సాధారణ రైతు కుటుంబంలో పుట్టి.. ఎలాంటి శిక్షణ పొందకుండా, కేవలం గ్రంథాలయంలో పుస్తకాలు చదివి.. గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించిన మహ్మద్ విలాయత్ అలీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 26 ఏళ్ల వయసులోనే మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ప్రతి అవసరానికి తోడు ప్రాణావసరానికి చరవాణి ఉండాల్సిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంకా కొన్ని గ్రామాల ప్రజలు సెల్ఫోన్ సంకేతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు
బజార్హత్నూర్ మండలంలోని దేగామ వెళ్లే దారిలో గంగాపూర్ సమీపంలోని గుట్ట ఇది. ఇక్కడ కొన్నేళ్లుగా మొరం తవ్వకాలు చేపడుతుండటంతో ఈ గుట్ట పూర్తిగా తరిగిపోతుంది. ఇప్పటికే సగభాగం వరకు తొలగించేశారు.
జిల్లాలో చాలామంది విద్యార్థులకు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా వేలమంది విద్యార్థులు ‘అపార్’ నమోదు చేయించుకోలేకపోతున్నారు.
జిల్లాలో ఏకైక పరిశ్రమ సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని నిరుద్యోగ జేఏసీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే
వానాకాలం సీజన్లో పత్తి పంటల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది.. కూలీల కొరత వేధిస్తోంది. వరి కోతలు, పత్తి తీసేందుకు స్థానికంగా కూలీలు దొరకకపోవడమే ఇందుకు కారణం.
శీతాకాలం పొరుగు రాష్ట్రంనుంచి జిల్లా అటవీ ప్రాంతాలకు వచ్చిన పులులు ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. కుమురం భీం జిల్లా మీదుగా మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించిన ఎల్-1 ఆడ పులి లక్షెట్టిపేట, జన్నారం, ర్యాలీ, అందుగుటపేట, ముత్యంపల్లి, దేవాపూర్ సెక్షన్ పరిధిలో నెలల తరబడి కలియ తిరిగి లక్షెట్టిపేట అటవీ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు
చీకటి పడితే అక్కడికి లారీలు, జేసీబీలు చేరుకుంటున్నాయి. రెండు నెలలుగా యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నా పట్టించుకునేవారు లేరు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నా పట్టనట్లు చూస్తున్నారు.
జిల్లాలో సాగునీటి చెరువులు శిథిలావస్థకు చేరాయి. ఆనకట్టలు, తూములు, అలుగులకు గండ్లు పడ్డాయి. మరమ్మతులకు లేక వాటి ఆయకట్టుకు నీరందడం లేదు. వాటి పునరుద్ధరణకు అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
చేతికందొచ్చిన యువకుడిపై ఆ కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరికొద్ది రోజుల్లో ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ అనుకోని ప్రమాదంలో మృత్యువు ఆ యువకుడిని కబళించింది.
గోదావరి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో కరకట్టలు కట్టాలనే ప్రతిపాదనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లా కేంద్రంలోని రాళ్లవాగులో కరకట్టల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.
మందమర్రి ఏరియాలోని సీఈఆర్ క్లబ్లో ఈ నెల 17, 18వ తేదీల్లో సీఎంపీఎఫ్వో అధికారుల ఆధ్వర్యంలో జీవన్ ప్రమాన్ పునరుద్ధరణ కోసం (లైఫ్ సర్టిఫికెట్) శిబిరం నిర్వహిస్తున్నట్లు జీఎం రాధాకృష్ణ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శనివారం వీజీఎస్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రైవేటు పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు.