వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డును మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిందే అని హరీష్ డిమాండ్ చేశారు.
అడవిలో ఉండాల్సిన కోతులు నగరబాట పట్టాయి. ఏటూరునాగారం, పస్రా, ములుగు, రామప్ప, భూపాలపల్లి తదితర అటవీ ప్రాంతాల్లో కోతులకు పండ్లు, ఫలాల చెట్లు కనుమరుగవుతుండటంతో తిండి కరవై జనారణ్యంలోకి వలస వస్తున్నాయి.
పత్తి కొనుగోళ్లు ఆలస్యం కావడం ఓ సమస్య అయితే.. సీసీఐ నిబంధనలు రైతులతోపాటు జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలకు అవరోధాలుగా మారాయి. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే రైతు పంట అమ్ముకొనే విధానాన్ని ఈసారి ప్రవేశపెట్టింది.
ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలకపాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తోంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ నిత్యం బస్సు కండిషన్ సరిచూసి డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే బస్సులు నడిపేందుకు అనుమతిస్తున్నారు.
ఎంజీఎం ఆసుపత్రిలో అత్యంత కీలకమైన ఎంఆర్డీ(మెడికల్ రికార్డు డిపార్ట్మెంట్) లీగల్ కేసులకు సంబంధించిన విభాగంలోని సెక్షన్ క్లర్క్ విధులు ఓ ప్రైవేటు వ్యక్తి నిర్వహిస్తుండగా.. కోర్టు కానిస్టేబుళ్లు సోమవారం ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంవోకు ఫిర్యాదు చేశారు
యువతికి ఇచ్చిన డబ్బులు అడగడానికి వెళ్లిన వ్యక్తిని కుటుంబ సభ్యులు కట్టేసి కొట్టి చంపిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. ములుగు మండలం సర్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని లాలాయిగూడెంకు చెందిన యువతి తల్లిదండ్రులు గతంలో జీవనోపాధి కోసం ఏటూరునాగారం వెళ్లారు.
జిల్లా కేంద్రానికి వచ్చే వారిని ఆకర్షించేలా చెరువుల సుందరీకరణ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ మేరకు పట్టణ ప్రజలకు అందుబాటులో మరిపెడ వెళ్లే జాతీయ రహదారి పక్కనే ఉన్న బంధం చెరువును అభివృద్ధి పనులతో అందంగా తీర్చిదిద్దడం కోసం అడుగులు పడుతున్నాయి
గూడు లేని నిరుపేదలకు ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు నిర్మించింది. రెండేళ్ల క్రితం లబ్ధిదారులకు పంపిణీ చేసింది. కనీస వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులే స్వచ్ఛందంగా సమకూర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది
కబ్జాలకు కాదేదీ అనర్హం అన్న చందంగా మారింది స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో. కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా చెరువులను చెరబడుతున్నారు. పంటలను సాగు చేస్తూ.. వెంచర్లు ఏర్పాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
గ్రేటర్లో రెండున్నరేళ్లవుతున్నా.. ఆస్తిపన్ను తప్పిదాలు సరిచేయడం లేదు. దీంతో ఆదాయానికి గండి పడుతోంది. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని కొన్ని నివాస గృహాల ఆస్తిపన్ను అసెస్మెంట్లను ఖాళీ స్థలాల(వీఎల్టీ) పన్నుగా మార్చారు.