వేడి సాంబారు గిన్నెలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాములలో ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్కి గ్రామానికే చెందిన మదిరి ప్రవీణ్కుమార్ దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తె ప్రేరణతో కలిసి వెళ్లారు.
అక్రమంగా నగదు లావాదేవీలు, సొమ్ము బదిలీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వింజో గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ.527 కోట్ల విలువైన చరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు.
దేశ భద్రతా రహస్యాలను పాకిస్థాన్కు చేరవేశారన్న కేసులో నేరం రుజువు కావడంతో మరో ఇద్దరు నిందితులకు 71 నెలల చొప్పున సాధారణ జైలుశిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది.