శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిచ్చే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
రైతుల పక్షాన తాము నిలబడుతున్నామని, చంద్రబాబు ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడం, శుక్రవారం సాక్షి ప్రధాన పత్రికలో ఆయన కొన్ని ప్రశ్నల్ని అడగడంపై జిల్లా రైతుల్లో చర్చ నడుస్తోంది.
ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, హైదరాబాద్కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) సంస్థల మధ్య విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో మెగా పేరంట్స్ డే పండగ వాతావరణంలో నిర్వహిస్తుంటే.. పిల్లలు తల్లిదండ్రులతో ఆనందంగా గడిపారు. ఇందుకు భిన్నంగా స్థానిక గురుకుల గిరిజన సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయులు అరటి పండ్ల ట్రేలు మోయించారు.
భద్రత, సేవల్లో పారదర్శకత కోసం సీసీ కెమెరాల పర్యవేక్షణ సాధారణమైతే.. ఆ బ్యాంకులో రాజకీయ కక్ష సాధింపులకు వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పొట్టకూటి కోసం భవన నిర్మాణ కార్మికులు నిత్యం సాహసాలు చేస్తున్నారు. సదుపాయాలు, సౌకర్యాలు, భద్రత గురించి ప్రశ్నిస్తే మళ్లీ పనికి పిలవరనే భయం వారితోపాటు వారి కుటుంబాలను అగాథాల్లోకి నెడుతోంది.
వైకాపా ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో భారీగా అక్రమాలు జరిగాయి.. ఇళ్ల నిర్మాణాలు జరగకపోయినప్పటికీ అప్పటి వైకాపా నేతల ఆదేశాలతో విద్యుత్తు సంస్థ కోట్లాది రూపాయలు వ్యయం చేసి విద్యుత్తు లైన్లు, నియంత్రికలు అమర్చింది.
రోడ్డు ప్రమాదం ఓ వ్యాపారిని జీవన్మృతుడిగా మార్చేసింది.. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం అంత విషాదంలోనూ అవయవదానానికి ముందుకు రావడంతో ఎనిమిది మందికి ప్రాణదానం చేసినట్లయింది.
విజిలెన్స్ అధికారులమంటూ ఓ వీఆర్వో ను బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి ఓ డమ్మీ తుపాకీ, ఐదు సెల్ఫోన్లు, రూ.1.26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో(మెప్మా) రిసోర్స్ పర్సన్లకు(ఆర్పీ) కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వైకాపా పాలనలో వీరు మూడేళ్లు మాత్రమే విధుల్లో ఉండాలని నిబంధన పెట్టారు.
పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదాయంలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాల (బంగారు కుటుంబాలు)ను ఆర్థికంగా వృద్ధి చెందిన 10 శాతం మంది (మార్గదర్శులు) ఆగస్టు 15 నాటికి దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
నగరాన్ని పట్టిపీడిస్తున్న భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూడీఎస్)కు త్వరలో మోక్షం లభించనుంది. దీన్ని ఆధునికీకరించేందుకు రూ.330 కోట్లు అవసరమని నగరపాలిక ఇంజినీరింగ్ విభాగం ఇప్పటికే అంచనాలు రూపొందించింది.
ఎర్రచందనం స్మగ్లర్ల ఎత్తుగడలను అధికారులు చిత్తు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వాహనాలకు పోలీసు స్టిక్కర్తో సరిహద్దులు దాటించేందుకు యత్నిస్తూ అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు.
వరకట్న వేధింపులకు మూడు నెలల గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. సూళ్లూరుపేట మండలం నాదెండ్లవారికండ్రిగలో గంథవల్లి రవి కుటుంబం నివాసముంటోంది.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో చేసింది ఏదైనా ఉందంటే అది నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) రూ.14.50 లక్షల కోట్లు రద్దుచేసి పదిశాతం వాటాలు దండుకోవడమేనని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఆరోపించారు.
రైతుల కన్నీరు తుడిచేందుకు వచ్చిన వైకాపా నాయకులు, దగాపడ్డ రైతులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, వారు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు భూమా కరుణాకర్రెడ్డి అన్నారు.
జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటనలో అంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్పై జరిగిన దాడిలో జీడీనెల్లూరుకు చెందిన వినోద్, చిత్తూరుకు చెందిన చక్రిని గురువారం అదుపులోకి తీసుకున్నామని సీఐ శ్రీనివాసులు గురువారం రాత్రి తెలిపారు.
Bandi Sanjay On TTD Staff: టీటీడీలోని అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతో పాటు పురాతన ఆలయాలను టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు.