‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద దేశవ్యాప్తంగా రూ.లక్ష కోట్లతో రైల్వేల ఆధునికీకరణ, పునరాభివృద్ధి పనులు చేపట్టడం భారతీయ రైల్వేల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.
వరంగల్ దయానంద్ కాలనీలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్’ను వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ గురువారం ప్రారంభించారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్లో బాంబు పెట్టేందుకు అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం అధికారిక ఈ-మెయిల్కు సమాచారం అందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వానాకాలం సీజన్ సాగుకు సమయం దగ్గర పడుతున్నా.. జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ మందకొడిగానే సాగుతోంది. కాంటాలు సక్రమంగా జరగక వారాల తరబడి అన్నదాతలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాగరణ చేస్తున్నారు.
పన్నెండేళ్లకోసారి వచ్చే అపూర్వ వేడుక.. పుష్కరాల్లో పుణ్యస్నానం చేసి పునీతులు కావాలని ప్రతి ఒక్కరి కోరిక. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడో ఉన్న బంధుమిత్రులంతా ఈ పవిత్ర స్థలంలో కలుసుకుంటున్నారు.. పూర్వ విద్యార్థులు కూడా ఆత్మీయ సమ్మేళనాలకు వేదిక చేసుకుంటున్నారు..
పేదింటి నుంచి ధనిక కుటుంబాల వరకు జరిగే వివాహాలు, ఇతర వేడుకల్లో నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డించాలనే తపన ఉంటుంది. విస్తరిలో పదుల రకాల రుచులుండాలని చూస్తారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు పైచదువుల కోసం అవసరమైన టీసీ, మార్కుల మెమో ఇవ్వడానికి విద్యా సంస్థల యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నారు.
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చినా పెద్దగా మార్పు ఏ మాత్రం కనిపించడం లేదు.
గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో నిండిపోయేలా ఉండేందుకు ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టింది.
జిల్లాలో ఆరోగ్య ఉపకేంద్రాలకు నిర్మాణాలకు నిధులు మంజూరైనా పనులు పూర్తికాకుండా అసంపూర్తిగా నిలిచిపోయాయి. మరికొన్ని భవనాలు చివరి దశ పనులను పూర్తి చేయకపోవడంతో ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇసుక లారీల రవాణా, వాహనాల రద్దీ కారణంగా ప్రయాణానికి భద్రత కరవైంది. ములుగు పట్టణంలో అవసరమైన చోట ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.
మోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రైల్వే స్టేషన్లను నూతన హంగులతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.