మహాత్మ జ్యోతిబాఫులే గురుకులాల్లో విద్యార్థులకు భోజనం సమకూర్చే గుత్తేదారులకు ఆర్నెల్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భూపాలపల్లి సింగరేణి డివిజన్లో కార్మికులకు, అధికారుల నివాసాల కోసం నిర్మించిన క్వార్టర్లు, భవనాల్లో కొన్నేళ్ల పాటు అద్దెకు తీసుకున్న ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు అద్దె చెల్లించడం లేదు.
సేద్యంలో యాంత్రీకరణ రోజురోజుకు పరుగులు పెడుతోంది. దుక్కి మొదలు పంట చేతికందే వరకు కూలీల కొరత, కూలీ రేట్లు అధికం, సమయం ఎక్కువగా వెచ్చించడం, తదితర కారణాలు యాంత్రీకరణలో కీలకమయ్యాయి.
తెలంగాణలో వరుస ఘోర రోడ్డు ప్రమాదాలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆయా ప్రమాదాల్లో పలువురు మృతిచెందుతుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ నెల 16న హనుమకొండ జిల్లా దామెర గ్రామ శివారులో జరిగే సువర్ణ లక్ష్మి దాంపత్య మహాయాగ ఏర్పాట్లను శాసన మండలి విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి శనివారం పరిశీలించారు.