దీపావళి పండుగ కొనుగోళ్లతో చిత్తూరు నగరంలోని ప్రధాన వీధులన్నీ సందడిగా మారాయి. కొత్త బట్టలు, పూజా సామగ్రి , టపాకాయలు కొనుగోలు చేసే వారితో చర్చివీధి, బజారువీధి, డీఐరోడ్డు, ప్రకాశం హైరోడ్డు తదితర ప్రాంతాలు కిటకిటలాడాయి.
రైళ్లలో ప్రయాణికుల వస్తువుల చోరీకి పాల్పడుతున్న కేసుల్లో ఐదుగురు నిందితులను విజయవాడలో రైల్వే పోలీసులు శనివారం అరెస్టు చేశారు.ఇటీవల విజయవాడకు వచ్చే పలు రైళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
హైందవ ధర్మాన్ని రక్షించడంలో నాయీ బ్రాహ్మణుల పాత్ర కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. వారి సంప్రదాయ వృత్తి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతోందని, తద్వారా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రాజకీయ నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు, వాటిపై నిరసనలు సర్వసాధారణం. జీడీనెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఈ ఆరోపణలు నిత్యకృత్యంగా మారాయి. ఈ క్రమంలో శనివారం టీడీపీ నాయకులు జీడీనెల్లూరులో, పాలసముద్రంలో నిరసనవ్యక్తం చేశారు.వీటిపై ఎవరి ఫిర్యాదూ లేకపోయినా పాలసముద్రం ఎస్ఐ చిన్నరెడ్డప్ప అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నాయకురాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ అరెస్టు చేసి జీపు ఎక్కించారు
మనిషి జీవన వికాసానికి కళలు మూలాధారంగా నిలుస్తాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయభాస్కరరావు పేర్కొన్నారు. మూడు రోజులుగా ఎస్వీ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యువతరంగ్ - 2025 కార్యక్రమం శనివారం ముగిసింది.
తెలుగుగంగ కాలువ పనులకు ఆది నుంచి అడ్డంకులు శాపంగా పరిణమిస్తున్నాయి. రెండు దశాబ్దాల క్రితం పునాది పడినా నేటికీ అడుగు ముందుకు పడటం లేదు. ఫలితంగా ఈ కాలువ నీటితో సాగుచేయాలనే రైతుల కోరిక నెరవేరడంలేదు.
ఎస్వీయూలో జరుగుతున్న యువతరంగ్-2025 వేడుకలు రెండో రోజైన శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. శ్రీనివాస ఆడిటోరియంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇటీవల తిరుపతి పరిసర గ్రామాల్లో ఒక కొత్త మార్పు కనిపిస్తోంది. ఉద్యోగాలు, ఐటీ రంగం, పట్టణ జీవితం వదిలి వ్యవసాయంలోకి తిరిగి వస్తున్న యువత సంఖ్య పెరుగుతోంది.