కొండపల్లి ఖిల్లాకు.. రూ.10.90 కోట్లతో గత తెదేపా ప్రభుత్వంలో అధునాతన సౌకర్యాలను కల్పించారు. కోటను పాలించిన రాజులే.. స్వయంగా వచ్చి.. తమ చరిత తెలిపేలా.. ఆగ్మెంటెడ్ రియాలిటీతో ఏర్పాట్లు చేశారు.
బంకుల్లో పెంట్రోలు కొట్టించుకునే వారిలో చాలా మందికి అక్కడ నిర్వాహకులు కల్పించాల్సిన సౌకర్యాలపై అవగాహన ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్వాహకులు వాటికి ఎగనామం పెట్టేస్తుంటారు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నీటి పన్ను వసూళ్లు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారులు లక్ష్యాలు నిర్దేశించినా... అమల్లో సిబ్బంది చొరవ చూపకపోవడం.. ప్రణాళిక లోపం కారణంగా నూరుశాతం కాదుకదా... కనీస స్థాయిలోనూ బిల్లులు జమ కావడం లేదు.
విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలు, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీఐహెచ్)తో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి సమీపంలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల శుక్రవారం ఒప్పందం చేసుకుంది.
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆ సంస్థ సీఎండీ ఎ.రాబర్ట్ జెరార్డ్ రవి సూచించారు. విజయవాడ చుట్టుగుంటలోని సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలోని పలువురు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నల్లపాడు శాఖ పరిధిలోని అక్రమాలపై చర్యలకు రంగం సిద్ధమైంది. 51 విచారణను పరిశీలించిన పాలనాధికారి సెక్షన్ 59 కింద అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు సర్ఛార్జి విచారణకు ఆదేశించారు.
మహిళలు, న్యాయమూర్తులు, కూటమి నేతల కుటుంబాలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి విజయ్భాస్కర్రెడ్డికి డిసెంబరు 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఉద్దానం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధి మూలాలపై పరిశోధన చేసేందుకు ఐసీఎంఆర్ ముందుకు వచ్చింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించి పరిష్కరిస్తున్నామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్ కమ్స్పై శ్రద్ధపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సర్వీసును పొడిగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో ముగియనున్న సీఎస్ కె. విజయానంద్ సర్వీసును మరో 3 నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
ఏపీని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ బిహార్ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి బిహార్ చేరుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి.
ఏపీలోని మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ను బుధవారం ఏపీ హైకోర్టు విచారించింది.
కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం అందింది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎంపీపీ అన్నమ్మపై అవిశ్వాస తీర్మానంపై రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఎంపీపీ పదవి కోసం వైకాపాలో గత కొన్ని నెలలుగా వర్గపోరు నెలకొంది.
గుంటూరు జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు.
ఆరుగాలం శ్రమించి పండించిన వ్యవసాయోత్పత్తుల సేకరణలో ఎదురవుతోన్న ఇబ్బందులను చాలా వరకు పరిష్కరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికత సాయంతో వినూత్న ప్రక్రియలను అందుబాటులోకి తెస్తోంది.
తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జి లేని లోటు గుర్తించామని, ఏ కష్టమొచ్చినా, మీ సమస్యలు తీరకపోయినా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
బాలిక అదృశ్యం మిస్టరీగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె (16) అక్టోబరు 4వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదని పోలీసులు, ఎస్పీ, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినా..