ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మికత, జీవన విలువలు, వ్యక్తిత్వ వికాసంపై ఉపన్యాసాన్ని అందించారు.
సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని గత ఆగస్టు నెల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకూ ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకూ ఈ పథకానికైన ఖర్చును ఏపీఎస్ ఆర్టీసీకి చెల్లిస్తూ కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
మండలంలోని రాఘవపురం గ్రామంలో నూతనంగా మంజూరైన కేంద్రియ విద్యాలయానికి వెళ్లే అప్రోచ్ రోడ్ నిర్మాణానికి రూ.20 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వెలుగు సంఘాల్లో లెక్కలేనన్ని చీకటి దందాలు వెలుగు చూస్తున్నాయి.. కొందరు కింది స్థాయి అధికారులు, బుక్ కీపర్లు, బ్యాంకు సిబ్బంది కుమ్మక్కయి కథ నడిపిస్తున్నారు.
రైతులు, ఫల ఆధారిత పరిశ్రమలు నిర్వహించే వారు పళ్లు, కాయలు తెస్తే.. రసం(జ్యూస్), పల్ప్(గుజ్జు) ప్యాక్చేసి ఇచ్చేలా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మల్లవల్లిలో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) రూపొందించారు.
ఇటీవల తెలంగాణలో కంకర టిప్పర్ అదుపుతప్పి ఆర్టీసీ బస్సుపై పడడంతో అక్కడికక్కడే 19 మంది మృత్యువాతపడ్డారు. అధిక లోడ్ చేసుకుని వస్తున్న కంకర లారీ.. మితిమీరిన వేగంతో అదుపుచేయలేక ఆ దుర్ఘటనకు దారితీసింది.
విజయవాడ ఆటోనగర్.. ఏపీఐఐసీ కాలనీలో రేగుల అనూరాధ ఉన్నత పాఠశాలకు గతేడాది వచ్చిన ఆర్వో ప్లాంట్కు విద్యుత్తు సరఫరా ఇవ్వక వృథాగా ఉంది. ఇక్కడ 200 మంది చదువుతున్నారు.
వైకాపా పాలనలో ఇళ్ల స్థలాలు ఇచ్చి పనులు గాలికొదిలేయడంతో నిరుపేద లబ్ధిదారుల సొంతింటి కల సాకారం కాలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే.. ఆయా పనులను పట్టాలెక్కించి పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టింది.
పుష్ప సినిమాలోని స్మగ్లింగ్ సన్నివేశాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో గత రెండేళ్లుగా గంజాయిని రహస్యంగా రవాణా చేస్తున్నాడు.. ఎక్కడా తనిఖీలకు దొరక్కుండా లారీల్లో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి..
బెంగళూరులో స్నేహితుల ద్వారా నైజీరియన్లతో పరిచయంతో మ్యాడీ పెడ్లర్గా మారాడు. నైజీరియన్లకు వాట్సాప్లో కాల్ చేసి డ్రగ్స్ అడిగేవాడు. వారు వాట్సాప్లోనే యూపీఐ క్యూఆర్ కోడ్ పెడితే.. దానిని స్కాన్ చేసి డబ్బులు పంపేవాడు.
విజయవాడ రైల్వేస్టేషన్ దేశంలోని ప్రధాన 28 రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇప్పటికే ఎలైట్ గ్రూప్లో కూడా చేరింది. నిత్యం లక్షల మంది రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్లో విధులు నిర్వర్తించే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
హ్యాక్ చేయడానికి వీల్లేని డ్రోన్... రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి, అధికారులకు సమాచారమిచ్చే ఆవిష్కరణ... అసలు రోడ్డు ప్రమాదాలకు ఆస్కారమే లేకుండా ప్రత్యేక పెయింటింగ్తో కట్టడి చేసే ఆలోచన..
మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై జులుం ప్రదర్శించి, అసభ్య పదజాలంతో దూషించారు. డీఎస్పీ స్థాయి అధికారిని సైతం ఏకవచనంతో సంబోధిస్తూ వాగ్వాదానికి దిగారు.
రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కింద ప్రతి యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఇంక్యుబేషన్ హబ్లు, పేటెంట్ సెల్లు, స్టార్టప్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ సూచించారు.
దేశ రాజధానిలో కారు బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో బుధవారం పోలీసులు గుంటూరులోని రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, వాణిజ్య సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేశారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కలుపుతూ ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటులో భాగంగా అవసరమైన భూముల సేకరణకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో 2022, జనవరిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు 10 వేల మందికి సంబంధించిన వేతనాల బిల్లులను డీడీవోలు ఆన్లైన్లో పెట్టకుండానే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వేతనాలు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటేషన్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ. 99.62 కోట్లతో నిర్మించే ప్రాజెక్టును ఆమోదించింది.
రైతుల కష్టాన్ని, పెట్టుబడిని గుర్తించి సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాల పేరుతో ఆంక్షలు విధించకుండా మద్దతు ధర చెల్లించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కోరారు.
అమరావతి ఎన్టీఆర్ జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలతో కృషి చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీషా అన్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరుకు మండలం చోడవరం గ్రామానికి చెందిన మాలపాటి భాస్కరరెడ్డి లండన్లో ఉంటూ మూడేళ్లుగా సోషల్ మీడియాలో అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్నాడు.