ఆక్వా రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2014 సంవత్సరానికి ముందు ఆయిల్ ఇంజిన్లకయ్యే ఖర్చుతో సాగుదారులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్న క్లిష్ట సమయంలో తెదేపా ఆక్వాను ఆదుకుంది.
ఉపాధిహామీ పథకంలో వేతనాలతో పాటు కన్వర్జెన్సీ పనులకు సంబంధించిన బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు రూ.155 కోట్ల బిల్లులు పెండింగ్లో పడ్డాయి.
దేశ శాంతి భద్రతల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) ‘సురక్షిత తీరం.. సమృద్ధి భారత్’ లక్ష్యంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ ప్రశంసనీయమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
అవనిగడ్డ కేంద్రంగా డ్రగ్ మాఫియా చెలరేగిపోతోంది. మందుల చీటీలు, సేల్ రిజిస్టర్లు లేకుండా.. మత్తు కలిగించే ట్రెమడాల్ సహా పలు ఔషధాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.
2024 ఆగస్టు 31న రాత్రి.. బుడమేరు కట్ట తెగి సృష్టించిన విధ్వంసం.. ఆరు నెలలు దాటుతున్నా ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతోంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విజయవాడ నగరం సహా పలు నియోజకవర్గాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.
మాదకద్రవ్యాల వినియోగం.. వ్యక్తులనే కాదు కుటుంబాలను, సమాజాన్ని నిర్వీర్యం చేస్తుందని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. సరఫరాదారుల ఆట కట్టించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.
మధ్యాహ్న భోజనం బాగోలేదని లింగాలపాడు ఎస్సీకాలనీ ఎంపీపీ పాఠశాలకు శుక్రవారం విద్యార్థులు సామూహికంగా గైర్హాజరయ్యారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి అయిదు తరగతులకు 32మంది ఉన్నారు.
పోలీస్ శాఖ, అగ్నిమాపకశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తదితర విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల సేవా పతకాలను ప్రకటించింది.
ఆ నలుగురు కరుడుగట్టిన నేరస్థులు.. నాటు తుపాకులు తీసుకుని పిట్టలను వేటాడుతున్నట్టు నటిస్తూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ప్రేమికుల జంటలపై అదను చూసి పంజా విసిరే కిరాతకులు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డారు.
రైల్వే కార్మికులకు మెరుగైన పింఛను ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ విజయవాడ డివిజనల్ అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల రాఘవేంద్ర, ఆమంచి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
అప్రజాస్వామిక పద్ధతులు అవలంబిస్తున్న వైకాపా అధినేత జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే ఒంటరిగా మిగలక తప్పదని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.