పోలీస్ ఠాణాలకు పెద్దలు వచ్చిన సమయంలో.. కొన్ని సందర్భాల్లో వారితో పాటు చిన్నారులుంటారు. ఆ బాలలు ఠాణాల్లో ఎలాంటి లోటు లేకుండా ఆడుకోవడానికి, విశ్రమించడానికి వీలుగా ప్రత్యేక గదుల ఏర్పాటుకు నగర పోలీస్ శాఖ ముందుకొచ్చింది
దేశానికి అత్యధిక మొత్తంలో రక్షణ, వైమానిక ఉత్పత్తులు అందించే కర్ణాటక తన సత్తాను మరింత విస్తరించుకునే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై బుధవారం దిల్లీలో కీలక చర్చలకు సర్కారు సిద్ధమవుతోంది.
రాజధాని నగరంలో అదొక కీలకమార్గం. వాహనాలు రయ్యిన దూసుకెళుతున్న సమయంలో ఒక్కసారిగా రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం.. ఆపై మరో రెండు వాహనాలను తాకడంతో ఆందోళన వ్యక్తమైంది.
కర్ణాటక కేంద్ర ‘పరప్పన అగ్రహార కారాగారం’లో పనిచేసే ఏఎస్సై చాంద్పాషా, మానసిక వైద్యుడు డాక్టర్ నాగరాజ్, అనీస్ ఫాతిమా అనే మహిళను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.
భార్యతో జరిగిన గొడవలో ఆమె గొంతుపై కాలు వేసి తొక్కి హత్య చేసిన హరీశ్ కుమార్ (32) అనే వ్యక్తిని బొమ్మనహళ్లి ఠాణా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. భర్త చేతిలో హత్యకు గురైన గృహిణిని పద్మజ (27)గా గుర్తించారు.