పాఠశాల, కళాశాల పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు విద్యార్థులకు సూచించారు. లక్షెట్టిపేట పట్టణం లోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలను డీపీవో బుధవారం పరిశీలిం చారు.
సర్యారు బడుల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని డీఈ వో యాదయ్య తెలిపారు. వేంపల్లిలో పదేళ్ల్లుగా మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలను బుధవారం డీఈవో యాదయ్య పునః ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలోని హైటెక్సిటీ కాలనీలో ఉన్న ’మంచిర్యాల క్లబ్’ లో పెద్ద మొత్తంలో నిధులు గోల్మాల్ అయినట్లు తెలుస్తోంది. రిక్రియేషన్ పేరిట నిర్వహిస్తున్న క్లబ్లో పేకాటే ప్రధానంగా కార్యకలాపాలు సాగుతుండగా, జిమ్, స్విమ్మింగ్ పూల్, షటిల్ కోర్టు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల విక్రయం పక్కదారి పడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే యూరియాను ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి రూ.లక్షలు సొమ్ము చేసుకునేలా వ్యూహాత్మకంగా దోపిడీ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహించింది. సర్వే చేసిన ఎన్యుమరేటర్లకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, సూపర్వైజర్లకు ప్రత్యేకంగా గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించింది.
వైద్యులకు సమాజంలో ఎంతో గౌరవం ఉందని, బాధితులకు నిస్వార్థ సేవలందిస్తే మరింత గౌరవ పెరగటంతో పాటు మంచి గుర్తింపు లభిస్తుందని రిమ్స్ సంచాలకుడు డాక్టర్ రాఠోడ్ జైసింగ్ పేర్కొన్నారు.
ఆదర్శ పాఠశాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం వందల మంది విద్యార్థులు బజార్హత్నూర్ ఆదర్శ పాఠశాలకు వస్తుంటారు.
జిల్లా రైతులకు రాయితీపై ఎరువులు సరఫరా చేసే బాధ్యతను ప్రభుత్వం.. పీఏసీఎస్, డీసీఎంఎస్, ఆగ్రోస్ సేవా కేంద్రాలతోపాటు హాకా (హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్) కేంద్రాలకు అప్పజెప్పింది.
రాష్ట్రంలో 0-6 చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల కొలువులపై ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, సహాయకుల (హెల్పర్) పోస్టులు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)లకు వచ్చే రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో.
గూడు లేని పేదలకు అన్ని హంగులతో పక్కా ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది.. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తోంది..