ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్లో కూలి పనులు చేసుకొని జీవించే రాజేశ్వర్(47) మద్యానికి బానిసగా మారి విమానాశ్రయ మైదానంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మద్యం తాగడానికి భార్య డబ్బులివ్వలేదని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవటంతో ఆ కుటుంబం రోడ్డున పడినట్లయింది.
జిల్లాకేంద్రంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో కనిపించిన దృశ్యమిది. అక్కడి ఓ చికెన్ సెంటర్ నుంచి వెలువడిన వ్యర్థాలను ఇలా బస్తాల్లో నింపి వాహనంలో తరలిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా విద్యాశాఖ దృష్టి పెట్టింది. డీఈవో పి.రామారావు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పిల్లలు, తల్లిదండ్రులు, పోషకులను కలిసి సర్కారు బడుల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, విద్యాబోధనను వివరిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగిరపర్చడానికి చేపడుతున్న చర్యలు ముందుకు సాగడం లేదు. మొదటి విడతలో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించి జిల్లాలో 769 గృహాలను మంజూరు చేశారు.
మరికొన్ని రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానుండగా.. వ్యాపారులు ఇప్పటికే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారు. కొన్నిచోట్ల రైతులు ఇప్పటినుంచే విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసుకుంటున్నారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరలోని ఓ ప్రసూతి ఆసుపత్రిలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో 633 ప్రసవాలు జరగగా ఇందులో 65 మాత్రమే సాధారణం. మిగితావన్నీ శస్త్రచికిత్సలే.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులకు లెక్కలు చూపించేందుకే బోర్డులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు.
గృహజ్యోతి పథకంలో భాగంగా.. 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించిన వారికి ‘జీరో’ బిల్లులు జారీ చేస్తున్నారు. ప్రారంభించినప్పటి నుంచి ఈ పథకం పేద, మధ్య తరగతి కుటుంబాలకు కొంతమేర ఆసరాగా నిలిచింది.
వానాకాలంలో కడెం జలాశయానికి వరద ఎప్పుడు పోటెత్తుతుందో తెలియని పరిస్థితులు ఎదురవుతాయి. జలాశయంపై గతేడాది మంజూరైన నిధుల్లోంచి చేపట్టాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్లు గతేడాది నిర్దేశిత లక్ష్యానికి మించి ఆదాయం పొందడంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లక్ష్యాన్ని మార్కెటింగ్ శాఖ ఖరారు చేసింది.
అధిక వడ్డీ రుణాల భారం నుంచి వీధి విక్రయదారులకు విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 జూన్లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి(పీఎం స్వనిధి యోజన)ను ప్రవేశపెట్టింది.
చెన్నూరు మండలలోని కిష్టంపేట సమీపంలో అటవీ శాఖ అధికారులు చెక్ పోస్టు ఏర్పాటు చేసి టోల్ వసూలు చేయడాన్ని నిరసిస్తూ భాజపా నేతలు రాస్తారోకో చేశారు. టోల్ వసూళ్లను నిలిపివేయాలని ఆందోళన చేశారు.