డిజిటల్ పంట సర్వే చేపట్టేందుకు వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈఓలు) ససేమిరా అంటున్నారు. సర్వే చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా రాష్ట్రవ్యాప్తంగా ఏఈఓలు ముందుకు రావటం లేదు.
దసరా, బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఖమ్మం రీజియన్లో ఆర్టీసీకి ఆదాయం సమకూరింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పండుగ సమయాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది.
ఆటోమేటిక్ ఫాలింగ్ గేట్లు.. వర్టికల్ గేట్లు.. రేడియల్ క్రస్ట్ గేట్లు.. మూడూ జలాశయాల్లో నిల్వ నీటిని, వరద ప్రవాహాన్ని బయటకు విడుదల చేసేందుకు దోహదపడేవే.. ఒక్కోదాని పని విధానం ఒక్కో తీరున ఉంటుంది.
ఆరు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఆ ప్రాథమిక సహకార పరపతి సంఘం అంచెలంచెలుగా ఎదిగింది. రైతులకు పలు రకాల సేవలందిస్తూ ఉమ్మడి జిల్లాలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది.
రాష్ట్రానికి గంజాయి తరలించే వారికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు గుమ్మంగా మారాయి. సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఏపీలోని పలు ప్రాంతాల్లోంచి హైదరాబాద్ తదితర నగరాలకు బస్సులు, కార్లు, లారీల్లో అక్రమంగా పెద్ద ఎత్తున సరకు తరలిస్తున్నారు.
వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం రాముడంటే శబరికి అమితమైన భక్తి. దీన్ని గుర్తించిన ఆలయ వైదిక బృందం గడిచిన దశాబ్దకాలం నుంచి అశ్వయుజ పౌర్ణమికి శబరిమాత ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఇల్లందు మండలం రాజీవ్ నగర్లో డీఎస్పీ చంద్రభాను, సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఉదయం ఐదు గంటల నుంచి నిర్బంధ తనిఖీలు (కార్డెన్ సెర్చ్) చేశారు.
మద్దులపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో వెంకటే శ్వర స్వామి వారి కల్యాణాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు సురబాక రాజు, సుర బాక రామ్మూర్తిల ఆధ్వర్యంలో గురువారం వైభవంగా నిర్వహించారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10 వేల 6 పోస్టులు డీఎస్సీ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కలిపించిందని, గత ప్రభుత్వం అనేక స్కూల్స్ పెట్టిందే తప్ప పక్క వసతి కలిపించడంలో విఫలమైందని ఆరోపించారు.