వరంగల్ జిల్లా పర్వ తగిరి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నారంషరీఫ్ యాకూబ్షావళి దర్గాలో ఉర్సు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది తర లిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపడుతున్నట్లు వక్ఫ్బో ర్డు ఇన్స్పెక్టర్ రియాజ్పాషా తెలిపారు. వక్ఫ్బో ర్డు నుంచి రూ.7 లక్షలు మంజూరు కావడంతో ఆ నిధులతో ప్రధానదర్గాతో
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ బి.గోపి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన గ్రీవెన్స్లో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా అందించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయా సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ తెలిపారు. మొత్తం 43 వినతి పత్రాలు రాగా ఇందులో భూమికి సంబంధించినవి 11, విద్యాశాఖ ఒకటి, ఎంజీఎం ఒకటి, ఎస్సీ కార్పొరేషన్ ఆరు, డీఆర్డీవో ఒకటి, మున్సిపాలిటీ మూడు, పోలీసు కమిషనర్ రెండు, నర్సంపేట ఆర్డీవో ఒకటి, కార్మిక శాఖ నాలుగు, పశు సంవర్ధక శాఖ ఒకటి, ఆర్ అండ్ బీ ఒకటి, విద్యుత్ ఒకటి, ఏడీ సర్వే రెండు, సబ్ రిజిస్ట్రార్ ఒకటి, మైన్స్ మూడు, ఇరిగేషన్ ఒకటి, నర్సంపేట మున్సిపాలిటి ఒకటి దరఖాస్తులను ఆయా శాఖలకు బదిలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు కె.శ్రీవత్స, అశ్విని తనాజీ వాకడే, డీఆర్డీ పీడీ సంపత్రావు, వివిధ శాఖల
[04:27] శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దీనిపై ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు.
[04:23] హైదరాబాద్- వరంగల్ నగరాలను కలిపే జాతీయ రహదారి 163 ప్రారంభమై రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఒకప్పుడు భారీ వృక్షాలతో కళకళలాడింది. ఇప్పుడు ఇరువైపులా ఇప్పుడు ఒక్క చెట్టూ కనిపించదు.
[04:23] అనధికార లేఅవుటు స్థలాల్లో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని పురపాలక చట్టం 2019 చెబుతోంది. మరోవైపు ‘లేఅవుటు రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) భవిష్యత్తులో ఉండదని రాష్ట్ర పురపాలక శాఖ తేల్చి చెప్పింది.
[04:23] టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సోమవారం మేడారంలో సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభించనున్న ‘హాథ్సే హాథ్ జోడో’ తొలిదశ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి రోజు మేడారం నుంచి రామప్ప వరకు దాదాపు 52 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది.
[04:23] వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జీరో దందాను నియంత్రించేందుకు ఓవైపు మార్కెట్ శాఖకు చెందిన ప్రత్యేక పరిశీలన బృందం విచారణ చేపడుతుండగానే, మరోవైపు కొంతమంది వ్యాపారులు జీరో దందా కొనసాగించారు.
[04:10] పాలకుర్తిలో దుకాణ సముదాయ భవన నిర్మాణానికి అడుగులు పడడం లేదు. దీంతో రహదారుల వెంట వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
[04:10] శ్రీభద్రకాళి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవుడి పేరుతో హనుమకొండ పెద్దమ్మగడ్డ శివారులో ఉన్న స్థలంలో రెండు రోజులుగా ఎర్ర జెండాలు, తాత్కాలిక గుడారాలు వెలిశాయి.
[04:10] రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తర్వాత రెండో పెద్ద వర్సిటీ కాకతీయ. ఉన్నత విద్యాప్రమాణాలతో విరాజిల్లుతున్న కేయూ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
[04:10] విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ ఎంతో కీలకమని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిట్ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.వి.రమణారావు పిలుపునిచ్చారు.
[04:10] రాష్ట్రంలో నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదల సంఖ్య 40 లక్షలకు పైగానే ఉందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపెల్లి నాగయ్య అన్నారు.
[04:10] ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా, ఆటంకాలు కలిగించినా ఇచ్చిన మాటకు కట్టుబడి కుల సంఘాల భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.