ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క గురువారం ప్రవేశపెట్టిన 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది.
‘వయసు ఒక నంబరు మాత్రమే’ అని నిరూపిస్తున్నారు భద్రాచలం ఐటీడీఏ ప్రాంతానికి చెందిన గాలి రాంమోహన్రావు ఐటీసీ విశ్రాంత ఉద్యోగి అయిన ఆయన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు బంగారు పతకాలు సాధించిన శభాష్ అనిపించుకుంటున్నారు.
మూడు వేల ఏళ్లనాటి చరిత్రకు ఆనవాళ్లు రాకాసి గూళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం నుంచి వేములూరు మార్గంలోని అడవిలో ఇవి సాక్షాత్కరిస్తాయి.
పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు పండిస్తున్న పంటలకు ఈ సీజన్లోనే సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు.
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు.
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.