చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. కదులుతున్న రైలులో గర్భిణిపై లైంగిక దాడి చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సదరు మహిళ ప్రతిఘటించగా.. రైలు నుంచి ఆమెకు బయటకు తోసేశాడు. దీంతో, సదరు గర్భిణి తీవ్రంగా గాయపడగా.. ఆమెకు ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరుకు చెందిన రేవతి(36) తమిళనాడులో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి. ఈ క్రమంలో చిత్తూరులో ఉన్న ఆమె తన తల్లి వద్దకు వెళ్లిందుకు గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. బాధితురాలు రైలులోకి మహిళల కోచ్లో కూర్చుంది. తాను కోచ్లోకి ఎక్కిన సమయంలో ఆమె పాటుగా మరికొందరు మహిళలు కూడా ఉన్నారు.కాగా, రైలు జోలార్పేట రైల్వే స్టేషన్కు చేరుకోగానే కోచ్లో మహిళలు అందరూ దిగిపోగా రేవతి ఒక్కరే ఉన్నారు. ఆ స్టేషన్లోనే నిందితుడు హేమరాజ్(27) మహిళల కోచ్కి ఎక్కాడు. రైలు ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే హేమరాజ్ కోచ్లోకి ప్రవేశించాడు. ఇక, కోచ్లోకి ఒంటరిగా ఉన్న రేవతిని నిందితుడు చూశాడు. కోచ్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కానీ, రేవతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో, ఆవేశానికి లోనైన నిందితుడు.. రేవతిపై దాడి చేసి ఆమెను కదులుతున్న రైలులో నుంచి బయటకు తోసేశాడు. ఈ క్రమంలో రేవతి.. చేతులు, కాళ్లు, తలపై తీవ్ర గాయాలయ్యాయి.🚨A 4 month pregnant woman traveling alone in the ladies' compartment of the Coimbatore-Tirupati Intercity Express was molested and pushed out of the moving train near Vellore, Tamil Nadu. The suspect, Hemaraj has been arrested.pic.twitter.com/huAiRFEiKn— Trend_X_Now (@TrendXNow) February 7, 2025ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు రేవతిని వెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హేమరాజ్ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గతంలో కూడా హత్య, దోపిడీ కేసులో అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. Fri, Feb 7 2025 1:43 PM
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. అక్కడి ఇంద్రావతి నేషనల్ పార్క్లో ఆదివారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఇంద్రావతి ఏరియా కమిటీలు ఒకేచోట సంచరిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీనితో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ఫోర్స్లకు చెందిన జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటలకు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్పూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వా«దీనం చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణ నేతలు? ఛత్తీస్గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ షెల్టర్ తీసుకోగా, ఇంద్రావతి ఏరియా కమిటీ రక్షణగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీనితో వివిధ భద్రతా దళాలకు చెందిన 650 మందికిపైగా జవాన్లు వేర్వేరు దిశల నుంచి శుక్రవారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. శనివారం రాత్రికల్లా మావోయిస్టులు బస ప్రదేశాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఎన్కౌంటర్ మృతుల్లో ఎక్కువ మంది జనమిలీషియా సభ్యులే ఉన్నట్టు సమాచారం. వారితోపాటు తెలంగాణ కమిటీకి చెందిన కీలక నేత కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మొదలైతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. టార్గెట్ చేసి.. రెండో సారి.. భద్రతా దళాలు కొన్ని నెలలుగా మావోయిస్టు తెలంగాణ కమిటీ టార్గెట్గా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవులను జల్లెడపట్టడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలినవారు తప్పించుకున్నారు. ఆ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి తెలంగాణ కమిటీ లక్ష్యంగా ఇంద్రావతి నేషనల్ పార్క్లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దండకారణ్యంపై భద్రతా దళాల పట్టు మావోయిస్టులు స్థాపించిన జనతన సర్కారుకు దండకారణ్యమే కేంద్ర బిందువుగా నిలిచింది. కానీ గడిచిన ఏడాదిలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని క్రమంగా తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంటున్నాయి. గత ఏడాది చివరిలో కొండపల్లిలో భద్రతా దళాల క్యాంపు ఏర్పాటైన తర్వాత.. దండకారణ్యం తమకు సురక్షితం కాదని మావోయిస్టులు నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న వివిధ కమిటీలు, దళాలకు చెందిన కీలక నేతలు సమీపంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు తరలివెళ్లినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. టైగర్ రిజర్వ్లపై ఫోకస్ ఇంద్రావతి నేషనల్ పార్క్ 2,779 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీన్ని 1983లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. మావోయిస్టుల అడ్డాలైన అబూజ్మడ్, దండకారణ్యం మధ్య ఈ అడవి వారధిగా నిలిచింది. ఇందులో సగానికిపైగా మావోయిస్టుల ఆ«దీనంలోనే ఉంది. ఫారెస్టు గార్డులు కూడా అక్కడ కాలు పెట్టలేని పరిస్థితి ఉందని అంటారు. ఇలా టైగర్ రిజర్వులలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులపై కొన్నేళ్లుగా భద్రతా దళాలు ఫోకస్ చేశాయి. ఇంతకుముందు ఉదంతి – సీతానది టైగర్ రిజర్వ్లో భాగంగా ఉన్న ఘరియాబండ్ అడవుల్లో జనవరి 24న జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సహా 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు ఇంద్రావతి రిజర్వు ఫారెస్ట్లో ఏకంగా 31 మంది మృతి చెందారు. గడువు కంటే ముందే మావోయిస్టుల అంతం: అమిత్షామావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్కు ‘ఇంద్రావతి’తో భారీ విజయం దక్కిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గడువుగా పెట్టుకున్న 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నారు. ఎన్కౌంటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆ జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా దళాలకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయన్నారు.40 రోజుల్లో 81 మంది మృతిఛత్తీస్గఢ్లో ఈ ఏడాది మొదలైన 40 రోజుల్లో 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. అందులో 65 మంది బస్తర్లో జరిగిన ఘటనల్లో కన్నుమూశారు. గతేడాది ఛత్తీస్గఢ్లో 217 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. Mon, Feb 10 2025 12:56 AM
