శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ఓటు అనే ఆయుధంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకుని అసెంబ్లీకి పంపాం. వీరికిచ్చిన అయిదేళ్ల అధికారం.. రాష్ట్రానికి మార్గదర్శకం. సామాజికంగా, ఆర్థికంగా పరిపుష్ఠి చెంది అభివృద్ధి ఫలాలు ప్రజలకు చెందాలంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధిపైనే ఆధారపడి ఉంది.
రాష్ట్రంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా కాలువలకు బదులు పైపులైన్ ద్వారా ప్రాజెక్టు నుంచి సాగు నీటిని అందించాలనే లక్ష్యంతో.. ‘మత్తడివాగు ప్రాజెక్టు’ కుడి కాలువ నిర్మాణం చేపట్టారు.
రిమ్స్లో రోగులకు త్వరలో మరిన్ని మెరుగైన సేవలు అందనున్నాయి. రిమ్స్లో అలైడ్ సైన్సెస్(అనుబంధ శాస్త్రాల) నిపుణుల కోర్సును ప్రారంభించింది. గతేడాది ఈ కోర్సుల్లో 60 మందికి 53 మంది అభ్యర్థులు చేరి సంబంధిత కోర్సులు చదువుతున్నారు.
జిల్లా కేంద్రంలోని జీసీసీ(గిరిజన సహకార సంస్థ) గోదాం ఇన్ఛార్జిని సరెండర్ చేసి 25 రోజులు గడుస్తున్నా.. వేరే వారికి బాధ్యతలు అప్పగించకపోవడంతో అందులోని నిత్యావసర సరకులు నిరుపయోగంగా మారుతున్నాయి.
తెలంగాణ క్రీడా ప్రాంగణాల పేరిట గత ప్రభుత్వం పురపాలికలు, మండలాలు, గ్రామ పంచాయతీల్లో మైదానాలు ఏర్పాటు చేసింది. హడావుడిగా, ఆటలకు అనుకూలంగా లేనిచోట బోర్డులు పెట్టి వదిలేశారు.
మహిళల సంరక్షణకు ప్రత్యేకంగా చట్టాలున్నాయి. వాటి అమలుపై దృష్టిసారిస్తున్నారు. ప్రత్యేకంగా షీ బృందాలను నియమించారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ అవగాహన సదస్సులు, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గు గని కార్మికులను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలనేది మొదటి నుంచి ఉన్న ప్రధాన డిమాండ్.
అతివల ఆర్థికాభివృద్ధికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ప్ సహకారంతో స్వయం సహాయక సంఘాల నిర్వహణ చేపడుతోంది. వీరికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సీఐఎఫ్ పథకాలతో ఏటా రుణాలు అందజేస్తున్నారు.
ఎస్సైనుంచి ఏసీపీలస్థాయి వరకు అధికారుల పోస్టింగులు ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నలలోనే జరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జిల్లాలో 25 పోలీసు స్టేషన్లున్నాయి.
నిర్మల్లో ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఆక్రమించుకొని నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన డీ1 పట్టాల జాబితా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు.
పంటలు చేతికొచ్చాక పంటవ్యర్థాలు, వరికొయ్యలను తగులబెట్టడంతో వచ్చే పొగతో గ్రామీణ ప్రాంతాల వాసులు గాలి కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నారు. పట్టణాల్లో పరిశ్రమల నుంచి వెలువడే పొగతోనూ ప్రజలు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
జిల్లా కేంద్రంలో ప్రాచీన కట్టడాల్లో శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం ఒకటి. దాదాపు 400 సంవత్సరాల కింద ఈ మఠం వెలిసిందని భద్రంగా దాచిన ఆనాటి గ్రంథాలు చెబుతున్నాయి.
విఠలేశ్వరుని తలచిన వెంటనే పండరీపురం గుర్తుకొస్తుంది. విఠల్-రుక్మిణీబాయి దివ్య మనోహర రూపం కళ్లముందు అగుపిస్తుంది. అచ్చం మహారాష్ట్రలోని పండరీపురం క్షేత్రం మాదిరిగానే ఏడాది పొడువునా కుభీరులోని విఠలేశ్వరుని ఆలయంలో భక్తి కార్యక్రమాలు జరుగుతాయి.
దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్న మారుమూల గ్రామాలవి. రహదారి సౌకర్యం లేని ఆ ఊర్లకు కొండకోనలు, వాగువంకలు దాటుకుంటూ వెళ్లి ఆపన్నహస్తం అందించి దాతృత్వాన్ని చాటుకుంది నిర్మల్కు చెందిన డా.అప్పాల కావేరి ఫౌండేషన్.
జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తొలివిడుత కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో విడుత మంత్రివర్గ కూర్పుపై జోరుగా చర్చ జరుగుతోంది.
వాంకిడి, డిసెంబరు 10: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడమే లక్ష్యంగా బడిబయట పిల్లల సర్వేకు జిల్లా విద్యాశాఖ సన్నద్దమవుతోంది. ఈనెల 11వ తేదీ నుంచి నెల రోజుల పాటు పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేకు సమాయత్త మతున్నారు. ఇందుకోసం అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
రెబ్బెన, డిసెంబరు 10: నిజాం కాలం నాటి నుంచి ప్రముఖులు, అతిఽథులకు విడిది సౌకర్యం కల్పించిన చోటది. మండల కేంద్రంలో ఆ పురాతన కట్టడం విషయంలో పాలకులు, అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆర్అండ్బీ విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరింది.
రెబ్బెన, డిసెంబరు 10: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమని, మానవతా దృక్పథంతో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ
కౌటాల, డిసెంబరు 10: మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై ఆదివారం నిర్వహించిన జాతరకు భక్తజనం పొటె త్తారు. ఎటుచూసినా భక్తులు అమ్మవారి దర్శనం కోసం గుట్ట వైపే చేరుకోవడం కనిపించింది. జాతరకు భక్తులు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహా రాష్ట్ర, చత్తీస్గడ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం ప్రారంభ మైంది. సీఎం రేవంత్రెడ్డి శనివారం జీరో చార్జీ టికెట్టును ఆవిష్కరించారు. మహిళలు రాష్ట్రంలో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలుతో మహిళల్లో ఆనందం వ్యక్తమ వుతోంది. కాని జిల్లాలోని చాలా గ్రామాల మహిళలకు ఉచిత ప్రయాణ యోగం కలగడం లేదు. జిల్లాలో వందకు పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు.
చాతుర్మాస దీక్ష ముగించుకుని వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్కు వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్థానిక తిర్పెల్లి బ్రాహ్మణ సమాజ్ రామాలయంలో బస చేశారు.
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈనెల 12న ఉదయం 10 గంటలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్-14 బాలికలు, అండర్-17 బాల బాలికలకు హాకీ జట్ల కోసం ఎంపిక.