ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది.
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం.
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది.
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
సిర్పూర్(టి), జూలై 25: మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం జాతీయ ఉపాధిహామీ పథకంలో 2023-24సంవత్సరంలో చేపట్టిన 386 పనులకు సంబంధించిన రూ.2,86,79,048 లకు గాను గ్రామీణఉపాధిహామీసిబ్బందితో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.
పాతకాలంలో.. ఇంట్లో డబ్బులు ఉంటే దొంగలు ఎత్తుకుపోతారు.. బ్యాంకుల్లో అయితే భద్రం అని చెప్పేవారు. దీంతో ప్రజలు బ్యాంకులను నమ్మి అందులోనే పొదుపు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకులో డబ్బులు ఉండడమే శాపంగా మారింది. బ్యాంకు ఖాతాలో లక్ష అంతకంటే ఎక్కువ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకుని సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. స్మార్ట్ఫోన్తో ఎంత మేలు జరుగుతుందో.. అంత నష్టం కూడా జరుగుతోంది... కాబట్టి తస్మాత్ జాగ్రత్త..
జిల్లా కేంద్రంలో శుక్రవారం కార్గిల్ విజయ దివస్ సందర్భంగా జేసీ శ్యామలాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
ప్రజా పోరాట యోధుడు రాయల చంద్రశేఖర్ వర్ధంతి సభను ఈ నెల 28న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి జగన్సింగ్ పేర్కొన్నారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి బోజారెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మడావి ప్రసాద్, కుర్సెంగ ధనుకుమార్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే వనపర్తి హాకీ సెంటర్కు ఎంపికయ్యారు.
బెజ్జూరు, జూలై 26: ప్రాణహిత నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. తలాయి-పాపన్నపేట, కుశ్నపల్లి- సోమిని గ్రామాల మధ్య ప్రాణహిత బ్యాక్వాటర్, లోలెవల్ వంతెనలపై వరదనీరు ప్రవహిస్తుండడంతో 12 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి.
వర్షాకాలం.. అందులోనూ కాలానుగుణ వ్యాధులు ప్రబలే అవకాశం. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో రక్షణ, వారికి అవసరమైన వసతులు, ఆరోగ్యపరంగా సూచనలు,
ఇచ్చోడ నుంచి ఇంద్రవెల్లి మండలం ముత్నూరు వరకు, ఇచ్చోడ మండలం సిరిచెల్మ నుంచి పెంబి వరకు, బజార్హత్నూర్ మండలంలోని మోర్కండి నుంచి నందిగామ వరకు రోడ్ల పనులు జరిగితే బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం కలుగుతుంది.
శాసనసభ ఎన్నికల కంటే ముందు సింగరేణి ద్వారా గత ప్రభుత్వం విడుదల చేసిన జిల్లా మినరల్ ట్రస్టు ఫండ్(డీఎంఎఫ్టీ) లెక్కల వ్యవహారం తేలడం లేదు. నిర్దేశించిన పనులు చేశారా? లేదా? అనేది వెల్లడి కావడం లేదు.
వానాకాలం సాగు పనులు ఊపందుకున్నాయి. విద్యుదాఘాతం, అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఆత్మహత్య ఇలా మృతి చెందిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
తాండూరు మండలం చౌటపల్లి గ్రామంలోని పోచంపల్లికి చెందిన కొండ పోషం(50) బోయపల్లి బోర్డు వద్ద జాతీయ రహదారిని దాటుతున్నాడు. ఇదే క్రమంలో ఆసిఫాబాద్ నుంచి బెల్లపంల్లి వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది.
మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యూనిట్లన్నీ స్వల్ప వ్యవధిలోనే మూలన పడుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసినవి వృథాగా మారుతున్నాయి.
మహిళలకు అమ్మతనం పునర్జన్మలాంటిది. గర్భం దాల్చిన వారి ప్రసవం కోసం అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత పాలకులదే. అయితే జిల్లాలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి.
జలాశయాలు జలకళను సంతరించుకోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. కడెం జలాశయంలోకి వరద భారీగా చేరుతోంది. పూర్తి మట్టం 700 అడుగులుకాగా బుధవారం సాయంత్రం వరకు 692.650 అడుగులకు చేరుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖలో భారీగా అధికారులకు స్థానచలనం కల్పిస్తూ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్ఎం డోబ్రియాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. ఇచ్చిన హామీలకు.. సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు.