సీఎంఆర్ ధాన్యాన్ని సొంతానికి వాడుకున్న మిల్లర్లలో భయం మొదలైంది. త్వరలోనే వీరిపై తీసుకునే చర్యలకు సంబంధించి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా మిల్లుల్లో ఉంచిన వడ్లకు ఏడాది క్రితం వేలం వేసిన విషయం తెలిసిందే.
పాఠశాలల్లో పచ్చదనం పరిశుభ్రతను ప్రోత్సహించడం కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమలు చేస్తున్న అంశాలను పరిగణనలోకి తీసుకొని రేటింగ్ ఇవ్వనుంది. జాతీయ స్థాయిలో ఎంపిక అయిన పాఠశాలలకు రూ.లక్ష ప్రోత్సాహకం ఇవ్వనుంది.
నగరంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
ఆధునికతను సంతరించుకుంటున్న ఐటీఐలు విప్లవాత్మక మార్పులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)ల ఏర్పాటు ద్వారా కీలకమైన అడుగులు పడ్డాయి.
బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి అయిన ఇంటి వద్ద నిలుచున్న ఈమె పేరు చిదురాల వెంకటలక్ష్మి. భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో పనులు చేపట్టారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు, అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కలెక్టర్ రిజ్వాన్బాషా నేతృత్వంలో జిల్లా ఉన్నతాధికారులు విద్యాలయాలను సందర్శిస్తున్నారు. ఆకస్మికంగా తనిఖీ చేస్తూ లోటుపాట్లను తెలుసుకుంటున్నారు.
గతంలో కంటే ఈ సారి పదో తరగతి పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర విద్యా పరిశోధన, అభివృద్ధి, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అభ్యాస దీపికలను ముద్రించారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజాఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు.
వాహనదారులకు అందించే లైసెన్సు, రిజిస్ట్రేషన్ స్మార్ట్ కార్డులు కనుమరుగు కానున్నాయి. రవాణాశాఖలో నూతనంగా చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రవేశపెట్టిన ‘సారథి’ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్మార్ట్కార్డు వచ్చేలా మార్పులు చేశారు.
ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ కమిషనింగ్ పనుల కారణంగా సెప్టెంబర్ 18, 19 తేదీల్లో కాజీపేట-బల్లార్ష మార్గంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.