కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద వంద గజాల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత పదార్థాల విక్రయం నిషేధించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ఈ రైతు పేరు మల్లన్న. పత్తికొండ నియోజకవర్గం లోని క్రిష్ణగిరి గ్రామం. ఈ ఖరీఫ్లో తనకున్న ఐదెకరాల పొలంలో వేరుశనగ పంటను సాగు చేసేందుకు పెట్టుబడి కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగునీటి చెరువుల్లో జరుగుతున్న పనులు నాసిరకంగా మారాయి. పేరుకు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు చెబుతున్నప్పటికీ ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు నాయకుల ఆధ్వర్యంలో సాగుతున్నాయి.
పేరు ‘ఆదర్శం.. వసతి లేదు.. బస్సు ఉండదు.. బడికెళ్లాలంటే భావితరం అవస్థలు పడుతోంది. విద్యాభివృద్ధికి వెనుకబడిన మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అక్కడికెళ్లడానికి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో లక్షల మందికి జన్ధన్ ఖాతాలున్నాయి. వాటిలో చాలావరకు ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయి. దీంతో నగదు బదిలీ పథకాల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రజల చరవాణులకు ఏపీకే ఫైళ్లను పంపి వారి ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్పాటిల్ సూచించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీల్లో పైరవీలకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవోతో ఏమాత్రం సంబంధం లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా బదిలీ చేశారు.
శ్రీశైల క్షేత్రానికి రోజురోజుకు భక్తుల రాక పెరుగుతోంది.. ఏటా కోట్లాది మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలొస్తున్నారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయంతోపాటు ప్రకృతి రమణీయత, సుందరమైన కృష్ణానది వంటివి పర్యాటకాభివృద్ధికి ప్రధాన వనరులు.
అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం వైభవంగా సాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీల్లో పైరవీలకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవోతో ఏమాత్రం సంబంధం లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా బదిలీ చేశారు.
అన్నదాత కష్టాన్ని సైబర్ మోసగాళ్లు దోచేశారు..ఫోన్ హ్యాక్ చేసి రూ.9 లక్షలు తస్కరించడంతో ఆ రైతు కంట కన్నీరు ఆగడం లేదు. హొళగుంద మండలం హెబ్బటం గ్రామానికి చెందిన పైగేరి కురవ రంగస్వామి 15 ఎకరాల్లో మిరప సాగు చేశారు.
ఆదోని పట్టణ సరిహద్దులో ఓ బాలికపై అత్యాచారం చేసిన ఆదోని మండలం ఇస్వీ గ్రామానికి చెందిన ఆటోడ్రైవరు సంగిపోగు రమేశ్ను సోమవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు తాలుకా సీఐ నల్లప్ప తెలిపారు.
ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలోని ఉరుకుంద ఈరన్న స్వామి (లక్ష్మీ నరసింహ స్వామి ) శ్రావణమాసానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు.
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలెక్షన్ మేనేజ్మెంట్ (IIIDEM) ఆధ్వర్యంలో 146-ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్వో)కు శిక్షణ కార్యక్రమం మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైంది.
శ్రీశైలం, తిరుపతి, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి, కాణిపాకం, అహోబిలం, పుట్టపర్తి, కడప దర్గా.. తదితర ప్రదేశాలు మనకు పవిత్రమైన ఆస్తులని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. పోలవరం నుంచి బనకచర్లకు నీరు రావాలని ఆకాంక్షించారు. గోదావరి నీరు.. బనకచర్ల వరకు వస్తే కరవు అనే మాటే ఉండదన్నారు.