‘మన ఊరు మన బడి’ లెక్కల్లో ఈ వింతలతో జనం విస్తుపోతున్నారు. పనుల్లో పురోగతి పావు శాతం కూడా దాటకుండానే ఉన్నతాధికారులు జిల్లాలకు వెయిటేజీ, ర్యాంకులను ప్రకటిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన ఊరు మన బడి పనుల్లో 33.8శాతం పనులు పూర్తిచేసిన ఖమ్మంజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. మరి మిగతా 76శాతం ప
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి సమర్పించిన పట్టు వస్త్రాల్లో కొన్ని మాయమైనట్లు తెలిసింది. శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఉత్సవాల తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా బయటకు పొక్కింది.
గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించిన పోస్టుల్లో భాగంగా జిల్లాలో హెల్త్ అసిస్టెంట్లు 54, ఫార్మసిస్టులు 23, ల్యాబ్ టెక్నీషియన్లు 19 మందికి డీఎంహెచ్ఓ డా.జేవీఎల్ శిరీష నియామక పత్రాలను గురువారం అందజేశారు.
పెద్దమునగాల మధ్యనున్న రామలింగేశ్వర స్వామి ఆలయ కల్యాణ మండప నిర్మాణానికి పెద్దమునగాలకు చెందిన నల్లమోతు పెద్ద నరసింహారావు, సక్కుబాయి దంపతులు రూ.5 లక్షలు వితరణగా గురువారం అందించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు వేదికలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఖమ్మంలో ప్రభుత్వ వైద్యవిద్య కళాశాల కల నెరవేరింది. రాబోయే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. జిల్లాలో 161 పల్లె, తొమ్మిది బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. కంటి వెలుగు పథకం రెండో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఖమ్మంలో జనవరి 18న ప్రారంభించారు.