తిరుపతి: తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిందో మహిళ. తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ పేర్కొంది. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాను అప్పు చేసి నగలు తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని ఇచ్చానని స్పష్టం చేసింది.‘నావద్ద నుంచి తిరుపతి జనసేన ఇన్చార్జ్గా ఉన్న కిరణ్ రాయల్ అనే వ్యక్తి కోటి 20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ీతీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. నేను కూడా అప్పు చేయడమే కాకుండా ఉన్న నగల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును తెచ్చాను. రూ. 30 లక్షలు ఇచ్చేందుకు ాబాండ్స్, ెచెక్ రాసిచ్చాడు. నన్ను బెదిరించి, భయపెట్టి వీడియో తీసుకున్నారు. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ల వద్ద నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి. నాకు చావే శరణ్యం’ అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది లక్ష్మి అనే మహిళ. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాసేపటికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమెకు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సీఐపై భార్య ఫిర్యాదు Sat, Feb 8 2025 6:01 PM
శాలిగౌరారం: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతోపాటూ మరో మహిళను రెండో వివాహం చేసుకుని తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ఆబిడ్స్ సీఐ నర్సింహపై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం బండమీదిగూడెంకు చెందిన కప్పల సోమలింగయ్య–అంజమ్మ కుమార్తె సంధ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన కుంభం నర్సింహకు 2012 లో వివాహం జరిగింది. నర్సింహ ప్రస్తుతం హైదరాబాద్లోని ఆబిడ్స్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు.వివాహ సమయంలో కట్నకానుకలు మొత్తం అప్పజెప్పారు. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడని సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. తట్టుకోలేక 2024 జూన్లో తల్లిగారింటికి వచ్చి తన భర్తపై 2024 డిసెంబర్18న నల్లగొండ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానంది. అక్కడ చర్యలు తీసుకోకపోవడంతో 2024 డిసెంబర్ 24న శాలిగౌరారంలో ఫిర్యాదు చేశానంది.ఇదిలా ఉండగా హైదరాబాద్లోని సరూర్నగర్లో గల తన కుమార్తెను చూసేందుకని ఈ నెల 4న పాఠశాలకు వెళ్లి తన కూతురిని తల్లిగారింటికి తీసుకుని వచ్చానని తెలిపింది. దీంతో తన కుమార్తె కిడ్నాప్నకు గురైందని నర్సింహ సరూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సరూర్నగర్ ఎస్ఐ మారయ్య, ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి, మహిళా హెడ్కానిస్టేబుళ్లు శుక్రవారం బండమీదిగూడెం వచ్చి తనను విచారించి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారని సంధ్య తెలిపింది.చదవండి: డబ్బులు ఇచ్చి.. భర్త కాళ్లు విరగ్గొట్టించిన భార్య ఈ విషయమై ఆబిడ్స్ సీఐ నర్సింహ వివరణ కోరగా, తన భార్యతో గొడవలు జరుగుతున్నాయిని దీంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించానని తెలిపారు. ప్రస్తుతం తమ కేసు కోర్టులో ఉందన్నారు. Sat, Feb 8 2025 5:23 PM
Hyderabad ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ట్రావెల్ నిర్వహాకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
Hyderabad రోడ్డు ప్రమాదంలో చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళినా... అందరి గుండెల్లో కలకాలం నిలిచిపోయింది ఓ డాక్టర్. తను మరణిస్తూ మరో ఐదుగురి భవిష్యత్కు కొత్త బాటలు వేసింది యువ డాక్టర్ నంగి భూమిక రెడ్డి.
Child Dies ట్యూషన్కు వెళ్తున్న తన అన్నకు బాయ్ చెప్తూ.. ఓ ఏడాదిన్నర చిన్నారి రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
School Girls Hanging From Tree స్కూల్ డ్రెస్లో ఉన్న బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. స్కూల్లో చదువుతున్న ఆ ఇద్దరు బాలికలు రెండు రోజుల కింద అదృశ్యమైనట్లు వారి తల్లిదంద్ర
చిలకలగూడ,హైదరాబాద్: చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచింది కట్టుకథేనని పోలీసులు తేల్చేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో కుమారుడు యశ్వంత్ కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుండగా.. వద్దని వారించేందుకు అడ్డొచ్చిన తల్లిని పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, స్థానికులు అందించిన కీలక సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఇది వేరే వారి పని కాదని, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలే కారణమని నిర్ణయించి అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన తల్లి రేణుక తన ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేయగా, తల్లి రేణుక, పెద్ద కుమారుడు యశ్వంత్లకు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమారు 150 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా దుండగులకు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు లేవని స్థానికులు స్పష్టం చేశారు. గట్టిగా కేకలు వినిపించడంతో వెళ్లిచూడగా లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉందని, కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరుచుకోగా రేణుక, యశ్వంత్ ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని, అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. వినియోగించిన చాకు ఫోరెన్సిక్ ల్యాబ్కు.