రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితుల హత్యలు పెరిగిపోతున్నాయని, హత్య లను పోలీసు అధికారులు ఆత్మహ త్యలుగా చిత్రీక రిస్తున్నారని ఎమ్మా ర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు.
‘‘పొందుగలలో నాలుగు నెలలుగా జలజీవన్ మిషన్ పనులు చేస్తున్నారు. ఒక్క కుళాయినైనా ఎందుకు ఏర్పాటు చేయలేదు.’’ అని ఎన్టీఆర్ జిల్లా అధికారులపై పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు.
కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడం, నగరాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం అనే ప్రక్రియ దేశ వ్యాప్తంగా బలోపేతం చేయుటయే ఫోరం ప్రధాన లక్ష్యమని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
నగరంలో సినీ హీరో వీజే సన్నీ, కమెడియన్ సప్తగిరి సందడి చేశారు. బిగ్బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్స్టాపబుల్ ఈ నెల 9న విడుదల కానున్న సందర్భం గా బందర్ రోడ్డులోని పీవీపీ మాల్లో సినిమా ప్రమోషన్ను శుక్రవారం నిర్వహించారు.
ఆమె వయసు 75 ఏళ్లు. ఆమె భర్త గ్రామ సర్పంచ్గా ఏకఛత్రాధిపత్యంగా 25 ఏళ్ల పాటు పనిచేసి అప్పటి టీడీపీ, కాంగ్రెస్ నేతల గౌరవం పొందారు. ఆయన లెగసీతో వైసీపీ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు సర్పంచ్గా పోటీచేసి గెలుపొందిన పెద్దావిడ మనసు ఇప్పుడు కష్టపడింది. అభివృద్ధి పనులకు తనను ఆహ్వానించ పోవడంతో చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల సర్పంచ్ చిన సైదమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నాగవంశ కులస్థులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని టీడీపీ నాగవంశ సాధికర సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరుబోతు రమణారావు కోరారు.
హర్ష క్రియేషన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని వెలిదండ్ల హనుమంతరా య గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సాంఘిక నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం మూడు నాటికలు ప్రదర్శించారు.
2024 ఎన్నికలలో తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మో హన్ అఖండ విజయం సాధిస్తారని, ఈ గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఉద్యోగుల సర్దుబాటుకు ఇంకా రెండు, మూడు రోజుల సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. బదిలీల జాబితాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల చేసినా వాటిలో మార్పులు చేర్పులు ఉంటాయని ఉద్యోగులు భావిస్తున్నారు.
రాజమండ్రిలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు మహిళలు, యువకుల్లో మంచి స్పందన లభించిందని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. త్వరలో రూ. 12వేల కోట్లకుపైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు బీజం పడింది. ఇరు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్...
వేసవి కాలం వచ్చిందంటే చాలు పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి అటకెక్కింది.
విజయవాడ దుర్గగుడికి తొలిసారి డిప్యూటీ ఈవోను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు రెండేళ్ల కిందట డిప్యూటీ ఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
రాజకీయ పలుకుబడి, ఉత్తరంతోపాటు... దక్షిణ సమర్పించుకున్న వారికి కోరుకున్న స్థానం దక్కింది. నిబంధనలు, మార్గదర్శకాలు బేఖాతరు. ఎవరికి ఇష్టమైన వారిని వారు బదిలీ చేయించుకున్నారు.
ఆయనకు ఎనికేపాడులో ఓ ఇంటి స్థలం ఉంది. కుటుంబ అవసరాల కోసం అమ్మకానికి పెట్టారు. మెట్రోకు భూసేకరణ చేస్తున్నారనీ.. దానికి తీసుకుంటారని ప్రచారం జరగడంతో కొనడానికి ఎవరూ ముందుకురాలేదు.