బాపట్ల: ఢిల్లీలో ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే జాతీయ స్థాయి ఈత పోటీలకు బాపట్ల జూనియర్ కళాశాల విద్యార్థి ఉప్పాల జ్ఞానవివేక్గౌడ్ ఎంపికయ్యాడు. ఈ సంవత్సరం...
బాపట్ల: యువతలో నైపుణ్యాల మెరుగుకు, ఉపాధి అవకాశాల కల్పనకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. ఉపాధి కల్పన శాఖ, నైపుణ్య అభివృద్ధి...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహిపై ఈనెల 14 నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అన్నవరం సత్యదేవుని చెంత పూజలు నిర్వహించిన తర్వాత యాత్ర మొదలవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పీఏసీ సభ్యులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు.
రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన రొయ్యల వ్యాపారి, టీడీపీ నాయకుడు దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో గురువారం ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు...
మంత్రాలయంలో కళ్యాణ కట్ట టెండర్ రద్దుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కళ్యాణకట్టలో భక్తుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయమై నోటీసులు జారీ చేశారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది సుమారు 260 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి పెనుమూడి వారధి వరకు పలు ప్రాంతాల్లో తీరప్రాంత ప్రజలు నదిలోకి దిగుతున్నారు.
అమరావతి మండలం కృష్ణానది తీరంలోని ధరణికోట రేవు ప్రాంతమిది. ఇక్కడ 2020 మార్చి 15న సాయి (19), గోవర్ధన్ (20) ఈతకు దిగి నీటమునిగి చనిపోయారు. ఇక్కడే 2021 అక్టోబరు 3న మోదుగల దుర్గాప్రసాద్ (17), ఆనంద అరవింద్ కుమార్ (24) స్నానానికి దిగి మృత్యువాత పడ్డారు. 2022 నవంబరు 11న తొండపు మణికంఠ (9) ఆడుకుంటూ వెళ్లి నదిలో పడి మృతి చెందారు.
రైతు భరోసా, పీఎం కిసాన్ మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 1,22,500 మంది రైతు కుటుంబాలకు రూ.91,87,50,000ను ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు.
నగరంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లోని పలు రోడ్ల ముస్తాబు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. 2న ముఖ్యమంత్రి రైతులకు వాహనమిత్ర పథకం కింద ట్రాక్టర్లు పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే.
చీరాల ప్రాంతం సాయంత్రం.. 4 గంటల సమయం.. మొదట చల్లని గాలి.. ఆపై ఒక్క సారిగా ఈదురుగాలి, సుడిగాలి.. భారీ వర్షం.. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే బీభత్సం.. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో చీరాల ప్రాంతంలో ఎక్కువ చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయి గాఢాంధకారం నెలకొంది.
బెంగళూరు-కడప-విజయవాడ (బీకేవీ) గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారి భూసేకరణ విషయంలో అద్దంకి మండలం కొటికలపూడి రైతులు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం చెల్లించే పరిహారం సరిపోదని, రైతులు సంతృప్తికరంగా ఉంటేనే భూములు ఇచ్చేందుకు ఒప్పుకొంటామని తీర్మానించారు.
ఉపాధ్యాయ ఖాళీలు కొన్ని బ్లాక్ చేస్తున్నట్లు జాబితా ఒకటి బయటకు రావడంతో టీచర్లలో ఆందోళన నెలకొంది. మంజూరైన పోస్టులు, వాటిల్లో పనిచేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుని కొన్నింటిని బ్లాక్ చేస్తూ తాజాగా విడుదలైన జాబితాతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది.
ఈనెల ఒకటి నుంచి భూముల మార్కెట్ విలువలు స్వల్పంగా పెంచుతామంటూ రిజిస్ట్రేషన్ల శాఖ వారం పది రోజుల నుంచి ఇస్తున్న సంకేతాలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనని తేలిపోయాయి.