వ్యాపార రంగంలో రాణిస్తున్న మహిళా సంఘాలతో తాజాగా సౌర ప్లాంట్లు ఏర్పాటు చేయించి వారిని మరింత శక్తిమంతులను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు గ్రామాలను ఎంపికచేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.
చరవాణి ద్వారా పోస్టల్ సేవలను వినియోగదారులకు అందించేందుకు తపాలాశాఖ కొత్త యాప్ను సిద్ధం చేసింది. ఇంతవరకు పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా సేవలను అందించింది.
అనధికారిక లే అవుట్లకు రిజిస్ట్రేషన్ చేయరాదని ఆదేశాలు ఆదిలాబాద్లో అమలు కావడంలేదు. దర్జాగా ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గతంలో జరిగిన దస్తావేజులు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అంతర్గత విచారణ జరుపుతున్నారని సమాచారం.
ఈ బాలలు ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్నారు..కలలు సాకారం చేయడానికి లక్ష్యం వైపు దూసుకెళ్తున్నారు. కళాకారులుగా, క్రీడాకారులుగా, చిట్టి శాస్త్రవేత్తలుగా ఆకాశమే హద్దు అన్నట్లు ప్రతిభ చాటుతున్నారు.
విద్యుత్తు వినియోగదారులు ఆ సంస్థ విధించే ఏసీడీ (అడిషనల్ కన్జమ్షన్ డిపాజిట్) ఛార్జీలపై అవగాహన కలిగి ఉండాలి. టీజీఎన్పీడీసీఎల్ సంస్థ బిల్లులు జారీ చేసే సమయంలో ఏసీడీ ఛార్జీలను విధిస్తుంది.
జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా ధాన్యంలో తేమ శాతం తగ్గించేందుకు.
వీధి కుక్కలు ప్రజలను భయకంపితులను చేస్తుంటే పశువులేమో రోడ్లపై సంచరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటీవల వీధి కుక్కల దాడుల్లో చిన్నారులతోపాటు చాలా మంది గాయపడ్డారు.
ప్రభుత్వం అందించిన ధాన్యాన్ని మరపట్టి అందించడంలో రైస్ మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మరపట్టి ఇచ్చే బాధ్యతలను ప్రభుత్వం మిల్లులకు కేటాయిస్తుంది.
దాబాల్లో, శివారుప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మద్యం తాగేవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. యువకులు సైతం ఇందులో భాగమవుతుండటం గమనార్హం. విందులు- వినోదాల పేరిట తాగి, ఆ మత్తులో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు.