భూముల క్రయవిక్రయాలు పారదర్శకంగా జరగాలనే సదుద్దేశంతో భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం పూనుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన (జూన్ 2) పూర్తిస్థాయిలో ‘భూ భారతి’ని అమల్లోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా ‘ధరణి’ స్థానంలో భూభారతి పోర్టల్ను తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతోంది.
భూభారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు జూన్ 3 నుంచి 20 వరకు అధికార యంత్రాంగం గ్రామాలకు వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
జిల్లాలో రైతులకు, వ్యవసాయ రంగానికి జీవనాడి అయిన సాగర్ కాల్వల మరమ్మతులకు పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రధాన కాల్వ సహా వివిధ ఎత్తిపోతల పథకాలు, గతేడాది వరదలకు దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేపట్టనుంది.
ఖమ్మం జిల్లా అధిక వేడి ప్రమాదంలో ఉందని దిల్లీకి చెందిన శక్తి పర్యావరణం, నీటిమండలి (సీఈఈడబ్ల్యూ) మంగళవారం ప్రచురించిన కొత్త అధ్యయనం స్పష్టం చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో అధిక వేడి నుంచి చాలా అధిక వేడి ప్రమాదంలో ఉన్న జిల్లాల జాబితాలో ఖమ్మం 21వ స్థానంలో నిలిచింది.
ఈ ఏడాది సకాలంలో జీవన ప్రమాణపత్రాలు సమర్పించని కారణంగా సింగరేణికి చెందిన 5వేల మంది విశ్రాంత ఉద్యోగులు పింఛన్కు దూరమయ్యారు. లబ్ధిదారులు ప్రతిఏటా డిసెంబరులోగా సంబంధిత పత్రాలను అందజేయాలనేది నిబంధన.
అభంశుభం తెలియని ఆ బాలుడికి పెద్ద ఆపదే వచ్చిపడింది. ఆటపాటలతో హాయిగా గడపాల్సిన వయసులో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. చిన్నారి బతకాలంటే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరని, ఇందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పటంతో బాలుడి తల్లి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది.
మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈనెల 23(నేటి) నుంచి 29వ తేదీ వరకు ఖమ్మం రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు ఖమ్మం రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎండీ.జాఫర్ తెలిపారు.
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 31 తుది గడువు విధించారు. ఖమ్మం జిల్లాలో ఏడు మైనార్టీ గురుకుల విద్యా సంస్థలు(పాఠశాలలు, జూనియర్ కళాశాలలు) ఉన్నాయి.
అనాథలు, నిరుపేద బాలికలు విద్యనభ్యసించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడి విద్యార్థినుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నిర్వాహకులు వేసవి శిక్షణ శిబిరాల్ని నిర్వహించారు.
సాధారణంగా ఉపాధి పనులు అనగానే పలుగూపార గుర్తొస్తాయి. మట్టి పనులు మదిలో మెదలుతాయి. వ్యవసాయ పనుల్లేని రోజుల్లో, మండు వేసవిలో కాలే కడుపుల్ని నింపుకొనేందుకు వేతన జీవుల పడే శ్రమే గుర్తొస్తుంది.