జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలకు సంబంధించిన పత్రాలను కాంగ్రెస్ పార్టీ నేతలు ట్రక్కులో దిల్లీకి పంపించారు.
‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్’ ఛానళ్ల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం విజయవాడ పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో నిర్వహించాల్సిన కార్తిక దీపోత్సవం వాయిదా పడింది.
స్క్రిప్టు ఎవరు రాసిచ్చారు.... ఆ రైతులు స్థానికులేనా..ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా అని కూడా ఆరా తీయకుండా స్క్రిప్టు చదివేసి వెళ్లిపోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన ఎలా చేశారో అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు.
విజయవాడలో బుధవారం మధ్యాహ్నం కాసేపు వర్షం కురిసింది. ఆటోనగర్లో ప్రధానమైన వంద అడుగుల రహదారిపై ఆ చివర బందరు రోడ్డు నుంచి ఈ చివర మహానాడు వరకు కనీసం ఓ పది ప్రాంతాల్లో నీళ్లు మోకాళ్ల లోతున నిలిచిపోయాయి.
ఉన్నత విద్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి లోకేష్.
వీఆర్లో ఉన్న పోలీస్ అధికారులకు జీతాలు రావడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో పిల్ వేశారు. ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్పై బుధవారం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
కూటమి ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయడంపై సాక్షి మీడియా, వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సాక్షి పత్రికలో ప్రైవేట్ స్కూల్ బాలికపై లైంగిక దాడి అని వార్త ఇచ్చారని.. అదే వార్తపై ఇవాళ బాలిక కాదు వివాహిత అని రాశారని అనిత మండిపడ్డారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .