‘పెనుమూరులోని మహిళా మార్టు కోసమని మా దగ్గర తీసుకున్న డబ్బులు ఏమయ్యాయి. ప్రతి ఏడాదీ లాభాల్లో వాటా ఇస్తామన్నారు. మూడేళ్లవుతున్నా మా డబ్బుల సంగతి చెప్పడం లేదు. ప్రతినెలా ఒక్కో మహిళ వెయ్యి రూపాయలకు సరుకులు కొనాలని నిబంధన పెట్టి మరీ కొనిపించారు’ అంటూ మంగళవారం మహిళలు వెలుగు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు
తిరుపతిలో సోమవారం సైకో వీరంగంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరునగరిలో భిక్షగాళ్లు, మతిస్థిమితం లేని వ్యక్తులు, సైకోల ఏరివేతకు ఎస్పీ హర్షవర్ధన్రాజు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
‘మంత్రి పీఏ చెప్పారు కదా.. ఇక్కడ కూడా షాపు ఇవ్వండి.. లేదంటే నేను సీఎం పీఏగా వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు నా అవసరం ఉంటుంది’ అంటూ గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజులుగా ఓ మహిళా వైద్యాధికారిణిపై ఒత్తిడి చేస్తున్నారు.
సాధారణంగా నాలుగు, ఆరు చక్రాల లారీలను చూస్తుంటాం... అప్పుడప్పుడూ పది, పదహారు చక్రాల లారీలనూ చూసుంటాం. కానీ మంగళవారం తడలో 50 చక్రాల లారీ అందరినీ ఆకర్షించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కెలా నుంచి తడ మీదుగా చెన్నైకు భారీ ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్తున్న 50 చక్రాల చక్రాల లారీ తడలో కొంతసేపు ఆగింది.
రాజకీయ లబ్ధికోసమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారని, ఆయన పర్యటనతో రైతులకు ఎలాంటి లాభం లేదని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్ అన్నారు.
వైఎస్ జగన్ పర్యటనలో సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు పోతున్నా, పోలీసులకు గాయాలవుతున్నా, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. జగన్ ఎదుట బలాన్ని నిరూపించుకోవడానికి జిల్లా నేతలు తాపత్రయపడుతున్నారు. ఓవైపు పోలీసులు 500 మందికి మించకుండా ఉండాలని సూచనలు చేస్తున్నప్పటికీ వాటినేమి పట్టించుకోని వైసీపీ నేతలు జనాలను తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ బంగారుపాళ్యం పర్యటన నేపథ్యంలో జిల్లా వైసీపీ నేతల మధ్య పొరపొచ్చాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. బంగారుపాళ్యం మండలం పూతలపట్టు నియోజకవర్గంలోకి వస్తుండడంతో మొత్తం ఖర్చును అక్కడి ఇన్చార్జి సునీల్కుమార్ భరించాలని తొలుత ‘బడా’ నాయకుడు సూచించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యే కానని, అంత మొత్తం భరించలేనని ఆయన వివరణ ఇచ్చుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
రామకుప్పం మండలంలోని 89పెద్దూరు గ్రామ సమీప తోటలపై సోమవారం రాత్రి ఆరు ఏనుగుల మంద స్వైరవిహారం చేసింది. తమిళనాడు అడవుల నుంచి వి.కోట మండలం నాయకనేరి అడవుల మీదుగా వచ్చిన ఏనుగులు 89పెద్దూరు గ్రామానికి చెందిన పలువురి అరటి, టమోటా, మామిడి తోటలపై దాడులు చేసి.. విధ్వంసం సృషించాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. దీంతో వైసీపీ ప్రతిపక్ష హోదా సైతం పొందలేదు. ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అలాంటి వేళ.. వైఎస్ జగన్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.
శాసనసభ్యుల వ్యక్తిగత సహాయకులు (పీఏ) నిర్దేశించిన పనులకే పరిమితం కావాలి. వారి రోజువారీ కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రజలు అర్జీలు ఇస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపాల్సిన బాధ్యత వారిదే.
కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి పెద్దపంజాణి మండలం కొలత్తూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మి.. పెట్రోల్ బాటిళ్లతో రావడం కలకలం సృష్టించింది.
స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో టికెట్ల మాయాజాలంతో భక్తులను మోసగించి బ్యాంకు సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఆలయంలోని ప్రసాదాల కౌంటర్ ఎదురుగా భక్తుల సౌకర్యార్థం టికెట్ల కౌంటర్ ఏర్పాటు చేశారు.
పదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి చిత్తూరు పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.సోమల మండలం చింతలవారిపల్లెకు చెందిన రామకృష్ణ (46) 2020 జూలై 20వ తేదిన ఓ చిన్నారి స్నేహితులతో ఆడుకుంటుండగా చాక్లెట్ కొనిపెడతానంటూ మాయమాటలు చెప్పి ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.