పట్టించుకోని రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ అధికారులు ప్రజాశక్తి-నారాయణవనం : తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయం పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల…
తమ పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని, అక్కడి నుంచి డిప్యూటేషన్పై డీఈవో కార్యాలయానికి గతంలో వచ్చిన గుమస్తాను మళ్లీ తమకే కేటాయించాలని కోరిన బంగారుపాళ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజేంద్రకు.. చిత్తూరు డీఈవో షోకాజ్ ఇచ్చిన ఘటన తాజాగా వివాదాస్పదమైంది.
గతేడాది ఆగస్టు 4న పుంగనూరు మండలం భీమగానిపల్లి కూడలిలో పోలీసులు- తెదేపా శ్రేణుల మధ్య జరిగిన అల్లర్ల ఘటనలో 499 మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.
సులువుగా నగదు సంపాదించాలనే అత్యాశ కొందరికీ చేటు తెచ్చింది. నగదు యాప్లో వచ్చే స్టార్ హోటళ్ల ప్రకటనలకు రేటింగ్ ఇచ్చి.. కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే.. రెట్టింపు నగదు వస్తుందన్న మాటలతో చాలామంది బాధితులుగా మారారు
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు.
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి.
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది.
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
అధికారం అండగా చెలరేగిపోయారు. తమ ఎమ్మెల్యేలు, నేతలను చూసి శ్రేణులూ రెచ్చిపోయాయి. మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నామంటూ కార్యకర్తలకు భ్రమలు కల్పించారు. నాయకులూ అదే భావనలో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అరాచకం, విధ్వంసం సృష్టించారు. వీరి దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలతో విసిగిపోయిన జనం.. జిల్లాలో పుంగనూరు మినహా అన్నిచోట్లా ఘోరంగా ఓడించారు. అప్పటి వరకూ మేమున్నామంటూ శ్రేణులకు చెబుతూ వచ్చిన వైసీపీ అభ్యర్థులు.. ఘోర పరాజయం తర్వాత వెనుతిరిగారు. ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి ఒక్క ఓటమితో కార్యకర్తల్ని గాలికొదిలేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అయోమయం, గందరగోళానికి గురవుతున్నారు.
తమలో దాగిన నైపుణ్యాలను వెలికి తీసి, ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. కుప్పంలో శుక్రవారం ఆమె ఎన్టీఆర్ ట్రస్టు తరఫున స్కిల్ డెవల్పమెంట్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం పీఈఎస్ ఆడిటోరియంలో 31 కుట్టు మిషన్లు, 25 తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లాకు వచ్చాయి. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులతో కూడిన కిట్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దీనిపై దృష్టి పెట్టారు. అన్నట్టుగానే ఇంటర్మీడియట్ విద్యా మండలి నిధులతో పాఠ్యపుస్తకాలు ముద్రించడంలో పాటు అవసరమైన నోట్ పుస్తకాలు, బ్యాగులు అందించే యత్నం చేశారు. ఈ పుస్తకాలు, బ్యాగులు జిల్లా కేంద్రానికి.. అటు నుంచి మండలాలకు చేరాయి. వచ్చే వారంలో ఇంటర్ విద్యార్థులకు కిట్ల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.
నామినేటెడ్ పదవులకు సంబంధించిన 60:40 ఫార్ములా తిరుపతిలో కూటమి నేతలను కలవరపరుస్తోంది. ఈ ఫార్ములా వల్ల నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ నాయకులు తమకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జనసేన నేతల్లో సంబరం ఉన్నా, తమలో పదవులు దక్కేది ఎవరికనే కలవరం వారిలోనూ ఉంది. బీజేపీ కూడా తమ వాటా పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమిత సంఖ్యలో ఉన్న నామినేటెడ్ పదవుల పందేరం మొత్తంమీద తిరుపతి నియోజకవర్గంలో కత్తిమీద సాముగా మారే అవకాశం కనిపిస్తోంది.
