బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాలకు కూడా వెళ్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఓబీసీపై సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాదులు పోరాడుతున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులను భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 50% మాత్రమే ఖర్చు చేసిందని, మిగతా 50 శాతం పంచాయతీ నిధులు ఏమయ్యాయని భాజపా నేత మాధవీ లత ప్రశ్నించారు.
మణుగూరు మండలం సమితి సింగారంలో భారత రాష్ట్ర సమితి సర్పంచి అభ్యర్థి గుండి గౌరీ ప్రచార రథం డ్రైవర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఉదయం దాడికి పాల్పడ్డారు.
తల్లాడ మండలం కొడవటిమెట్ట(రెడ్డిగూడెం) పంచాయతీలోని ఓ వార్డుకు నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు కరవయ్యారు. ఈ పంచాయతీలో ఎనిమిది వార్డులున్నాయి. ఒకటో వార్డు ఎస్టీకి రిజర్వ్ అయింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నాయకులు ఏకగ్రీవాలకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రాయ‘బేరాలు’ ఫలించటంతో చాలాచోట్ల పాలకవర్గాలు ఏకగ్రీవమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వన్యప్రాణుల వేట నిత్యకృత్యమవుతోంది. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారు ఈ వేటలో భాగస్వాములవటం, వేటాడిన మాంసాన్ని కొనుగోలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది
జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని 191 గ్రామ పంచాయతీల్లో సర్పంచి స్థానాలకు 1,025, 1,742 వార్డులకు 4,085 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
గతంలో ఎన్నడూలేని విధంగా ఈసంవత్సరం పత్తి రైతు చిత్తయ్యాడు. తొలుత అనావృష్టి, తర్వాత అతివృష్టి.. కర్షకులను నిండా ముంచాయి. పత్తి నిల్వలతో కళకళలాడాల్సిన మార్కెట్ యార్డులు వెలవెలబోతున్నాయి.
మన పూర్వీకులు ఇంటికి వచ్చిన అతిథితో పాటు ఇంట్లో వారంతా అరటి ఆకులో భోజనం చేసేవారు. అలాంటి పద్ధతులు అంతరించి ప్రస్తుతం స్టీల్, పింగాణి ప్లేట్లలో భోజనం ఆరగిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో 566, భద్రాద్రి జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచి, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి
అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే పూర్వప్రాథమిక విద్యనభ్యసించే అంగన్వాడీ పిల్లలకు దుస్తులు అందించి విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావటానికి ఏర్పాట్లు చేస్తోంది.
2025 మే 23న విజయవాడ వైపు వెళ్తున్న సింహపురి ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన ఓ యువతి ఐ-ఫోన్ 15ను డోర్నకల్ సమీపంలో దొంగలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.