పశ్చిమ బైపాస్ ఎన్హెచ్-16లో విలీనమయ్యే సమయం ఆసన్నం అవుతోంది. బైపాస్లో ప్యాకేజీ-1 గుండుగొలను-కలపర్రు, ప్యాకేజీ-2 కలపర్రు-చినఆవుటపల్లి ఇప్పటికే ఎన్హెచ్-16లో మమేకమయ్యాయి. ప్యాకేజీ-3, 4 నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది.
వైద్య రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటే రోగులకు మెరుగైన చికిత్సలు అందించవచ్చని అంటున్నారు.. చిన్నఆవుటపల్లిలోని డా.సుధా, నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాల వైద్యులు.
అవనిగడ్డ శివారులోని కొత్తపేట చిన్న గ్రామం. 600 మంది జనాభా. మోటారు ఫీల్డే. ఇక్కడ ఎక్కువ మందికి జీవనాధారంగా ఉండేది. ఫ్యాక్షన్ గ్రామంగా కూడా ముద్ర ఉంది. ఇది గతం.
‘మాలోని ప్రతిభను చాటేందుకు ‘ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శన’ సరైన వేదికగా మారింది. ఇక్కడి ప్రాజెక్టులు చూస్తుంటే.. మాకూ తయారు చేయాలనిపిస్తోంది. ఒక్కొక్కటీ పోటీపడేలా ఉన్నాయి.’ అంటూ పలువురు విద్యార్థులు పేర్కొన్నారు.
‘విద్యార్థుల ప్రదర్శనలు.. ఆకట్టుకుంటున్నాయి. వారి ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. వారిలోని సృజనకు పదునుపెట్టి మరీ ప్రాజెక్టులను రూపొందించారు. ప్రోత్సహిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని నిరూపించారు’.. అంటూ పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కొనియాడారు.
ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ఆర్టీసీ చేపట్టిన పార్సిల్ రవాణా... ప్రజల్లో నమ్మకం పెంచుకోవడంతో ఆదాయం ఏటేటా పెరుగుతోంది. మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ బస్టాండ్ల పరిధిలో డోర్ డెలివరీ సేవలు అందిస్తున్నారు.
ఇస్రో.. అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన బస్సును ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రదర్శనకు ఉంచారు. ఇందులో వివిధ రాకెట్లు, క్రయోజనిక్ ఇంజిన్లు, మంగళయాన్, చంద్రయాన్, శాటిలైట్ల నమూనాలు ఏర్పాటు చేశారు.
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారని, సమాజానికి పెనుసవాలుగా మారారని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఏ38గా ఉన్న వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని జైలు అధికారులు సోమవారం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
‘నాకు పెద్ద పెద్ద అధికారులు తెలుసు. మీ అమ్మాయికి మత్స్యశాఖలో ఉద్యోగం ఇప్పిస్తా. కొంత సొమ్ము చేబదులుగా ఇస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు తిరిగిస్తా...’ అంటూ స్నేహితురాలినే నమ్మించింది.
నేపాల్తో జరిగిన ఫైనల్స్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
సీఎం చంద్రబాబు తన విజనరీతో అన్నతాతలకు పంచ సూత్రాలను అందిస్తున్నారని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. పంచ సూత్రాల ద్వారా రైతులు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్తో పోటీ పడతారని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శన’ నిర్వహిస్తోంది. సోమవారం కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ మెగా సైన్స్ ఫెయిర్ ప్రారంభమైంది.