ప్రజారవాణా వ్యవస్థలో కీలకంగా భావిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రాథమిక ప్రణాళికలను సిద్ధం చేశారు. క్షేత్రంలో సర్వే అనంతరం మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు తుది రూపు తీసుకొచ్చారు.
నిత్యావసరాల సరకుల పంపిణీలో ప్రభుత్వం తీసుకురానున్న నూతన మార్పులతో రేషన్ మాఫియాకు అడ్డుకట్ట పడనుంది. ఇందులో భాగంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) వ్యవస్థను రద్దు చేసి...ఈ జూన్ నుంచి గతంలో మాదిరి చౌక దుకాణాల వద్దే నిత్యావసర సరకులు పంపిణీ చేయనున్నారు.
ప్రముఖుల తాకిడి పెరుగుతున్నందున మరో మూడు నెలల్లో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేయడంతో పాటు.. 2028 నాటికి విమానాశ్రయం నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్కు విమానం ఎగరడమే లక్ష్యంగా పెట్టుకున్నామని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.
ఆరంభంలోనే జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆటంకం కలిగింది. జడ్పీ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన సమావేశంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు కేటాయిస్తున్నట్లు తీర్మానించామని ఛైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు.
ఆటోనగర్లో పేరుకుపోయిన 500 టన్నుల చెత్తకు గురువారం కొత్తగా.. మరో 30 టన్నులు వచ్చి చేరింది. ఎన్ని రోజులు చెత్తను తరలించకుండా రహదారుల పక్కనే వదిలేస్తే.. అంత ఎక్కువ అయిపోతోంది.
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి దివిసీమలోని వేలాది మంది రైతులు పంటలు సాగు చేయడం లేదు. సముద్రం నీరు పంట భూముల్లోకి వస్తోందని మొరపెట్టుకున్నా వినలేదు.
విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కృష్ణానది మధ్యలో ఉన్న భవానీద్వీపంలో భారీగా చెట్లను నరికి తరలించుకుపోతున్నారు. పర్యాటక శాఖకు చెందిన కొందరు అధికారుల సహకారంతోనే ఈ దందా సాగుతున్నట్టు సమాచారం.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు పట్టుబడిన దొంగల వివరాలు గురువారం వెల్లడించారు.
పోరంకిలో నివాసముంటున్న తెదేపా నాయకుడు, డాక్యుమెంట్ రైటర్ తుమ్మలపల్లి హరికృష్ణ ఇంటిపై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు.
మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికపై నిఘా పెట్టాలని డీజీపీకి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.