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వివాహం కాకపోవడం తదితర సమస్యలో తల్లి రేణుక కుమారుడు యశ్వంత్ల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని తెలిసింది. మూడు నెలలుగా యశ్వంత్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అతను.. కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యకు యతి్నంచగా, అడ్డుకున్న తల్లిని కూడా పొడిచినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ ఘటనలో వినియోగించిన చాకును పోలీసులు స్వా«దీనం చేసుకుని ఫింగర్ప్రింట్స్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు సమాచారం. బాధితుడే.. నిందితుడు... ఈ ఘటనలో బాధితుడే నిందితుడు కావడం గమనార్హం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యశ్వంత్ను బాధితుడిగా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు నిందితుడిగా చేర్చనున్నారు. ఆత్మహత్యా యత్నంతో పాటు తల్లిని చాకుతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినందుకు యశ్వంత్పై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసును తప్పుదారి పట్టించేలా వ్యవహరించిన యశ్వంత్ సోదరులు యశ్పాల్, వినయ్లపై కూడా కేసులు నమోదు చేసేందుకు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నట్లు తెలిసింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేణుక, యశ్వంత్లు కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వీరు పూర్తిగా కోలుకున్న తర్వాత వాంగూల్మం నమోదు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. Sat, Feb 8 2025 9:25 AM
గద్వాల క్రైం: ట్రాన్స్జెండర్తో ప్రేమ వ్యవహారం చివరికి ప్రాణాల మీదకు తెచ్చింది. ట్రాన్స్జెండర్ను ప్రేమించి చివరకు పురుగుమందు తాగి బలవనర్మణానికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. మృతుడి తల్లి శంకుతుల, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు... గద్వాల పట్టణంలోని చింతలపేటకాలనీకి చెందిన బోయ నవీన్(25) అనే యువకుడు, ట్రాన్స్జెండర్(రవి అలియాస్ పల్లవి) ఇద్దరు స్నేహితులు. కాగా వారిద్దరు ఇటీవలే ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు గుర్తుగా నవీన్ తన చెస్ట్ (ఎడమ వైపు) ట్రాన్స్జెండర్ పల్లవి(రవి) టాటును సైతం వేయించుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు సిఫార్సు చేశారు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజులుగా అందించినా పరిస్థితి మెరుగు పడకపోలేదు. చేసేదేమీ లేక గురువారం రాత్రి తిరిగి గద్వాల ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా.. ఇక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈ విషయం ప్రస్తుతం గద్వాల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అయితే మృతుడి రెండు కాళ్లు, తోడలు, సున్నితమైన ప్రదేశాల్లో గాయాలు ఉన్నాయి. గాయాలను పరిశీలిస్తే వేడి చేసిన వస్తువుతో వాతలు పెట్టినట్లు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. దీంతో మృతుడి తల్లి తన కుమారుడు పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోలేదని, చిత్రహింసలు పెట్టారని అనుమా నం వ్యక్తం చేసింది. ఈమేరకు ట్రాన్స్జెండర్ పల్లవి అలియాస్ రవి, నరేష్ పై ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపారు. పక్కా వ్యూహ రచనతోనే? ట్రాన్స్జెండర్ (పల్లవి) రవి, నవీన్లు ఇద్దరూ గతంలో చింతలపేటకాలనీలోనే ఉండేవారు. కొన్నేళ్ల క్రితం రవి కాలనీ వదిలి వెళ్లిపోయి ట్రాన్స్జెండర్గా మారి పట్టణ శివారులో హమాలీ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకున్నాడు. నవీన్ జిల్లాకేంద్రంలోని ఓ ఫైనాన్సియర్ వద్ద కలెక్షన్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఈ క్రమంలో పల్లవితో నవీన్ ప్రేమలో పడ్డాడు. ఈ నేపథ్యంలో పల్లవిని డబ్బులు యాచించేందుకు బయటికి వెళ్లొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఈనెల 4న అర్ధరాత్రి వేళ నవీన్ను పల్లవి (రవి) తమ్ముడు నరేష్ ఇంటి వద్దకు వచ్చి స్కూటీపై ఎక్కించుకు వెళ్లిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోలు సైతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో పక్కా వ్యూహరచనతోనే నవీన్ను చిత్రహింసలకు గురి చేసి హత్యచేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువురి మధ్య సంబంధాలపై ఆరా.. నవీన్ మృతిపై అతడి తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశాం. ఇరువురి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తాం. ట్రాన్స్జెండర్ పల్లవిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తాం. ఈ నెల 4న జరిగిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుటాం. – కళ్యాణ్కుమార్, పట్టణ ఎస్ఐ, గద్వాల Mettuguda Incident: అంతా కట్టుకథేనా! Sat, Feb 8 2025 12:16 PM
పంజగుట్ట: ఆస్తి కోసం ఉన్మాదిలా మారి తాతను అత్యంత పాశవికంగా పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేసిన మనవడి కేసులో పంజగుట్ట పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు కిలారు కార్తి తేజ (29)ను శనివారం అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరుకు చెందిన వి.చంద్రశేఖర జనార్దన్ రావు (86) వెలిజ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. రెండో కూతురు సరోజ భర్త వేరే ప్రాంతంలో ఉండగా.. ఆమె తండ్రితో కలిసి సోమాజిగూడలో నివసిస్తోంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మరొకరిని నియమించారని.. సరోజ కొడుకు కార్తి తేజ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి 2018లో నగరానికి వచ్చాడు. కార్తి తేజ తనకు తాత ఆస్తిలో వాటా సరిగా ఇవ్వడం లేదని, చిన్నతనం నుంచి అందర్నీ పెంచినట్లు తనను పెంచలేదని మనసులో కక్ష పెంచుకున్నాడు. ల్యాంకో హిల్స్లో స్నేహితులతో కలిసి ఉంటూ.. తాత, తల్లితో తరచూ గొడవపడుతుండేవాడు. ఇటీవల జనార్దన్ రావుకు సంబంధించిన ఒక సంస్థకు సరోజ అక్క కొడుకును బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమించడంతో కార్తి తేజ జీర్ణించుకోలేక పోయాడు. ఎలాగైనా తాతను చంపాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి 11 గంటలకు సోమాజిగూడలోని తాత జనార్దన్రావు ఇంటికి వచ్చాడు. కుర్చీలో కూర్చుని ఉన్న తాతను తన వెంట తెచ్చుకున్న కత్తితో సుమారు 60 నుంచి 70 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. జనార్దన్ రావు గట్టిగా కేకలు వేయడంతో వంటింట్లో ఉన్న కార్తి తేజ తల్లి సరోజ బయటకు వచ్చి అడ్డుకోబోగా ఆమెను కూడా కత్తితో ఆరు పోట్లు పొడిచాడు. బయట విధుల్లో సెక్యురిటీ గార్డు ఇంట్లోకి రాగా.. చంపేస్తానంటూ అతడిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. తనను అందరిలా పెంచలేదని తాతను చంపిన మనవడుమంచి వితరణశీలిగా పేరు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి జనార్దన్ రావు అప్పటికే మృతి చెందాడు. కుమారుడి చేతిలో కత్తిపోట్లను గురైన తల్లి సరోజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. జనార్దన్ రావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం ఏలూరుకు తరలించారు. శనివారం సోమాజిగూడలోని భీమా జ్యువెలరీ షాపు వద్ద సంచరిస్తున్న కార్తి తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. జనార్దన్ రావు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, టీటీడీకి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మంచి మనిషి మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. Sun, Feb 9 2025 8:48 AM
