దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సజీవ చరిత్ర పుస్తకం ద్వారా 1984లో చోటు చేసుకున్న వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని తెలిపారు.
జిల్లాలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని 17వ తేదీన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో జిల్లా కలెక్టర్ల సమావేశం సోమవారం నాడు రాజధాని అమరావతిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
రెవెన్యూలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రపంచంలోనే తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలనేదే తన ఆలోచన అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కొత్త ఉపాధ్యాయులొస్తున్నారు. అతి త్వరలోనే విధుల్లో చేరబోతున్నారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ విజయవంతంగా పూర్తి చేసింది
సూర్యలంక సముద్ర తీర ప్రాతంలో నిర్మించిన తారకేశ్వరాలయం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 2016లో దీని నిర్మాణ పనులు ప్రారంభించి.. 2023లో విగ్రహాలను ప్రతిష్ఠించారు.
గుంటూరు - బాపట్ల - చీరాల (జీబీసీ) రాష్ట్ర రహదారిలో ఏటా ట్రాఫిక్ పెరిగి రద్దీగా మారింది. రెండు జిల్లాల కేంద్రాలను కలిపే రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని పుష్కరకాలంగా ప్రతిపాదనలు ఉన్న కార్యరూపం దాల్చలేదు. కేంద్రం ఎన్హెచ్గా గుర్తించి నిధులు కేటాయిస్తేనే విస్తరణ పనులకు మోక్షం లభిస్తుంది.
పంచాయతీలకు మహర్దశ పట్టనుంది. సొంత భవనాలు లేని వాటికి ప్రభుత్వం శాశ్వత భవనాల్ని మంజూరు చేసింది. జిల్లాలో 459 గ్రామ పంచాయతీలు ఉండగా కొన్నింటికే సొంత భవనాలు ఉన్నాయి
పొన్నూరు మండలం వెల్లలూరులో 15 రోజుల క్రితం పిచ్చికుక్క 15 ఏడుగురిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడు తాడిశెట్టి కార్తీక్ను పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్చగా.. ఆరోగ్యం క్షీణించింది
పాడి పరిశ్రమకు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మినీ గోకులం పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఇవి రైతులకు ఉపయోగకరంగా ఉండడం, వందశాతం ఉపాధి హామీ నుంచి రాయితీ అందిస్తుండడంతో లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు
సాతులూరు రైల్వేస్టేషన్లో దక్షిణంవైపు ప్లాట్ఫామ్ అభివృద్ధి.. గుంటూరు-కర్నూలు ఎన్హెచ్ నుంచి రెండు వరుసలతో సిమెంటు రహదారి నిర్మించాక ఎరువుల రవాణా సమస్యలుతొలగిపోయాయి.
అర్జీలు అందించిన ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సూచించారు
తన భర్త వేముల రామాంజనేయులును నమ్మకంగా తీసుకెళ్లి చంపేశారని, వేముల శివపార్వతి.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు.
జిల్లా కేంద్రం నరసరావుపేట పల్నాడు రోడ్డులోని ప్రాంతీయ వైద్యశాలలో గర్భిణుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం వరకు పరీక్షల నిమిత్తం వైద్యుల వద్దకు వచ్చేవారు ఓపీలో పేర్లు నమోదు చేసుకునేందుకు ఎక్కువసేపు నిరీక్షించాల్సి వస్తోంది
పల్నాడు ప్రాంతంలో వైకాపా నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన పోలీసు అధికారులపై వేటు పడింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, తెదేపా నాయకులపై దౌర్జన్యాలకు వీరు వంతపాడారు.