ఏడాది కాలంగా చర్చకు వచ్చిన రామనగర జిల్లా పేరు మార్పు ప్రతిపాదన ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. గురువారం నాటి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ తీర్మానాన్ని చేశారు. ఇకపై రామనగరను ‘బెంగళూరు దక్షిణ జిల్లా’గా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
బెంగళూరు ప్యాలెస్ భూమిని స్వాధీనపరుచుకున్నందుకు అభివృద్ధి హక్కుల బదిలీ (టీడీఆర్)గా రాజవంశస్థులకు రూ.3400 కోట్లు చెల్లించాలని సర్వన్నత న్యాయస్థానం ఆదేశించింది. బళ్లారి రోడ్డు, జయమహల్ రహదారి విస్తరణకు అనుగుణంగా ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న 15 ఎకరాల.
పాలనా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఎనిమిదో కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గురువారం అందజేసింది. తాము 189 సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదికను అందించామని కమిషన్కు నేతృత్వం వహించిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే తెలిపారు.
భారతీయ వైద్య విద్యా కోర్సుల ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిని చేరుకున్నా కమ్యూనికేషన్కు సంబంధించి ఇంకా మెరుగుపడాల్సి ఉందని గ్లోబల్ హెల్త్కేర్ అకాడమీ(జీహెచ్ఏ) సర్వసభ్య సమితి అభిప్రాయపడింది. ‘భారతీయ ఆరోగ్య విద్య, భవిష్యత్తు, ప్రపంచ ప్రమాణాల కోసం సన్నాహకాలు’.
తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కర్ణాటక వాసులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన 12మంది ఒకే వ్యాన్లో తమిళనాడులోని వేలాంగణ్ణికి పర్యాటకానికి బయలుదేరారు. తొలుత తిరుచ్చికి వచ్చిన వాళ్లు అక్కడి నుంచి తంజావూర్ మీదుగా వేలాంగణ్ణికి పయనమయ్యారు.
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకువస్తూ దొరికిపోయిన నటి రన్యారావు కేసు మరింత జటిలం అవుతోంది. హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ ఆమె వివాహ సమయంలో రూ.25 లక్షల వరకు నగదు, బహుమతులను ఇచ్చారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గుర్తించారు.
మైసూరు శాండల్ సబ్బులకు కొత్త రాయబారిగా నటి తమన్నా భాటియాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. రెండేళ్ల పాటు ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం రూ.6.2 కోట్లు చెల్లించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు కన్నడిగులు ఖండించారు.
పట్టణంలో చక్కెరమిల్లు ఏర్పాటుపై ముఖ్యమంత్రి సహా ఏలికలెవరూ సాధన సమావేశంలో నోరెత్తకపోవడంతో చెరకు రైతులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి నోట చక్కెరమిల్లు ఏర్పాటుపై ఓ నిర్ణయం వెలువడుతుందని సమావేశానికి 15 రోజుల ముందు నుంచి స్థానిక ఎమ్మెల్యే గవియప్ప చెప్పుకొచ్చారు.
చిన్న, పెద్ద గుంతలు పడిన బెంగళూరు రహదారులపై ప్రయాణించడానికి నిన్న మొన్నటిదాకా పడరాని పాట్లు పడిన ప్రజలకు ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైంది. పెనం మీద నుంచి పొయ్యి మీదకు పడిపోయిన దుస్థితి వెన్నాడివచ్చింది.
మహారాష్ట్ర తెలుగు సమాఖ్య, బెంగళూరులోని తెలుగు విజ్ఞానసమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ‘వారధి’ పేరుతో నిర్వహించే ‘తెలుగు భాష- సంస్కృతిక సమ్మేళనం’ కనుల విందుగా మారనుంది. పేరుకు భాషా వేదికైనా..
నగర సంచార రద్దీ నియంత్రించేందుకు చేపట్టిన నమ్మ మెట్రో పసుపుపచ్చ మార్గంలో పైలెట్ రహిత రైలు ప్రయోగాత్మకంగా పరుగులు తీస్తోంది. ప్రజల అవసరాలకు అందుబాటులోకి రావడానికి సమయం సమీపించింది. కోల్కతా సమీప టాటానగర నుంచి ఇలాంటి రైలు బోగీలు బెంగళూరు నగరానికి తరలించుకొచ్చారు.
బీకాం చివరి సంవత్సరం విద్యార్థిని కవన (21)కు శనివారం ఉదయం వివాహమైంది. వివాహమైన వెంటనే పరీక్ష కేంద్రానికి తన సోదరునితో కలిసి వచ్చి పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్లింది. మొదట వివాహ తేదీ నిశ్చయం అయిన అనంతరం పరీక్ష తేదీలను ప్రకటించారు.
గాయకుడు సోనూ నిగమ్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. బ్యాంకుల్లో స్థానికులు మాట్లాడే భాషను అర్థం చేసుకునే వారినే నియమించాలని బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య (భాజపా) చేసిన సూచనలను సోనూ నిగమ్ ఖండించారు.