దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ప్రజల మధ్య సమానత్వ భావన నెలకొని బలహీన వర్గాల ప్రజలకు హక్కులు లభించాయని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కనపర్తి సంగీతరావు అన్నారు.
మండలంలోని వింజనంపాడు శ్రీ కోదాడ రామస్వామి దేవాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న 61 వ రామనామ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
జిల్లాలో జడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించిన పనులకు నిధులు కేటాయించక పోవడంపై జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, సీఈఓ జ్యోతిబసులను సభ్యులు నిలదీశారు.
తిరుమల పరకామణి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈకేసులో పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని సీఐడీ మరోసారి విచారణకు పిలిచింది.
రైతుల మీద మొసలికన్నీరు కారుస్తున్న సజ్జల గత ఐదేళ్లల్లో ఏం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. జగన్ అండ్ కో పాల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని తెలిపారు. పిల్లలకు అర్ధం అయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తకరూపంలో తీసుకొచ్చామని వెల్లడించారు.
కృష్ణా జిల్లాలోని గుడివాడ యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బ్యాంక్ కార్యాలయం నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అమరావతి రోడ్డు అనుసంధాన మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం సాగుతున్న రోడ్ల పనుల పూర్తికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడం.. త్వరలో మరో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభంకానున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ రోడ్లను అందుబాటులోకి తేనుంది.
పోలీసు వ్యవస్థ గట్టి నిఘా పెట్టడంతో యువతపై మత్తు వల విసురుతున్న వ్యక్తులు పట్టుబడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఎండీఎంఏ విక్రయ, కొనుగోళ్లకు సంబంధించి 8 మందిని అరెస్టు చేశారు.
ఏళ్లుగా కృష్ణా యూనివర్సిటీ సమస్యల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతోంది. 2008లో యూనివర్సిటీ స్థాపించినప్పుడు దాని పరిధిలో 167 కళాశాలలు ఉంటే ఆ సంఖ్య 144కు తగ్గింది.
శరవేగంగా విస్తరిస్తోంది. ఏటా జనాభా పెరుగుతోంది. వాణిజ్య కూడలిగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా శివారుల్లో జనసాంద్రత పెరుగుతోంది. నేరాలూ పెచ్చుమీరుతున్నాయి.
నందిగామ మండలం దాములూరు వద్ద వైరా ఏరుపై ఎనిమిదేళ్ల క్రితం వంతెన నిర్మించినా ఇంతవరకు అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయలేదు. గత వైకాపా ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదని గుత్తేదారుడు ముఖం చాటేశాడు.