అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు.
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా ఈనెల 21వ తేదీన 1,872 మంది అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలు రాయనున్నారని, ఐదు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, లోటుపాట్లు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఎస్.దిల్లీరావు ఆదే శించారు.
గులకరాయి సానుభూతి అస్త్రం వైసీపీ నెత్తిన బండరాయిగా మారింది. కేవలం వడ్డెర కులాన్ని టార్గెట్గా చేసుకుని ఎన్నికల్లో సానుభూతి పొందాలన్న పన్నాగం చివరికి వైసీపీ మెడకే చుట్టుకుంది. ఒక కులానికి చెందిన మైనర్లయిన బాలురును అదుపులోకి తీసుకోవడం, పోలీసులు ఏ2గా చెబుతున్న వేముల దుర్గారావును ఇంతవరకు కుటుంబ సభ్యులకు చూపించకపోవడంతో వడ్డెర కులస్తులు పిడికిలి బిగించారు. ఎన్నికల ముందు మైలేజ్ కోసం తమ కులాన్ని దోషిగా చిత్రీకరించారని ఆగ్రహిస్తూ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
ఓటు హక్కు ఉన్నవారంతా ప్రజాస్వామ్యస్ఫూర్తితో ఓటేయాలని ప్రజలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దిల్లీరావు, విజయవాడ పార్ల మెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయపరిశీలకుడు వి.జస్టిన్, విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తిరువూరు, మైలవరం ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్శర్మ, విజయ వాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట ఎన్నికల వ్యయ పరిశీలకుడు మదన్ కుమార్ పిలుపునిచ్చారు.
నమ్మిన సిద్ధాంతానికి కడదాక కట్టుబడిని నిస్వార్ధ ప్రజాసేవకుడు, త్యాగశీలి సర్ధార్ గౌతు లచ్చన్న అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ కీర్తించారు. గౌతులచ్చన్న సేవాసమితి అధ్యక్షుడు కాగిత కొండ ఆధ్వర్యంలో శుక్రవారం లచ్చన్న 18వ వర్ధంతి నిర్వహించారు.
ప్రజా సంక్షేమంతో కూడిన రాష్ట్రా భివృద్ధి టీడీపీ కూటమితోనే సాధ్యమని మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు అన్నారు. బొమ్ములూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఇంటింటి ప్రచారంలో యార్లగడ్డ సతీష్తో కలిసి పాల్గొన్నారు. సూపర్సిక్స్ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకురు తుందని ప్రజలకు వివరిస్తూ, అభ్యర్థుల గుర్తులను చూపుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.
మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించడం ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకువద్దామని ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు.
నామినేషన్ల జాతర రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. రెండు జిల్లాల్లో భారీగానే నామినేషన్లు పడ్డాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, ఇతర రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్రులు, సోషలిస్టు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 18, కృష్ణాజిల్లాలో 8 దాఖలయ్యాయి. అభ్యర్థుల ర్యాలీలు, ప్రచారాలతో ఎన్నికల పండుగ వాతావరణం కనిపిస్తోంది.
ఇబ్రహీంప ట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి జోగి రమేశ్ బంధువులు ఆయన ఇంటి ముందే సభాస్థలి ఏర్పాటుచేసి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మైలవ రం అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు.
‘ఐదేళ్లలో వైసీపీ చేసిన ఘోరాలెన్ని? తగిలిన గాయాలెన్ని? పోయిన ప్రాణా లెన్ని? గులకరాయి గాయంపై వాపోతున్న జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి?’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్శదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాం డ్ చేశారు.
బీజేపీ-జనసేన బలపరచిన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) శుక్రవారం విజయోత్సవంలా.. ఉత్సాహపూరిత వాతావరణంలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరుతున్నారని, నియోజకవర్గంలో వైసీపీకి కౌంట్డౌన్ ప్రారంభమయిందని మాజీ మంత్రి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు.
సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో రైటింగ్ పార్ట్ చాలా ముఖ్యమైనదని ప్రిలిమినరీస్ దగ్గర నుంచి మెయిన్స్ వరకు నిరంతరం శ్రమిస్తే గమ్యం చేరుకోగలుగుతారని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వి. మణి చైతన్య అన్నారు.
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకళ్ల…
ఇండియా వేదిక’ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి-పెదపారుపూడి ప్రజా వ్యతిరేక విధానాలు అవంలభిస్తోన్న వారిని ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలని పలువురు వక్తలు అన్నారు. ఇండియా వేదిక బలపరిచిన…
సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-హనుమాన్ జంక్షన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వారు…
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) ఎన్నికల విధుల నుండి వికలాంగ ఉద్యోగస్తులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుల మరియు వయోవృద్ధుల, ట్రాన్స్…
ఇండియా వేదిక బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు శుక్రవారం నామినేషన్ కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక కెఎల్.రావు పార్క్ వద్ద నుంచి భవానీపురంలోని…
చిల్లకల్లు ఎస్ఐ వి.సతీష్ ప్రజాశక్తి – జగ్గయ్యపేట : సాధారణ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని తిరుమలగిరి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.…
ప్రజాశక్తి – వన్టౌన్ : విద్యార్థులు వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ నారాయణరావు అన్నారు. కేబీఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్…
ఐక్య కార్యాచరణతో వైసిపి అభ్యర్థులను గెలిపించుకుందామని జెడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. రెడ్డిగూడెం మండల పరిధిలోని మద్దులపర్వ గ్రామంలో వైసిపి కార్యకర్తల సమావేశం…
ప్రజాశక్తి – కంచికచర్ల : కంచికచర్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆరో రోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యాధికారులతో పాటు…