భారతదేశానికి 93మిలియన్ డాలర్ల దాదాపు రూ.825 కోట్ల విలువైన ట్యాంకు విధ్వంసక జావెలిన్ క్షిపణి వ్యవస్థ, ఎక్స్కాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, సంబంధిత రక్షణ పరికరాలను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ట్రంప్ 50శాతానికి పెంచిన తర్వాత..
విదేశీ ఉద్యోగుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు. నిపుణులైన విదేశీ ఉద్యోగులను తాను ఆహ్వానిస్తానన్నారు. అలాంటి వారు చిప్లు, క్షిపణులు వంటి సంక్లిష్ట ఉత్పత్తులను ఎలా అభివృద్ధి చేయాలన్నది అమెరికా ఉద్యోగులకు నేర్పిస్తారని చెప్పారు.....
నిన్న మొన్నటి వరకు హెచ్-1బీ వీసా ఉద్యోగులంటేనే ఒంటికాలిపై లేచి వారిపై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మెల్లిమెల్లిగా తత్తం బోధపడుతున్నట్టుంది. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరి
హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు ఆగటం లేదు. గురువారం ఖాన్ యూనస్లో రెండు చోట్ల ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా.. ఐదుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
సెక్స్ ట్రాఫికర్ జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన అన్ని ఫైళ్లను బహిర్గతం చేయడానికి సంబంధించిన బిల్లుపై సంతకం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం తెలిపారు. ఇది పారదర్శకత కోసం వేసిన �
నేపాల్లో మరోసారి జెన్ జీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బారా జిల్లాలో జెన్ జీ ఆందోళనకారులు రెండో రోజైన గురువారం కూడా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడంతో పలు చోట్ల పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
అమెరికాలోని న్యూజెర్సీలో 2017 మార్చిలో జరిగిన జంటహత్యల కేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యలు జరిగిన తర్వాత.. భారత్కు తిరిగి వెళ్లిపోయిన ఓ యువకుడే ఈ హత్యలకు పాల్పడినట్టు నిర్ధారణ అయింది.
Nepal : పొరుగుదేశమైన నేపాల్లో యువతరం మరోసారి భగ్గుమంది. రెండు నెలల క్రితం కేపీ ఓలీ (KP Sharma Oli) ప్రభుత్వాన్ని పడగొట్టిన కే జెన్జెడ్ ఈసారి ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగింది. ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూను తిరిగ�
నేపాల్లో మళ్లీ యువత నిరసనల బాట పట్టింది. బారా జిల్లాలో సీపీఎన్-యూఎమ్ఎల్ నేతలు స్థానిక యువతపై దాడి చేయడంతో నిరసనలు మొదలయ్యాయి. దీంతో, పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో గురువారం రాత్రి 8 గంటల వరకూ కర్ఫ్యూ విధించారు.
Donald Trump భారత్-పాక్ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చాటింపు వేసుకున్నారు.
RT India: రష్యాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ రష్యాటుడే.. ఇప్పుడు ఇండియాలోనూ తన ప్రసారాలను విస్తరించనున్నది. ఆర్టీ ఇండియా ఇంగ్లీష్ ఛానల్ను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్
వలస విధానాలు, హెచ్-1బీ వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారు. అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని బహిరంగ వేదికపై అంగీకరించారు
ఎప్స్టీన్ ఫైల్స్ను విడుదల చేసే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ ద్వారా వెల్లడించిన ట్రంప్.. ఈ సందర్భంగా డెమొక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం గతంలో అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే.
ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేమని శమంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం హెచ్చరించారు.
Epstein files అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసుకు సంబంధించిన ఫైల్స్ (Epstein files) విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫైల్స్ను బహిర్గతం చేసే బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చ�
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 2018 తర్వాత తాజాగా తొలిసారి అమెరికాకు వెళ్లారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. సౌదీ అరేబియాకు తమ అధునాతన F-35 ఫైటర్ జెట్లను విక్రయించబోతున్నట్టు ట్రంప్ తెలిపారు.
NASA అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగారకుడి ఉపరితలంపై మిస్టీరియస్ రాయిని గుర్తించింది. ఈ రాయి మార్స్ సహజ, భౌగోళిక నిర్మాణంతో పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నది. శాస్త్రవేత్తలు 80 సెంటీమీటర్ల పొడవు
16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చి తల దాచుకున్నారు. ఆ సమయంలో తన తల్లిని చంపేందుకు కుట్ర జరిగిందని, తల్లిని సకాలంలో భారత్ రక్షించిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ పేర్కొన్నారు.
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో కలిసి మంగళవారం శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఏబీసీ న్యూస్ విలేకరి మేరీ బ్రూస్పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో భారత్కు చెందిన 8 నెలల గర్భిణి ప్రాణాలు కోల్పోయారు.
ఎప్స్టీన్ ఈమెయిళ్లు వెలుగు చూస్తుండటంతో అమెరికాలో అతడితో అంటకాగిన వారి బండారం బయటపడుతోంది. తాజాగా మాజీ ఆర్థిక మంత్రి, ఓపెన్ ఏఐ బోర్డు డైరెక్టరు లారీ సమ్మర్స్ రాజీనామా చేశారు.
పశ్చిమ ఉక్రెయిన్లోని టెర్నోపిల్ నగరంపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 25 మంది మరణించారని అత్యవసర సేవల విభాగం బుధవారం వెల్లడించింది.