పరకామణి విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. లక్షల కోట్లు దోచుకున్న జగన్కు ఇది చిన్న తప్పే కావచ్చని వ్యంగాస్త్రాలు సంధించారు. వైకాపా నేత పేర్ని నానిపై కూడా కౌంటర్ వేశారు.
దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లుగా ఏపీ భాజపా అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
యువతలో స్ఫూర్తి నింపేందుకు క్రీడా పోటీలు నిర్వహించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి నేషనల్ లెవల్ గేమ్స్ కాంపిటేషన్స్ మరెన్నో జరగాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్రం పురోగతి చెందడానికి, దేశంలోనే ప్రథమ స్థానానికి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వివరించారు. రాయలసీమను ఒక పవర్ హౌస్గా అభివృద్ధి చేయనున్నారని చెప్పుకొచ్చారు.
బొల్లి ముంత శివరామకృష్ణ ఫౌండేషన్, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి సంయుక్తంగా తెనాలిలోని తెనాలి రామకృష్ణ కవి కళా క్షేత్రంలో కూచిపూడి మహా నాట్య ప్రదర్శన నిర్వహించారు.
గుంటూరు నగరంలోని ఆర్. అగ్రహారంలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 655 ఏళ్ల చరిత్ర ఉంది. 12 మంది ఆళ్వారులు ఉండడంతో వైష్ణవ దివ్యక్షేత్రంగా వర్థిల్లుతోంది. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో స్వామివారికి నిత్యం ఉదయం ప్రాబోధిక గోష్ఠి, మధ్యాహ్నం మహా నివేదన, సాయంత్రం తీర్థ గోష్ఠితో త్రికాల అర్చనలు చేస్తుంటారు
సొంతింటి కోసమనో.. పెట్టుబడి సాధనంగానో చాలామంది స్థలాలను కొనుగోలు చేస్తుంటారు. అవగాహన లేక.. దళారుల మాటలు నమ్మి మోసపోతున్నవారెందరో.ఒకే స్థలానికి అనేక రిజిస్ట్రేషన్లు చేయడం, ఒకరికి అమ్మిన స్థలాన్ని మరొకరికి రిజిస్ట్రేషన్ చేస్తున్న ఘటనలు వెలుగులోకొస్తున్నాయి.
జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ప్లాజాల్లో వాహనదారుల నుంచి రుసుం వసూలు చేయడమే కాదు.. కొన్ని సేవలూ అందించాలి. వీటి గురించి చాలా మందికి అవగాహన లేక వినియోగించుకోవడం లేదు
సినీ చరిత్రలో తారా స్థాయికి ఎదిగిన మహానటి సావిత్రి పేరు చెప్పగానే ఆమె నటనే అందరికీ గుర్తుకు వస్తోంది. ఆ మహానటి గౌరవార్థంగా ఆమె జన్మించిన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని చిర్రావూరులో రూ.2 కోట్లతో కల్యాణ మండపం నిర్మిస్తున్నారు.
‘‘నిబంధనలకు ఇసుక అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇసుక విధానం జిల్లాలో కొందరు నేతలు, అధికారులు, వ్యాపారులకు కాసుల పంట పండిస్తోది.
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వెంకట్కు.. అమరావతిలోని ఓ విశ్వవిద్యాలయం క్యాంపస్లో అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం చూసి భయం పట్టుకుంది. తోటి విద్యార్థులతో మెలగడంలోనూ ఇబ్బంది పడ్డాడు
పూర్వం మట్టి పాత్రలు, చెక్కతో చేసిన పాత్రలు, జాడీలు వాడేవారు. ఆధునిక కాలంలో స్టీలు, అల్యూమినియం, ప్లాటినం గిన్నెలు వాడుతున్నారు. ప్లాస్టిక్తో తయారైన స్పూన్లు, గ్లాసులు, ప్లేట్ల వాడకమే ఎక్కువ.
జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ దుర్గగుడికి శనివారం ఓ కుటుంబం కారులో వస్తుండగా.. బాపులపాడు మండలం వీరవల్లి పైవంతెన సమీపంలో వాహనం ఆగిపోయింది. వెంటనే మంటలు వ్యాపించాయి.
పాతబస్తీ బ్రాహ్మణవీధిలోని ఇంద్రకీలాద్రి అతిథి గృహంలోని హాల్లో దుర్గగుడి పాలకమండలి రెండో సమావేశం శనివారం నిర్వహించారు. ఈనెల 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల విరమణ దేవస్థానం నిర్వహిస్తున్నందున ఏర్పాట్లకు అవసరమైన అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
నగరపాలక సంస్థ వైకాపా పాలకపక్షం తీరు.. అనుసరిస్తున్న వైఖరి పలు విమర్శలకు దారితీస్తోంది. కార్పొరేషన్ బడ్జెట్లోని కేటాయింపు పద్దును అడ్డుపెట్టుకుని కౌన్సిల్ ఆమోదం లేకుండానే కార్పొరేటర్ల బృందం విజ్ఞానయాత్ర పేరిట ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశంలోని పలు ప్రాంతాలను తిరిగొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఏపీ సీపీడీసీఎల్)వినియోగదారులకు అందించే సేవల విషయంలో జవాబుదారీతనంతో పనిచేసేందుకు నియమిత గడువు విధించుకుంది
గ్రహణం మొర్రి చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. చిన్నారుల మోముపై చిరునవ్వులు మాయమవ్వడంతో పాటు కొందరు హేళనకు గురవుతున్నారు. దీంతో విద్యార్థులు ఒకింత చదువుకు దూరమవుతున్నారు
యువత చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న కృష్ణాతరంగ్ కార్యక్రమ ముగింపు సభను శనివారం సాయంత్రం నిర్వహించారు.