సిద్ధరామయ్య మంత్రివర్గం మునుపటిలా బలంగా లేదు. మంత్రివర్గ సమావేశంలో ఏదైనా అంశంపై చర్చకు వస్తే ఏ ముగ్గురి అభిప్రాయం ఒకలా ఉండదు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా, డీకే శివకుమార్ సూచించినా సగానికి సగం ఆయా అంశాలను విభేదిస్తూ చర్చను కాస్త నీరుగార్చేలా చేయడం ఇటీవల కాలంలో సాధారణంగా మారింది
బైకులో తిరుగుతూ తల్వార్తో బెదిరించిన ఇద్దరు అపరిచితులు ఇద్దరు మహిళల గొలుసులను తెంపుకెళ్లారు. అడ్డుకునేందుకు చేతిని అడ్డుపెట్టిన ఒక మహిళ చేతి వేళ్లు తెగిపడ్డాయి.
నాడహబ్బ మైసూరు దసరా ఉత్సవాలను బుకర్ పురస్కార విజేత, రచయిత్రి బాను ముష్తాఖ్ ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆహ్వానించడాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన అన్ని అర్జీలను ఉన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది.
హరిత విప్లవం, సేద్యంలో కొత్త పోకడలు ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆహార భద్రత కల్పిస్తూ పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, శాస్త్రవేత్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.
తన ఫోన్ హ్యాక్ అయిందని నటి ప్రియాంక ఉపేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనకు డబ్బులు ఇస్తేనే మీ నంబరు మీరు వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తామని నిందితులు ఆమెను డిమాండ్ చేశారు.
నగదు లావాదేవీలకు సంబంధించి జరిగిన గొడవలో కనకపుష్ప (62) అనే వృద్ధురాలు సోమవారం కత్తిపోట్లకు గురైంది. కారు డ్రైవరు మడివాళప్ప ఆమెతో గొడవ పెట్టుకుని కత్తితో గొంతులో పొడిచి పరారయ్యాడు