CM Chandrababu: దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. వెల్స్పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్మార్ట్ ప్రెసిడెంట్- సీఈవో కాత్ మెక్లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై సీఎం చర్చించనున్నారు.
దావోస్లో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్ను కోరారు.
వైకాపా ప్రభుత్వ వైఫల్యాలతో అయిదేళ్లలో గ్రామాల్లో భూ వివాదాలు, చెరువులు, కాలువల ఆక్రమణలు పెచ్చరిల్లాయి. వైకాపా నాయకుల కన్నుపడిన భూములు అన్యాక్రాంతం అయ్యేవి. దీనికి తోడు నాడు భూ సర్వేలు సక్రమంగా జరగక సమస్యలు ఏర్పడ్డాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అపార్ ప్రక్రియ విద్యార్థులు, ఉపాధ్యాయులకు గుదిబండలా మారింది. జాతీయ విద్యావిధానంలో కేంద్ర ప్రభుత్వం నూతన మార్పులు తేనుంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డు అందిస్తున్నారు.
దుర్గగుడిలో వేల మంది భక్తులు రాకపోకలు సాగించే ఘాట్రోడ్డు, కొండ దిగువన కనకదుర్గానగర్ రాజమార్గాలను గత తెదేపా ప్రభుత్వ హయాంలో పక్కా ప్రణాళికతో విస్తరించారు. భక్తులు భారీగా వచ్చినా ఇబ్బంది లేకుండా.. రాకపోకలు సాగించేలా విశాలంగా మార్చారు.
హస్తకళల పరిశ్రమగా ప్రసిద్ధిచెందిన కలంకారీ దిశ దశ మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్ఎంఈ) ఆర్థిక సౌజన్యంతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(సీడీపీ) అమలుకు రంగం సిద్ధమవుతోంది.
జగనన్న కాలనీల పేరుతో ఏకంగా ఊళ్లకు ఊళ్లే నిర్మించేస్తున్నాం. సెంటున్నర స్థలంతో పాటు, పక్కా ఇల్లు కూడా సాకారం చేసి అందిస్తున్నామంటూ మాజీ సీఎం జగన్ పదేపదే ఊదరగొట్టారు.
సైబర్ నేరాల్లో ఒక చోట రూ.లక్షలు, మరో చోట రూ.వేలు మోసపోయారని మనం నిత్యం వింటూనే ఉంటాం..అయితే మోసగాళ్ల ఆగడాలు లక్షల్లోనే ఉన్నాయనుకుంటే పొరపాటే. చివరకు చిల్లర రూపాయిల వద్ద కూడా వీరి జిమ్మిక్కులకు అంతులేకుండా పోయింది.
వైద్య విద్య పేరుతో విద్యార్థులను విదేశాలకు పంపిన ఓ కన్సల్టెన్సీ వీసా పునరుద్ధరించకుండా అదనపు డబ్బు చెల్లిస్తేనే చేస్తామంటూ డిమాండ్ చేస్తోంది. అదనపు డబ్బు చెల్లించేందుకు నిరాకరించడంతో వీసా పునరుద్ధరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
వారిద్దరూ స్నేహితులు. హైదరాబాద్లోని ఓ కంపెనీలో డిజైనర్లుగా పని చేస్తున్నారు. సంక్రాంతికి రైళ్లు, బస్సుల రద్దీతో సొంతూళ్లకు చేరేందుకు భారీగా ఖర్చవుతుందని ద్విచక్ర వాహనంపై వచ్చారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ మద్యం మత్తు.. రెండు ప్రాణాలు బలిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
తనకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదన్న ఆవేదనతో ఓ జనసైనికుడు స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో ఆత్యహత్యయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా గూడూరు మండలం కంకటావలో సోమవారం వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ హాజరయ్యారు.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రీజనల్ స్థాయిలో గెలిచిన జూనియర్స్, సీనియర్స్ జట్లు రాష్ట్ర స్థాయిలో తలపడుతున్నాయి.
దుర్గగుడిలో ప్రక్షాళన ప్రారంభమైంది. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మరికొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఈవో గుర్తించినట్లు సమాచారం.
