ఆర్థిక, విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ..ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టిన రణభేరి బైక్ ర్యాలీని గన్నవరంలో మంగళవారం ప్రారంభించారు.
తెదేపా సీనియర్ నేత, నవ్యాంధ్ర తొలి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నివాళులు అర్పించారు.
ఇంద్రకీలాద్రిపై దశాబ్దం తర్వాత నూతన అన్నదాన భవనం అందుబాటులోకి వస్తోంది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని.. కొండ దిగువకు వచ్చే మార్గంలో కనకదుర్గానగర్లో అధునాతన అన్నదాన భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఉపాధ్యాయ కొలువులు సాధించిన అభ్యర్థుల ఆనందానికి హద్దులు లేవు. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత కూటమి సర్కారు నిర్వహించిన మెగా డీఎస్సీలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన 1203 మంది ఉద్యోగాలు సాధించారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆర్థిక సంఘ నిధులతో పాటు దస్తావేజు రుసుముపైనే ఆధారపడి జరుగుతుంటాయి. కానీ ఆ రుసుము సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్టీఆర్ కమిషనరేట్ సీపీగా రాజశేఖరబాబు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేశారు. దాని ఆధారంగా పోలీసింగ్లో మార్పులు తీసుకొచ్చారు. చాలా కష్టమైన కేసులు పరిష్కరించారు. వాటిని కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో వివరించనున్నారు.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు వచ్చే పోయే వారిపై దాడులకు ఎగబడుతున్నాయి. వాటి బారినపడి ఎందరో ఆసుపత్రుల పాలవుతున్నారు.
గన్నవరం నియోజకవర్గంలో విరివిగా ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ సామాజిక అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రజా అవసరాలకు ఎక్కడా సెంటు భూమి దొరకని విధంగా ఆక్రమణలకు గురయ్యాయి. చెరువులను సైతం చెరబట్టారు.
అందమైన మీ ఫొటో యోధుడిగా మార్చవచ్చు. అలాగే తాజా ఫోటోను పాతకాలం నాటిదిగా చేసేయొచ్చు. క్షణాల వ్యవధిలో ఏఐ టూల్స్తో మీకు కావాల్సిన రూపంలో మీ చిత్రాలను త్రీడీ చిత్రాలుగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఏఐ యాప్లు కోకొల్లలుగా ఉన్నాయి.
పోరంకి క్యాపిటల్ ఆసుపత్రిలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మదన్ అనే 40 ఏళ్ల వ్యక్తికి అరుదైన రీడోహార్ట్ శస్త్ర చికిత్సను దేశంలోనే మొదటిసారిగా విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి ఎండీ మన్నే హరీష్ తెలిపారు.
ఎన్టీఆర్ స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ) వృద్ధికి ప్రధాన వనరు పాడి పరిశ్రమ కావడంతో సామూహిక గోకులాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కలెక్టర్ జి.లక్ష్మీశ తీసుకెళ్లారు.
కొండపల్లి పారిశ్రామికవాడ రసాయన వ్యర్థాల నిర్వహణను గాలికొదిలేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుద్ధి చేయకుండానే వాగుల్లోకి వదిలి ప్రకృతి వనరులను కలుషితం చేస్తున్నారని వాపోతున్నారు. ఫలితంగా రైతులు, పశువులకు తీవ్ర నష్టం జరుగుతోంది.
జాతీయస్థాయిలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయం పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పాఠశాలల్లో స్వచ్ఛత పచ్చదనం, వసతుల నిర్వహణ ఆధారంగా పురస్కారాలను అందజేస్తారు.
రైల్వే ప్రాంగణాల్లో వాహనాలు దొంగలు హల్చల్ చేస్తున్నారు. పార్కింగ్ చేసిన వాహనాలు మాయం అవుతున్నాయి. రైల్వేస్టేషన్లో కుటుంబ సభ్యులు, బంధువులను రైళ్లు ఎక్కించేందుకు వచ్చే ప్రయాణికులు తమ వాహనాలను ఆవరణలో నిలుపుతుంటారు.
విద్యుదాఘాతానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు శివపార్వతీనగర్కు చెందిన కోవెల రాజశేఖర్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగోన్నతుల చర్యల్లో భాగంగా ఉమ్మడి కృష్ణా పరిధిలో 9 మంది డిప్యూటీ మండల పరిషత్ అధికారులు, నలుగురు ఏవోలకు ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి లభించింది.
నగరంలోని వైఎస్సార్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఆర్డర్ చేసిన టిఫిన్కు బదులు వేరే ఇచ్చారని అడిగినందుకు హోటల్ సిబ్బంది కస్టమర్పై దాడి చేసి గొంతు కోశారు.