ఉద్దానం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధి మూలాలపై పరిశోధన చేసేందుకు ఐసీఎంఆర్ ముందుకు వచ్చింది.
ఏపీని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం అమరావతిలో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ బిహార్ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి బిహార్ చేరుకోనున్నారు.
‘మా పిల్లలకు సక్రమంగా మధ్యాహ్నం భోజనం ఎందుకు పెట్టడం లేదు?.’అంటూ వరగాని ఎస్డబ్ల్యూ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.
ఏపీలోని మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ను బుధవారం ఏపీ హైకోర్టు విచారించింది.
విజయవాడ పీఎన్బీఎస్లో ముందస్తుగా టిక్కెట్లు ఇచ్చేందుకు 40 మంది బుకింగ్ కండక్టర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది అనర్హులే. ప్రజాప్రతినిధులు, ఆర్టీసీలో అధికారులను ప్రసన్నం చేసుకుని ఏళ్లుగా ఇక్కడే పాగా వేశారు.
వ్యవసాయ భూములు, ఇళ్లు, స్థలాలు.. కొనుగొలు చేయాలన్నా, విక్రయించాలన్నా రిజిస్ట్రేషన్ అవసరం. ఎందుకంటే ఆ భూమి రిజిస్టర్ అయి ఉంటేనే దానికి హక్కుదారులుగా చట్టం పరిగణిస్తుంది.
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ దృష్టి సారించింది. అద్దేపల్లి సోదరుల బ్యాంకు స్టేట్మెంట్లను సేకరించి క్షుణ్నంగా విచారిస్తోంది.
గుంటూరు నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లే మార్గంలో తాడికొండ నుంచి తుళ్లూరు వరకు రోడ్డు అత్యంత దారుణంగా తయారైంది. ప్రధానంగా పెదపరిమి-తుళ్లూరు మధ్య భారీ గోతులతో కార్లు కూడా వెళ్లలేని పరిస్థితి.
పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. రేషన్ కార్డులను స్మార్ట్గా ఏటీఎం కార్డు పరిమాణంలో కార్డుదారులకు అందిస్తోంది.
లాస్ ఏంజిల్స్లో 2028లో జరిగే ఒలింపిక్స్లో పతకం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నానని ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ పసిడి పతక విజేత, ఒలింపియన్ బొమ్మదేవన ధీరజ్ చెప్పారు.