ప్రభుత్వ శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలన్నీ సాధారణంగా జిల్లా కేంద్రాల్లోనే ఉంటాయి. కానీ, ఎన్టీఆర్, కృష్ణాజిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు మాత్రం జిల్లా కేంద్రాల్లో ఉండవు. జిల్లా కేంద్రానికి రావాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఆ శాఖాధికారులు పట్టించుకోరు.
‘రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి.’ అన్న నానుడి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వర్తిస్తుందేమో..! వివాదాస్పద ఘటనల నేపథ్యంలో సోమవారం రెండోసారి ఆయన టీడీపీ విచారణ కమిటీ ముందు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. పదేపదే ఆయన వివాదాల్లో చిక్కుకుంటుండటం, దుందుడుకుతనంతో వ్యవహరించడం, ఓ ప్రజాప్రతినిధిగా ఉండి అధికారుల మాదిరిగా ప్రవర్తిస్తుండటం కూడా అటు నియోజకవర్గ ప్రజలతో పాటు ఇటు టీడీపీ అధిష్ఠానానికి కూడా తలనొప్పిగా మారాయి. రెండుసార్లు కమిటీకి వివరణ ఇచ్చుకున్న ఆయన ఈసారైనా జాగ్రత్తగా ఉంటారా, లేదా అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఓ ఫొటోగ్రాఫర్ పెళ్లి ఈవెంట్ కోసం పీఎన్బీఎస్ నుంచి ప్రకాశం జిల్లాకు బస్సులో బయల్దేరాడు. ఒంగోలు వెళ్లే బస్సెక్కాడు. ఇదే బస్సులో ఎక్కిన ముగ్గురు ఉత్తరప్రదేశ్ వాసులు అతడి కెమెరా బ్యాగ్ను కాజేశారు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వచ్చేలోగా పని పూర్తి చేసుకున్నారు. బస్సు జాతీయ రహదారిపైకి రాగానే మరో వ్యక్తి బస్టాండ్లో ఉండిపోయాడని చెప్పి దిగిపోయారు. సరిగ్గా ఒంగోలు వెళ్లి చూసుకునే సరికి బ్యాగ్లో ఉన్న కెమెరా, లెన్స్ కనిపించలేదు. ఈ కేసులో నిందితులను సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి గుర్తించారు. రోజుల వ్యవధిలోనే పోలీసులు కేసు ఛేదించారు. నిందితులు బస్సెక్కడం మొదలు జాతీయ రహదారిపై దిగే దృశ్యాలన్నీ ఫుటేజీలో కనిపించాయి. జగ్గయ్యపేటలో బంగారం షాపులో గుమస్తాగా పనిచేసే వ్యక్తి విజయవాడకు కారులో వచ్చారు. బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల వద్దకు రాగానే ఓ గ్యాంగ్ పోలీసుల అవతారమెత్తి ఆ కారును ఆపింది. ఆ గుమస్తా నుంచి రూ.25 లక్షలు కాజేసింది. డిసెంబరు 11న జరిగిన ఈ ఘటనలో నిందితులను సీసీఎస్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా పట్టుకున్నారు. కాజేసిన మొత్తాన్ని రికవరీ చేశారు.
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 27 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
CM Chandrababu: హిల్టన్ హోటల్లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అనంతరం పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి బృందం సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం పమిడిముక్కలలో ఉద్యాన శాఖ సహకారంతో త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ సంస్థ నిర్వహిస్తున్న ఆయిల్ ఫామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సందర్శించారు.
ఈనెల 11న జరిగిన ఘటనపై తెదేపా (TDP) క్రమశిక్షణ కమిటీ సభ్యులకు నేరుగా, రాతపూర్వకంగా తన వివరణ ఇచ్చానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasarao) తెలిపారు.
Kolikapudi Srinivas: ‘‘ఆ వైసీపీ కుటుంబ సభ్యులు నన్ను టార్గెట్ చేశారు.. ఆత్మహత్యాయత్నం చేసి వైసీపీ కుటుంబ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారు. మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్పై గతంలో ఆ కుటుంబసభ్యులే దాడులు చేసి వాహనాలు పగలగొట్టారు’’ అని కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు.