బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పాలేరు మత్స్యపరిశోధన స్థానం ఉన్నతీకరణకు అడుగులు పడటం లేదు. రాష్ట్రంలోనే చేపలపై పరిశోధించే ఏకైక కేంద్రమిది. దీన్ని 1976లో మత్స్యశాఖకు అనుబంధంగా ఏర్పాటుచేశారు.
ఖమ్మంలో రోడ్లపై అపరిమిత వేగంగా దూసుకెళ్లే వాహనాలపై పోలీసులు నిఘా పెట్టారు. గాలిలో తేలిపోయే వాహనాలను గుర్తించి రూ.1,035 చొప్పున జరిమానా విధిస్తున్నారు. ఖమ్మం పరిసరాల్లో సగటున రోజుకు 50 వాహనాలపై చలానా విధిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బీమా’ పథకాన్ని 2018 ఆగస్టు నుంచి అమలుచేస్తోంది. బీమా వర్తింపు సంవత్సర కాలం. ఏటా ఆగస్టు 14 నుంచి తర్వాత సంవత్సరం ఆగస్టు 13 వరకు అమల్లో ఉంటుంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిరప కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉదయం జెండా పాట నిర్వహించినా... ఆర్డర్లు లేవని వ్యాపారులు కొనుగోలు చేయకుండా చేతుల్తేశారు.
ఖమ్మం నగరంలోని మిర్చి వ్యాపారి గుమాస్తా వద్ద రూ.6 లక్షల నగదు కాజేసిన విషయంలో పోలీసు అధికారులు చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జూన్ చివరి వారంలో జరిగిన ఈ సంఘటనలో ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రధాన సూత్రధారి అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరేందుకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని విద్యార్థులు ఆదివారం నుంచి ఆప్షన్లను నమోదు చేసుకుంటున్నారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి పురుషోత్తపట్నంలో భూములున్న విషయం విదితమే. ఆ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ పనులు చేపడుతుండటంతో సిబ్బంది దాన్ని అడ్డుకునే క్రమంలో ఆ గ్రామస్థులతో సోమవారం ఘర్షణ జరిగింది.
కన్న కూతుర్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన కేసులో తల్లితోపాటు ఆమె మామకూ జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి న్యాయస్థానంలో జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ సోమవారం తీర్పు చెప్పారు.