[03:26] గంజాయి విక్రయిస్తున్న ముఠాను పటమట పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామవరప్పాడులోని పాలెంవారి వీధిలో గంజాయి విక్రయం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది.
[03:26] విజయవాడ నగర పరిసరాల్లో టిడ్కో ఇళ్లు, జగనన్న గృహాల సమస్యల పరిష్కారంపై సమర భేరి మోగింది. సీపీఐ, సీపీఎం, తెదేపా వేర్వేరుగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై స్పందన వేదికగా గూడు కోసం.. తమ గోడు వినిపించారు.
[03:26] యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ భవనం నిర్మించిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు మూడో అంతస్తును కూల్చివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది.
[03:26] న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలు మన సమస్యగా భావించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఎస్పీ జి.జాషువా పోలీసు అధికారులకు సూచించారు.
[03:26] హత్యకేసులో నిందితునికి జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం మచిలీపట్నానికి చెందిన జి. వెంకటేశ్వరరావు(వీరప్పన్న) ఇదే ప్రాంతానికి చెందిన సబీరున్సీనా అనే మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు.
[03:26] మహిళా సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రంజిత్బాషా అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు
[03:26] ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు అల్లోపతి వైద్యాన్ని వీలైనంత వరకూ తగ్గించి ఎలాంటి వ్యతిరేక ప్రభావం లేని సంప్రదాయ భారతీయ వైద్య విధానాలను ప్రోత్సహించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు పేర్కొన్నారు.
[03:26] ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తూ, అక్రమంగా మద్యం తరలిస్తున్న వైకాపా సోషల్ మీడియా సహ సమన్వయకర్తను సోమవారం విజిలెన్స్ అధికారులు పట్టుకున్న సంఘటన ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో చోటుచేసుకుంది.
[03:26] మాజీ ఎమ్మెల్యే, గుడివాడ నియోజకవర్గ తెదేపా బాధ్యుడు రావి వెంకటేశ్వరరావును పోలీసులు సోమవారం రాత్రి 11.45 గంటలకు పమిడిముక్కల పోలీస్టేషన్కు తీసుకొచ్చారు.
[03:26] ధర చెప్పకుండా ఉత్పత్తిదారుల వద్ద గుడ్లు తరలిస్తూ, కొన్ని రోజుల తరువాత తక్కువ సొమ్ము ముట్టజెప్పడంపై కోళ్లఫారాల నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
[03:26] కృష్ణా నది గర్భంలోకి నేరుగా వ్యర్థాలను వదిలేస్తున్నారు. విజయవాడ నగరంలో డ్రైనేజిల నుంచి మురుగునీరు, పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను నేరుగా రిటైనింగ్ వాల్ మధ్యలో నుంచి గొట్టాల ద్వారా కృష్ణా నదిలోకి వదిలేస్తున్నారు.
[03:26] డ్వాక్రా రుణాల మాఫీ హామీ అమల్లో భాగంగా వైకాపా ప్రభుత్వం ఆసరా పేరుతో పొదుపు మహిళలకు లబ్ధి చేకూర్చే కార్యాచరణ చేపట్టింది. 2019 ఏప్రిల్ 11 నాటికి లింకేజీ రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల్లోని సభ్యులకు దీనిని వర్తింపజేస్తున్నారు.
[03:26] దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్లలో పని చేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెడుతున్నారా? గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే పై ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. మంత్రి జోగి రమేశ్ తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతోపాటు, వైసీపీ పెద్దలను దానికి అనుగుణంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు మైలవరంలో లైన్ క్లియర్ చేసుకోవడంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్(కేపీ)ను లక్ష్యంగా చేసుకుని తన అనుచరులతో పొగపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాల్చేసి ప్రతి ఒక్కరి తలపై అప్పుల కుంపటి పెట్టాడని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మట్టి అక్రమాలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ అండదండలో అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. దందాలు, దౌర్జన్యాలు, జూదాలకు పాల్పడే గడ్డం గ్యాంగ్ కూడా మట్టి అక్రమాల్లోకి జొరబడింది. ఆక్రమణలకు తెగబడుతోంది.
బయటకు ఓ పేరుతో బోర్డు కనిపిస్తుంది. ఆ పేరుతోనే అనేక వెబ్సైట్లు గూగుల్లో ప్రత్యక్షమవుతాయి. బోర్డుపై కనిపించే పేరుకు కార్యాలయంలో జరిగే కార్యకలాపాలకు ఎలాంటి సంబంధమూ ఉండదు. కరపత్రాలపై పథకాలు ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి వెళ్లిపోతాయి.