పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న తరుణంలో పారిస్ రైల్వే నెట్వర్క్ పై జరిగిన భారీ దాడి ఫ్రాన్స్ ను షాక్ కు గురిచేసింది. ఫ్రాన్స్ హై-స్పీడ్ TGV రైలు నెట్వర్క్పై ఈ దాడి జరిగిందని సమాచారం. దీంతో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు, ఫ్రెంచ్ రాజధానికి హైస్పీడ్ రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 50 వేల మంది పై ప్రభావం పడింది.
Telangana: రూరల్ ప్రాంతంతో పాటు రాజధాని హైదరాబాద్ కోసం భారీగా నిధులు కేటాయించారని చెప్పారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ చదువుతుంటే కేసీఆర్ బయటికొచ్చి విమర్శలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అమ్మకడంపైనే, అప్పులు చేయడంపైనే ఫోకస్ చేశారన్నారు. ఎవరైనా భూములు అమ్మాలన్నా, అప్పులు చేయాలన్నా ఆయన వద్ద నేర్చుకోండని ఎద్దేవా చేశారు. ‘‘పత్తాలు ఆడడం మాకు రావు, బీఆర్ఎస్.. బీజేపీ వాళ్ళకే వస్తాయ్’’ అంటూ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు.
సంగమేశ్వరం వద్ద గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం. ప్రస్తుతం 846 అడుగులకు చేరిన వరద నీరు. మరో రెండు రోజ్జుల్లో పూర్తిగా నీట మునగనున్న ఆలయం. మళ్ళీ 8 నెలల తరువాతే స్వామి వారి దర్శనం.