తిరుపతికి చెందిన వ్యాపారి కిడ్నాప్ కథ చివరకు సుఖాంతమైంది.చిన్నగొట్టిగల్లు మండలం చెరువు ముందరపల్లెకు చెందిన భాస్కర కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలోని మంగళం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న ఈయన ఆటో కూడా నడుపుతుంటాడు.సొంత పనుల నిమిత్తం బుధవారం స్వగ్రామానికి వచ్చి తిరిగి తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలోని చిన్నగొట్టిగల్లు వద్ద కిడ్నాప్ అయ్యాడు
ఎన్నికల ప్రక్రియ ముగిసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పొరుగు జిల్లాల్లోని తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగురోజుల క్రితం సీసీఎల్ఏను ఆదేశించింది. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన కారణంగా తహసీల్దార్ల బదిలీలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి శుక్రవారం రాత్రి తహసీల్దార్లను రిలీవ్ చేయాలని చెప్పడంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు ఇచ్చారు.
సమతా సైనిక్ దళ్(ఎ్సఎ్సడీ) సంస్థ పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ రూ.5లక్షలు డిమాండ్ చేస్తున్నారంటూ డీఎంహెచ్వో శ్రీహరి శుక్రవారం ఎస్పీ సుబ్బరాయుడికి ఫిర్యాదు చేశారు.
తిరుపతి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి అమరావతి నుంచి నూతన ఇసుక పంపిణీపై భూగర్భ గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకే్షకుమార్ మీనా వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో సమీక్షించారు.
నేడు ‘భారతీయ న్యాయ సంహిత’ సదస్సుప్రజాశక్తి – తిరుపతి టౌన్ బిజెపి ప్రభుత్వం ‘భారతీయ న్యాయ సంహిత’ పేరుతో అమల్లోకి తెచ్చిన మూడు క్రిమినల్ చట్టాలు అత్యంత…
విద్యార్థులు సాంకేతిక నైపుణ్యం అలవర్చుకోవాలి : డిఇఒప్రజాశక్తి -రేణిగుంటనేటి విద్యార్థులు సాంకేతిక నైపుణ్యం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ పి.శేఖర్ తెలిపారు శుక్రవారం…
తిరుపతి ఎయిర్పోర్ట్ పేరుమార్పుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనప్రజాశక్తి తిరుపతి టౌన్రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్ల పేర్లకు సంబంధించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. తిరుపతి ఎయిర్పోర్టును…
త్వరలో ఉచిత డిఎస్సీ కోచింగ్ ఎన్టీఆర్ ట్రస్టు స్కూలు ఏర్పాటుకు చర్యలు కుప్పంలో ముగిసిన నారా భువనేశ్వరి పర్యటనప్రజాశక్తి – కుప్పం టౌన్మహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతమే…
‘సంపద’ సృష్టించని ‘డంపింగ్యార్డులు’ మరమ్మతుకు నోచుకోని చెత్త వాహనాలు అంబాసిడర్లకు అందని జీతభత్యాలుప్రజాశక్తి – రామచంద్రాపురం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చెత్తతో సంపద సష్టించేందుకు గ్రామపంచాయతీలలో డంపింగ్…
పిల్లల అభివృద్ధి వ్యత్యాసాలపై సదస్సు ప్రజాశక్తి -తిరుపతి సిటీ చిన్నపిల్లల్లో అభివృద్ధి వ్యత్యాసాల గుర్తింపు, ముందస్తు చర్యలపై రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సును శుక్రవారం ప్రారంభించారు.…
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ద్రోహం : సిపిఎంప్రజాశక్తి – బిఎన్ కండ్రిగ కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం ద్రోహం చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు…
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై (Madanapalli fire incident) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు.
తిరుపతి: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసారని.. అది ధర్నాలా లేదని.. డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని ఎద్దేవా చేశారు.