దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రామప్ప నుంచి లక్నవరం చెరువులోకి నీటిని తరలించే ప్రక్రియ అమలులో తీవ్ర జాప్యం నెలకొంది. భూ సేకరణ ముందుకు సాగకపోవడం కాల్వ నిర్మాణానికి అడ్డంకిగా మారింది.
సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరిద్దరు క్రీడాకారులుంటే గొప్ప. అలాంటిది భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు (కుటుంబమంతా) క్రీడాకారులు కావడం.. వారంతా జాతీయస్థాయిలో రాణించడం విశేషం.
ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలను చూస్తే ఏదో పాఠశాల అనుకుంటాం.. కానీ ఇది ఓ పోలీస్స్టేషన్. హనుమకొండ జిల్లా ఐనవోలు ఠాణాకు ఏడాది కిందట ఎస్సైగా పస్తం శ్రీనివాస్ వచ్చారు.
జనగామ పట్టణాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పురపాలికలు, నగరపాలికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వరంగల్ ఎల్బీనగర్లోని ఓ యువతికి 2023 మేలో వివాహం జరిగింది. అదే ఏడాది షాదీముబారక్ పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది విచారణ జరిపి నివేదికను ఆర్డీవో కార్యాలయానికి పంపారు.
అరుదైన వ్యాధితో ఊపిరి కోసం పోరాడుతున్న కుమార్తెను బతికించుకొనేందుకు నిరుపేద కుటుంబం ఆపన్నుల కోసం ఎదురుచూస్తోంది. సాయం చేసి తమ కంటిపాపను కాపాడాలని వేడుకొంటోంది.
ఇది సెవెన్ హిల్స్ కాలనీ ప్రాంతం. వర్షాలు కురిస్తే ఎగువ నుంచి వచ్చే వరద నీటితో కాలనీ జలాశయంగా మారుతుంది. వరద కాలువ నిర్మాణంతోపాటు సంజీవరెడ్డి ఇంటి నుంచి పత్తిపాక రోడ్డుకు రహదారి నిర్మిస్తే కాలనీవాసుల సమస్య తీరనుంది.
‘ఇంటికొచ్చిన అతిథిని బాగా చూసుకుంటేనే కదా. వారు మన గురించి మంచిగా చెబుతారు. అదే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అందరిలో పరువు తీస్తారు.’ సరిగ్గా ఎంజీఎం ఆసుపత్రిలో అదే జరుగుతోంది.
గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ న్యూశాయంపేట జేఎస్ఎం కాలనీ సమీపంలో రహదారిపై వెళ్తున్న కె.కార్తీక (5) అనే బాలికను వీధి కుక్కలు పదుల సంఖ్యలో మీదపడి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైంది.
పల్లెల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వేర్వేరు పద్దుల కింద నిధులు విడుదల చేస్తున్నాయి. పంచాయతీరాజ్శాఖ అధికారుల ఆదేశాలతో ఆదాయ, వ్యయాల వివరాలను అందించే పనుల్లో పంచాయతీ కార్యదర్శులు తలమునకలయ్యారు.