తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఐ- బొమ్మ కేసుకు సంబంధించి నిందితుడు ఇమంది రవి నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సైబర్క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.
కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ చిన్నారుల ఎదుట అశ్లీల నృత్యాలు చేయడంపై జిల్లా ఎస్సీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు అజయ్ కుమార్ అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు.
జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి.. దోపిడీకి యత్నించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు సకాలంలో చేరుకోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
హబ్సిగూడలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక (14) ఈరోజు తెల్లవారు జామున ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
దమ్ముంటే పట్టుకొమ్మంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి ఒకానొక సమయంలో భయపడ్డాడా... విదేశాల్లో ఉన్నా తన చుట్టూ ఎవరో తిరుగుతున్నారని ఆందోళనకు గురయ్యాడా... పోలీసులకు మస్కా కొట్టగలననే అతి విశ్వాసంతో హైదరాబాద్కు వచ్చి చిక్కాడా... ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది.
మద్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఇద్దరు భార్యలు. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవక్కపేట్లో సోమవారం వెలుగు చూసింది.
అమెరికా జాతీయులను లక్ష్యంగా చేసుకుంటూ నడిపిన అక్రమ కాల్ సెంటర్ల కేసుకు సంబంధించి కీలక నిందితుడు వికాస్ కుమార్ నిమర్ను సీబీఐ అరెస్టు చేసినట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో ప్రజల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ‘జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తమిళనాడులో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు... తెన్కాశి నుంచి శ్రీవిల్లిపుత్తూరుకు సోమవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బయల్దేరింది.