బౌద్ధనగర్,హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తి తరచూ అనుమానిస్తూ..వేధింపులకు పాల్పడడంతో భరించలేక ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బౌద్ధనగర్లోని అంబర్నగర్కు చెందిన నాగయ్య కుమార్తె ప్రవళిక (23) కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతుంది. కాలేజీ అయ్యాక సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు వారాసిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పార్ట్టైమ్ జాబ్ చేస్తుంది. కాగా నాలుగేళ్లుగా ప్రవళిక..సృజన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సృజన్ ఆమెను వేధిస్తూ వేధింపులకు దిగాడు. మరో యువకుడితో మాట్లాడుతున్నావని అనుమానించేవాడు. ఇదే విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నెల 6వ తేదీన సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని ఓ బేకరీలో ప్రవళిక, సృజన్ల మధ్య వాగి్వవాదం జరిగింది. దీంతో మరో స్నేహితుడు మధుకర్ వచ్చి ఇద్దరిని సముదాయించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రవళిక తన తండ్రి నాగయ్యకు ఫోన్ చేయగా, తాను ఫంక్షన్కు వెళ్తున్నానని ఆలస్యంగా వస్తానని చెప్పాడు. అర్థరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన నాగయ్యకు బెడ్రూమ్లో ప్రవళిక దుప్పటితో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో ప్రవళికను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రవళిక స్నేహితుడు మధుకర్..సృజన్తో ప్రేమ, గొడవల గురించి నాగయ్యకు తెల్పగా..ఆయన ఫిర్యాదు మేరకు సృజన్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Sat, Feb 8 2025 7:21 AM
బంజారాహిల్స్: ఫేస్బుక్ పరిచయం ఆమె పాలిట శాపమైంది. కువైట్లో ఉన్న ఓ వ్యక్తి ఫేస్బుక్ చాట్లో తీయటి మాటలతో ఓ వివాహితను లోబర్చుకున్నాడు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ఆమెతో శారీరకంగా కలవడమే కాకుండా ప్రైవేటు ఫొటోలను, వీడియోలను కూడా తీశాడు. ఫేస్బుక్ మెసెంజర్లో ఆ ఫొటోలను పోస్ట్ చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతుండటంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కువైట్లో ఉంటున్న కుడుపూడి ప్రసాదరావుతో నగరానికి చెందిన ఓ వివాహితకు ఫేస్బుక్లో పరిచయమైంది. ఆ తర్వాత తరచూ చాటింగ్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తన పట్ల ప్రసాదరావు కనబరుస్తున్న ప్రేమతో అతనిని నమ్మడం ప్రారంభించింది. 2020లో ఇరువురూ శారీరకంగా ఒక్కటయ్యారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ప్రసాదరావు ఆమెతో 2, 3 రోజులుగా గడిపేవాడు. డబ్బు, బంగారం ఇచ్చేవాడు. కువైట్లో ఉన్నప్పుడు ఆమెతో వీడియో కాల్లో మాట్లాడేటప్పుడు ప్రైవేటు పార్ట్స్ను స్క్రీన్ రికార్డ్ చేశాడు. ప్రైవేటుగా కలిసే సమయంలో ఆమె ఫొటోలను సేవ్ చేశాడు. రోజులు గడిచే కొద్దీ ప్రసాదరావు ప్రవర్తన ఆమె పట్ల మారుతూ వచ్చింది. ఆమె కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి అడగడం ప్రారంభించాడు. లేదంటే తనతో ఉన్న ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ క్రమంలో వీరిద్దరి ఫొటోలను తన ఐడీ ద్వారా ఫేస్బుక్ స్నేహితులకు మెసెంజర్లో పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏపీలోని రాజోలు పొన్నమండలో ఉండే ప్రసాదరావు భార్య భవాని, తండ్రి రామకృష్ణ తదితరులు కలిసి ఆమె ఇంటికి వెళ్లి రూ.4,28,800 చెల్లించాలంటూ తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారు. బాధితురాలితో పాటు ఆమె కుమార్తెను బెదిరించి గొలుసు, ఉంగరాలు సహా 28 గ్రాముల బంగారాన్ని తీసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ శనివారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. Sun, Feb 9 2025 8:12 AM
మేడ్చల్ రూరల్: సమస్య చెప్పుకునేందుకు పోలీస్స్టేషన్కు వచ్చిన యువతిని.. న్యాయం చేస్తానని లోబర్చుకుని గర్భవతిని చేశాడో కానిస్టేబుల్. ఆపై బెదిరింపులకు దిగాడు. బాధితురాలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా సదరు కానిస్టేబుల్ను రిమాండ్ చేశారు.పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ ఇందిరానగర్ కాలనీలో ఉండే యువతి (31) డబ్బుల విషయమై తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు గతేడాది మార్చి 21న తన తల్లితో కలిసి మేడ్చల్ పోలీస్స్టేషన్కు వెళ్లింది. క్రైమ్ విభాగం కానిస్టేబుల్ సుధాకర్రెడ్డి వారి సమస్య పరిష్కరిస్తానంటూ హామీఇచ్చి తన సెల్ఫోన్ నంబర్ను యువతికి ఇచ్చాడు. ఇంటికి పిలిచి అఘాయిత్యం మర్నాడు తన కేసు విషయమై యువతి కానిస్టేబుల్కు ఫోన్ చేసింది. లాయర్తో మాట్లాడదామంటూ ఆమెను తన ఇంటికి రప్పించి ఆమెను మాటల్లో పెట్టి, తనకు పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. మరోసారి కూడా ఇంటికి రప్పించుకుని ఇలాగే చేశాడు. యువతి గతేడాది జూలైలో గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఈ క్రమంలో ఆగస్టు 15న యువతి సుధాకర్రెడ్డికి ఫోన్ చేయగా అతని భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది. దీంతో అతడికి పెళ్లయిన విషయం తెలియడంతో యువతి కానిస్టేబుల్ను నిలదీసింది. ఆమె కారణంగా తన కుటుంబంలో గొడవలు తలెత్తాయని భావించిన సుధాకర్రెడ్డి యువతి అడ్డు తొలగించుకునేందుకు మేడ్చల్లోని ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు. అనంతరం సుధాకర్రెడ్డి దంపతులు సదరు యువతిని ఇంటికి పిలిపించుకుని దాడి చేశారు. అలాగే, తన మిత్రుడైన మరో కానిస్టేబుల్ ద్వారా సుధాకర్రెడ్డి యువతిని బెదిరింపులకు గురిచేశాడు. డిసెంబర్ 16న సుధాకర్రెడ్డి తన బండిపై యువతిని తీసుకెళ్లి గిర్మాపూర్ సమీపంలో కిందికి తోసేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు కానిస్టేబుల్ వ్యవహారం గురించి తెలిసి మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ.. అతడిని సైబరాబాద్ కమిషనరేట్కు బదిలీ చేయించారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో ఆ యువతి ఈ నెల 3న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసింది. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి సుధాకర్రెడ్డిని రిమాండ్కు తరలించారు. Fri, Feb 7 2025 4:49 AM
