ఇటీవల వారానికి 90 గంటల పనివేళలు.. అందులోనూ ఆదివారం నాడూ పని చేయాలని ఎల్అండ్టీ చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ అభిప్రాయపడటం (అదే సమయంలో ఆయన.. తన అభిప్రాయంపై పెడార్ధం తీశారని ప్రకటించారు).
మైసూరు సమీపంలోని జయపుర ఠాణా పరిధి హారోహళ్లి- గుజ్జేగౌడనపుర గ్రామాల మధ్య సోమవారం పట్టపగలే దుండగులు దోపిడీకి తెగించారు. కేరళకు చెందిన వక్కల వ్యాపారి షఫి వెళుతున్న కారును నిందితులు అడ్డగించారు.
కన్నడిగుల కుందానగరి బెళగావి మరోసారి కొత్త అందాలు సంతరించుకుంది. జాతిపిత మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో సరిగ్గా వందేళ్లకిందట కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు ఇదే గడ్డపై కొనసాగిన నేపథ్య వేడుకలు మంగళవారం పునః ప్రారంభం కానున్నాయి.
తరికెరె తాలూకా హులితిమ్మాపురలో బంధువుల ఇంట్లో తన కుమార్తె వివాహ శుభలేఖను ఇచ్చేందుకు వెళ్లిన చంద్రు (45) ఆదివారం మరణించారు. ఈ విషయం ఆయన కుమార్తెకు, వరుని కుటుంబానికి తెలిస్తే వివాహం ఆగిపోతుందని బంధువులు ఆందోళన చెందారు.
నమ్మ మెట్రో వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరించి.. బెంగళూరు నగర జనజీవనంతో మమేకమవుతోంది. నగర వాసికి విడదీయరాని అవసరంగా మారిపోతోంది. ఈ రైళ్లలో సంచరించే ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.