మండలంలో జరుగుతున్న జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన సర్వేను జిల్లా వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ సమక్షంలో కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ సంతారం, డాక్టర్ మనిషా పరిశీలించారు.
తమకు సకాలంలో జీతాలు చెల్లించి పనికి తగిన వేతనం చెల్లించాలని ఆదోని పురపాలక సంఘం ఇన్ఛార్జి కమిషనర్ నాసిర్ హుస్సేన్కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం ప్రజా ఆరోగ్య అదనపు కార్మికులు విన్నవించుకున్నారు.
పంటి నొప్పితో బాధపడుతూ కోడుమూరుకు చెందిన వెంకటేష్ స్థానిక సీహెచ్సీకి వెళ్లారు. అక్కడ సేవలందించే వారు లేకపోవడంతో కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ఎక్స్రే తీసి పన్ను తొలగించినందుకు రూ.1,200 తీసుకున్నారు. మరోటి దెబ్బతిందని.. దానికి రూట్ కెనాల్ చేసేందుకు రూ.3 వేలు ఖర్చవుతుందన్నారు.
కర్నూలు నగర శివారులో గత నెల 16వ తేదీన నిర్వహించిన ప్రధాని సభకు వెచ్చించి నిధుల్లో భారీగా దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. 450 ఎకరాల్లో సభ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. అవసరం లేకపోయినా రోడ్లు వేశారు.
ఉమ్మడి జిల్లాలో గనులు, క్వారీల సీనరేజీ రుసుము ప్రభుత్వ ఖాతాకు చేరడం లేదు. నంద్యాల జిల్లాలో 250, కర్నూలులో 150 వరకు లీజులున్నాయి. వీటి నుంచి పన్ను వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది.
రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో కీలకమైన సుంకేసుల జలాశయం గేట్ల లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం 300- 400 క్యూసెక్కుల మేర వృథా అవుతోంది. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం జలాశయాల నిర్వహణకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 99 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. నంద్యాల జిల్లా పరిధిలో కేవలం రెండు సంఘాలు మాత్రమే 12 మంది కౌలుదారులకు రూ.5.50 లక్షల పంట రుణాలివ్వగా కర్నూలు
భావితరం ఆటలకు దూరం అవుతోంది.. ఆసక్తి ఉన్నోళ్లు పదో తరగతి వరకు ఆడి తర్వాత విశ్రమిస్తున్నారు.. కొందరు మాత్రం కళాశాలకు వెళ్లినా ఆటను వదలడం లేదు. వారే కర్నూలుకు చెందిన క్రీడాకారులు.
సైబరోళ్లు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నకిలీ వెబ్సైట్లు సృష్టిస్తున్నారు. శ్రీశైల మల్లన్న క్షేత్రానికి వేలాది మంది భక్తులొస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు వసతి, దర్శనం టికెట్ల కోసం ఆన్లైన్పైనే ఆధారపడుతుంటారు.
ఉన్నత విద్య, ఉపాధి, పర్యాటక ప్రాంతాల సందర్శనకు విదేశాలకు వెళ్తుంటారు. ఇందుకు పాస్పోర్టు తప్పనిసరి. తపాలా కార్యాలయంలోనూ దీన్ని పొందే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాల్లోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ సౌకర్యం ఉంది.
సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు శుద్ధజలం అందించాలని ‘కూటమి’ ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోస్టు మెట్రిక్ 19, ప్రీ మెట్రిక్ వసతి గృహాలు 54 వరకు ఉన్నాయి. ఆయా వసతి గృహాల్లో 13,117 మంది చదువుకుంటున్నారు.
దేశంలో ముఖ్య నగరాలైన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైలు ఏర్పాటు కోసం సర్వే పనులు జరుగుతున్నాయి. డోన్ పరిధిలోని జాతీయ రహదారి వెంట సుమారు 0.25 కి.మీ. దూరంలోనే ఈ రైల్వేలైను ఏర్పాటు
పోలీసు విభాగంలో ఏదైనా పనిఉంటే ఐపీఎస్, ఎన్ఐఏ అధికారి.. ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనికోసం ఐఏఎస్గా అవతారమెత్తి ప్రజలను మోసగిస్తున్న వ్యక్తిని ఫిల్మ్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ బుధవారం వివరాలు వెల్లడించారు.
చిత్రంలో కనిపిస్తున్నది ఎర్రగుంట కొట్టాల గ్రామం. 278 జనాభా ఉండగా, అందరూ వ్యవసాయ కూలీలే. గ్రామానికి నేటికీ రహదారి కూడా సరిగా లేదు. గ్రామంలో చాలామంది పక్కాగృహాల కోసం దరఖాస్తు చేసుకున్నా, అవి మంజూరు కాలేదు. అలాగే మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలులో క్రీడల అభివృద్ధికి సహకరిం చాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం డిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ్యన్ కలిసి వినతి పత్రం అందించారు.
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం పరిపాలన భవనంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అధికారులు సరస్వతమ్మ, సి.రాంగోపాల్, బసవశేఖర్, మహ్మద్ హక్, ఉద్యోగులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట దిగుబడులు కొన్న రోజునే రైతులకు వ్యాపారులు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వ నిబంధన. అతిక్రమిస్తే వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకుంటారు.
వైసీపీ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సందర్భంలో అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆదోని జిల్లా గురించి ఎందుకు పట్టించుకోలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి విమర్శించారు.
శ్రీశైల మహా క్షేత్ర పరిధిలో పర్యావరణ పరిరక్షణ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడితే వ్యాపారాల లైసెన్స్ రద్దు చేస్తామని ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు.