ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్ (YS Jagan) కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఏపీ లిక్కర్ స్కామ్ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం, సోర్లగోంది గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి చేసిన నీచమైన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న ఈయన.. సోమవారం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున 2021లో ప్రారంభించిన అగ్రి, ఆక్వా ల్యాబ్ల్లో సేవలు నామమాత్రంగా ఉన్నాయి. విత్తనం స్వచ్ఛత, మొలక శాతం, ఎరువుల నాణ్యత పరీక్షలకే పరిమితమయ్యాయి.
శివరామ్ప్రసాద్... రేపల్లె నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడలో బస్సు దిగే హడావుడిలో పర్సు పడిపోయినా చూసుకోలేదు. అందులో డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఏటీఎం, పాన్ కార్డులు, రూ.5 వేలు ఉన్నాయి. దిగాక సరిచూసుకుంటే బస్సు వెళ్లిపోయింది.
ఇటీవల గొల్లపూడి పోసాని నరసింహారావుచౌదరి ఉన్నత పాఠశాల సమీపంలో రోడ్డు దాటుతున్న ఇబ్రహీంపట్నానికి చెందిన గుత్తేదారును కారు ఢీకొంది. సంఘటనా స్థలంలోనే అతను చనిపోయారు.
‘నేను షేర్లలో పెట్టుబడి పెట్టడంలో దిట్ట. ఏ షేర్ ధర ఎప్పుడు పెరుగుతుందో పసిగట్టగలను. షేర్ మార్కెట్లో బడా వ్యక్తులతో నేరుగా మాట్లాడగలిగే పరిచయాలు ఉన్నాయి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్.. ట్రేడింగ్లో నాకున్న అనుభవంతో భారీగా సంపాదిస్తానని’ అద్విక ఎండీ ఆదిత్య పోలీసుల విచారణలో వేడుకున్నాడు.
కష్టపడి పనిచేయడం కాదు..స్మార్ట్గా ఆలోచించి పని చేయండని సీఎం చంద్రబాబు తరచూ చెబుతున్న మాటలు విజయవాడ మురళీనగర్ శ్రీరాంజీ టవర్స్ అపార్ట్మెంట్లో ఇస్త్రీ చేసే బల్లంట్ల రాము తూచా తప్పకుండా పాటిస్తున్నాడు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్/ గ్రీవెన్స్) కార్యక్రమానికి జిల్లా అధికారులు ఠంఛన్గా వేళకు రావాలని, ఆలస్యమైనా, గైర్హాజరయినా సస్పెన్షన్ వేటు తప్పదని కలెక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు.
పల్లెపండగ స్ఫూర్తితో పండ్ల మొక్కల పండగకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ఉభయ జిల్లాల్లో ఒకేరోజు భారీఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం మంగళవారం చేపట్టనున్నారు.