భారాస నిరసనలతో సోమవారం ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ శ్రేణులు ఫ్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాకతీయ విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విశ్వవిద్యాలయం కులపతి హోదాలో పాల్గొన్నారు. గవర్నర్ మాట్లాడుతూ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చిందన్నారు.
భారాస నిరసనలతో సోమవారం ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలో నిరసనలు, తోపులాటలు, వాగ్వాదాలు, మండల కేంద్రాల్లో భారాస నాయకుల ముందస్తు అరెస్టులతో జిల్లా అట్టుడికింది
రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క హెచ్చరించారు. ములుగు జిల్లా వాజేడులోని ఐటీఐ ప్రాంగణంలో భద్రాచలం ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు అధ్యక్షతన సోమవారం నష్టపోయిన విత్తన మొక్కజొన్న రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు
గర్భిణులకు శస్త్ర చికిత్సలు తగ్గించి సుఖ ప్రసవాలు అధికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు
భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 302 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ బడిలోనే అత్యధికంగా బాలబాలికలు ఉన్నారు.
చిన్నారులకు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య, వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం, గర్భిణులు, బాలింతలకు అవసరమైన ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది
జిల్లాలో దేవాదుల, ఎస్సారెస్పీ కాలువల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలకు సాగునీరందుతోంది. జలాశయాల నుంచి పంటలకు సాగు నీరందించేందుకు నిర్మించిన కాలువలు పిచ్చి చెట్లు, రాళ్లు రప్పలతో నిండిపోయాయి. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులకు, దళారులకు రూపాయి కూడా ఇవ్వొద్దని, ఎవరైనా లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు