CM Chandrababu Delhi Visit: ఢిల్లీలో వరుస భేటీలతో సీఎం చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా న్యూ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద జోషితో సీఎం సమావేశమయ్యారు.
CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టుల సత్వర అమలుకు కేంద్రప్రభుత్వం మద్దతు కోరేందుకు ముఖ్యమంత్రి గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శుక్ర, శనివారాల్లో ఇక్కడే ఉంటారు. సీనియర్ కేంద్ర మంత్రులతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించనున్నారు.
Rains Alert: ఆంధ్రప్రదేశ్లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. దానికి అల్పపీడనం తోడైంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు. శనివారం అల్లూరి జిల్లా, మన్యం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
ప్రజారవాణా వ్యవస్థలో కీలకంగా భావిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రాథమిక ప్రణాళికలను సిద్ధం చేశారు. క్షేత్రంలో సర్వే అనంతరం మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు తుది రూపు తీసుకొచ్చారు.
నిత్యావసరాల సరకుల పంపిణీలో ప్రభుత్వం తీసుకురానున్న నూతన మార్పులతో రేషన్ మాఫియాకు అడ్డుకట్ట పడనుంది. ఇందులో భాగంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) వ్యవస్థను రద్దు చేసి...ఈ జూన్ నుంచి గతంలో మాదిరి చౌక దుకాణాల వద్దే నిత్యావసర సరకులు పంపిణీ చేయనున్నారు.
ప్రముఖుల తాకిడి పెరుగుతున్నందున మరో మూడు నెలల్లో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేయడంతో పాటు.. 2028 నాటికి విమానాశ్రయం నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్కు విమానం ఎగరడమే లక్ష్యంగా పెట్టుకున్నామని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.
ఆరంభంలోనే జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆటంకం కలిగింది. జడ్పీ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన సమావేశంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు కేటాయిస్తున్నట్లు తీర్మానించామని ఛైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు.
ఆటోనగర్లో పేరుకుపోయిన 500 టన్నుల చెత్తకు గురువారం కొత్తగా.. మరో 30 టన్నులు వచ్చి చేరింది. ఎన్ని రోజులు చెత్తను తరలించకుండా రహదారుల పక్కనే వదిలేస్తే.. అంత ఎక్కువ అయిపోతోంది.
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి దివిసీమలోని వేలాది మంది రైతులు పంటలు సాగు చేయడం లేదు. సముద్రం నీరు పంట భూముల్లోకి వస్తోందని మొరపెట్టుకున్నా వినలేదు.
విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కృష్ణానది మధ్యలో ఉన్న భవానీద్వీపంలో భారీగా చెట్లను నరికి తరలించుకుపోతున్నారు. పర్యాటక శాఖకు చెందిన కొందరు అధికారుల సహకారంతోనే ఈ దందా సాగుతున్నట్టు సమాచారం.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు పట్టుబడిన దొంగల వివరాలు గురువారం వెల్లడించారు.
పోరంకిలో నివాసముంటున్న తెదేపా నాయకుడు, డాక్యుమెంట్ రైటర్ తుమ్మలపల్లి హరికృష్ణ ఇంటిపై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు.
మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికపై నిఘా పెట్టాలని డీజీపీకి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
గ్రామీణ మహిళల ఆర్థిక పురోగతిని మరింత వేగవంతం చేసేందుకు స్ర్తీనిధి సంస్థ ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేసి, యాప్ను తీసుకురావడం అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
‘నీలాగా సూట్కేసు కంపెనీలు పెట్టే అలవాటు నాకు లేదు. దమ్మూ ధై ర్యం ఉంటే లిక్కర్ స్కాం ఎవరి హయాంలో జరిగిందో చెప్పాలి.’ అని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సవాల్ విసి రారు.
ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని డీలర్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
రెడీమేడ్, డిజైన్ దుస్తుల కారణంగా టైలర్లకు చేతినిండా పని లేకుండా పోయిన ఈ రోజుల్లో వినూత్నంగా ఆలోచించాడు మండలంలోని వణుకూరుకు చెందిన సీనియర్ టైలర్ షేక్ కాలేషా. పని లేదని నిరుత్సాహపడ కుండా టైలరింగ్ సేవలను వినియోగదారుల ఇంటి వద్దకు తీసుకెళ్లి దర్జాగా దర్జీ సేవలందిస్తున్నాడు.
భవానీద్వీపంలో కలప దొంగలు బరితెగించారు. ఇంటిదొంగల సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా ద్వీపంలో పచ్చటి చెట్లను తెగనరికారు. ద్వీపం పునరుద్ధరణ పనులకు పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్న తరుణంలో పచ్చదనాన్ని హరించేసే చర్యలకు తెగించారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతుండగా, ఏపీటీడీసీలో ఇంటిదొంగల పేర్లు బయటపడుతున్నాయి.
వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. వరదల సమయంలో గేట్లు ఎత్తే సమస్యకు త్వరలో తెరపడనుంది. రెగ్యులేటర్ గేట్ల మరమ్మతులకు, పూడికతీత పనులకు కూటమి ప్రభుత్వం రూ.1.80 కోట్ల నిధులు కేటాయించడం, పనులు చకచకా జరుగుతుండటంతో స్థానిక రైతులతో పాటు సమీప గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా కొన్న ఆర్టీసీ బస్సులకు మార్గం సుగమమైంది. ఈ బస్సులొచ్చి చాలాకాలం కావస్తున్నా రిజిసే్ట్రషన్ చేయడానికి రవాణా శాఖ అభ్యంతరం వ్యక్తం చేయటంతో రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ హబ్ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.