సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల్లో...
Hyderabad: తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో తమ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను ప్రజలకు వివరించేందుకు అన్ని వర్గాలకు చేరువవుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రచార దూకుకు పెంచింది. ఇదే సమయంలో అధికార పార్టీ బీఆర్ఎస్ సైతం వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మూడో సారి అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. నువ్వా నేనా అనే విధంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ ల మధ్య ప్రస్తుతం ఎన్నికల పోరు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
లుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న దుర్ఘటనలో వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్) విద్యార్థిని అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
చివరి మజిలీలోనూ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. బంధువులు, కుటుంబ సభ్యుల అంత్యక్రియల కోసం శ్మశానవాటికలకు వెళ్లిన వారికి అక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
అడవులు వేగంగా అంతరించిపోతున్న తరుణంలో అడ్డుకుని వాటిని పరిరక్షించేందుకు అటవీ సంరక్షణ చట్టాన్ని కఠిన నిబంధనలతో తీసుకువచ్చారని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా మేడారంలో మహాజాతర అభివృద్ధి పనులు ఆగవని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి గురువారం పర్యటించారు. దేవస్థానం వెనుక హెలిప్యాడ్ పరిసరాల్లో రూ. 2.15 కోట్లతో 1,500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మేడారం ఐటీడీఏ అతిథి గృహంలో అధికారులతో సమావేశమయ్యారు. 2024 ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్షించారు.
బీఆర్ఎస్ సర్కారు పథకాలను కాపీకొట్టే కాంగ్రెస్ను గ్రామాల పొలిమేరల నుంచి తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ పాకనాటి సునిల్రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఇంటిని అంగన్వాడీ ఉద్యోగులు ముట్టడించారు.