గుండెలు పిండేసే దుర్ఘటన.. కళ్లు చెమర్చే విషాద ఘటన.. జీవన గమనంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న రెండు విభిన్న మనసులు... ప్రేమ పేరుతో దగ్గరై.. మూడు ముళ్లతో ఒక్కటై.. బొమ్మరిల్లు లాంటి కుటుంబాన్ని నిర్మించుకున్నాయి.
నెల్లూరు కేంద్రంగా జరుగుతున్న రేషన్ దందాపై ఉచ్చు బిగుస్తోంది. పేదల బియ్యం అక్రమ రవాణా, మాఫియా తీరు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, నాయకుల ఆరోపణలపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది.
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతమున్న పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు.. అన్ని నియోజకవర్గాల్లో కొత్త పార్కుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.
పేద కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ గొప్ప మనసును చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన ఇంటి యజమాని అవయవాలు దానం చేసి.. ఇద్దరికి కొత్త జీవితానిచ్చి స్ఫూర్తిగా నిలిచింది.
జిల్లాలో ఉచిత ఇసుక తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. భారత ప్రభుత్వం, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు పెన్నానదిలో ఇసుక తవ్వకం, రవాణా పూర్తిగా నిషేధించారు.
జిల్లాకే తలమానికంగా ఉన్న సోమశిల జలాశయానికి నిర్వహణ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఓ వైపు రైతాంగానికి సజావుగా సాగునీరు అందిస్తున్నా.. మరోవైపు గరిష్ఠ స్థాయికి నీరు చేరుతోంది.
మద్యం మత్తులో కూతురి(15)ని బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో జలదంకి మండలం హనుమకొండ పాలెంనకు చెందిన తండ్రి, నిందితుడు కర్రా బాలరాజుకు జీవితఖైదుతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి సిరిపిరెడ్డి సుమ బుధవారం తీర్పు చెప్పారు.
ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి విడతల వారీగా రూ.80లక్షలు తీసుకుని మోసం చేసిన యువతిపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.