పిల్లలు తొమ్మిది, పదో తరగతి వచ్చేసరికి శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. కౌమార దశ నుంచి యవ్వనదశ మధ్యలో ఉన్నవారంతా టీనేజర్లే. ఈ వయసులో మనసు నియంత్రణ కోల్పోయి పరుగెత్తుతుంది. మంచి కంటే చెడుకే ఎక్కువగా ఆకర్షితులవుతారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్ల వైఖరి వారి పాలిటశాపంగా మారుతోంది. వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతోంది.
పట్టణంలో పాదబాటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇదేమిటని ఎవరూ అడిగే పరిస్థితి లేదు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ప్రజలు నడిచేందుకు ఆస్కారం లేకుండా చేయడంతోపాటు, వ్యాపారులు నిర్మాణాలు సైతం చేపడుతున్నారు.
గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛదనం-పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణ చేపట్టింది. ఇంటింటికి చెత్తసేకరణ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, మురుగు కాలువలు, రహదారుల శుభ్రతను మెరుగుపర్చేందుకు కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది.
ఉపాధి కోసం ఎదురుచూస్తున్న గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజీవ్ యువ వికాసం ద్వారా అర్హులైన వారికి ఆర్థిక సహాయ పథకాలు అందించి జీవనోపాధికి చేయూతనివ్వాలని సంకల్పించింది.
ఉన్న ఊళ్లో ఉపాధి అవకాశాలు కనిపించక రూ.లక్షలు వెచ్చించి ఏజెంట్లను నమ్మి విదేశాలకు వెళ్లినవారు అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కడెం మండలంలోని లింగాపూర్కు చెందిన అయిదుగురు, దస్తూరాబాద్ మండలం మున్యాలకు చెందిన ఒకరు ఇలాగే ఉపాధికోసం మలేషియాకు వెళ్లారు.
దేశంలో పేదలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రం బ్యాంకుల ద్వారా పలు బీమా ప్రయోజన పథకాలు ప్రవేశపెట్టింది. అవి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ప్రచార లోపంతో పేదలకు దూరంగా ఉన్నాయి.
ద్విచక్రవాహనంపై దంపతులు వెళ్తుండగా గాలివానకు చెట్టు విరిగిపడటంతో భార్య మృతి చెందగా భర్తకు గాయాలైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జన్నారం ఎస్సై రాజవర్దన్ తెలిపిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన శనిగారపు జగన్.
వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. కల్లాల్లో ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులకు కునుకు లేకుండా పోతోంది. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదని, మిల్లర్లు తరుగు పేరుతో క్వింటాకు అయిదారు కిలోల మేరకు కత్తిరిస్తుండటంతో..
గత కాంగ్రెస్ హయాంలో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా.. పలు మండలాల్లో కాలువలను నిర్మించారు. వీటి కోసం భూమిని ఇచ్చిన రైతులు ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. పుష్కర కాలం నుంచి పరిహారం రాకపోవడంతో..
వ్యవసాయ, అనుబంధ, ఇతర రంగాలకు రుణ పంపిణీ కోసం ఏటా స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) రుణ ప్రణాళిక రూపొందిస్తుంది. దాని ప్రకారం బ్యాంకుల వారీగా వార్షిక రుణ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఏటేటా కేటాయింపులు పెంచుతూ ప్రణాళిక ఖరారు చేస్తున్నా..
యాసంగి పూర్తయి ధాన్యం కొనుగోళ్లు చివరి దశలో ఉన్నాయి. వానాకాలం సాగుకు రైతులు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాకు కల్పతరువైన కడెం జలాశయం కాల్వలకు ఏళ్లుగా మరమ్మతులు లేక ఆయకట్టు చివరకి నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్క్వాస్(జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు) గుర్తింపు పొందిన ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా ముందువరుసలో ఉంటుంది. ఇప్పటికే పది వరకు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని కేంద్రం అందించే నిధులకు అర్హత సాధించాయి.
జిల్లాలో ఏటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా వేసవి కాలం వచ్చేసరికి పలు చోట్ల నీటి ఎద్దడి నెలకొంటోంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది.
గతానికి భిన్నంగా ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. రుతుపవనాల కారణంగా నాలుగైదు రోజులుగా జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తుండటం, మున్ముందు మరింతగా పడే అవకాశముండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఉమ్మడి జిల్లాలోనే పెద్ద బస్టాండ్గా పేరున్న నిర్మల్ ఆర్టీసీకి ఘనమైన చరిత్ర ఉంది. దాదాపు 9 దశాబ్దాల నుంచి ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ప్రైవేటు వాహనాల పోటీని తట్టుకుంటూ, ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
జిల్లాలో వానాకాలం సాగు కోసం రైతులు సన్నద్ధం అవుతున్నారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటూనే పంటలు వేసేందుకు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. నల్లమట్టి వేయడంతో పాటు జూన్ ఆరంభంలో వర్షాలు పడగానే విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రైతులు అధైర్య పడొద్దని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని డీసీవో రాథోడ్ బిక్కు రైతులకు భరోసా ఇచ్చారు. దహెగం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీవో గురువారం పరిశీలించారు.