శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
చిత్తూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల పుంగనూరు నియోజకవర్గ ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది. నగరి నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు.జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల నిర్ణయాన్ని చంద్రబాబు సరిదిద్దుతారని ఆశపడితే తీవ్ర నిరాశకు గురి చేశారంటున్నారు.
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఆలయ చైర్మన్గా సురేంద్ర బాబు అలియాస్ మణి నాయుడు ఎంపికయ్యారు.ట్రస్టు బోర్డు సభ్యులు బుధవారం ఉదయం ఆలయ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేశాక సురేంద్రబాబును చైర్మన్గా ఎన్నుకున్నారు.
జిల్లాకు చెందిన విద్యార్థులు బుధవారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో మంత్రులుగా వ్యవహరిస్తూ.. తమ వాగ్ధాటితో అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులపై సోషల్ మీడియా చెడు ప్రభావం పడకుండా ప్రత్యేకంగా రూపొందించిన బిల్లును చిన్మయి ప్రవేశపెట్టారు.
తిరుపతిలోని తుడా కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేశారు. అందులో మొదటి బహుమతి పొందిన విద్యార్థులు జిల్లా స్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు.
సుధా సోమానీ’ పరిశ్రమలో నైట్రోజన్ ట్యాంకరు ఎలా పేలింది.. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తి మండలం వెల్లంపాడులోని ఈ కర్మాగారంలో బుధవారంనాటి ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్రయోజనిక్ ప్రొపైన్ ఖాళీ ట్యాంకులో నైట్రోజన్ నింపుతుంటామని పరిశ్రమ నిర్వాహకులు అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది.
గూడూరును ప్రత్యేక జిల్లాగా చేయకపోతే పోయారు.. కనీసం నెల్లూరుజిల్లాలో అయినా కలుపుతారని నమ్మిన ప్రజలు దిగ్ర్భాంతికి గురవుతున్నారు. నెల్లూరులో మళ్లీ విలీనం అయినట్టే అని రెండు రోజుల ముందు దాకా బలంగా ప్రచారం కూడా జరిగింది. నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలను కూడా తిరుపతిలో కలుపుతారని ఆశ పడ్డారు. హఠాత్తుగా కథ ఎందుకు అడ్డం తిరిగిందో అర్థం కాక అందరూ సతమతమవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలుచేసేందుకు జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే రద్దుచేయాలని వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
మదనపల్లె జిల్లా ప్రకటనపై వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, జనసేన రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో బుధవారం టమాటా మార్కెట్లో సంబరాలు నిర్వహించారు.
శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమీతీర్థం మంగళవారం కనులపండువగా జరిగింది. అమ్మవారి చక్రస్నానంతోపాటు పుణ్యస్నానాలు చేసేందుకు తరలివచ్చిన అశేష భక్తజన సందోహంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి.
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం పేరుతో నాటి వైకాపా ప్రభుత్వం ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు ఇళ్ల పట్టాలు కట్టబెట్టింది. డబ్బులు తీసుకుని అనర్హులకు విలువైన స్థలాలు ఇచ్చారు. పేదలను మాత్రం కొండలు, గుట్టల్లోకి పంపించారు.
నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఆగస్టు 31లోపు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గృహాలకు అవకాశం ఇస్తూ 2026 మార్చి 11లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్దేశించింది.
చిత్తూరు జిల్లాలో క్రీడాకారులు పుష్కలంగా ఉన్నా సౌకర్యాలు మాత్రం అంతంతగానే ఉంటున్నాయి. దీంతో కొందరు లక్ష్యాలు చేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో సమస్యలతో ఆటలు ఆడాల్సిన పరిస్థితి ఎదురైంది.
విద్యుత్తు కనెక్షన్ పొందాలంటే ఇకపై కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లూ కొత్త కనెక్షన్ కావాలంటే ఇంటికి 30 మీటర్ల దూరం దాటితే స్తంభాల ఖర్చు వినియోగదారుడే భరించాల్సి ఉండేది.
ప్రభుత్వ భూముల కబ్జాకు అక్రమార్కులు కొత్త దారులు వెతుకుతున్నారు. తన పొలంలో వెళ్తున్న వంకపై కల్వర్టు నిర్మించుకుంటానని అనుమతి తీసుకున్న వ్యక్తి ఆ స్థలం ఆక్రమణకు యత్నించిన వైనం రేణిగుంట మండలంలో వెలుగులోకి వచ్చింది.
రానున్న కాలంలో చిత్తూరు జిల్లా పరిమాణం మరింత తగ్గనుంది. ప్రస్తుతం 32 మండలాలు ఉండగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆ సంఖ్య 23కు చేరనుంది. మదనపల్లె కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం...
భారత రాజ్యాంగం రూపకల్పన, రచనలో పుదూరుకు ప్రత్యేక స్థానం ఉంది. గ్రామానికి చెందిన వ్యక్తులు సంస్కృతంలో ఉన్న రామాయణ, మహాభారత కథలను తెలుగులోకి అనువాదం చేసి సరళమైన తెలుగు అక్షరాలు, పదాల రూపకల్పన చేశారు.
కలంకారీ అంటే గతంలో పురాణ, ఇతిహాస ఘట్టాలు మాత్రమే. ఇటీవల వీటి తయారీలో ఎన్నో మార్పులొచ్చాయి. నేటి పరిస్థితులకు అనుగుణంగా అద్భుతమైన డిజైన్ల తయారీలో యువత ఆసక్తి చూపుతోంది. కొనుగోలుదారులకు కావాల్సిన రీతిలో డిజైన్లు సిద్ధం చేస్తున్నారు.
మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. మంగళవారం ఛైర్పర్సన్ చాముండేశ్వరి అధ్వర్యంలో చేపట్టాల్సిన సాధారణ సమావేశానికి ఉద్దేశ పూర్వకంగా వైకాపా కార్యవర్గ సభ్యులు హాజరు కాలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో ఈ ఏడాది జులై 3న ‘సంజీవని’ ప్రాజెక్టును ప్రారంభించగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు.
ప్రధాన మంత్రి పాఠశాలలు ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) ద్వారా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర నిధులతో పలు విడతల్లో వసతులకు శ్రీకారం చుడుతున్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేలా సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
పట్టణంలోని విద్యుత్తు కార్యాలయం వద్ద ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మోటారు సైకిల్పై వచ్చి వృద్ధురాలి మెడలో నుంచి మూడు సవర్ల బంగారు సరుడు లాక్కున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది.