తిమ్మక్క జీవితంలో అధికారం కోసం.. సంపద కోసం వెతకలేదన్నారు పవన్. కానీ భూమి తల్లి పట్ల ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనమని తెలిపారు. అలాంటి 114 ఏళ్ల తిమ్మక్క.. ఈ రోజు మనల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారన్నారు.
సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని గత ఆగస్టు నెల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకూ ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకూ ఈ పథకానికైన ఖర్చును ఏపీఎస్ ఆర్టీసీకి చెల్లిస్తూ కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడేలా కోర్టులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సూచించారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానిమీగా భారతదేశం ఎదిగిందని సీఎం చంద్రబాబు నొక్కిచెప్పారు. 2047 కల్లా ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత ప్రభావవంతమైన దేశంగా భారతదేశం మారుతోందని వెల్లడించారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడంలో న్యాయవ్యవస్థ అత్యంత కీలక బాధ్యత వహిస్తోందని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
గగన విహార కేంద్రం గన్నవరం.. దీప కాంతుల ధగధగలతో మెరిసిపోయింది. ఓ వైపు వేద మంత్రాలు... మరోవైపు ఓంకార నాదాలతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా శివ, కేశవుల ఆరాధన మార్మోగింది.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి పంపిణీ చేసే బియ్యం సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి పాఠశాలలకు ప్రతి నెలా 1, 2 తేదీల్లో రావాల్సిన బియ్యం రెండు వారాలు దాటుతున్నా సరఫరా కావడం లేదు.
బెజవాడ-బందరు ఎన్హెచ్-65 డీపీఆర్ వివాదాన్ని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారు. తాజాగా ఎన్హెచ్, మెట్రో అధికారులు.. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో సమావేశమయ్యారు.
ఎండీఎంఏ కేసు సమగ్ర దర్యాప్తునకు విజయవాడ పోలీసులు సిద్ధమయ్యారు. మధుసూదన్రెడ్డి అలియాస్ మ్యాడీ అరెస్టుతో వచ్చిన కీలక సమాచారం ఆధారంగా ముందుకు పోలీసులు ముందుకు వెళ్లనున్నారు.
బహిరంగ మార్కెట్లో ధరలు పతనం కావడంతో శనగ రైతులు విలవిల్లాడుతున్నారు. గత వినాయక చవితికి ఎర్రశనగలు క్వింటాలు ధర రూ.6,500గా ఉండగా.. ప్రస్తుతం రూ.5,500కు పడిపోయింది.
రైల్వే భద్రత, సిబ్బంది క్రమశిక్షణపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. డీఆర్ఎం సుధేష్ణసేన్ అధికారులు, పర్యవేక్షకులతో ఇటీవల సమావేశమై.. కొన్ని కీలక సూచనలు చేశారు.
గుంటూరు నగరానికి చెందిన ఓ యువకుడికి తెలియని నంబరు నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేయగానే.. దుస్తుల్లేకుండా ఓ అమ్మాయి లైన్లోకి వచ్చి మాటలు కలిపేందుకు ప్రయత్నించింది.
చదువుకునే రోజుల్లో బ్యాంకు ఖాతా తెరచి అందులో కొంత నగదు దాచుకుని మరిచిపోయినవారు కొందరైతే.. వ్యాపార, వర్తక అవసరాలకు రెండు లేదా మూడు ఖాతాలు ప్రారంభించి పట్టించుకోనివారు మరికొందరు.
దేశంలో డిజిటల్ అరెస్టు మోసాలు ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా సొమ్మును బాధితులు పోగొట్టుకున్నారు. మోసగాళ్లు డీఆర్ఐ, పోలీసు, సీబీఐ, తదితర ఏజెన్సీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది.. గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరనడానికి ఉదాహరణగా గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని మత్తి అరుణ నిలిచారు.
మీ చిన్నారులకు రంగు రంగుల బొమ్మల పుస్తకాలు కారు చౌకగా కావాలా? మీ బామ్మ, తాతలకు పౌరాణిక పుస్తకాలు... మీ అబ్బాయికి పోటీ పరీక్షలకు.. మీ శ్రీమతికి వంటల పుస్తకాలు... ఇలా ఏవీ కావాలన్నా దొరుకుతాయి.