ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 4 లక్షలు తీసుకుని మోసగించారంటూ బాధితులు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ ప్రత్యేక విచారణకు ఆదేశించారు.
పెట్టుబడుల సొమ్ము పక్కదారి పట్టించిన అద్విక నిర్వాహకుడు ఆదిత్య, సీఈవో రవికిరణ్లు బినామీ పేర్ల మీద వందల ఎకరాలను పొరుగు రాష్ట్రాల్లో కొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైకాపా ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన చోట నిరుపయోగంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, కండక్టరు తొలగించేందుకు విద్యుత్తు సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయని.. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల ఏపీ బ్రెయిన్ క్యాపిటల్గా మారుతుందని ఉద్ఘాటించారు. క్వాంటమ్ సైన్స్ను ఇంజనీరింగ్లోనూ భాగం చేస్తున్నామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా ఏపీ వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
క్వాంటమ్ వ్యాలీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ పార్క్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. అమరావతిలో టెక్ వ్యాలీ పార్కులోనే లక్షల మందికి ఉద్యోగావకాశాలు, ఇతర రాష్ట్రాలూ సేవలు వినియోగించుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించనుంది.
పల్నాడు వద్దంటున్నారు..గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పనిచేయడానికే మొగ్గుచూపుతున్నారు.. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి ఉండగా, ఈసారి జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లోనూ ఈ సమస్య మరింత ఎక్కువగా మారింది.
వైకాపా హయాంలో 2019-24 మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పద్దుల ద్వారా పొన్నూరు మన్సిపాలిటీకి రూ.3724.08 లక్షలు నిధులు మంజూరు చేయగా.. దానిలో 1,886.13 లక్షలు ఖర్చు చేసినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.
అద్విక ట్రేడింగ్ కంపెనీ బోర్డు తిప్పేసిన వ్యవహారంలో అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సేకరించిన రూ. వందల కోట్ల డిపాజిట్లను దారి మళ్లించడానికి చేయని ప్రయత్నాలు లేవు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డిజిటల్ గేమింగ్ అడిక్షన్ను జబ్బుల చిట్టాలో చేర్చిందని నిమ్హాన్స్కు చెందిన సైకియాట్రీ విభాగం వైద్యుడు సమీర్ కుమార్ తెలిపారు.
నేషనల్ హైవే పోలీసు పెట్రోలింగ్ వాహనంలోని ఓ కానిస్టేబుల్ మంగళగిరి- గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజ టోల్ప్లాజా వద్ద లారీ డైవర్ను కొట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇన్ఛార్జుల పాలనకు ఏడాది పూర్తవుతుంది. వీసీ మొదలుకుని అనేక కీలక స్థానాల్లో అదే పరిస్థితి నెలకొనడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది.