వెంగంపల్లికి చెందిన రామిరెడ్డి, రాములమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాసులరెడ్డి. ప్రాథమిక విద్య వెంగపల్లిలో, పదో తరగతి వరకు రేవూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివారు.
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను విస్తృతం చేసింది. ఇప్పుడు అదే తరహాలో నగర/పురపాలికల్లో చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న కుటుంబాలను ఆదుకోవడంపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది.
జిల్లాలో కోల్కతా- చెన్నై రహదారి(ఎన్హెచ్-16) తర్వాత కీలకమైంది నెల్లూరు- ముంబయి జాతీయరహదారి (ఎన్హెచ్-67). దీనిపై నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా నిర్దుష్ట చర్యలు కొరవడ్డాయి.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రీజనల్ స్థాయిలో గెలిచిన జూనియర్స్, సీనియర్స్ జట్లు రాష్ట్ర స్థాయిలో తలపడుతున్నాయి.
CM Chandrababu: శ్రీహరి కోట, ఇస్రో నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వి-సి 60 రాకెట్ విజయవంతంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది మానవ సహిత అంతరిక్ష యానానికి, ఉపగ్రహాల మెయింటినెన్స్కు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు.
కూటమి ప్రభుత్వం హైలెవల్ కాలువ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నా.. వైకాపా ప్రభుత్వ పాలనలో చూపిన నిర్లక్ష్యం తీవ్ర ప్రతిబంధకంగా నిలుస్తోంది.
తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఆ మహనీయుడికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు.
నెల్లూరు పెన్నా నదిపై నిర్మించిన పాత వంతెన పరిస్థితి.. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లు ఉంది. వంతెనకు 71 ఏళ్లు నిండాయి. 1954 డిసెంబరులో ప్రారంభించిన వంతెన పొడవు 2,505 అడుగులు.
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు.. అంతర్జాతీయ పరిశ్రమలను నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా బీపీసీఎల్ రిఫైనరీతో పాటు ఇండోసోల్ పరిశ్రమలు ఏర్పాటు కానుండగా- మరిన్ని తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అమరజీవి పొట్టి శ్రీరాములు నడయాడిన నేల జువ్వలదిన్నె. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ పల్లె అభివృద్ధి అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది.
రైల్వేలో విద్యుత్తు తీగల పనులు చేసే సమయంలో అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవడం లేదు. జిల్లాలో రైల్వేలైన్ పొడవున ఉన్న హై లెవల్ విద్యుత్తు తీగల నిర్వహణలో భాగంగా నిత్యం తీగలను అధికారుల ఆధ]్వర్యంలో రైల్వే సిబ్బంది పరిశీలిస్తుంటారు.
జిల్లాలో రోడ్లపై గుంతలు పూడ్చడంలో ర.భ. శాఖ లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. గత వైకాపా ప్రభుత్వం జిల్లాలోని రహదారులపై నిర్లక్ష్యం చూపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్రాంతిలోగా గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కావలి అబ్బాయి, మధ్యప్రదేశ్కు చెందిన అమ్మాయి మనసులు కలిశాయి. వీరిద్దరూ కలిసి డబ్బు సంపాదనే ధ్యేయంగా గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఓయో రూమ్స్ కేంద్రంగా సరఫరా చేస్తున్నారు.
వ్యవసాయానికి విద్యుత్తు కోత మొదలయింది. రైతు గుండెల్లో గుబులు మొదలైంది. 9గంటల సరఫరా చేయాలి ఉండగా- రెండు రోజుల క్రితం వరకు వారం పాటు 8గంటలు అందించారు. రెండు రోజులుగా 7గంటలే చేస్తున్నారు.