ఉద్దానం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధి మూలాలపై పరిశోధన చేసేందుకు ఐసీఎంఆర్ ముందుకు వచ్చింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ బిహార్ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి బిహార్ చేరుకోనున్నారు.
ఏపీలోని మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ను బుధవారం ఏపీ హైకోర్టు విచారించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు.
ఫ్యామిలీ నంబర్ సర్టిఫికెట్ జారీ.. ముడుపులిస్తేనే ఆమోద ముద్ర అన్నట్లు సాగుతోంది. కనీస పరిశీలన, విచారణ లేకుండా మామూళ్లు ఇవ్వడమే అర్హతగా వ్యవహారం సాగుతోంది.
అంతరిక్షం... అంతుపట్టని బ్రహ్మ పదార్థం.. ఎన్నో ఆసక్తుల సమ్మేళనం.. పిల్లలకైతే ఎంతో తెలుసుకోవాలన్న ఉత్సుకత. సరైన అవగాహన లేకపోవడం, మార్గనిర్దేశకత్వం చేసేవారు లేక ఈ రంగాన్ని ఎంచుకోలేకపోతున్నారు.
కొండపల్లి ఖిల్లాకు.. రూ.10.90 కోట్లతో గత తెదేపా ప్రభుత్వంలో అధునాతన సౌకర్యాలను కల్పించారు. కోటను పాలించిన రాజులే.. స్వయంగా వచ్చి.. తమ చరిత తెలిపేలా.. ఆగ్మెంటెడ్ రియాలిటీతో ఏర్పాట్లు చేశారు.
బంకుల్లో పెంట్రోలు కొట్టించుకునే వారిలో చాలా మందికి అక్కడ నిర్వాహకులు కల్పించాల్సిన సౌకర్యాలపై అవగాహన ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్వాహకులు వాటికి ఎగనామం పెట్టేస్తుంటారు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నీటి పన్ను వసూళ్లు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారులు లక్ష్యాలు నిర్దేశించినా... అమల్లో సిబ్బంది చొరవ చూపకపోవడం.. ప్రణాళిక లోపం కారణంగా నూరుశాతం కాదుకదా... కనీస స్థాయిలోనూ బిల్లులు జమ కావడం లేదు.
విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలు, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీఐహెచ్)తో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి సమీపంలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల శుక్రవారం ఒప్పందం చేసుకుంది.
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆ సంస్థ సీఎండీ ఎ.రాబర్ట్ జెరార్డ్ రవి సూచించారు. విజయవాడ చుట్టుగుంటలోని సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలోని పలువురు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నల్లపాడు శాఖ పరిధిలోని అక్రమాలపై చర్యలకు రంగం సిద్ధమైంది. 51 విచారణను పరిశీలించిన పాలనాధికారి సెక్షన్ 59 కింద అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు సర్ఛార్జి విచారణకు ఆదేశించారు.
మహిళలు, న్యాయమూర్తులు, కూటమి నేతల కుటుంబాలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి విజయ్భాస్కర్రెడ్డికి డిసెంబరు 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.