పన్నులు చెల్లించని విదేశీ సిగరెట్లు.. విజయవాడ, సమీప ప్రాంతాలకు భారీగా వచ్చేస్తున్నాయి.పారిస్, గోల్డ్ స్టాగ్, గోల్డ్ లేబుల్ పేర్లతో ఉన్న రూ.1.75 కోట్ల విలువైన అక్రమ విదేశీ సిగరెట్లను.. తాజాగా వాణిజ్య పన్నులశాఖ సిబ్బంది పట్టుకున్నారు.
నున్న ఏటీఎస్(ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్)లో ఫిట్నెస్ ధ్రువపత్రం మంజూరులో దోపిడీ రాజ్యమేలుతోంది. వాహన స్థితి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉందా లేదా అన్నది అనవసరం.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య చేపట్టిన ముక్త్యాల- మాదిపాడు వంతెన పనులు.. కూటమి ప్రభుత్వం వచ్చాక వేగం పుంజుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.60.54 కోట్ల అంచనాతో చేపట్టిన పనులు నత్తలా సాగాయి.
వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో వందే భారత్ స్లీపర్ వెర్షన్ను ప్రయోగత్మాకంగా ప్రవేశ పెట్టబోతుంది. ఇప్పటికే విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేయగా ఎప్పుడు పట్టాలెక్కిస్తారోనని ఆసక్తిగా ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆధ్యాత్మికశోభ వెల్లివెరిసింది. వెంకటపాలెంలో శ్రీవారి ఆలయాన్ని రూ.260 కోట్లతో అభివృద్ధి చేయడానికి మరో అడుగు పడింది. తితిదే వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాల నడుమ ద్వితీయ మహా ప్రాకార నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.
గుడివాడలోని ఈవీఆర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పేరుతో చేస్తున్న అక్రమాలపై బాధితురాలు యాళ్ల సావిత్రి ఫిర్యాదుపై ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఎస్బి.సతీష్ కుమార్ బృందం గురువారం ఆసుపత్రిలో తనిఖీలు చేసింది.
పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులపై కొందరు దాడికి పాల్పడ్డారు. కర్రలతో దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
సరైన డీ మ్యాట్ ఖాతా ఉంటేనే పెట్టుబడులు పెట్టాలని.. ఆన్లైన్లో తక్కువ పెట్టుబడులకు ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుందని ఎవరైనా చెబితే నమ్మవద్దని పోలీసులు చెబుతున్నా.. అమాయకులు మోసపోతూనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది.
మంగళగిరి పట్టణం శివాలయం సమీపంలో రూ. 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. 1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి ఆయన శంకుస్థాపన చేశారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు తేల్చే విషయంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో సభ్యును సైతం నియమించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ అయింది.
వైకల్యమనేది మనిషికే గాని మనసుకు కాదని, ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోతుందని.. క్రీడల్లో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతులు సత్తా చాటాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు.
ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ పని చేసిన సమయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందజేసింది. దాంతో ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం సంజయ్పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల అతడి నివాసంతోపాటు కంపెనీలపై సిట్ అధికారులు దాడులు చేసి.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
నందిగామ మండలం పెద్దవరంలో రూ.40 లక్షల నిధులతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి క్రక్స్ బయోటెక్ ఎండీ రవిచంద్రతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. వర్షాల ప్రభావంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.