TDP Mahanadu: కడపలో ఈ ఏడాది మహానాడు నిర్వాహణకు 19 కమిటీలను తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.
తెనాలి మున్సిపల్ అధికారులు నిబంధనల ప్రకారం పనుల బిల్లులు ఎంబుక్ రికార్డు చేయకుండా గుంటూరు ప్రీఆడిట్ అధికారులకు పంపగా వారు తిరస్కరించారు. మళ్లీ రికార్డు చేసి పంపించాలని తేల్చి చెప్పారు. ఈ పనుల వ్యయం విలువ రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఉంటుంది.
తప్పనిసరి బదిలీల కేటగిరీలో ఉన్న ప్రధానోపాధ్యాయులతో విద్యాశాఖ యంత్రాంగం విధిగా దరఖాస్తులు చేయించింది. దరఖాస్తు చేసుకునే క్రమంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే వాటిని సంబంధిత హెచ్ఎంలతో ఫోన్లో మాట్లాడి అధిగమించేలా గుంటూరు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల బలం తెదేపా సొంతమని జిల్లా పార్టీ అధ్యక్షుడు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి మహానాడు సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు.
ఖరీఫ్ సీజన్కు గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ సన్నద్ధమైంది. తొలకరి వర్షాలు పడడం, రుతుపవనాలు ముందస్తుగా వస్తుండడంతో అందుకు అనుగుణంగా పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వేసవి దుక్కులతో చాలా ప్రాంతాల్లో సందడి కనిపిస్తోంది.
గుంటూరు నగరం గుజ్జనగుండ్ల కూడలి నుంచి ఇన్నర్రింగ్ రోడ్డు కలిపే విధంగా నాడు తెదేపా హయాంలో నిర్మించిన విశాలమైన రోడ్డుకు ఐదేళ్ల తర్వాత డివైడర్ పనులు మొదలుపెట్టారు. వైకాపా ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనులు గాలికొదిలేసింది.
ఉచిత ఇసుక విధానాన్ని ఇసుకాసురులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అనుమతులు లేకుండానే ఇసుక రీచ్లలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తూ సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అటు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఇటు సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.
ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర(ఎస్ఆర్కేవీఎం-1) కిట్లు అందజేయడానికి ఇండెంట్ మేరకు సమకూర్చుకునే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. వైకాపా ప్రభుత్వం దీనిని జగనన్న విద్యా కిట్ పేరుతో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు గడ్డపై ప్రజారంజక పాలన అందించిన రెడ్డిరాజుల ఘన చరిత్ర, కొండవీడు గత వైభవం, చారిత్రక విశిష్టతను భావి తరాలకు అందించాలనే సత్సంకల్పంతో అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య- శ్రీశైలం వారు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు సమీపంలో ఉన్న ఫిరంగిపురం మండలం హౌస్గణేష్ గ్రామంలో రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల (మ్యూజియం) నిర్మించారు.
హనుమజ్జయంతి గురువారం ఊరూవాడా ఘనంగా నిర్వహించారు. శింగరకొండ, అద్దంకిలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో ఉదయం స్వామి మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
పల్లె పండగ కింద గ్రామాల్లో సిమెంటు రోడ్లు, ప్రహరీలు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టినవారు బిల్లుల కోసం ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ప్రతిపాదిత పనుల్లో 69 శాతం మాత్రమే జరిగాయి. వందల సంఖ్యలో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచాయి.
పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలలో గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో ప్రసూతి సేవలు మృగ్యమయ్యాయి. గర్భిణులు ఎవరొచ్చినా.. ఇక్కడ కాదండి.. తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లండి.. అంటూ శాఖాధికారులు రిఫర్ చేస్తున్నారు.
గత ఏడాదిగా ఏమీ జరగలేదని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లపాటు ఆయన చేసిందేమిటో అడగాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు పట్టుబడిన దొంగల వివరాలు గురువారం వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసుస్టేషన్లో నమోదైన యువతిపై అత్యాచారం కేసులో నిందితుడు అమరేందర్రెడ్డిని పట్టుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు.
AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీలో 1 /2019 సర్క్యూలర్ పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Covid Guidelines: కరోనా మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం నాడు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులతో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
CM Chandrababu: డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగయ్యేలా చూసి... రైతులు నష్టపోకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు కోరారు. పొగాకు, కోకో పంటలను ఆయా కంపెనీలు కొనుగోళ్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటకు మద్దతు ధర కన్నా తగ్గితే రైతులను నేరుగా ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు.