సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గడిచిన 21 రోజుల్లో సుమారు రూ.90 లక్షలకు టోకరా వేశారు. పార్ట్టైం ఉద్యోగాలు, ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వంటి పేర్లతో పలువురిని బురిడీ కొట్టిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొందరు ప్రైవేటు వ్యక్తులు రాజకీయ పలుకుబడితో ఆక్రమణలకు తెగబడుతున్నారని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా బల్దియా టౌన్ప్లానింగ్ విభాగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ స్థలాలు, లేఅవుట్ ఖాళీ స్థలాలు, పార్కులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.
ఇది ములుగు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు 80 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, స్టాఫ్రూం లేదు. తాగునీటి సదుపాయం లేదు. ప్రయోగశాలకు ప్రత్యేక గది లేకపోవడంతో సైన్స్ పరికరాలకు భద్రత కొరవడింది.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు వేర్వేరు పద్దుల కింద ప్రభుత్వం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టాయి. కొందరు ప్రధానోపాధ్యాయులు సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మండలంలో 41 పాఠశాలలుండగా అన్నింటిలోనూ ఇదే తంతు జరిగినట్లు తెలిసింది
ఎంబీ రికార్డు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మిషన్ భగీరథ డీఈ కె.సంధ్యారాణి శుక్రవారం అనిశా వలలో చిక్కారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన 4వ అంతర్జాతీయ యునెస్కో మోడల్ ఎథిక్స్ ఆఫ్ న్యూరో టెక్నాలజీ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వరంగల్ పెరుకవాడకు చెందిన రంగరాజు రోహిణి ఎంపికైంది.
వరి సాగుపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. దిగుబడి ఎకరానికి 4 క్వింటాళ్ల వరకు తగ్గినట్లు కర్షకులు చెబుతున్నారు. చైన్ యంత్రాలతో కోయిస్తే రూ.1200 చొప్పున అదనపు భారం
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో హనుమకొండ, వరంగల్, కాజీపేట పోలీస్ డివిజన్లను కలిపి సెంట్రల్ జోన్ ఉంటుంది. డీసీపీ అధికారి అత్యంత కీలకమైన పోస్టు, ఇక్కడ పని చేస్తున్న షేక్ సలీమా బదిలీయై రెండు నెలలు కావొస్తున్నా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు.
మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. రెండు శాసనసభ నియోజకవర్గాలు పూర్తిగా, మరో మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఆరు మండలాలతో విస్తరించిన జిల్లాలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఏడు మండలాల్లో 8 మంది లబ్ధిదారులు ఇటీవల గృహ ప్రవేశం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని ఎస్సై రాజేష్ అన్నారు. రేగొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ సన్ప్రీత్సింగ్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు ఇన్స్పెక్టర్ ఒ.రమేష్ను వీఆర్కు బదిలీ చేశారు