కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి శక్తివంచన లేకుండా శ్రమిస్తానని పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పునరుద్ఘాటించారు. పార్టీనే నా సర్వస్వమని ప్రకటించారు.
కన్నడనాట ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. కొత్త సర్కారు ఏర్పాటైన తర్వాత ఎస్ఎస్ఎల్సీ ఉత్తీర్ణతను పెంచే దిశగా నిబంధనలను సవరించారు.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో బెయిలుపై బయటకు వచ్చిన దర్శన్ విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చినా.. స్విట్జర్లాండ్ దేశం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది.
కుటుంబ నిర్వహణ కోసం తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో సూక్ష్మ రుణ సంస్థ సిబ్బంది వేధించారని ఆరోపిస్తూ హరిహర సమీపంలోని గంగనరసి గ్రామానికి చెందిన సువర్ణమ్మ (56), దివ్యాంగురాలైన ఆమె కుమార్తె గౌరమ్మ (26) రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.
భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడిందంటూ ప్రముఖ దినపత్రికల్లో మొదటి పుట మొత్తం ప్రకటనలు ఇచ్చిన కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారణ చేసే అంశంలో ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.
కన్నడనాట అర్ధాంతరంగా ఆగిపోతున్న గుండెకు ఊపిరిపోసే మార్గాలు కానరావడం లేదు. ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు డాక్టర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం ఇటీవలే ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పిస్తూ.. అంతా సవ్యంగా ఉంది.
కలబురగి సూపర్ మార్కెట్ సమీపంలోని సరాఫ్బజార్లోని ఒక నగల దుకాణంలో శుక్రవారం దోపిడీ దొంగలు హడలెత్తించారు. మాస్కులు ధరించి, తుపాకీలో పట్టుకుని వచ్చిన నలుగురు ఆగంతకులు చూస్తుండగానే మూడు కిలోల బంగారు ఆభరణాలను దోచుకుని వచ్చిన దారిలో వెళ్లిపోయారు.
విధానపరిషత్ మాజీ సభ్యుడు, సీనియర్ నేత, న్యాయవాది, అఖిల వీరశైవ మహాసభ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడు, వీరశైవ విద్యావర్ధక సంఘం మాజీ అధ్యక్షుడు ఎన్.తిప్పణ్ణ (97) శుక్రవారం వేకువజామున కన్నుమూశారు.