కోడిపందేలు జరిగితే.. ‘కోళ్లే కదా.. కొట్టుకు చస్తాయిలే..’ అంటారు. అధికారులు నివేదిక అడిగితే.. ‘చూద్దాంలే..’ అని సాగదీస్తారు. ఆరోపణలు ఉన్న సిబ్బందికి.. ‘నేనున్నాను లే..’ అని అభయమిచ్చేస్తారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ ఇన్స్పెక్టర్ పనితీరుకు ప్రామాణికాలు ఇవన్నీ. ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)గా ఉన్న స్టేషన్లో సిబ్బందిపై నేరుగా డీజీపీకి ఫిర్యాదులు అందడంతో అక్కడ జరుగుతున్న బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.
విజయవాడలో అద్విక ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటుచేసి రూ.కోట్లు లూటీ చేసిన తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య దుబాయిలోనూ ట్రేడింగ్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాడు. అందుకే ఇక్కడ పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బును దుబాయిలోని కబానా ట్రేండింగ్ కంపెనీకి పంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ సోమవారం రాజ్ భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం. హరి జవహర్లాల్ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సత్కరించారు.
ప్రజల వైద్య అవసరాల రీత్యా మంగళగిరి ఎయిమ్స్కి చేరుకోవడానికి మంగళగిరి(ఎన్హెచ్-16) వద్ద ఉన్న ఎంట్రీ ర్యాంప్ను ఎగ్జిట్ ర్యాంప్గా మార్చేందుకు కేంద్ర రహదారుల శాఖ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న చేపట్టిన సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చెప్పారు.
YS Sharmila: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.
Special workshop: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం విజయవాడలో ప్రత్యేక వర్క్షాపు జరగనుంది. ఇందులో క్వాంటమ్ కంప్యూటింగ్ను సాంకేతికంగా అభివృద్ధి చేసే సంస్థలు, వినియోగించేవారు, విద్యార్థులు, మేధావులు, ప్రభుత్వరంగానికి చెందిన వారు పాల్గొంటారు.
ఉద్యమాలకు పుట్టినిల్లుగా పేరొందిన మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల (ఏజే విద్యాపరిషత్) సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. భావితరాలకు విద్యను అందించాలన్న ఉద్దేశంతో 350 ఎకరాల భూములు విరాళంగా ఇచ్చారు.
కాలానుగుణ సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని నేరాల కట్టడికి ముందుకెళ్తామని పలువురు ఐపీఎస్లు పేర్కొన్నారు. క్రైం రేటు తగ్గించడానికి కృత్రిమ మేధ వినియోగిస్తామన్నారు.
అద్విక ట్రేడింగ్ కంపెనీ బోర్డు తిప్పేసిన వ్యవహారంలో అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సేకరించిన రూ. వందల కోట్ల డిపాజిట్లను దారి మళ్లించడానికి చేయని ప్రయత్నాలు లేవు.
పుట్టిన రోజు నాడు ఆశీర్వదించమని అడుగుతాడని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు తమ ఏకైక కుమారుడు ప్రాణాలు కోల్పోయాడన్న వార్త ఆశనిపాతమైంది. పామర్రు వెలమపేటకు చెందిన రంభా వెంకట్రావు కుమారుడు ఖ్యాతితేజ.
మొన్నటి వరకు ఎంత కావాలంటే అంత పరిమాణంలో లభ్యమైన ఇసుక ధరకు ప్రస్తుతం రెక్కలొచ్చాయి. పర్యావరణం, రుతుపవనాల రాక పేరుతో జిల్లాలో ఇసుక తోడకాన్ని నిషేధిస్తూ సంబంధితశాఖ ఆదేశాలు జరీ చేసిన విషయం తెలిసిందే.
గత వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో పోలవరం కుడి కాలువ తీరు ఆందోళనకరంగా మారింది. ఇప్పటికిప్పుడు నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా, భవిష్యత్తులో ముప్పు తప్పదన్న విషయం స్పష్టమవుతోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువన కనకదుర్గానగర్ టోల్గేట్ నుంచి రథం సెంటర్ వరకు, కొండను ఆనుకుని చైనావాల్ వెంబడి.. ఆక్రమణలను అధికారులు పూర్తిగా తొలగించారు.
‘ఎ.కొండూరు కిడ్నీ బాధిత తండాలకు మరో మూడు వారాల్లో కృష్ణా జలాలు అందబోతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న స్వచ్ఛజలాలు ఎట్టకేలకు తండాలకు రాబోతున్నాయి.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్.
ఆగస్టు 19వ తేదీ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు జిల్లా స్థాయి పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. జిల్లాలోని ఫొటో జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు పోటీల్లో పాల్గొనవచ్చని కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.