ఉరవకొండ: నలుగురు స్నేహితులు. సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఎంతో ఆశతో బెట్టింగ్ యాప్లో రూ.లక్షలు పోశారు. లాభం కాదు కదా చిల్లిగవ్వ లేకుండా డబ్బంతా పోయింది. అయితే, కలసి కట్టుగా ఆడిన వారు.. నష్టం వస్తే మాత్రం తట్టుకోలేకపోయారు. ముగ్గురు కలిసి తమ స్నేహితుడిపైనే తిరగబడ్డారు. నీ వల్లే జరిగిందని, తమ డబ్బు ఇవ్వాలని ఒత్తిళ్లు చేయడం ప్రారంభించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణం పొందాడు. ఉరవకొండలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఉరవకొండ పంచాయతీ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న కిషోర్కుమార్ (41) స్థానిక ముద్దలాపురం వద్ద ఉన్న సుజలాన్ విండ్ పవర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సునీతతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైఎస్సార్ జిల్లా చెన్నూరు సచివాలయంలో మహిళా పోలీసుగా సునీత విధులు నిర్వహిస్తున్నారు. తన స్నేహితులైన హరి, కేదార్, సంజయ్తో కలిసి కిషోర్కుమార్ మూడేళ్ల నుంచి ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారు. ఇటీవల నలుగురూ దాదాపు రూ.9 లక్షల వరకు ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టుకున్నారు. ఇందుకు కారణం నువ్వేనంటూ కిషోర్కుమార్ను హరి, కేదార్, సంజయ్లు నిందించడం ప్రారంభించారు. డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. శనివారం ఇంటి వద్ద గొడవకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్ ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఐ జనార్దన్ నాయుడు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.నా చావుకు స్నేహితులే కారణం..
పాటియాలా: ప్రముఖ నటుడు సోనుసూద్కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పంజాబ్లోని లూథియానా కోర్టు. ఈ మేరకు సోనుసూద్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో కోర్టు ఇలా ఆదేశించింది.వివరాల ప్రకారం.. నటుడు సోనుసూద్ (Sonu Sood)కు లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్ను సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్పై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు.. సోనుసూద్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.పిటిషన్పై విచారణ అనంతరం..‘సోనుసూద్కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. ఇక, సోనుసూద్కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోనుసూద్ తెలుగు సహా బాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.Ludhiana’s Judicial Magistrate Ramanpreet Kaur has issued an arrest warrant against Bollywood actor Sonu Sood.The warrant was issued after Sonu Sood failed to appear in court to testify in a ₹10 lakh fraud case involving the fake Rijika coin. The case was filed by… pic.twitter.com/yZ5R3gk32p— Gagandeep Singh (@Gagan4344) February 6, 2025 Fri, Feb 7 2025 7:04 AM
కోల్కతా : అత్యవసర పని పడింది. నేను అడిగింది లీవే కదా. లీవ్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ.. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి సహనం కోల్పోయాడు. తాను సెలవు అడిగితే ఉన్నతాధికారి కాదనడంతో కోపం కట్టలు తెంచుకుంది. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఉన్నతాధికారితో పాటు సహచర ఉద్యోగులపై దాడి చేశాడు. అనంతరం, అదే కత్తితో తిరుగుతూ కనిపించారు. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో న్యూటౌన్ ప్రాంతానికి చెందిన కరిగరి భవన్లోని సాంకేతిక విద్యా విభాగంలో అమిత్ కుమార్ సర్కార్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఎప్పటిలాగే ఆఫీస్కు వచ్చిన కుమార్ లీవ్ కావాలని ఉన్నతాధికారిని అడిగారు. ఆ విషయంలో తన సహోద్యోగులతో గొడవ జరిగింది. ఈ గొడవలో అమిత్ వెంట తెచ్చుకున్న కత్తితో సహచర ఉద్యోగులపై దాడి చేశారు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లి పోయారు. వీపున బ్యాగు, రక్తంతో తడిసిన కత్తితో వెళ్తున్న అమిత్ను స్థానికులు వీడియోలు తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆఫీస్లో జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీస్ అధికారి మాట్లాడుతూ.. నిందితుడు తన సహోద్యోగులతో సెలవు విషయంలో గొడవ పడ్డాడు. సెలవు నిరాకరించడానికి గల కారణం, సహోద్యోగులపై కత్తితో ఎందుకు దాడి చేశారో తెలియాల్సి ఉంది. నిందితుడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుమానిస్తున్నాం. ఆ కోణంలో కేసు దర్యాప్తు చేస్తాం. కాగా, అమిత్ కత్తిదాడిలో జయదేబ్ చక్రవర్తి, శాంతను సాహా, సర్తా లేట్, షేక్ సతాబుల్ గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. Fri, Feb 7 2025 11:48 AM
