విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శన’ నిర్వహిస్తోంది. సోమవారం కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ మెగా సైన్స్ ఫెయిర్ ప్రారంభమైంది.
తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది.
జిల్లాలోని టిడ్కో గృహాల నిర్మాణం దాదాపు పూర్తయినా వసతుల లేమి లబ్ధిదారులను తిప్పలు పెడుతోంది. గత ప్రభుత్వంలో సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు ఆలస్యమయ్యాయి.
కృష్ణా నదిలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ సహా పరిసర ప్రాంతాల్లో భారీగా ఇసుక దందా సాగుతోంది. తాజా వరదలకు ఫెర్రీ సమీపంలోని లంకలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వేల టన్నుల ఇసుక కొట్టుకొచ్చింది.
ఏడు పదుల వయసులోనూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ సామాజిక సేవలో తరిస్తున్నారు.. కంకిపాడు మండలం మంతెనకు చెందిన పెండ్యాల విజయలక్ష్మి. ఆమె భర్త రామారావు ఏలూరులోని ఓ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.
అది తెనాలి పురపాలక బాలురోన్నత పాఠశాల. లోపలకు అడుగు పెడితే కళా ప్రపంచంలోకి వెళుతున్న భావన. గదుల గోడలపై దేశ నాయకుల భారీ చిత్రాలు, ఆవరణలో విగ్రహాలు, విభిన్న రూపాలు ఆకట్టుకుంటాయి.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా వందలమంది మృత్యువాత పడడంతోపాటు గాయపడిన వారి సంఖ్య 800 మందికిపైగా ఉంటోంది. వాహనదారులు రహదారి నిబంధనలు పాటించకపోవడంతోపాటు ఆయా రోడ్లపై ఉన్న బ్లాక్స్పాట్లతో ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.
‘కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా. రైతులు, కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
అమెరికాలోని పెద్ద ఆసుపత్రుల్లో వైద్యురాలుగా పనిచేసి బాగా నైపుణ్యం సంపాదించాక.. స్వస్థలానికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ పేదలకు సేవచేయాలనేది ఆమె కల. చిన్నతనం నుంచి వైద్యురాలు కావడం కోసం ఎంతో శ్రమించింది.
నీడ లేని పల్లె ప్రజలకు సొంత గూడు కల సాకారం చేసేందుకు కూటమి సర్కారు నడుం కట్టింది. దీని కోసం పీఎం ఆవాస్ యోజన 2.0 ద్వారా లబ్ధి అందించనున్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు
‘సామాజిక మాధ్యమాల ఖాతాలు నావే.. అందులో అసభ్యకర పోస్టులు.. మార్ఫింగ్ ఫొటోలు, కంటెంట్ నాది కాదు’ అని రెండో రోజు పోలీసుల కస్టడీలో వైకాపా సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి విజయ్భాస్కర్రెడ్డి సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది.
ఎటువంటి పురోగతి లేకుండా ఉన్న ఎండీఎంఏ కేసు మ్యాడీ అరెస్టుతో కీలక మలుపు తిరిగింది. అతని విచారణ ఆధారంగా మరికొందరి పేర్లు వచ్చాయి. వీరిలో వైకాపా విద్యార్థి నేత పులగం కొండారెడ్డి పేరు ఒకటి.
రాజధాని అమరావతి రూపకల్పనలో ఏపీ సీఆర్డీఏ ప్రజలను భాగస్వామ్యులను చేస్తోంది. భవిష్యత్తు తరాలకు ఉత్తమ, సుస్థిరమైన, ఆధునిక మౌలిక వసతులతో కూడిన రాజధాని నగరాన్ని నిర్మించేందుకు అమరావతి విజన్ 2047 రూపకల్పనలో ప్రజల నుంచి సూచనలు,
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రైళ్లలో దాదాపు బెర్తులన్నీ ఫుల్ అయ్యాయి. రెండు నెలల ముందుగానే రైల్వే రిజర్వేషన్ టికెట్ల బుకింగ్లు ప్రారంభమవ్వడంతో అన్ని ప్రధాన రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్ బెర్తులు నిండి వెయిటింగ్ లిస్టుతో పాటు కొన్ని రైళ్లలో నోరూమ్లు దర్శనమిస్తున్నాయి.
బహుజనులంతా విభేదాలను పక్కన పెట్టి రాజ్యాధికారం లక్ష్యంగా ఐక్యంగా పోరాడదామని బహుజన చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ పిలుపునిచ్చారు.
అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లిన కుమారుడు ప్రయోజకుడైన తిరిగి వస్తాడని భావించిన తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. అక్కడే అనారోగ్యంతో మృతి చెందటంతో బోరున విలపిస్తున్నారు.
నకిలీ మద్యం అమ్మకాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుండడంతో అద్దేపల్లి జనార్దనరావు.. ముడి సరకు, ఇతర వస్తువుల కోసం అధిక మొత్తాలు వెచ్చించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సీసాలు, మూతలు, లేబుల్స్, స్పిరిట్, అన్నింటికీ రెట్టింపు,