నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలోని న్యూ కంజర్ గ్రామంలోని గ్రామదేవతలైన మహాలక్ష్మి ముత్యాలమ్మ ఆలయాల్లో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాలను అపహరించారు.
నార్నూర్ మండలం భీంపూర్లో గతేడాది తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి ఖోఖో ఆడేటప్పుడు అకస్మాత్తుగా కిందపడి పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే మృతి చెందాడు. గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఎక్కడైనా భూమి పెరుగుతుందంటే నమ్ముతారా..? ఆదిలాబాద్ పట్టణ పరిధిలో ఇదే జరిగింది.. ఎన్ఫోర్స్మెట్ డైరెక్టరేట్(ఈడీ) ఆధీనంలో ఉన్న 2.09 ఎకరాలను కాజేసేందుకు రియల్టర్లు రమేష్శర్మ, ఇబ్రహీం మహ్మద్ అలియాస్ మామ్లా సేట్ చేసిన అక్రమాల్లో విస్తుపోయే నిజం వెలుగుచూసింది.
వినియోగదారులు కొనుగోలు చేసే వస్తు సామగ్రి తూకం, కొలతల్లో తేడా వస్తే తమకు ఫిర్యాదు చేయాలని, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతలశాఖ అసిస్టెంట్ కంట్రోలర్, జిల్లా ఇన్ఛార్జి అధికారి విజయసారథి పేర్కొన్నారు.
జిల్లాలోని పలు వాగుల నుంచి కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరు చెప్పి ఇసుకను జిల్లాను దాటిస్తున్నారు.
పట్టణాల్లో పచ్చదనంపేరిట అధికారులు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని పురపాలక సంఘాల బడ్జెట్లో ఏటా 10శాతం నిధులను పచ్చదనం కోసం కేటాయిస్తారు
కాసిపేట మండలం బుగ్గగూడెం గ్రామానికి చెందిన పెద్దులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం స్లాబ్ వరకు పూర్తయింది. ప్రభుత్వం నుంచి వచ్చే మూడో బిల్లు రూ.2 లక్షల కోసం కార్యదర్శి, ఏఈ ఫొటో తీసి యాప్లో నమోదు చేశారు
ఇది నూతన మండలం భీమారంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం. ఇటీవలే ఆర్భాటంగా మంత్రి ప్రారంభించారు. నిర్మాణ సమయంలో తరచూ పర్యవేక్షించిన అధికారులు సేవలు మొదలైన తర్వాత పట్టించుకోవడమే మరిచారు
నిర్మల్ జిల్లాలోని నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్, రత్నాపూర్కాండ్లీ గ్రామాల్లోని పోషకులే దాతలై సర్కారు బడికి వెలుగులు పంచుతున్నారు. అయిదు కి.మీ. దూరంలోని ప్రైవేట్ బడికి పంపించడం ఎందుకు ఉన్న ఊరిలోని సర్కారు బడుల్లో చదివిస్తున్నారు.
ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనతో సత్ఫలితాలను సాధించాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ప్రప్రథమంగా ‘ప్రయోగ దర్శిని’ పుస్తకాలను ముద్రించింది
కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. వివరాల ప్రకారం.. మండలంలోని గంభీరావుపేట గ్రామానికి చెందిన సైదం శేఖర్కు బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన జాగిర్తి బాపు రెండో కుమార్తె కల్పన(28)తో 12ఏళ్ల కిందట వివాహం జరిగింది.
బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారణమైన వారిని పోలీసు అధికారులు తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం ముఖ్య నేతల మధ్య పోటీ నెలకొంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ త్వరలో డీసీసీ పదవులు భర్తీ చేసేందుకు సన్నద్ధం అవుతుండటంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.