కాణిపాక వరసిద్ధి వినాయక స్దామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది.సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు క్యూ కట్టడంతో ఆలయంలోని క్యూలైన్లు పూర్తిగా నిండి పోయి వెలుపల వందల సంఖ్యలో భక్తులు వేచి వుండాల్సివచ్చింది.
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేదని ఫిర్యాదు చేస్తే సిబ్బంది వచ్చి సరిచేసేపాటికి రోజుల సమయం పడుతోంది.
సినీ నటి నిక్కీ గల్రానీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు.
సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. పద్మావతి నగర్లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం, సత్యసాయి సేవాసమితి ఆఽధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వైకాపా హయాంలో యథేచ్ఛగా సాగిన గ్రావెల్, మట్టి దందాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్ పడింది. నాలుగైదు నెలలపాటు అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడగా ఆ తర్వాత అధికార పార్టీ నేతలు గేట్లు తెరిచి తమ ‘మన్ను’గడ సాగిస్తున్నారు. దాంతో ప్రకృతి సంపద కనుమరుగవుతోంది.
ఇటీవల ఓ యువకుడు రయ్మంటూ ద్విచక్రవాహనంపై దూసుకెళ్తూ కనిపించగా.. పోలీసులు ఆపారు. శిరస్త్రాణం ఎందుకు పెట్టుకోలేదని అడగ్గా..సార్.. వెంట్రుకలు ఊడిపోతున్నాయని చెప్పడంతో వారు అవాక్కయ్యారు.
మీ కల ఐఏఎస్, ఐపీఎస్సా.. ఇందుకు అవసరమైన శిక్షణ తీసుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదా.. నిపుణుల, సలహాలు ఎలా పొందాలో అర్థం కావడం లేదా.. అయితే మీలాంటి వారికి కూటమి ప్రభుత్వం ఓ అవకాశం కల్పిస్తోంది
మీకు తెలుసా..! మన జిల్లాలోనే, మన వద్దే ఉప్పు సాగువుతుందని. సాగు అనగానే ఇదేదో చెట్లకు, మొక్కలకు కాసేది కాదు. వ్యవసాయం లాగా పొలాల్లో పండుతుంది. అదేలాగంటే.. పులికాట్ ఉప్పు నీటి సరస్సు. ఉప్పునీరు ఎందుకూ పనికి రాదు అనుకుంటాం కదా! కానీ.. ఆ నీటితోనే ఉప్పు తయారయ్యేది.
మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. సామాన్యులు అధిక ధర పెట్టి కొనలేక అవస్థలు పడుతున్నారు.. రూ.500 వెచ్చించినా వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదని వాపోతున్నారు
చిత్తూరు-పుత్తూరు ప్రధాన మార్గంలో జీడీనెల్లూరు మండలంలోని మోతరంగనపల్లె సమీపంలో శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొని రైతులు అరుణాచలం(66), కుమార్(52) మృతి చెందారు.
మహిళలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక శక్తిలా ఎదగాలని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు
శ్రీవారి అన్నప్రసాదంపై యాంకర్ శివజ్యోతి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గతంలో భర్త, స్నేహితులతో కలిసి ఆమె శ్రీవారి దర్శనానికి వచ్చారు.