అక్రమార్జన కేసులో రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఐడీసీ) జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్టు చేశారు.
వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించుకుందామంటే తహసీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఓ రైతు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన గురువారం చోటు చేసుకుంది.
భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి డా.సున్నం శ్రీనివాస్రెడ్డి గురువారం సంచలన తీర్పు వెలువరించారు.
ప్రమాదంలో రెండు మీటర్ల ఇనుపచువ్వ గుండె, ఊపిరితిత్తుల మీదుగా చొచ్చుకెళ్లిన ఓ వ్యక్తిని తిరుపతి రుయా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మూడు గంటల పాటు శ్రమించి బతికించారు.
వారసత్వపు ఆస్తిలో వాటా దక్కకుండా చేస్తామని బెదిరించి.. పదమూడేళ్ల బాలికను వివాహం చేసుకున్న కేసులో యువకుడిని, అతని తల్లిదండ్రులను గుంటూరు దక్షిణ డివిజన్ డీఎస్పీ భానోదయ అరెస్టు చేశారు.