కార్తిక మాసం సందర్భంగా తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలోని శ్రీసంగమేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం మంచుకొండల నడుమ ప్రత్యేక అలంకారంలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
అమరావతి రాజధాని అమరావతిలో రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. పలువురు రాజధాని ప్రాంతవాసులు, కూలీల నుంచి జీఆర్ఎం నోడల్ అధికారిణి పి.జయశ్రీ అర్జీలను స్వీకరించారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఐఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పైవేపై ఏర్పడిన గుంతలను తప్పించబోయి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సాంబశివరావు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు.
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వేరస్వామివార్ల ఆలయ పునర్మిర్మాణ శంకుస్థాపన మహోత్సవం జరిగింది.
ఆపద సమయంలో ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన జగన్ చేసే వ్యాఖ్యలు అర్ధరహితమని ధూళిపాళ్ల అన్నారు. జగన్ చేసే వ్యాఖ్యలు రాజకీయ లబ్ది కోసమే అని ఆరోపించారు. బెంగుళూరు ప్యాలెస్లో కూర్చుని జగన్ చేసే వ్యాఖ్యలు ఎవరూ నమ్మరని తెలిపారు.
ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు.
నవంబర్ 15లోపు 250 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అసోషియేషన్ వెల్లడించింది. అన్ని బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్మెంట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
జిల్లాలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయటంతో పాటు చేపట్టిన సహాయక చర్యలు వేగవంతంగా చేయాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు అన్నారు.
దేశంలో ఉన్న 560 సంస్థానాలను కలిపి భారతదేశం అంతా ఒకటిగా చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మాధవ్ పేర్కొన్నారు. స్వాతంత్రం తర్వాత కూడా ఆయన నిరంతర కృషితో ప్రజల కోసం, దేశం కోసం పనిచేశారన్నారు.
ప్రతి సంవత్సరం పాండురంగడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు.
మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.
కల్తీ మద్యం కేసులో గతంలో ఇబ్రహీంపట్నంలోని మద్యం తయారీ యూనిట్ను అధికారులు తెరిచారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్లో కనిపించిన నకిలీ మద్యం మరకలు విజయవాడలోని ఓ వైన్ షాపులో కనిపించాయి.
మొంథా తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం పరిశీలించారు. పొలాల్లోకి వెళ్లి రైతుల కష్టాలు విని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మొంథా తుపాను ప్రభావంతో ఈదురుగాలుల తాకిడికి భారీగా పంటలు నేలకొరిగాయి. పొట్ట, గింజ, పాలు, ఈత దశల్లోని వరి పొలాలు.. చేతికి అందివచ్చిన ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెరువుల గట్లు తెగిపోయి వందల హెక్టార్ల మత్స్య సంపద సముద్రం పాలైంది.
మొంథా తుపాను నేపథ్యంలో తీవ్ర ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించగా జిల్లాలో లంకల్లోని వారితో పాటు ఆవులు, గేదెలు, గొర్రెలను కూడా గ్రామాలకు తరలించారు.
పశ్చిమ బైపాస్ (ప్యాకేజీ-3)లో రైతులతో నెలకొన్న విద్యుత్తు హైటెన్షన్ వైర్ల అలైన్మెంట్ వివాదం దాదాపు కొలిక్కి వచ్చింది. జక్కంపూడి, అంబాపురంలోని ఆరు టవర్ల విషయంలో పాత అలైన్మెంట్ ప్రకారం టవర్లను ఉంచి ఎత్తు పెంచాలని గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఓ వైపు కరవు కాలువ.. మరో వైపు లోతైన గుంతలు.. ఈ రెండింటి మధ్య ఉన్న యనమలకుదురు-అవనిగడ్డ కరకట్టపై ప్రయాణం ప్రాణాలతో చెలగాటంలా మారింది. ఈ రహదారిపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.
మొంథా తుపాను ధాటికి కృష్ణా నది తీరంలోని భారీ వృక్షాలు నేలకొరిగాయి. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణా కరకట్ట పక్కన ఈదురుగాలులకు 75 ఏళ్ల వయసున్న భారీ రావి చెట్టు పడిపోయింది. ఇలాగే మరికొన్ని ఎన్నో ఏళ్ల నాటి చెట్లు నేల కూలాయి.
నల్లమడ వాగు సీవాల్యూ 300 నుంచి సీవాల్యూ 500కు పెంచాలన్న ప్రతిపాదన ఇప్పటికీ పట్టాలెక్కలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిదశలో భూసేకరణకు రూ.180 కోట్ల నిధులు కేటాయించడంతో ఆ ప్రక్రియ మొదలైంది.
మొంథా తుపాను రైతు కష్టాన్ని నీరుగార్చింది. ఎన్నో ఆశలతో పంటలు చేతికందే దశలో దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆరెకటిక సామాజికవర్గ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాలకార్ చంద్రశేఖర్ అన్నారు.
మొంథా తుపాను నేపథ్యంలో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మునేరు ఉగ్రరూపం దాల్చింది. నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలపై విరుచుకుపడింది. ఓ వైపు పంటలను ముంచేస్తూ.. గృహాలను చుట్టేస్తూ.. రాకపోకలు సైతం లేకుండా అష్ట దిగ్బంధనం చేసింది.
సైబర్ నేరగాళ్లు రోజుకోకొత్త ఎత్తుగడతో అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. కొత్తగా పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల (పీఎంకేఎస్కే) పేరుతో టోకరా వేస్తున్నారు.
తుపాను బాధితుల కోసం ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రాల్లో చివరిరోజు అనధికారిక పేర్లు అడ్డగోలుగా నమోదయ్యాయి. విపక్షాలకు చెందిన నాయకులు కొందరు అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి వీటిని నమోదు చేయించారు.
విజయవాడ నగరంలోని విద్యాధరపురంలో ఉన్న శ్రీనివాస వైన్స్ లైసెన్సును ఎక్సైజ్ అధికారులు రద్దు చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ఈ దుకాణంలో విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలిన విషయం విదితమే.