వైకాపా హయాంలో కుప్పం నియోజకవర్గంలో 2,934 మంది రైతులకు చెందిన 4,484 సర్వే నంబర్లలోని 3,673.36 ఎకరాలను మిగులు భూముల జాబితాలో చేర్చి మూడేళ్లు కర్షకులకు చుక్కలు చూపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు.
అర్ధగిరి శ్రీవీరాంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, 9 గంటలకు ఆంజనేయస్వామి ఇరుముడి పూజ, మాల విసర్జన, ఇరుముడి చెల్లింపు నిర్వహించారు.
ఉపాధ్యాయుల బదిలీ జాతర ప్రారంభమైంది. ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు గడువు ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ, జిల్లా.
ప్రయాణికుల సేవే పరమావధి అని ఆర్టీసీ అధికారులు గొప్పలు చెబుతున్నారు. అయితే ఆర్టీసీ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. సేవాలోపాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలని జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లలో ఏర్పాటు చేశారు.
అల్పపీడన ప్రభావంతో జిల్లా వరి రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి పంట చేతికందే సమయంలో వర్షాలు కురిస్తే పంటలు మునిగిపోతాయని అన్నదాతల గుండెల్లో దడ మొదలైంది. అకాల వర్షం, అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
తిరుమల శ్రీవారి దర్శనం వేగవంతంగా జరిగేందుకు తితిదే ఏఐ సాంకేతికత వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బోర్డు తీర్మానం మేరకు తితిదే ఈవో జె.శ్యామలరావు కార్యచరణను వేగవంతం చేశారు.
సాంకేతికత.. అన్నీ రంగాల్లో తనదైన ప్రాభవాన్ని చాటుతోంది. కష్టతరంగా చేసే పనులన్నీ విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా తిరుపతి ఐఐటీ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పలు పరిశ్రమలు, పరిశోధన సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకుంటూ గుర్తింపు పొందుతోంది.
తితిదే అనుబంధ వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం రాత్రి సర్వాలంకార భూషితుడైన స్వామివారు శ్రీనివాసుని ఆవతారంలో సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి గ్రామవీధుల్లో విహరించారు.
వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు పట్టుబడిన దొంగల వివరాలు గురువారం వెల్లడించారు.
పిల్లలూ.. మీరున్న కాలనీలో సమస్యలు ఉన్నాయా... వంగిన విద్యుత్తు స్తంభాలు కనిపించాయా.. నియంత్రికల వద్ద రక్షణ లేదా.. మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోయిందా.. దోమల బెడద ఎక్కువగా ఉందా.. వీధి దీపాలు వెలగట్లేదా.. ఇలాంటివన్నీ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదా..
పురపాలక సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా ప్రభుత్వం ఆస్తి పన్ను మదింపు చేయాలని నిర్ణయించింది. పట్టణాల్లో ఇబ్బడిముబ్బడిగా కట్టడాలు వెలుస్తున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు పొందింది కొంత వరకైతే..
తిరుపతిలోని గరుడ వారధిపై భక్తులకు సమస్యలు స్వాగతిస్తున్నాయి. రామానుజకూడలి నుంచి తిరుచానూరుకు వెళ్లే మార్గంలో వారధిపై డివైడర్ మధ్యలో ఉన్న రేడియం స్టిక్కర్ ఉన్న గ్రీన్ స్టాండ్స్ విరిగిపోయింది.
తిరుమల తరహాలో కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో ఉచిత సేవకుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అధికారులకు సూచించారు. ఇటీవల ఆలయ అభివృద్ధి, ఇతర విషయాలపై.
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనతో విద్య, వైద్య, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలను కోల్పోయి చిత్తూరు అనాథగా మిగిలింది. ఇప్పుడు ప్రజల అభ్యర్థనలు, పరిపాలనా సౌలభ్యం పేర్లతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిత్తూరు మరింత చిన్నబోయేలా ఉంది.
అటు షార్.. ఇటు శ్రీసిటి.. మరోవైపు రాష్ట్ర సరిహద్దు. ఇంతటి కీలకమైన సూళ్లూరుపేటలో రైల్వే స్టేషన్ను ‘అమృత్ భారత్’ కింద ఆధునికీకరించారు. రూ.14.50 కోట్లతో కొత్త సొబగులతో, ప్రయాణికులకు అన్ని వసతులతో ఆధునికీకరించిన ఈ రైల్వే స్టేషన్ను గురువారం వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించగా.. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేరుగా ప్రారంభోత్సవం చేశారు.
రెవిన్యూశాఖలో బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీఅయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాస్థాయిలో జరుగనున్న ఈ బదిలీలకు కలెక్టర్ సుమిత్ కుమార్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
‘ఇప్పటికే పత్రికాపరంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాం. అదే తరహాలో మరో అడుగు ముందుకు వేసి ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి పునాది వేశాం. ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం.
అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం జిల్లాస్థాయి మహానాడును నిర్వహించారు.
తిరుమలలోని జపాలి హనుమాన్కు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ పండితులు, అధికారులు ఛైర్మన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Tirumala: తిరుమలలో అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. నిత్యం స్వామివారి చెంత కళ్యాణం చేసుకుని వచ్చే భక్తులతో కళ్యాణ వేదిక ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది.