యోగా సాధనతో మంచి ఆరోగ్యం సాధ్యమవుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలలకు చెందిన సుమారు 8వేల మంది విద్యార్థులు ఆసనాలు వేశారు.
రాజధాని ప్రధాన కేంద్రంగా ఉన్న గుంటూరు జంక్షన్ యార్డు ఆధునికీకరణ పనులకు 2025 బడ్జెట్లో కేంద్రం రూ.71.63 కోట్లు కేటాయించింది. గత కొన్నేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు అనుమతి కోసం అధికారులు చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలించింది.
సాగులో విత్తన ఎంపికే కీలకం. మేలైనవి సాగు చేస్తేనే మంచి దిగుబడులొస్తాయి. కానీ.. కొంతమంది అక్రమార్కులు నకిలీలు, నాణ్యత లేనివి, అనుమతుల్లేనవి రైతులకు అంటగడుతున్నారు.
రాజధాని అమరావతిలో భూగర్భ పరిస్థితులపై అధ్యయనం సాగుతోంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు దీనిని సీఆర్డీఏ చేపట్టింది. వరద విశ్లేషణ, నేలలు, రాతి స్వభావం, నీటి జాడలు, తదితర అంశాలపై హైదరాబాద్కు చెందిన బ్లూ ఎనర్జీ బిల్డ్ అనే సంస్థ అధ్యయనం చేస్తోంది.
మిర్చియార్డులో కమీషన్ ఏజెంట్ల లైసెన్సుల వ్యవహారం ఎంతకీ తెగడం లేదు. దిగుమతి లైసెన్సులకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. లైసెన్స్ ఉంటే ఏదో ఒక రూపేణా కాసులు వెనకేసుకోవచ్చని వ్యాపారులు పోటీ పడుతున్నారు.
రాజధాని ప్రాంతానికి మణిహారంలా ఉండేలా శాఖమూరు సెంట్రల్ పార్కును అభివృద్ది చేయాలని గతంలో తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. 300 ఎకరాల భూమిని కేటాయించి ప్రగతి వెల్డర్నెస్ డెవలప్మెంట్ వారితో కలిసి 40 వేలకు పైగా చెట్లు పెంచారు.
జిల్లాలో జల్ జీవన్ మిషన్లో అసంపూర్తి పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నిధులు కేటాయించి డిసెంబరులోగా ఓవర్హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం పూర్తిచేసి కొత్తగా 45 వేల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చి రక్షిత తాగునీరు....
దేవుడి భూములను కాపాడాల్సిన అధికారులు కొందరు కాసులకు కక్కుర్తి పడి అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. పంచారామ క్షేత్రం అమరేశ్వరాలయ భూముల రికార్డులను కొందరు రెవెన్యూ అధికారులు తారుమారు చేస్తున్నా దేవాదాయ శాఖ మిన్నకుండి పోతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ‘సంసిద్ధత’ కార్యక్రమం నిర్వహించాలని విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. వేసవి సెలవుల్లో చదువుకు దూరంగా గడిపిన బాలబాలికలు తిరిగి గాడిలో పడేలా వారి మానసికస్థితిని సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
తల్లికి వందనంతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లల చదువుకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇచ్చింది. మరో అడుగు ముందుకు వేసి డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కొత్త పథకానికి రూపకల్పన చేసింది.
గుంటూరు జైలులో అస్వస్థతకు గురైన వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్కు జీజీహెచ్లో అత్యవసర విభాగంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు.
సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్ల పోలీసు నిఘా నీడలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ బుధవారం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
పంట దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చలేక నాదెండ్ల, మండలంలోని తూబాడుకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాదెండ్లకు చెందిన నాశం ఆదినారాయణ(48)కు 1.25 ఎకరాలుంది.
ఒక పక్క రైతులు ఇనాం భూమి, ప్రభుత్వ భూమి, ఆదాయపు పన్ను చెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగి, ఆధార్ అనుసంధానం కాకపోవడం, రీసర్వేలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం తదితర కారణాలతో అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించలేదు.
పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ మరోసారి పట్టాలు ఎక్కబోతోంది. ఆత్మగౌరవానికి మళ్లీ అడుగులు పడనున్నాయి. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రజల్లో ఆసక్తి ఉన్నా ప్రభుత్వం నుంచి సాయం అందని పరిస్థితి.
వైకాపా పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం చేసిన వ్యక్తి.. వైకాపా గెలుస్తుందని బెట్టింగ్ పెట్టి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు జగన్ రావడమేంటి?
సచివాలయ ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీన్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రధానంగా అయిదేళ్లు సర్వీసు పూర్తిచేసిన ప్రతి ఒక్కరు బదిలీ కావాల్సిందే.
ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్లో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఫైబర్నెట్ టెక్నికల్ కమిటీని ప్రభుత్వం పునర్ నియామకం చేసింది. తొమ్మిది మంది సభ్యులతో ఫైబర్నెట్ టెక్నికల్ కమిటీ నియమించింది.
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రికి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నారా లోకేష్ బయలుదేరి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రణాళిక శాఖపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎస్ విజయానంద్, సంబంధిత అధికారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. 2018 నుంచి పెండింగ్లో ఉన్న రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ 2,787 కోట్లతో నిర్మించే ప్రాజెక్టులకు ఆమోదించింది.
జగన్ తన హయాంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నడిపారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. మహిళలు ఓట్లు వేయలేదని, ప్రజలు తనకు ప్రతిపక్ష హోదా కల్పించలేదనే అక్కసుతోనే జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ(మంగళవారం) సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
స్థానికంగా నిర్మించబోయే రిజర్వాయర్ ముంపునకు గురికావడంతో మంగళవారం బొల్లాపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సర్వే బృందాలతో ఆర్డీవో సమీక్ష సమావేశం నిర్వహించారు.