‘ఇంద్రకీలాద్రికి తెలుగు రాష్ట్రాలేకాక.. దేశవిదేశాల నుంచి ఏటా కోటిన్నర మందికిపైనే భక్తులు వస్తున్నారు. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులు, తలనీలాలు సమర్పించేవారు.. తొలుత దుర్గాఘాట్లో స్నానాలు చేశాకే కొండపైకి వస్తారు. కానీ..
‘ఏ పాఠశాలలో బాగా చదువు చెబుతారు? ఎక్కడ చేరిస్తే ర్యాంకులు వస్తాయనే కోణంలోనే 90 శాతం మంది తల్లిదండ్రుల ఆలోచన ఉంటోంది. కానీ.. ప్రస్తుతం ఏ పాఠశాలలో క్రీడామైదానం ఉంది, ఎక్కడ చేరిస్తే మా పిల్లాడు ఆరోగ్యంగా ఉంటాడనేది ఆలోచించాల్సిన సమయమిది.
గత తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయం నుంచే రాష్ట్రం మొత్తాన్ని నియంత్రించే విధంగా సాంకేతికత సాయంతో పారదర్శకంగా పరిపాలన, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించే విధంగా సరికొత్త వ్యవస్థ.
మాదక ద్రవ్యాలు కలిగిన ముగ్గురు యువకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు మెథాంఫేటమిన్ (మెత్) అనే మత్తు మందు వస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచారు.
బ్యాంకు ఖాతాలు సీజ్ అయ్యాయని.. ఆగమేఘాలపై రెండు కొత్త కంపెనీలు పెట్టి మరీ డిపాజిట్లు వసూలు చేశాడు... అద్విక ట్రేడింగ్ కేసులో నిందితుడు ఆదిత్యపై నిరుడు భీమవరంలో ఒకటి, భవానీపురం ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి.
‘మట్టి తవ్వకాలకు అధికారులు అడ్డుకట్ట వేస్తున్నా.. అక్రమార్కులు కొత్త మార్గాలను వెతికి మరీ పేట్రేగుతున్నారు. తాజాగా కొత్తూరు తాడేపల్లిలో పోలవరం కాలువను ఆనుకుని గుట్టుగా అర్ధరాత్రి దాటాక జేసీబీలను పెట్టి తవ్వేస్తూ అడ్డంగా దొరికారు.
ప్రభుత్వ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్ పత్రాల చోరీలకు పాల్పడుతున్న నిందితులను గన్నవరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి వివరాలను గన్నవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.
పదమూడేళ్లుగా తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోక, పరిసరాలపై అవగాహన లేకుండా, మానవ సంబంధాలకు అర్ధం తెలియక, అచేతన స్థితిలో ఉన్న ఓ చిన్నారి సాయం కోసం ఎదురుచూస్తోంది. మోపిదేవి మండలం చిరువోలులంకలో ఉంటున్న ప్రేరణ(13).
సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి జీవనం సాగిస్తే శాంతి నెలకొంటుంది. కానీ మారుతున్న కాలక్రమంలో మితిమీరిన ఆశ, క్షణికావేశం, కక్షలు, అసూయ ఇలా ఏదైనా కానీ చట్టాన్ని దిక్కరించడంతో పోలీస్ స్టేషన్లు.
చదరంగం క్రీడ మెదడుకు పదును పెడుతుందని..దీని ద్వారా పనితీరు మెరుగుపరచుకోవచ్చని సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ.ఏడుకొండలు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్ డా.ఏవీ రావు అన్నారు.
జలవనరుల శాఖ పోరంబోకు స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి సాగు చేసేందుకు దున్నకం చేసిన వేరే గ్రామ తెదేపా నాయకుడిపై మరో గ్రామ తెదేపా నాయకుడు అధికారులకు ఫిర్యాదు చేసిన వైనంపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..
రైళ్లలో గుట్టుచప్పుడు కాకుండా రవాణా అవుతున్న గంజాయి చాక్లెట్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు, ఈగల్ టీమ్ బృందాలుగా ఏర్పడి శుక్రవారం రైళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
కంచే చేను మేసిన చందంగా సున్నంపాడు గ్రామంలోని పోస్టాఫీస్ పనితీరు ఉందని నగదు కోల్పోయిన ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన నల్లమోతు కీర్తి 2017 నుంచి పోస్టుమాస్టర్గా ఇక్కడ విధులు నిర్వహిస్తోంది.
నగరంలో ఈ-వ్యర్థాల సేకరణను అధికారులు అటకెక్కించారు. వార్డు సచివాలయ పరిధిలోనూ ఇందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించినా..నేటికీ అందుబాటులోకి రాలేదు.
ఒకప్పుడు శివారు ప్రాంతాలపై గస్తీ అంటే పోలీసులకు తలకు మించిన భారంగా మారేది. ఎంత నిఘా పెట్టినా ఎదో ఒక కాల్వ పక్కనో..తోటల్లోనో..కృష్ణానది లోపలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండేవారు.