ఉమ్మడి కృష్ణా జిల్లాలో 80 శాతం మంది ధాన్యం దళారులకే విక్రయిస్తున్నారు. వారు మాత్రం ఆన్లైన్లో నమోదు చేయించి మద్దతు ధర తీసుకుంటున్నారు. ఏటా ఇదే తంతు. ఆర్బీకేల్లో విధించే నిబంధనలు... వేధింపులతో రైతులు విసిగిపోతున్నారు.
మేమున్నామంటూ ఊదరగొట్టిన వ్యవసాయశాఖ అధికారులు, రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) సిబ్బంది మిగ్జాం తుపాను ప్రభావంతో కష్టాల్లో ఉన్న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్యాయ పాలనపై సమర శంఖం పూరించడానికి రైతులందరూ కదలి రావాలని అమరావతి ఐకాస పిలుపునిచ్చింది. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి గ్రామాల్లో రైతులు చేపట్టిన ఉద్యమం ఈ నెల 17కు నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుంది.
కంకిపాడు మండలం గొడవర్రు వద్ద కంకిపాడు, విజయవాడ నగరానికి చెందిన వేలాది మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన జగనన్న లేఔట్లో ఇటీవల కురిసిన వర్షానికి నీరు చేరి చెరువుని తలపిస్తోంది.
‘విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఓపీ, ఇన్పేషెంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. కానీ.. దీనికి తగ్గట్లుగా కనీస స్థాయిలోనూ సౌకర్యాలను కల్పించడం లేదు. వైకాపా పాలకుల ప్రకటనల్లో మాత్రం.. ప్రభుత్వ ఆసుపత్రులు వెలిగిపోతున్నాయి. కానీ.. వాస్తవ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెదేపా ప్రభుత్వం ఏర్పడగానే తొలి ఎమ్మెల్సీ పదవి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకేనని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆదివారం రాత్రి తెదేపా మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్యచౌదరి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన నియోజకవర్గస్థాయి రావి-రాము వర్గీయుల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
శ్రీరామ పాద క్షేత్రంలో కృష్ణానది ఒడ్డున కొలువైన గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో కొనసాగుతున్న కార్తిక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేసి, నవ జ్యోతులు వెలిగించారు.
అంతర్జాతీయ తెలుగు మహా సభలు వచ్చే జనవరి 5, 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహిస్తామని.. సాహతీ ప్రియులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మహా సభల కృష్ణా జిల్లా సంచాలకుడు వసుధ బసవేశ్వరరావు పేర్కొన్నారు.
ప్రముఖ సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆదివారం కూచిపూడిలోని బాలా త్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
వణుకూరు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో వందేళ్ల నాటి రావి వృక్షాన్ని రెండ్రోజుల నుంచి రంపాలు, యంత్రాలతో కోసేస్తుండగా ఆదివారం నాటికి సగం మోడువారింది. మిగతా మొదలును సోమవారం తొలగించనున్నట్లు సమాచారం.
కొండపల్లి శివారు శాంతినగర్-ఈలప్రోలు జగనన్న కాలనీకి దారి లేక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ లేఔట్లో 1,605 ప్లాట్లకుగానూ చివరి ప్రాంతంలో ఉన్న ప్లాట్లకు శాంతినగర్ పొలాల వైపు నుంచి వెళ్లేందుకు అనువుగా అధికారులు రహదారిని అభివృద్ధి చేస్తామని గతంలో చెప్పారు.
ఆ ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహ బంధానికి గుర్తుగా వారికి బాబు జన్మించాడు. అల్లారు ముద్దుగా కుమారుడిని పెంచుకుంటున్నారు. బోసి నవ్వులు నవ్వుతూ ఇంట్లో సందడి చేస్తున్న ముద్దుల కొడుకు చిరు ప్రాయంలోనే మృత్యు కౌగిలికి చేరుకుంటాడని అనుకోలేదు.
వీఆర్ఏలకు డీఏ బకాయిలు చెల్లించాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ బాలోత్సవ్ భవన్లో ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.నరేంద్ర ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు.
అదనపు కట్నం కోసం భార్యకు తిండి పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసిన భర్త, అత్తమామలపై పెనమలూరు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంకు చెందిన మానేపల్లి అశోక్కు, పెనమలూరుకు చెందిన కల్యాణిలకు గతేడాది వివాహం జరిగింది.
