గుంటూరు జిల్లాలో భద్రతాపరమైన చర్యలను కట్టుదిట్టం చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు.
దేశ ప్రయోజనాలకు దోహదపడే అధునాతన పరిశోధనలను యూనివర్సిటీలు విస్తృత పరచాలని చెన్నైలోని ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ ముర్వేకర్ సూచించారు.
ఘంటసాల మండలంలో దివంగత నేత, భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఆయా పాఠశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రంథాలయాల్లోనూ శుక్రవారం నిర్వహించారు.
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల వాహనాన్ని అప్పినపల్లి గ్రామస్తులు వెంబడించి మరీ పట్టుకున్నారు.
నేటి బాలలే రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారు. మనం వారిని పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మంచి ఆరోగ్యంతో.. శక్తితో ఉండేలా వారిని పెంచాలి. పిల్లలే అత్యంత విలువైన వనరు అని అన్నారు
జీఎంసీలో కొంతమంది వర్క్ఇన్స్పెక్టర్ల ఇష్టారాజ్యంబినామీల అవతారం.. బిల్లుల్లో మాయాజాలంనల్లచెరువులో గతంలో పని చేసిన ఓ వర్క్ ఇన్స్పెక్టర్దే నేటికీ పెత్తనం. రూ.కోట్ల విలువైన కాంట్రాక్టులు బినామీ పేర్లతో చేయించడం.. ఏఈలను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పడం.. ఇదీ ఆయన పద్ధతి
పశ్చిమ బైపాస్ ప్యాకేజీ-4 పనులు కొలిక్కి వస్తున్నాయి. తుది దశ పనులు వేగంగా పూర్తి చేసి సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మంగళగిరిలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన కార్యచరణ మంత్రి నారా లోకేశ్ రూపొందించారు. చేనేత వస్త్ర ఉత్పత్తి తయారీలో ఆధునికతను జోడించి స్టాండ్ మగ్గాలను కార్మికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు
జిల్లాలో యూరియా కష్టాలు తీరడం లేదు. ఖరీఫ్లో గతేడాది సీజన్ కంటే 5,445 టన్నులు అదనంగా సరఫరా చేసినా.. కృత్రిమ కొరత కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే రబీలో ఇప్పటికే 2 వేల టన్నులకుపైగా అదనంగా సరఫరా అయింది.
మంగళగిరి మండలం నీరుకొండలో ఉన్న ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మకమైన బయోమెడికల్ రీసెర్చ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నెట్వర్క్ (బ్రెయిన్) పరిశోధనా కేంద్రాన్ని రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేశారు
సీఐపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం తప్పుడు కేసులో ఇరికించాలని పథకం పన్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. గురువారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్జిందాల్ వివరాలు వెల్లడించారు.
వారంతా బుడుగులు.. ప్రతిభలో చిచ్చర పిడుగులు.. తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని గురువుల మార్గ దర్శనంలో అద్వితీయ విజయాలు సొంతం చేసుకున్నారు. చదువుతో పాటు ఎంచుకున్న రంగంలో తమ ప్రత్యేకత చాటేందుకు తపన పడుతున్నారు.
అభంశుభం తెలియని పిల్లలపై కొందరు కర్కశంగా వ్యవహరిస్తుంటారు. వివిధ రకాలుగా వేధిస్తుంటారు. వెట్టిచాకిరి చేయిస్తుంటారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా బాలల హెల్ప్లైన్ ఉంది
విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలో మేనేజర్ ఉద్యోగం.. అక్కడ ఇతర రాష్ట్రాల కూలీలతో పరిచయమైంది. వారి మాటలు విని ఉద్యోగానికి రాజీనామా చేశాడు.. త్వరగా కోటీశ్వరుడిని కావాలన్న ఆశతో గంజాయి స్మగ్లర్గా మారాడు
‘నకిలీ లేబుళ్ల డిజైన్, ప్రింటింగ్ కోసం నన్ను 2022 చివరలో తిరుమలశెట్టి శ్రీనివాసరావు సంప్రదించాడు. నేను తొలుత అంగీకరించలేదు. రిస్కుతో కూడుకున్న వ్యవహారం కావడంతో భయపడ్డా.
అమ్మా ఎక్కడి వరకు వచ్చారు.. అని తన తల్లికి ఫోన్ చేయగా అవతలివైపు పోలీసులు మాట్లాడుతూ.. మీ అమ్మా నాన్న వస్తున్న కారు ప్రమాదానికి గురైంది.. గాయాలయ్యాయి.. అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ గురైంది