ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో దేవాలయాల్లో ఏళ్ల తరబడి మినిమం టైం బేసిక్ పే వేతనాలకు పని చేస్తున్న అనేక మంది ఉద్యోగులకు హెచ్.ఆర్, డీఏ అలవెన్స్తో కూడిన జీతాలు మంజూరు చేయాలని ఆలయ సిబ్బంది కోరారు.
పెన్షన్లను 200 నుంచి వెయ్యి రూపాయలు చేసినా, ఆ తర్వాత నాలుగు వేలు చేసినా, 15 వేల వరకు పెన్షన్ అందిస్తోన్న ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే అని మంత్రి కొండపల్లి చెప్పుకొచ్చారు.
రానున్న 3 గంటల్లో కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని మంత్రి అనగాని స్పష్టం చేశారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగావకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలు ఉంటాయన్నారు.
సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. నేడు జీఎస్టీపై సభలో చర్చించనున్నారు. కేంద్రప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లు తగ్గించడం వల్ల ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు.
ఎవరి ప్రభుత్వంలో ఏం చేశారు అనేది చర్చలో తేలుద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు. యూరియా, పంటలకు గిట్టుబాటు ధరలపై బీఏసీ సమావేశంలో సమయం కేటాయిస్తే ఎన్ని గంటలు అయినా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అని అచ్చెన్న స్పష్టం చేశారు.
జగన్ పెట్టిన పథకాలలో అవినీతిపై ఒకరోజు చర్చ పెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రస్తుతం లబ్ధిదారులను బ్యాంక్లు ఇబ్బందిపెడుతున్నాయని, జగన్ చేసిన అప్పులకు లబ్ధిదారులు బలి అవుతున్నారన్నారు.
11 సీట్లు వచ్చిన పార్టీ నేతలు ప్రతిపక్ష హోదా అడుగుతుంటే గూబ పగలగొట్టాలి అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన నాయకుడు అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటే ఎంత తప్పో ... జగన్ ప్రతిపక్ష హోదా అడగటం కూడా అంతే తప్పు అని అన్నారు.
దసరా ఉత్సవాలు సమీపిస్తున్న వేళ.. బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సిద్ధం చేశారు. ఈసారి బందోబస్తు విధులు ‘ఈ-డిప్లాయ్మెంట్’ యాప్ ద్వారా కేటాయిస్తున్నారు.
మధురానగర్కు చెందిన ఒక గృహిణి చరవాణికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. మీరు గృహ రుణం తీసుకుని కట్టడం లేదని.. చర్యలు తీసుకుంటామంటూ భయపెట్టారు. ఎక్కడా రుణాలు తీసుకోలేదని చెప్పినా... బెదిరింపు ధోరణితో మాట్లాడారు.
పంచాయతీ పురోగతి సూచిక సాధించిన గ్రామాలకు కేంద్రం భారీ ప్రోత్సాహక నజరానా ప్రకటించింది. ఇందుకు గ్రామాల్లో చేయాల్సిన తొమ్మిది అభివృద్ధి కార్యక్రమాలను పురోగతి సూచికలో పొందుపరిచింది.
‘నేను టెండరు వేయడానికి ఈఎస్ కార్యాలయానికి వచ్చా. నా భార్య నగలు తాకట్టు పెట్టి డీడీలు తీసుకున్నా. దరఖాస్తుకు ఇంకా సమయం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత.. ప్రజాప్రతినిధి చెబితే కానీ టెండరు తీసుకోమని ఎక్సైజ్ సీఐ చెబుతున్నారు.
విజయవాడకు చెందిన డాక్టర్ కూచిభట్ల అజయ్కి అమెరికాలో అరుదైన గుర్తింపు లభించింది. వర్జీనియా రాష్ట్రంలోని పది మంది అగ్రశ్రేణి మానసిక వైద్యులను ఎంపిక చేయగా.. వారిలో డాక్టర్ అజయ్ ఒకరిగా నిలిచారు.
గుడివాడలోని పామర్రు రోడ్డులో గల భీమవరం రైల్వేగేటు వద్ద నిత్యం వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. రోజులో సుమారు 80కి పైగా రైళ్లు ఈ మార్గంలో నిత్యం ప్రయాణిస్తుంటాయి.
చదువుకోవడం లేదని మందలించిన తల్లిపై ఫిర్యాదు చేసేందుకు ఓ చిన్నారి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. సత్యనారాయణపురం గులాబీతోట ప్రాంతానికి చెందిన మహిళకు ఇద్దరు కుమారులు.
రాజధాని కోసం భూములిచ్చిన అసైన్డ రైతులకు మరో ఊరట లభించింది. ఇప్పటికే సీఐడీ కేసుల పేరుతో గత ప్రభుత్వ వేధింపుల నుంచి విముక్తి చేసిన కూటమి ప్రభుత్వం, తాజాగా వారికి మరో మేలు చేసింది.
కుటిల రాజకీయానికి తెరతీశారు. డంపింగ్ యార్డు పేరుతో బుధవారం హడావిడి చేయడానికి ప్రయత్నించిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. తమకు బూడిద అందకుండా జెన్కో.. ఓ ప్రైవేట్ సంస్థకు బల్క్గా కాంట్రాక్టు అప్పగించిందని ఓవైపు ట్రాన్స్పోర్టర్లు ఆందోళన చేస్తుండగా, వారికి మద్దతుగా నిలివాల్సిందిపోయి ఎమ్మెల్యే వసంతపై లేనిపోని ఆరోపణలు చేస్తూ జోగి హడావిడి సృష్టించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జక్కంపూడి ఎకనమిక్ టౌన్షిప్ (జెట్) సిటీ లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ బ్యాలెన్స్ పనులు పూర్తి చేయటానికి వీలుగా ఏపీఐఐసీ కీలక అడుగు వేసింది. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఈ కాంప్లెక్స్ను పూర్తి చేసేందుకు రూ.19.55 కోట్లతో టెండర్లు పిలిచింది.
ఏపీ హోం మంత్రి అనిత ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కొండపై జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.
శృతి భారతీ వేద పాఠశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఏర్పేడు వ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామీజీ తెలిపారు. బుధవారం తాడేపల్లిలో వేద పాఠశాల, కంప్యూటర్ల గదిని స్వామీజీ, అసంగానంద స్వామీజీ, కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు.
భవిష్యత్తులో బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో ఉద్యోగాలు వచ్చేలా చేసినందుకు బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు వచ్చిందన్నారు.