రాజధాని నాలుగు రోజులుగా వాన నీటిలో మునిగి.. బుధవారం కాస్త తేలినంత భ్రాంతికి లోనయ్యింది. వానదేవుడు చినుకులు రాలుస్తూనే ఉన్నా.. మునుపటి రోజులతో పోలిస్తే కాస్తా మందగమనమే కావడంతో జనం ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.
మదగజాలను బంధించేందుకు కర్ణాటక ప్రభుత్వం అందించిన కుంకీ ఏనుగులను ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బెంగళూరుకు చేరుకున్న వేళ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం విధానసౌధ ముంగిట బుధవారం పెద్ద సందడి సృష్టించింది.
రాష్ట్రంలో ఈ రెండేళ్లలో ప్రభుత్వం అన్ని రంగాలల్లోనూ విఫలమైందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ప్రభుత్వం కొత్తగా రూ.1.16 లక్షల కోట్ల రుణాన్ని ప్రజల భుజాలపై మోపిందని విమర్శించారు.
భారీ వర్షాలతో నీరు చొరబడిన కాలనీలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి కేజే జార్జి, పాలికె అధికారులతో కలిసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం పరిశీలించారు.