పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో శ్రీకృష్ణపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో విశ్వశాంతి మహాయాగంలో భాగంగా రెండో రోజు మహాగణపతి, సుదర్శన రుద్రహోమాలు, రమాసతి సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.
పత్తి కోత పనులకు వెళ్తూ.. ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో 12మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం ఉదయం ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు
మండలంలోని ప్యాలకుర్తి సమీపంలో అక్టోబరు 28న జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తబ్రేజ్ చెప్పారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నర్సింగ్ సిబ్బంది విధులకు సంబంధించిన డ్యూటీ రోస్టర్ గందరగోళంగా మారింది. 1,200 పడకలున్న ఆసుపత్రిలో 600 మంది రెగ్యులర్ హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు విధులు నిర్వహిస్తున్నారు.
పారిశ్రామికవాడ(ఇండస్ట్రియల్ ఎస్టేట్)లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో ఎప్పుడు ఏం ముచుకొస్తుందోనని పరిశ్రమల యజమానులు, కార్మికులు భయపడుతున్నారు.
మొంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి హామీ ఇచ్చారు.
ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నవ నరసింహుల నృత్య ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో సంపూర్ణ బంద్ పాటించారు.
అమ్మాయిలు క్రికెట్లో అదరగొడుతున్నారు.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ పోటీల్లో హర్మన్ప్రీత్ బృందం 339 లక్ష్యాన్ని ఛేదించి కంగారులను మట్టి కరిపించింది.
తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన విబో శంకరన్(75), నాగలక్ష్మి(65) ఆదోని రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని నగరూరు సమీపంలో గూడ్స్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది.
మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెట్, ఎస్ఐ, కానిస్టేబుల్, డీఎస్సీ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ కర్నూలు జిల్లా అధికారిణి సబిహా పర్వీన్ తెలిపారు.
అరుదైన, అపురూప వస్తువులను సేకరించడమే అభిరుచిగా కొందరు గుర్తింపు పొందుతుంటారు. అలాంటి వ్యక్తుల్లో చాగలమర్రి పట్టణానికి చెందిన విశ్రాంత అధ్యాపకుడు అన్నా సత్యనారాయణ ఒకరు.
ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా ప్రజల కష్టాల్లో వెన్నంట ఉండే నాయకుడు చంద్రబాబు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా నెల్లూరు జిల్లాలో తుపాను వస్తే ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు.