[04:30] జనసేన పార్టీ జనసైనికులకు.. వారి కుటుంబాలకు జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అండగా ఉంటారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు.
[04:30] ఆర్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రాయలసీమ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది నియామకాల్లో అక్రమాలు జరిగాయని.. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందారని పలువురు విద్యార్థి సంఘాల నేతలు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేశారు.
[04:30] ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు జిల్లా, మండలస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.
[04:30] తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు పెద్దఎత్తున జనాదరణ లభిస్తోందని, దీనిని చూసి ఓర్వలేక వైకాపా ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
[04:30] నల్లమల అటవీ ప్రాంతంలో ఏటా కార్చిచ్చు తీవ్ర నష్టం మిగిల్చుతోంది. వన సంపదతో పాటు వన్యప్రాణులను దహించి వేస్తోంది. గడ్డి క్షేత్రాలతో పాటు భారీ వృక్షాలు అగ్నికి ఆహుతవుతున్నాయి
[04:30] కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని.. ముఖ ఆధారిత హాజరు విధానాన్ని రద్దు చేయాలని, పలు విభాగాల అధికారులు తనిఖీల పేరుతో వేధిస్తున్నారని.. దీనిని ఆపాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు.
[04:30] నగరాలు, పట్టణాల్లో మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ధరలకు ఇళ్ల పట్టాలు సమకూర్చే పథకం నేతలకు భరోసాగా మారింది. విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేసి వాటినే ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’కు సిఫార్సులు చేస్తున్నారు. లే-అవుట్లు వేశాక మధ్య తరగతి పేరుతో దక్కించుకునేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి
రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి. నిర్మల పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిగా మారారని, ఆయన సీఎంగా ఒక్క రోజు కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి శ్రద్ధ్ద తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు ఇన్చార్జి బీవీ జయనాగేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు.
శ్రీశైల దేవస్థానంలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కైలాస ద్వారం వద్ద దేవస్థానం అధికారులు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు.