పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ఆత్మకూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ తాళ్లపల్లి రంగశాయి, శ్యామలసాయి దంపతులు రూ.1,11,116 విరాళం అంద జేశారు.
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 18న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐఎల్డీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్, కోశాధికారి చౌడప్ప పిలుపునిచ్చారు.
ఆదోని నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 46 మంది బాధితులకు మంజూరైన రూ.15 లక్షల విలువైన చెక్కులను తెదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బుధవారం పంపిణీ చేశారు.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి మఠంలో బుధవారం ఏకాదశి పురస్కరించుకొని అర్చకులు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ఏకాదశి పూజలు నిర్వహించారు.
గుంతకల్లు-గుంటూరు రైల్వే లైను వెంట ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్సీ గేట్లు తొలగించారు. వాటి స్థానంలో అండర్ పాస్లు నిర్మించారు. గుత్తేదారులు నిబంధనలు పాటించలేదు. వరద నీరు వెళ్లడానికి కాల్వలు సరిగా నిర్మించలేదు.
జిల్లాకు వచ్చిన పెట్టుబడులతో పరిశ్రమల నిర్మాణం వేగవంతం చేసి, త్వరగా ఉత్పత్తి ప్రారంభించేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.
డోన్ బాలుర కళాశాల వసతిగృహంలో ఈనెల 7న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో వసతిగృహ అధికారిణి అక్కడ లేరు. ఆమె గతేడాది వరకు ప్రీమెట్రిక్ వసతిగృహానికి ఇన్ఛార్జిగా పనిచేశారు.
భగత్సింగ్ కాలనీలో కేసీ పంట కాల్వపై కల్వర్టు నిర్మించారు. స్థిరాస్తి వ్యాపారులు దీన్ని పూడ్చి సమాంతరంగా మరో ప్రదేశంలో తవ్వారు. కాల్వ ఆరు మీటర్లకు బదులు మూడు మీటర్లు ఉండేలా నిర్మించడంతో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది.
నంద్యాల జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు వరాలు ప్రకటించారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పలు ప్రతిపాదనలు చేయగా ముఖ్యమంత్రి వాటిని ఆమోదం తెలిపారు.
ఖనిజ గ్రామాల్లో ‘దారి’ణంగా మారాయి. వాహనాలు అధిక బరువుతో ఖనిజాలు తీసుకెళ్తుండటంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. మోకాలి లోతు గుంతలు, రహదారులపై కడ్డీలు తేలి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.
నిమ్మ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ సరైన ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, దొర్నిపాడు మండలాల్లో 960 ఎకరాల్లో నిమ్మ సాగవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు క్వింటా రూ.1200 మద్దతు ధరతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి నిల్వల్లో పెద్దమొత్తం కుళ్లిపోయింది. ప్రభుత్వం చెప్పింది కదా అని రైతుల నుంచి కొని షెడ్లలో పడేశారు.
నంద్యాల రైల్వేస్టేషన్లో ఆధునికీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రయాణికులకు ఆధునిక వసతులు సమకూరనున్నాయి.
జిల్లా వ్యాప్తంగా పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పశువుల దోపిడీ దొంగలను మంగళవారం ఆదోని పోలీసులు అరెస్టు చేశారు. ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత, సీఐలు శ్రీరామ్, రాజశేఖర్రెడ్డి వివరాలు వెల్లడించారు.
శ్రీమఠానికి భక్తుల రాక పెరిగింది..హుండీ లెక్కింపు గతంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగేది. ప్రస్తుతం లెక్కంపు కార్యక్రమానికి మహిళలు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు.