మండలంలోని నరశింగాపురం.. వాలీబాల్ క్రీడకు పుట్టినిల్లుగా పేరుగాంచింది. శ్రీవినాయక యువజన క్రీడా సంఘం పేరిట క్రీడాకారులు వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని స్వశక్తితో ఏర్పాటు చేసుకున్నారు.
జగనన్న లేఔట్లో నిర్మాణాలకు అవసరమైన నీటికి లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. వెంకటగిరి పరిధిలో 2,250 గృహాలు మంజూరు చేశా రు. రూ.90 లక్షలతో పది బోర్లు, మోటార్లు, 90 మినీ ట్యాంకులు ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు.
ఎండలు మండుతున్న నేపథ్యంలో సమతుల్యమైన జీవనశైలితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం నుంచి ఆహారం వరకు అన్నిట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. విదేశీయులు అధిక సంఖ్యలో ఇక్కడి ఆలయంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలను చేయిస్తుంటారు.
వైఎస్సార్ బీమా ప్రయోజనం కోసం బాధిత కుటుంబాలకు ఎదురు చూపులు తప్పడం లేదు. నిధుల లేమి, ధ్రువపత్రాల సమర్పణలో లోటుపాట్లు తదితర కారణాలతో సాయం సకాలంలో అందడం లేదు.
తిరుమల : తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో...
వేసవి సెలవుల అనంతరం ఇంటర్ కళాశాలలు గురువారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కళాశాలలో అడుగుపెట్టే రోజుకు పాఠ్యపుస్తకాలందించేలా చర్యలు చేపడతామన్న పాలకుల మాటలు ఆచరణకు రాలేదు.
వైసీపీని గద్దె దించడమే తమ ధ్యేయమని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక పద్మావతీపురంలోని ఎల్వీ కల్యాణ మండపంలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
పర్యావరణానికి ఎంతో మేలు చేసే వానపాముల వేట పులికాట్ సరస్సులో అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. టన్నుల టన్నుల వానపాములను లోడి తరలించేస్తున్నారు. ఉపాధి కరువైన మత్స్యకారులకు డబ్బు ఆశ చూపి కూలీలుగా మార్చుకుని వీటిని తవ్వి తీస్తున్నారు.
టపాసుల గిడ్డంగి, తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. కనీసం కడసారి చూపు సైతం దక్కలేదంటూ కుటుంబ సభ్యులు రోధించిన తీరు చూపరులను కలిచివేసింది.
ఆ గ్రామంలోని పిల్లలు ప్రభుత్వ బడిలోనే చేరుతున్నారు.. సమీపంలో ప్రైవేటు బడులున్నా వెళ్లరు. బడి తమదన్న భావన.. ఉపాధ్యాయుల అంకితభావం వెరసి పదో తరగతిలో ఉత్తమ మార్కులు తోడు ఆటల్లోనూ రాష్ట్రస్థాయిలో తలపడుతున్నారు.
వాహన చోదకుడి నిద్రమత్తు అదే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది. మరో ఇద్దరిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాల్జేసింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు వేగంగా ఢీకొంది.
సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని దొరవారిసత్రం మండలం చందనంమూడి చెరువు, ఆనేపూడి, ఏకొళ్లు తదితర ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. కొంత స్థానిక లేఔట్లకు వినియోగిస్తుండగా మరికొంత పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు.
జిల్లాలో మామిడి ధరలు ప్రస్తుతం మిడిమిడిగానే కొనసాగుతున్నాయి. చిత్తూరు, బంగారు పాళ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని మామిడి కాయల యార్డుల్లో మామిడి వ్యాపారం కాస్తా జోరందుకుంది.
జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ మొదలైంది.. ముఖ్యమైన శాఖల జిల్లా అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు స్థానచలనం కల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇస్తున్నారు..
జల వనరుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమృత్ సరోవర్ కార్యక్రమం ద్వారా కొత్త చెరువుల నిర్మాణంతోపాటు ప్రస్తుతమున్న వాటినీ అభివృద్ధి చేస్తోంది.
తెదేపా గంగాధరనెల్లూరు నియోజకవర్గ బాధ్యుడిగా కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన డాక్టర్ థామస్ను నియమిస్తూ అధినేత చంద్రబాబు గురువారం ప్రకటించారు.