ఓ వైపు నగరంలో అనధికార లేఅవుట్ స్థలాల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు నగర శివార్లలో అక్రమ లేఅవుట్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. దీనివల్ల గ్రేటర్ వరంగల్ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మట్టి వ్యాపారులకు వరంగా మారింది. ఇళ్ల నిర్మాణానికి మొరం అవసరం ఉంటుంది కాబట్టి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దని స్థానిక ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ఇది ఐసీడీఎస్ నర్సంపేట ప్రాజెక్టు కార్యాలయం. ఇందులో సీడీపీవోతో కలిపి 10 మంది ఉద్యోగులు పనిచేస్తారు. కార్యాలయం పనిమీద సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు వస్తుంటారు.
ఉమ్మడి జిల్లా జనాభా పెరుగుదలలో లింగ వివక్ష కలవరపరుస్తోంది. కేంద్ర జనగణన విభాగం గత నెలలో వెలువరించిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం నివేదిక-2022 ప్రకారం... బాలురతో పోల్చితే ఏడాది వ్యవధిలో బాలికల జననం 5334 తక్కువ ఉంది.
ఇక్కడ కిరాణ దుకాణం నిర్వహిస్తున్న దివ్యాంగుడి పేరు సిరపురపు రాజేశ్వర్. కాశీబుగ్గ ఓం శ్రీసాయి దివ్యాంగుల సంఘంలో సభ్యుడు. మొత్తం ఐదుగురు సభ్యులున్న వీరి సంఘానికి గతేడాది బ్యాంకు రూ.5 లక్షల రుణం మంజూరు చేసింది.
ఈ ఏడాది రైతుల నుంచి పత్తి కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం పీడీపీఎస్ (ధర వ్యత్యాస చెల్లింపు పథకం) అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదే జరిగితే భారత పత్తి సంస్థ (సీసీఐ) పక్కకు తప్పుకోనుంది.
అతివేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఎస్సై పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపెల్లి రంజిత్(20) హైదరాబాద్లో ఓ వైన్స్ దుకాణంలో తన సోదరుడితో కలిసి పని చేస్తున్నాడు.
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. ఉన్నచోట శుభ్రం చేసే దిక్కులేని పరిస్థితి. మరికొన్ని చోట్ల అసలే లేక ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని డీఈవో భోజన్న అన్నారు. ప్రభుత్వ బడుల్లో నెలకొన్న వివిధ సమస్యలపై గురువారం ‘ఈనాడు’ డీఈవోతో ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఇటీవల గుజరాత్లో ఏళ్ల కిందట నిర్మించిన ఓ వంతెన కూలి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు వంతెనలు అపాయాలను నోరు తెరిచి పిలుస్తున్నాయి.
జిల్లాలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్గా ఉన్న బయ్యారం పెద్దచెరువు అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సహజసిద్ధమైన జలవనరుగా పెద్దచెరువు ఈ ప్రాంతంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాకాలంలో వంతెనలు వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.. గతేడాది కురిసిన భారీ వర్షాల సమయంలో జిల్లాలోని పలు వంతెనలు దెబ్బతిన్నాయి.
ఇది జిల్లా ఆసుపత్రిలోని టాయిలెట్ బ్లాక్. ఆసుపత్రికి నిత్యం సుమారు 700 మంది వస్తుంటారు. వీరికి టాయిలెట్ల వసతి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాలల బ్లాక్కు నీటి సరఫరా లేకుంది.