గుంటూరు నగరం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. నవ్యాంధ్ర రాజధాని నవనవోన్మేషంగా విరాజిల్లుతూ నవకళలతో.. కార్తికదీప కళికల మిలమిలలతో అదృష్టానంద రూపాన్ని సంతరించుకున్నట్లు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన కోటి దీపోత్సవం కళకళలాడింది.
ఆన్లైన్ ట్రేడింగ్లో లాభాలొస్తాయని మంగళగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో సైబర్ మోసగాళ్లు పెట్టుబడి పెట్టించారు. తొలుత లాభాలు చూపించారు. నమ్మిన ఆయన విడతలవారీగా లక్షలాది రూపాయలను మోసగాళ్లు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు.
శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది కార్తిక మాసం. దీంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణోక్తి. విశేష పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యం అసమానమైనది.
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య(93) మొవ్వ సర్పంచిగా గ్రామ అభివృద్ధికి అడుగులు వేశారు. మొవ్వలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, శ్రీవేణుగోపాలస్వామి ఆలయం జీర్ణోద్ధరణకు కృషి చేశారు.
పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ హయాంలో జరగని అక్రమం, చేయని అరాచకం అంటూ ఏదీ మిగల్లేదు. మట్టి దందా మొదలు చెరువుల లీజులు, విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు కమీషన్లు..భూ కబ్జాలు, కారుచౌకగా భూములు కొట్టేయడం..ఇలా ప్రతి దాంట్లోనూ జోగి హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
నందిగామ మండలం దాములూరు శివారు కూడలి సంగమేశ్వరస్వామి దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తుంటారు. కశ్యప మహాముని తపస్సు చేసి ఇక్కడ సంగమేశ్వరస్వామిని ప్రతిష్ఠించారు. శివాలయం ఎదురుగా వైరా, కట్టలేరు కలుస్తున్నాయి.
పురాతన కొండపల్లి కోట నుంచి మరికొంత దూరం ముందుకు వెళితే ఎత్తుగా ఒక టవర్ కనిపిస్తుంది. ఇదే టీవీ రిలే స్టేషన్ టవర్. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై మరో 180 అడుగుల ఎత్తున దీనిని నిర్మించారు.
విజయవాడ-హైదరాబాద్ ఎన్హెచ్ 65 ఆరు వరుసల విస్తరణకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధమైంది. దీన్ని మరో పది రోజుల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) అధికారులు ప్రాజెక్టు అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ(పీఏటీఎస్సీ) ముందుంచనున్నారు.
మచిలీపట్నంలోని చారిత్రక కట్టడాల్లో బందరుకోటకు ప్రత్యేకత ఉంది. ఇది 1864 ఉప్పెన స్మారక కట్టడంగా చరిత్ర చెబుతుంది. ఆ కాలంలో ఆంథోని ఫర్వాల్, మారియా అనే యూరోపియన్ దంపతులు, వారి పిల్లలు, మనవళ్లతో కలిసి ఇక్కడ నివసించే వారు.
తుపాను బందరుకు చేరువగా వచ్చి వెళ్లిపోయినా జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. నేలవాలిన పొలాలు, దెబ్బతిన్న ఇళ్లు, కూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు జరిగిన నష్టాన్ని తెలియజేస్తున్నాయి.ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఎక్కడికక్కడ నష్టాన్ని అంచనా వేసేందుకు శాఖల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.