తెలుగు బాలల పండగ ‘వీవీఐటీ బాలోత్సవ్ 2023’ వేడుకలకు సంబంధించి నంబూరులోని వీవీఐటీ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదివారం ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు.
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో యువత ఓట్ల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి సరికొత్త జగన్నాటకానికి తెరతీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో ఆరోపించారు.
అనకాపల్లిలో ఈ నెల 17వ తేదీన జరిగే ‘మిస్టర్ ఆంధ్రా’ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొనే జిల్లా జట్టును ఆదివారం కానూరులోని అశోక్ వ్యాయామ శాలలో ఎంపిక చేశామని ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ సంఘం అధ్యక్షుడు బి.మనోహర్, కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు.
నిరుద్యోగులకు ఉపాధితోపాటు... నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఫిష్ ఆంధ్ర’ స్టాల్స్ చాలాచోట్ల మూతపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం రాయనపాడులో ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర స్టాల్ ప్రారంభించిన కొన్ని రోజులకే మూసేయడంతో ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారింది.
పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): స్థానిక తిరుపతమ్మ మండల దీక్ష మాలధారణ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 12 వరకు నిర్వహిస్తామని ఆలయ ఈవో కె. రమేష్నాయుడు...
ఏజీ అండ్ ఎస్జీఎస్ కళాశాలలో రెండు రోజులుగా కృష్ణా విశ్వవిద్యాలయ 12వ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. విశ్వ విద్యాలయ పరిధిలో పలు కళాశాలల నుంచి పలు వురు విద్యార్థులు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరుస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు మునిగిన పొలాల నుంచి ఇప్పటి వరకు నీరు తగ్గకపోవడంతో వరి పనలు, వరిపంట మురిగి పోతున్న పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతు న్నారు. వర్షాలు తగ్గి నాలుగు రోజులు దాటినా మండ ల పరిధి పలు గ్రామాల పొలాల్లో ఇంతవరకు నీరు బటయకు పోక కొన్నిచోట్ల ధాన్యం నుంచి మొలకలు, మరి కొన్ని ప్రాంతాల్లో కోత కోసేందుకు వీలులేకుండా పంట నీటిలో మునిగి ఉంది.
డ్రెయిన్లు, మురుగు కాల్వల నిర్వహణలో ప్రభుత్వ వైఫ్యల్యం రైతులను నిండాముంచిందని టీడీపీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు, నియోజకవర్గ తెలుగు రైతు నాయకుడు కాకాని శ్రీనివాసరావు ఆరోపించారు.
‘ఎట్టి పరిస్థితుల్లో గుడివాడ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేద్దాం.. కొడాలి నానిని బొంద పెడదాం.. ఇదే మన నినాదం.. అదే మన విధానం..’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తుఫాన్ వెళ్లి ఐదురోజులైనా చేలలో నీళ్లు కదలకపోవటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటకోసే అవకాశంలేక పలువురు రైతులు దున్నేస్తున్నారు. 400 ఎకరాల్లో పంట నీటమునిగి రోజులు గడుస్తున్నా నీరుపోయేందుకు అధికారులు ఏవిధమైన చర్యలు చేపట్టకపోవటంతో ధాన్యం మెలకెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుఫాన్ కారణంగా పంట నష్టాన్ని అంచనావేయడంలో జగన్రెడ్డి ప్రభుత ్వం పూర్తి విఫలమైందని, రైతుకుటుంబాలు పడుతున్న అవస్థలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ అన్నారు.
భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచిన జగన్ ప్రభుత్వానికి భవిష్యత్లో కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఉమ్మర్వలి హెచ్చరించారు.
‘‘రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్ర హాలకు, దళితులకు రక్షణ కరువైంది. గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక వ్యక్తి అంబేడ్కర్ను అవమానించేలా విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేయడం దారుణం. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి’’ అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎస్సీ సెల్ చైర్మన్ సూర్య ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాశక్తి – మైలవరం : కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆఖరి ఆదివారం కావడంతో పలుకుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధనలు ఉత్సాహంగా కొనసాగాయి. పొందుకోల రోడ్లోని వివేకానంద…