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్లోకి చొరబడుతున్న రోహింగ్యాల్లో అనేక మంది నగరంలోనూ ఉంటున్నారా? అనే ప్రశ్నకు ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. వీరిలో అత్యధికులు హైదరాబాద్లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నట్లు చెబుతున్నాయి. కోల్కతాలోని సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్లో అక్కడి రైల్వే పోలీసులు బుధవారం నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారు. వీళ్లు ఏళ్ల క్రితం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి నగరంలోని పాతబస్తీలో ఉంటున్నారని, తిరిగి బంగ్లాదేశ్ వెళ్లే ప్రయత్నాల్లో అక్కడి పోలీసులకు చిక్కారు. వీరి విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల ‘ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది. అక్కడి అలజడులతో ఇక్కడ దడ... బంగ్లాదేశ్తో పాటు మయన్మార్లో నెలకొన్న అంతర్గత పరిస్థితులపై ఈ అక్రమ వలసదారుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన ప్రతిసారీ.. అనేక మంది రోహింగ్యాలు వాటిని విడిచిపెడుతున్నారు. వీరిలో అత్యధికులు నేరుగా భారత్కు వలస వస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతున్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో అక్రమ వలసలు పెరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మాంగ్డో నుంచి టెక్నాఫ్ నగరానికి.. మయన్మార్లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్కు వీళ్లు వచ్చి చేరుతున్నారు. అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని అక్కడి నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో వస్తున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నది దాటి భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా... కాక్స్ టౌన్లో పనులు చేసుకుంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటుందని, అదే హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని సాంత్రాగచి్చలో చిక్కిన రోహింగ్యాలు మహ్మద్ ఆలం, రియాసుల్ ఇస్లాం, బేగం దిల్బార్, రబీల్ ఇస్లాం పశి్చమ బెంగాల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నగరానికి అక్రమ వలసదారుల్లో అనేక మంది జీవనోపాధి కోసమే వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ నుంచి అనేక వైపులకు.. ఇలా రెండు దేశాల్లోని నదులు దాటి పశి్చమ బెంగాల్లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్తో పాటు బిహార్, జమ్మూ కశీ్మర్లకు వెళ్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశి్చమ బెంగాల్ వాసులమంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్ కార్డు, పాస్పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు. Sun, Feb 9 2025 8:42 AM
హైదరాబాద్: చిన్నప్పటి నుంచి తనను అందరిలా పెంచలేదని.. అందరిని చూసినట్లు తనను చూడలేదని తాతను కత్తితో పొడిచి చంపేశాడు ఓ మనవడు. అడ్డుకోబోయిన కన్నతల్లిని గాయపరిచాడు. ఈ దారుణ ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్ మక్తాలో నివాసం ఉండే వి.చంద్రశేఖర జనార్దన్ రావు (86) వ్యాపారవేత్త. ఇతను వెల్జాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్త్రీ చైర్మన్. ఆయనకు సరోజ అనే కూతురు. ఆమె భర్త బెంగళూరులో ఉండగా.. సరోజ తండ్రి జనార్దన్ రావుతో కలిసి బీఎస్ మక్తాలో ఉంటోంది. సరోజ కొడుకు కిలారు కార్తి తేజ (29) అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి నగరానికి తిరిగి వచ్చాడు. తాత ఆస్తి కోసం నిత్యం గొడవ పడేవాడు. అందరినీ చూసినట్లు తనను చూడడంలేదని.. అందరిలా తనను పెంచలేదంటుండేవాడు. ఈ విషయంలో తాతతో విభేదించి కార్తితేజ ల్యాంకోహిల్స్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి బీఎస్ మక్తాకు వచ్చి ఆర్థిక లావాదేవీల గురించి తల్లి, తాతతో గొడవకు దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్దన్ రావు కడుపులో పొడిచాడు. అడ్డుకున్న తల్లి సరోజను గాయపరిచాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతలోపే కార్తి తేజ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అప్పటికే జనార్దన్ రావు మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయాలపాలైన సరోజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కార్తి తేజ కోసం గాలిస్తున్నారు. Sat, Feb 8 2025 9:53 AM
సీతమ్మధార: సెల్ఫోన్లకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్న రోజులివి. రీల్స్ పిచ్చి ఓ మైనర్ తల్లిదండ్రులను తలెత్తుకోకుండా చేస్తే..మరో యువకుడ్ని కటకటాలపాల్జేసింది. ఫోర్త్టౌన్ పోలీసు స్టేషన్లో యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఆ వివరాలు..తాటిచెట్లపాలెం రెడ్డివీధికి చెందిన 15 ఏళ్ల బాలికకు రీల్స్ అంటే పిచ్చి..నిత్యం రీల్స్ చేయడం..వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేయడం అలవాటు. ఈ క్రమంలో సమీప ఇంట్లో ఉంటున్న భార్గవ్..బాలిక చేసిన రీల్స్ చూసి లైక్ కొట్టాడు. క్రమంగా ఇన్స్టాలోనే పరిచయం పెంచుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తనకు రీల్స్ చేయాలని ఉందని, దానికి సహకరించాలని బాలికను కోరాడు. లేదంటే చనిపోతానని బెదిరించాడు. దీంతో ఇటీవల కై లాసపురం కొండమీద గల వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వీరిద్దరూ కలుసుకున్నారు. జనవరి 9వ తేదీన మళ్లీ అదే ప్రదేశంలో కలుసుకుని బలవంతంగా బాలిక మెడలో తాళి కట్టాడు. ఆ తరువాత కొద్ది రోజులకు మళ్లీ సదరు బాలికను సింహాచలం తీసుకువెళ్లి అక్కడ మరోమారి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫోర్త్ టౌన్ పోలీసులు భార్గవ్పై పోక్సో, బాల్యవివాహ నిరోధక చట్టం, ఎస్టీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. భార్గవ్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. శనివారం ఆ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసును ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Sun, Feb 9 2025 10:49 AM
Hyderabad దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్పేట మర్డర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా చంపడంతో పాటు ఆధారాలు లేకుండా మాయం చేయడం మొత్తం ఆమె భర్త గురుమూర
