వనితా సాధికారతే లక్ష్యంగా, అందరి సంకల్పంగా రెండురోజుల పాటు శ్రీవారి పాదాల చెంత నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సు విజయవంతమైంది. ఈ తొలి జాతీయ సదస్సు దేశవ్యాప్తంగా మహిళలకు ఓ భరోసాను కల్పించిందనే నమ్మకం ప్రతినిధుల్లో మాటల్లో వ్యక్తమైంది. సదస్సు లక్ష్యం నెరవేరిందన్న సంతృప్తి అతిథుల్లో కనిపించింది.
సెలవులు, పండుగల నేపథ్యంలో నగర, పట్టణవాసులు ఊర్లకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు ఇళ్లను దోచేస్తుంటారు. తర్వాత లబోదిబో అంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు
ఓ వినూత్న ఆలోచన చాలు.. మీరెవరు ఏం చేస్తున్నారన్నది కాకుండా మీలోని ప్రతిభను వెలికితీసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది స్వయంఉపాధికి బాటలు వేస్తోంది తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీ.
ఇంటికి దీపం.. సృష్టికి మూలమైన మహిళల ఆరోగ్యంతోనే అభివృద్ధికర భారతావని సాధ్యమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే మహిళల ఆరోగ్య సంరక్షణకు ‘స్వాస్థ్ నారీ సశక్త్.. పరివార్ అభియాన్’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేసీ విద్యాధరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్లో వివిధ సమస్యలపై 339 వినతులు అందాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సోమవారం స్థానిక అన్నమయ్య భవనంలో ఎస్పీ సుబ్బరాయుడు, తితిదే సీవీఎస్వో మురళీకృష్ణతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
మహావిష్ణువు ఆది అవతారమైన మత్స్య రూపంతో సోమకాసురుడిని సంహరించి బ్రహ్మకు వేదాలు అప్పగించిన ఘన చరిత్ర నాగలాపురం గ్రామం సొంతం. వేదనారాయణుడిగా శ్రీహరి స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రంలో ఆలయాన్ని పల్లవ రాజులు తొలుత నిర్మించగా.. శ్రీకృష్ణదేవరాయలు 1517లో పునర్ నిర్మించారు. ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయం 1967లో తితిదేలో విలీనమైంది
ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని టీటీీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
తిరుమల రాజకీయ నిరుద్యోగి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల పవిత్రత దెబ్బతిన్నేలా ప్రతిరోజు అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
టీటీడీ సమావేశంలో పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకోనుంది. శ్రీవారి నిధులతో పలు ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయింపుపై పాలకమండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
వికసిత భారత్ సాధించాలంటే.. మహళల ఆర్థిక సాధికారత కీలకం. ఈ దిశగా అడుగులు వేసేలా రెండు రోజులపాటు తిరుపతిలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సు దోహదపడింది.