ప్రతి సోమవారం కలెక్టరేట్, మండల, డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చే ప్రజల ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయి.
గత వైకాపా పాలనలో చేసిన తప్పులు నేటీకి వెంటాడుతూనే ఉన్నాయి. జాతీయ రహదారిపై పడిన వర్షపు నీరు డ్రెయిన్లలోకి వెళ్లకుండా రోడ్డుపై నిలబడటంతో ఫుట్పాత్ మొత్తాన్ని యంత్రాలతో తవ్వి డ్రెయిన్లలోని పూడిక తీస్తున్నారు.
గుడివాడలో ఓ కార్పొరేట్ ఆసుపత్రి గుండె జబ్బు గల వారికి ఉచిత యాంజియోగ్రామ్ పరీక్షల పేరుతో ఆరోగ్య శిబిరం నిర్వహించి..వేరొక అనారోగ్యం పేరుతో తమకు ఎలాంటి శస్త్రచికిత్సలు చేయకుండానే చేసినట్లు ఎన్టీఆర్ వైద్య సేవలో నమోదు చేసుకుందని బాధిత కుటుంబం పేర్కొంది.
వైకాపా ప్రభుత్వ హయాంలో చేసిన రీసర్వే వల్ల వచ్చి పడిన జాయింట్ ఎల్పీఎం సమస్యకు కూటమి సర్కారు చక్కని పరిష్కారం చూపిస్తోంది. అన్నదాత సుఖీభవ వంటి పథకాలు వర్తించక..రిజిస్ట్రేషన్లు చేసే వీలు లేక..చివరికి బ్యాంకు రుణం కూడా రాని దైన్యానికి ముగింపు పలుకుతోంది.
వైకాపా హయాంలో విచ్చలవిడిగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించి.. వరుసగా షోకాజ్ నోటీసులు, డిమాండ్ నోటీసులను ఈ ఏడాది ఆరంభంలోనే ఇచ్చారు. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో సర్వే నంబర్ల వారీగా ఎక్కడెక్కడ ఎంత మట్టి తవ్వేశారు.
అమరావతి రోడ్డు అనుసంధాన మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం సాగుతున్న రోడ్ల పనుల పూర్తికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడం.. త్వరలో మరో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభంకానున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ రోడ్లను అందుబాటులోకి తేనుంది.
నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంలో చోదకుల పాత్ర కీలకం. కళ్లు ఆర్పకుండా నిత్యం అప్రమత్తతతో వ్యవహరిస్తూ.. రైళ్లు నడుపుతారు లోకో పైలెట్లు (రైలు డ్రైవర్లు).
నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగంలో కొందరు అధికారులు, ఓ లైసెన్స్డు టెక్నికల్ పర్సన్ (ఎల్టీపీ), వైకాపా నాయకుడొకరు కుమ్మక్కై, అక్రమంగా ప్లాను పొంది, ఓ భారీ నిర్మాణానికి తెర లేపారు.
అప్పనంగా సొమ్ములిచ్చేవారు మన వారైతే ఎలాంటి పరిస్థితుల్లో అయినా లబ్ధి చేకూరుతుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూరవిద్య విభాగంలో ఎన్టైటిల్మెంట్ చెల్లింపులే చెబుతున్నాయి. ఈసీ ఆమోదం లేకుండానే గత వీసీ ఉత్తర్వులను సాకుగా చూపుతూ తొమ్మిదేళ్లుగా దోచిపెడుతున్నారు.
గుంటూరు జిల్లాను బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేసే కీలక మార్గాలను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ప్రజా రాజధాని అమరావతి మరో కీలక ఘట్టానికి వేదిక కానుంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారేలా ఈ నెల 28న సీఆర్డీఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరుగనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇల్లు సమకూర్చుతామని జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్ చెప్పారు.
రాజధాని అమరావతిలో అబ్దుల్ కలాం పేరిట పది ఎకరాల స్థలంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కనకమేడల అప్పారావు, సభ్యులు డాక్టర్లు యర్రా నాగేశ్వరరావు, నిమ్మల శేషయ్య, శశికళ, తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్వజీర్ కోరారు.
దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ప్రజల మధ్య సమానత్వ భావన నెలకొని బలహీన వర్గాల ప్రజలకు హక్కులు లభించాయని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కనపర్తి సంగీతరావు అన్నారు.
మండలంలోని వింజనంపాడు శ్రీ కోదాడ రామస్వామి దేవాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న 61 వ రామనామ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
జిల్లాలో జడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించిన పనులకు నిధులు కేటాయించక పోవడంపై జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, సీఈఓ జ్యోతిబసులను సభ్యులు నిలదీశారు.
తిరుమల పరకామణి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈకేసులో పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని సీఐడీ మరోసారి విచారణకు పిలిచింది.
రైతుల మీద మొసలికన్నీరు కారుస్తున్న సజ్జల గత ఐదేళ్లల్లో ఏం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. జగన్ అండ్ కో పాల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని తెలిపారు. పిల్లలకు అర్ధం అయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తకరూపంలో తీసుకొచ్చామని వెల్లడించారు.