మహిళలను కించపరచడం, వాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం వైకాపా నేతలకు పరిపాటిగా మారిందని, ఇలాంటి నాయుకులపై ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వచ్చే పరిస్థితి ఉందని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుండ్లపల్లి భరత్ కుమార్ పేర్కొన్నారు.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ మరణం విజ్ఞానవంతమైన సమాజం కోరుకునే వారికి తీరనిలోటు అని కావలికి చెందిన మేజీషియన్, కళారత్న వి మాధవరావు పేర్కొన్నారు.
కార్యకర్తలే తెదేపాకు గుండెచప్పుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా పార్టీకి అండగా ఉన్నారు. గత ప్రభుత్వం ఎన్ని విధాలుగా వేధించినా చెక్కు చెదరని సంకల్పంతో నిలిచారు. మీ పోరాటం.. ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ముత్తుకూరు- నెల్లూరు ప్రధాన రహదారి పక్కన.. ముత్తుకూరు సమీపంలోని మల్లూరు రోడ్డు వద్ద, ముత్తుకూరు-వెంకటాచలం మార్గాల్లోని పంటపాళెం, కోళ్లమిట్ట సమీపంతో పాటు మరికొన్నిచోట్ల అనధికారికంగా బోర్లు తవ్వారు.
అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాలో వివిధ కారణాలతో పేర్లు నమోదు కాని రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. ఈ నెల పదో తేదీలోపు రైతు సేవా కేంద్రాల(ఆర్ఎస్కే)లకు వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది.
ఆ ఇంట్లో మరో పది రోజుల్లో కుమారుడి వివాహం. తల్లిదండ్రులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బంధువుల రాకపోలతో ఇంటిల్లిపాది సందడిగా ఉండగా.. ఇంతలోనే ఆ విధికి కన్నుకుట్టింది.
జిల్లాలోని ఉదయగిరి దుర్గాన్ని విశాఖపట్నం నేవీ బృందం సోమవారం సందర్శించింది. చారిత్రక నేపథ్యమున్న ఉదయగిరి పేరుతో యుద్ధ నౌక రూపుదిద్దుకొని ఆగస్టు 26న ప్రారంభోత్సవం కానుండడంతో లెఫ్ట్నెంట్ కమాండర్ ప్రశాంత్, బృంద సభ్యులు నరసింగరావు, నవీన్, ప్రకాష్కుమార్ స్థానిక పంచాయతీ అధికారులతో కలిసి దుర్గం కొండపై పర్యటించారు.
కేజీకి 250 గ్రాములు తక్కువ.. సీల్ లేని కాటాల ఉపయోగం.. వ్యాపారుల ఇష్టారాజ్యం.. ఫిర్యాదు చేస్తేనే తప్ప దాడులు చేయలేని అధికారులు.. ఇదీ జిల్లాలో తూనికలు కొలతల శాఖ పనితీరు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి దూర ప్రాంతాల నుంచి నుంచి వచ్చే విద్యార్థులకు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరికి రవాణా భత్యం చెల్లించేందుకు సిద్ధమైంది.
కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నెల్లూరు జిల్లా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు ఇవాళ(మంగళవారం) ఫిర్యాదు చేశారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఖండించారు. మహిళల జోలికి వస్తే వైసీపీ నేతలను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.