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఐదురోజుల క్రితం వెలుగులోకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లికి చెందిన మమతను జనవరి 27న హత్య చేసి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో పడేసిన విషయం తెలిసిందే. అయితే, వివాహేతర సంబంధమే మమత హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాసిపేటకు చెందిన మమత.. గత నెల 27న తన కుమారుడితో కలిసి బెల్లంపల్లి నుంచి కారులో బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయినా ఆమె.. కరీంనగర్ జిల్లా కొండనపల్లి శివారులో శవమై కనిపించింది. తల్లితో పాటు ఉన్న నాలుగేళ్ల కుమారుడు కూడా కనిపించకుండా పోయాడు. నిందితులు పరారైన కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చెన్నైలోని ఒక లాడ్జిలో బాలుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని కాపాడి.. నానమ్మకు అప్పగించారు.మృతురాలు మమత.. భర్తతో విడిపోయి సింగరేణి ఉద్యోగి భాస్కర్తో కలిసి ఉంటుంది. దీంతో భాస్కర్ కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి మమతను హత్య చేయించినట్లు పోలీసులు నిర్థారించారు. భాస్కర్ సోదరి, ఆమె స్నేహితుడు రఘు, సుపారీ కిల్లర్ కల్యాణ్, భాస్కర్ తండ్రి, సోదరి సమీప బంధువును అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. Thu, Feb 6 2025 6:49 PM
దుబ్బాక : ఒడి బియ్యం పోసుకునేందుకు సంతోషంగా అత్తగారింటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన శనివారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీరాం ప్రేమ్దీప్ కథనం మేరకు.. దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్కు చెందిన చిట్యాల వేణు(41) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం వేణు ఇద్దరు కుమారులు శివ (15), విష్ణును స్కూటీపై ఎక్కించుకొని ఒడి బియ్యం పోసుకునేందుకు అత్తగారి గ్రామమైన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధరిపల్లికి బయలుదేరాడు. దౌల్తాబాద్ మండలంలోని చెట్టనర్సంపల్లి బైపాస్ రోడ్డు వద్దకు రాగానే గజ్వేల్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి వేణు, పెద్ద కుమారుడు శివ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న కుమారుడు విష్ణు గాయాలతో బయటపడ్డాడు. తండ్రీకొడుకుల మృతదేహాలు రోడ్డుపై గుర్తు పట్టరాకుండా పడిపోయాయి. మృతుడు శివ తిర్మలాపూర్ జెడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి చదువుతున్నాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ ముత్యంరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. Sun, Feb 9 2025 3:14 AM
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ మెట్టుగూడలో తల్లి, కొడుకుపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. గాయాలపాలైన తల్లి రేణుక, కుమారుడు యశ్వంత్ని చిలకలగూడ పోలీసులు.. గాంధీ ఆసుపత్రికి తరలించారు. బైక్పై వెళ్తుండగా ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Thu, Feb 6 2025 2:59 PM
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు కలకలం రేపుతున్నారు. ఇవాళ మరో నకిలీ ఉద్యోగిని సచివాలయ భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఫేక్ ఐడీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించిన నకిలీ ఉద్యోగిని గుర్తించిన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తహశీల్దార్ పేరుతో కొంపల్లి అంజయ్య సచివాలయంలోకి వెళ్లాడు. అయితే అతనిపై అనుమానం రావడంతో అధికారులు విచారించి.. ఫేక్ ఐడీ కార్డుతో వచ్చాడని గుర్తించారు. సైఫాబాద్ పోలీసులకు అంజయ్యను అప్పగించారు.కాగా, కేటుగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొత్త అవతాలు ఎత్తుతున్నారు. గత వారం.. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటరియేట్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్మీట్ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు.తనిఖీ చేసే సమయంలో తాను రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగినంటూ ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు హాజరయ్యాడు. భాస్కర్ రావు ఐడీపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిన సంతి తెలిసిందే. భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగి కాదని, మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. Thu, Feb 6 2025 8:28 PM
సాక్షి, హైదరాబాద్/వరంగల్: వరంగల్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు విప్పుతున్నారు. శుక్రవారం నుంచి శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో నిర్వహించిన సోదా ల్లో పెద్ద మొత్తంలో అక్రమాస్తుల పత్రాలు, బంగారంతోపాటు విదేశీ మద్యం గుర్తించినట్లు ఏసీబీ డీజీ విజయ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం హనుమకొండ పలివేల్పుల రహదారిలోని దుర్గా కాలనీలో ఉన్న శ్రీనివాస్ నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూమి, నగదు, బంగారం, ఇతర ఆభరణాలు, వాహనాలు, ఖరీదైన గృహోపకరణాలు కలిపి మొత్తం రూ.4,04,78,767 విలువైన ఆస్తులను గుర్తించినట్టు విజయ్కుమార్ వెల్లడించారు. బహిరంగమార్కెట్లో ఈ ఆస్తు ల విలువ చాలా ఎక్కువగా ఉంటుందన్నారు.శ్రీనివాస్పై అవి నీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(బి), 13(2)తో పాటు తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968 కింద కేసు నమోదు చేసి వరంగల్లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. ఏసీబీ సోదాల్లో గుర్తించిన శ్రీనివాస్ అక్రమాస్తులు » శ్రీనివాస్ నివాసంలో రూ.19,55,650 విలువైన 1,542.8 గ్రాముల (కిలోన్నర)బంగారం. రూ.28 వేల విలువైన వెండి ఆభరణాలు. » శ్రీనివాస్తోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ.2,79,32,740 విలువైన మూడు ఇళ్లకు సంబంధించిన పత్రాలు. » రూ.13.57 లక్షల విలువైన 16 ఓపెన్ ప్లాట్ల పత్రాలు. » రూ.14,04,768 విలువైన 15.20 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు. » బ్యాంకు ఖాతాలో రూ.5,85,409 డిపాజిట్లు. » రూ.22,85,700 విలువైన గృహోపకరణాలు. » రూ.43,80,000 విలువైన మూడు కార్లు, ఒక బైక్. » రూ.5.29,000 ఖరీదు చేసే 23 విదేశీ మద్యం బాటిళ్లు. Sun, Feb 9 2025 3:28 AM
కొరుక్కుపేట: కుటుంబ కలహాల కారణంగా అక్క భర్త తన మరదలిని గొంతు కోసి హత్య చేసిన ఘటన తిరువొత్తియూర్లో కలకలం రేపింది. వివరాలు.. తిరువొత్తియూర్లోని సెల్వ కుమార్ ఆయపిళ్లై గార్డెన్ ఏరియాకు చెందిన ధనలక్ష్మి ఉదయం ఇంటి ముందు ముగ్గు వేసే పనిలో ఉన్నారు. తనతో పాటు సోదరి సెల్వి కూడా ఉంది. అంతలో ధనలక్ష్మి అక్క సెల్వి భర్త కాళీముత్తు అక్కడికి వచ్చాడు. అక్కడ కుటుంబ గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో ధనలక్ష్మి, కాళీ ముత్తు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కాళీముత్తు దాచిన కత్తితో ధనలక్ష్మి మెడపై నరికి పారిపోయాడు. ధనలక్ష్మి రక్తపుమడుగులో కుప్పకూలిపోయింది. ఈ శబ్ధం విని ఇరుగుపొరుగు వారు గుమిగూడి చూడగా ధనలక్ష్మి ప్రాణాలతో పోరాడుతూ పడి ఉండడం చూసి షాక్కు గురయ్యారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మార్గమధ్యంలోనే ధనలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై తివొత్తియూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. Thu, Feb 6 2025 10:23 AM
