సర్కార్ విద్యను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్నాయి. చదువుతోపాటు సంగీత పాఠాలు నేర్పాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) కింద ఎంపికైన కొన్ని పాఠశాలలకు అవకాశం కల్పించింది.
నవంబరులోనే చలి పంజా విసురుతోంది. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పదేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలో పడిపోలేదని అధికారులు చెబుతున్నారు.
కాజీపేట నుంచి బల్లార్ష వైపు మధ్యాహ్నం రైళ్లు లేవని ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే 17036 నంబరు గల కాజీపేట- బల్లార్ష ఎక్స్ప్రెస్ను మాత్రం పగటి పూట 14 గంటలు పాత వాషింగ్ ఏరియాలో ఖాళీగా ఉంచుతున్నారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 2.58 లక్షల నివాస గృహాల నుంచి ప్రతిరోజూ చెత్త సేకరణకు పక్కా ప్రణాళిక రూపొందించారు. నగరంలో వందశాతం ఇంటింటా చెత్తసేకరణ కోసం స్వచ్ఛ ఆటోలకు రూట్మ్యాప్లు ఖరారు చేశారు.
అన్నదాతలకు అవసరమైన పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం, బ్యాంకులు సానుకూలంగా లేకపోవడంతో.. చాలామంది మక్క రైతులు కమీషన్దారులనే ఆశ్రయించారు. దీంతో పంటను మార్క్ఫెడ్కు కాకుండా..
నగర పరిధిలో 25 వేల మంది దరఖాస్తుదారులు రుసుం చెల్లిస్తే ఇప్పటి వరకు 9 వేల మంది అనుమతి పత్రాలు జారీ చేశారు. మరో 16 వేలు పెండింగ్లో ఉన్నాయి. కమిషనర్ ఎన్నిసార్లు సమీక్ష చేసినా.. అర్జీలు కదలడం లేదు.
పంచాయతీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయి. వీటికి తోడు పంచాయతీలు వాటి పరిధిలోని గ్రామాల్లో వసూలయ్యే పన్నుల ద్వారా అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుంది.
అటవీ సంరక్షణ కొరవడింది. సమస్త జీవకోటికి ప్రాణవాయువు అందించే చెట్లపై గొడ్డలి వేటు పడుతోంది. మారుమూల గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పోడు పెరిగి చిట్టడవులు కనుమరుగవుతున్నాయి. వన్యప్రాణులు సైతం అంతరించిపోతున్నాయి.
చదువుల్లో పిల్లల పురోగతి తెలపడానికి ప్రతి నెలా పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం.. పీటీఎం (పేరెంట్ టీచర్ మీటింగ్) నిర్వహిస్తుంటారు. కానీ వ్యవసాయ పనుల హడావుడితో పిల్లల తల్లిదండ్రులు ఈ సమావేశాలకు రావడం లేదు.
జిల్లాలో ఇన్స్పైర్ మనక్, రాజ్యస్థారియ బాల్ వైజ్ఞానిక ప్రదర్శని (ఆర్ఎస్బీవీపీ) సంయుక్త జిల్లాస్థాయి ఎంపిక ప్రదర్శనల నిర్వహణకు వేళైంది. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ఈ ప్రదర్శనలు జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో నిర్వహించనున్నారు.
వన దేవతలు సమ్మక్క, సారలమ్మ మహా జాతర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.101 కోట్లతో గద్దెల పునర్నిర్మాణం, ప్రాంగణం విస్తరణ, శాశ్వత పనులు సకాలంలో పూర్తి చేయడం కోసం ఆర్అండ్బీ అధికారులు దగ్గరుండి రేయింబవళ్లు చేయిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరొందిన చందాకాంతయ్య స్మారక(సీకేఎం) ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. పడకలకు తగ్గ వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వం నియామకం చేయకపోవడంతో ఉన్న వారిపై పనిభారం పడుతోంది.
ఒకప్పుడు స్కూటర్పై ప్రయాణమంటే ఎంతో అనుభూతి చెందేవాళ్లు. ఆ వాహనాన్ని కొనాలంటే అప్పట్లో నెలల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉండేది. వరంగల్కు చెందిన ఎస్ఎస్కేరావు 79 ఏళ్ల వయసులో ఇప్పటికీ కుటుంబంతో ఎక్కడికి వెళ్లినా..
ఆమె పెన్సిల్తో గీసినా, కుంచెతో వేసిన ఏ చిత్రమైన జీవం పోసుకుంటుంది. పెన్సిల్ ఆర్ట్లో నైపుణ్యం సాధించి అద్భుతంగా బొమ్మలు గీస్తూ ఆకట్టుకుంటున్నారు హనుమకొండ గోపాలపురానికి చెందిన సాగంటి మంజుల.
ఓ ఇంట్లో జరిగిన గుప్త నిధుల తవ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారు నాణేలు లభించినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది గురువారం ములుగు జిల్లాలో కలకలం రేపింది. మంగపేట మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలోని ఇంట్లో తవ్వకాలు...
గుప్త నిధుల కోసం తొవ్వకాలు జరిపి.. భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ బంగారాన్ని పంచుకునే క్రమంలో ఘర్షణలు తలెత్తాయి. ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.