సోమశిలలో ప్రత్యేక రేంజ్ ఏర్పాటుకు అటవీశాఖ కసరత్తు చేస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం.. అందుకు ప్రతిబంధకాలు, చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలపై అధికారుల నుంచి నివేదిక కోరింది.
నెల్లూరు నగర పరిశుభ్రతే లక్ష్యంగా గత ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద ఇచ్చిన ఆటోల్లో సగానికి పైగా పడకేయగా.. అంతకుముందు స్వచ్ఛాంధ్ర మిషన్ కింద ఇచ్చిన ఖరీదైన యంత్రాలు మూలనపడ్డాయి.
వైకాపా ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా సాగిన భూసార పరీక్షల్లో.. మళ్లీ కదలిక వచ్చింది. రైతులకు ఎంతో ప్రయోజనకరమైన వీటిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొదించింది.
తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లా పరిధిలోని తీర ప్రాంతాలకు వచ్చి వేటాడుతున్న వారిని తక్షణమే అడ్డుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ను ఆదేశించారు.
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది.
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు.
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది.
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది.
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు.
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
అమరావతి: జగన్ ప్రభుత్వ హయాంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మదనపల్లిలో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా బాధితుల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.