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారిపోయారు. సభ్య సమాజం తల దించుకునేలా టీచర్లు వ్యవహరించారు. ఓ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో, ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని గర్భం దాల్చింది. అసలు విషయం తన తల్లికి చెప్పడంతో ఆవేదన చెందిన ఆమె.. బిడ్డను గత నెల రోజులుగా పాఠశాలకు పంపించలేదు. స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలిసింది.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే శిశు సంక్షేమ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితురాలితో ఫిర్యాదు చేయించారు. దీంతో, బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, రంగంలోకి దిగిన శిశు సంక్షేమ శాఖ అధికారులు.. దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఉపాధ్యాయులు చిన్నసామి(57), ఆర్ముగం(45), ప్రకాశ్(37)ను అరెస్ట్ చేశారు. ఇక, ఈ ఘటన చర్చనీయాంశంగా మారడంతో స్థానికులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు.. ఈ ఘటన అనంతరం వారిని జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తమిళనాడులో వరుస లైంగిక దాడుల ఘటనలు స్టాలిన్ సర్కార్కు మచ్చ తెస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు 23న అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో, ప్రతిపక్ష బీజేపీ నిరసనలు చేపట్టింది. స్టాలిన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.Tamil Nadu A 13-year-old girl student was allegedly sexually assaulted by three teachers at a government middle school in Krishnagiri district. The three teachers have been suspended by the District Education Officer (DEO) and arrested under various sections of the Protection…— ANI (@ANI) February 6, 2025 Thu, Feb 6 2025 9:28 AM
దొడ్డబళ్లాపురం,కర్ణాటక: అక్రమ సంబంధం అనుమానంతో భార్యను కడతేర్చాడో కిరాతక భర్త. ఈ సంఘటన బెంగళూరు ఆనేకల్ తాలూకా హెబ్బగోడిలోని వినాయకనగరలో చోటుచేసుకుంది. శ్రీగంగ (27), భర్త మోహన్రాజు(30). వీరు చిరుద్యోగులు. శ్రీగంగ అక్కడే డిమార్ట్లో పనిచేసేది. పృథ్విక్ (6) అనే కుమారుడు ఉన్నాడు.శ్రీగంగ సోషల్ మీడియాలో చురుగ్గా పోస్టులు పెట్టేది. గత 7 నెలలుగా మోహన్రాజు పనికి వెళ్లకుండా మద్యం తాగుతూ కాలం గడుపుతున్నాడు. దీంతో నిత్యం ఇద్దరికీ గొడవ జరిగేది. అంతేకాకుండా శ్రీగంగ ప్రవర్తనపై మోహన్ అనుమానంతో పీడించేవాడు. బుధవారం ఉదయం ఇద్దరూ గొడవపడ్డారు. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో మోహన్ కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమె రోడ్డు మీదకు పరుగులు తీయగా వెంటాడి ఎనిమిది సార్లు పొడిచాడు. చావు బతుకుల్లో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. హెబ్బగోడి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మోహన్రాజుని అరెస్టు చేశారు. కాగా, గత కొన్ని నెలలుగా దంపతులు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, అతడు అప్పుడప్పుడు కొడుకును చూడాలని వచ్చి వెళ్లేవాడని స్థానికులు తెలిపారు. అలా వచ్చినప్పుడు గొడవపడి హత్య చేశాడని తెలిపారు. Thu, Feb 6 2025 11:30 AM
జైపూర్: రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఓ బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో భారీ సంఖ్యలోప్రాణనష్టం వాటిల్లింది. రాజస్థాన్లోని దుడు రీజియన్లజజైపూర్-అజ్మీర్ హైవేపై మౌంఖపూరాకు అతి దగ్గర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయ్యాలయ్యాయి.బస్సు ముందు టైర్ పేలిపోవడంతో అది కాస్తా అదుపు తప్పింది. ఆ సమయంలో బస్సును కంట్రోల్ చేయడానికి యత్నించిన డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దాంతో కారులో ఉన్న వారు పలువురు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. Thu, Feb 6 2025 7:27 PM
రాజానగరం: ప్రేమించానన్నాడు.. వంచించాడు.. పెళ్లి మాటెత్తితే కాదు పొమ్మన్నాడు. 16 ఏళ్ల బాలిక 18 బాలుడిపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం రాజానగరంలో జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలు ఇలా వున్నాయి. రాజానగరానికి చెందిన ఆ మైనర్లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నరేంద్రపురం కూడలిలో జులాయిగా తిరిగే ఆ బాలుడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల నుంచి ఆమె వెంటపడేవాడు. చివరకు తనతోనే లోకం అనేలా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. పదో తరగతి వరకు చదివిన ఆ బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో పెళ్లంటే తనకు ఇష్టం లేదని పొమ్మన్నాడు. దీనితో న్యాయం కోసం ఆ బాలిక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరూ మైనర్లే కావడంతో పోలీసులు పోక్సో కేసుగా నమోదు చేసి, నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎస్సై నారాయణమ్మ దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతో.. భార్యను వెంటాడి మరీ.. Thu, Feb 6 2025 1:01 PM
[04:49] అమెరికాలో తెలుగు విద్యార్థి బలవన్మరణం కలకలం రేపుతోంది. ఉన్నత విద్య కోసం న్యూయార్క్ వెళ్లిన సాయికుమార్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు అతని స్నేహితుడు మాట్లాడుతున్న వీడియో వైరల్గా మారింది.
[04:49] ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన వరంగల్ ఉమ్మడి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్కు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
[04:50] ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర(వీసీ) జనార్దనరావు (86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.