కౌతాళం మండలం ఉరుకుంద గ్రామానికి చెందిన రామాంజినేయులు ఇటీవల ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని కమీషన్ ఏజెంట్ దుకాణానికి 12 క్వింటాళ్ల పత్తిని ఉంచారు.
యూపీపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ పొందే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఆదివారం స్ర్కీనింగ్ టెస్టు నిర్వహించినట్లు డీబీసీడబ్ల్యూవో ప్రసూన తెలిపారు.
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రొస్టేట్ క్యాన్సర్కు ఉత్తమ వైద్యం అందుబాటులో ఉందని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.కే.చిట్టినరసమ్మ, సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
శ్రీశైలంలో ఆది దంపతుల స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చనలు చేసిన తరువాత భక్తులకు దర్శనాలు కల్పించారు.
నేటితరం నటులకు స్ఫూర్తిప్రదాత మహానటి సావిత్రి అని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో, సావిత్రి 90వ జయంతి నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ సా విత్రి అభినయాన్ని మరెవ్వరూ అనుకరించ లేరని, సహజనటిగా తెలుగు, తమిళ చిత్రసీమలో రాణించారని అన్నారు.
ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులకు లాభాలు చేకూరుతున్నాయి. రైతులు, వ్యాపారులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. రూ.కోట్లలో ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాలు కరవయ్యాయి.
కర్నూలు పశ్చిమ ప్రాంతానికి కీలకమైన వేదవతి ప్రాజెక్టుపై అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. దీనిని ప్రాధాన్య ప్రాజెక్టుగా ప్రభుత్వం గుర్తించి పనులు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జులైలో జీవో సైతం జారీ చేసింది. అయినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
రెవెన్యూ అధికారులు తలచుకుంటే భూ యజమానులను మార్చేస్తారు. పట్టా భూములను సైతం మాయం చేస్తారు. పట్టాలు లేకున్నా మామూళ్లకు కక్కుర్తి పడి లేని భూములకు పట్టాలు సృష్టిస్తారు.
రబీ సీజన్లో ప్రధాన పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. పెట్టుబడులు పెరగడం.. గిట్టుబాటు ధర లేకపోవడం.. ఖరీఫ్లో నల్లరేగడి నేలల్లో చాలామంది కంది వేయడంతో శనగ విస్తీర్ణం పడిపోయింది.
ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం తీసుకొచ్చే వాటిల్లో గనుల శాఖ ఒకటి. ఏటా భారీగా నిధులు సమకూరుతాయి. ప్రస్తుతం అక్రమంగా మైనింగ్ అరికట్టడంతో పాటు అన్నిరకాల ఖనిజాల నుంచి సీనరేజీ వసూలు చేసే బాధ్యతను ఇటీవల ప్రైవేటుకు అప్పగించారు
ఎస్సార్బీసీ ప్రధాన కాలువ పనులు ఏళ్లుగా ముందుకు సాగక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తిగా ఆగిపోవడంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు. చివరికి ఆయకట్టు బీడుగా మారుతోంది.
ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎట్టకేలకు దృష్టి పెట్టారు. వీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దస్తావేజులేఖరులు తదితరులకు తాఖీదులు జారీ చేశారు.
సంజామల మండల పరిధిలోని పేరుసోముల గ్రామానికి చెందిన ఎస్.వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రూ.17 కోట్లకు ఐపీ పెట్టి నోటీసులు ఇచ్చారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.