హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు ఈరోజు (మంగళవారం) ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు.
తిరుపతి SVUలో మరోసారి ర్యాగింగ్ అంశం సంచలనమైంది. సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్కు గురిచేసినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై HODకి ఫిర్యాదు చేస్తే.. 'ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు'అంటూ..
ర్యాగింగ్పై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.
రేణిగుంట మండల కేంద్రంలోని దాదాపు మూడువేల మందికి వైకాపా హయాంలో ఇంటి పట్టాలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఈ మండలంలోని పాగలిలో స్థలాలు ఇస్తామని చెప్పినా ఎక్కడెక్కడ ఎవరెవరికి కేటాయించారో స్పష్టం చేయలేదు.
పల్లె పాలనలో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది.. క్లస్టర్ వ్యవస్థతోపాటు గ్రేడ్-4, 5 పంచాయతీలు రద్దుచేసి గ్రేడ్-3కే పరిమితం చేసింది.. గ్రామ సచివాలయ వ్యవస్థను వాటికి అనుసంధానం చేసి.. స్వతంత్ర పాలనా యూనిట్లుగా పంచాయతీలను ప్రకటించి సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టింది.
శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో కొన్నాళ్లుగా చెంగుచెంగు మంటూ గంతులేసిన జంట వాలబీలు ఇక్కడి సందర్శకులకు ప్రత్యేక అనుభూతులు మిగిల్చియి. అచ్చం కంగారూలను పోలిఉండే ఎర్రమెడ వాలబీల జంటను గుజరాత్ రాష్ట్రంలోని రాధేకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆగస్టు 27న ఇక్కడ అప్పగించింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గుట్కా క్రయవిక్రయాలు చాపకింద నీరులా సాగుతున్నాయి. ప్రతి దుకాణంలో అమ్మకాలు.. కర్ణాటక నుంచి జిల్లాలోకి యథేచ్ఛగా సరఫరా అవుతున్నా.. అధికారులు నామమాత్రం తనిఖీలు నిర్వహించి చెక్పోస్టులు దాటిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు.
నిత్యం విద్యార్థులకు పాఠాల బోధనలో తలమునకలయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆటవిడుపుగా, మానసికోల్లాసం, శారీరక దృఢత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆటల పోటీలు నిర్వహిస్తోంది. ఈనెల 15వ తేదీ నుంచి మండల స్థాయిలో ఈ క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు.
బాలికల ఆత్మరక్షణ కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కరాటేలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. బాలికల్లో మనోధైర్యం పెంపొందించడం, శరీర దారుఢ్యం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం,
రేషన్కార్డుదారులు నిత్యావసర సరకులు చౌకదుకాణాల ద్వారా పొందడానికి ఈ-కేవైసీ చేయించుకోవాలి. కార్డులో ఎంతమంది ఉంటే అందరూ వేలిముద్ర వేయాలి. ఈ విషయాన్ని రేషన్ డీలర్లు ఎంతగా ప్రచారం చేసినా వినియోగదారులు పట్టించుకోవడం లేదు.
ఎక్కువ దూరం ప్రయాణించాలంటే విద్యుత్తు వాహన చోదకులకు ఒకటే భయం. ఛార్జింగ్ అయిపోయి ఎప్పుడు వాహనాలు ఆగిపోతాయోనని ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే వాహనాల వినియోగం పెరిగినంతగా ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడమే అందుకు కారణం.
నిత్యం పుస్తకాలతో కుస్తీపడుతూ సాంకేతిక పరిశోధనలపై దృష్టి సారించే ఐఐటీ విద్యార్థుల్లో మానసికోల్లాసం కలిగించేందుకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు తిరుపతి, హైదరాబాద్, మద్రాస్ ఐఐటీలు సంయుక్త వేదికలు కానున్నాయి.