిలో పని చేసే ఉద్యోగులను ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోకి మళ్లించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వేర్వేరుగా బృందాలను ఏర్పాటు చేసింది.
లైసెన్స్డ్ సర్వేయర్లు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత మే నెల నుంచి గత అక్టోబరు వరకు థియరీ, అప్రెంటిస్షిప్ శిక్షణ తీసుకున్న లైసెన్స్ సర్వేయర్ల నియామకంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వం పలిమెలను నూతన మండలంగా ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల పలిమెల మండలానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు మహాదేవ్పూర్ మండలంలోనే ఏర్పాటు చేసి అక్కడి నుంచే సేవలు కొనసాగిస్తున్నారు.
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మారుమూల గ్రామం జబ్బోనిగూడెంకు చెందిన గిరిజన యువతి భవాని జాతీయ స్థాయి ఈత పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి స్టేడియం అక్వాటిక్ కాంప్లెక్స్లో నిర్వహించిన 21వ నేషనల్ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు.
మీ సేవ కేంద్రాల్లో అధికంగా రుసుములు వసూలు చేస్తున్నట్లు తనకు ఫిర్యాదులు రాలేదని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రశాంత్ తెలిపారు. పురపాలక కార్యాలయంలో ప్రైవేట్ ఆపరేటర్ను నియమించినట్లు తన దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఆమెకు తలదాచుకోను గూడు లేదు. రెక్కల కష్టం తప్ప మరో ఆస్తిలేదు. భర్త అకాల మరణం కుంగదీసింది. విధి చిన్నచూపు చూడడంతో దివ్యాంగురాలిగా మారిన కుమార్తె భవిష్యత్తు తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఓ అమ్మ దీనగాధ ఇది.
వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పూజల్లో తొలి అంకం ఘనంగా ప్రారంభమయింది. దేవతల గద్దెల మధ్య తక్కువ స్థాలం ఉండడం, భక్తుల సంఖ్య పెరిగి ప్రాంగణం ఇరుకుగా మారడంతో పూజారుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం గద్దెల పునర్నిర్మాణం చేపట్టింది.
మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్న ఓ మహిళ నెల రోజులు తిరగకముందే నగలతో పరారైన ఘటన మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగుజూసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడికి యువతి పరిచయమైంది.