ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్(ఐఎస్ఏ) అసెస్మెంట్ పరీక్ష ఫలితాల్లో విజయనగరానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అన్నె వెంకట రమ్య అఖిలభారత స్థాయిలో టాపర్గా నిలిచారు.
పిల్లలు సరదా పడుతున్నారని వయసుతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేస్తున్నారు. రోడ్డు మీదకు వస్తే రయ్యిమని చిత్రవిచిత్ర శబ్దాలన్నీ వినిపిస్తాయి.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో నమోదైన చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆధారాలు లేకుండా చేయడంతో కేసును ఛేదించడం వారికి సవాల్గా మారింది.
సైబర్ మోసాలపై యుద్ధం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్శాఖ వినూత్నంగా ‘సైబర్ సురక్ష’ పేరుతో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బ్యాంకుల్లో అవగాహనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల..ఆరు జిల్లాలకు వైద్య ప్రదాయిని. నిత్యం 5 వేల మంది రోగులు చికిత్స పొందే ఇక్కడ, 1,500 మందికి పైగా ఇన్పేషంట్లే ఉంటారంటే అతిశయోక్తి కాదు.
సాగుభూములను సస్యశామలం చేసే ఎత్తిపోతల పథకాలు నిర్వహణ లేక పడకేశాయి. వైకాపా ఐదేళ్ల పాలనలో కనీస నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో సింహభాగం పథకాలు మూలనపడ్డాయి.
పెద్ద మొత్తంలో సొమ్ము చోరీచేసి అప్పులు తీర్చేసి త్వరగా సెటిలై పోదామని భావించిన ఓ వ్యక్తి.. సోదరుడితో కలిసి పనిచేస్తున్న సొంత సంస్థ సొమ్మునే చోరీ చేశాడు.
ప్రేమగా పలకరిస్తూ..ఇంటికి తీసుకెళ్లి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకొని ఆస్తికూడా రాయాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారని శ్రీనివాసరావుపేటకు చెందిన షేక్ మౌలాబీ ఆరోపించారు.
అద్విక ట్రేడింగ్ కేసులో మింగిన సొమ్మును తిరిగి రాబట్టేందుకు పోలీసులు ఇస్తున్న నోటీసులకు ఏజెంట్లు ముఖం చాటేస్తున్నారు. అయాచితంగా లబ్ధి పొందిన సొమ్మును తిరిగి చెల్లించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు.
రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, దివంగత చెరుకూరి రామోజీరావు స్ఫూర్తితో తెలుగు భాషను కాపాడతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించడం హర్షణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు ఐదో మైలు వద్ద శ్రీ శ్రీనివాస కాటన్ మిల్లులో జరుగుతున్న పత్తి జిన్నింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత పరిశీలించారు.