ఎన్నికల హామీ ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి అయినా అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
జిల్లాలో అర్హత లేని వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు పొందుతున్నారని వాటిపై విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ రంజిత బాషాకు వినతి పత్రం అందజేశారు.
మహిళలకు ఆగస్టు-15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని ‘కూటమి’ ప్రభుత్వం నిర్ణయించింది. రద్దీ పెరగనున్న నేపథ్యంలో బస్టాండ్లలో వసతులపై ఆర్టీసీ ఆరా తీస్తోంది. మంచినీరు, మరుగుదొడ్లు, బెంచీలు, ఫ్యాన్లు తదితర వసతులు మెరుగుపరిచే పనిలో పడ్డారు.
ఆదివారం మాంసాహారులకు ముక్కలేనిదే ముద్ద దిగదు. ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టానుసారం దందా సాగిస్తున్నారు. నిబంధనలను లెక్క చేయడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలోనే జీవాలను వధించి.. మాంసం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
గత ఐదేళ్లు ‘నేల’ చూపులు చూసిన స్థిరాస్తి ఆదాయం ‘కూటమి’ ప్రభుత్వం చర్యలతో క్రమంగా పెరుగుతోంది. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి జిల్లాకు రూ.601.40 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించారు.
ఖాకీ చొక్కాలోని కరుకుదనంతో పాటు సేవల్లోనూ జిల్లా పోలీసులు కొత్త పంథా ఎంచుకున్నారు. ఎస్పీ విక్రాంత్పాటిల్ చొరవతో రోజువారి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు.
గనుల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఓ కుటుంబంలో పుట్టిన ఆ విద్యార్థిని ఓ వైపు చదువులోనూ మరోవైపు ఆటల్లోనూ ప్రతిభ చూపుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల సహకారంతో రెజ్లింగ్ ఆటలో పతకాలు సొంతం.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తపాలాశాఖకు పూర్వవైభవం తెస్తున్నాయి. తల్లికి వందనం, త్వరలో అమలుకానున్న అన్నదాత సుఖీభవ పథకాల నగదును ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తోంది.
ఎకరం పొలం.. రూ.35 వేల పెట్టుబడి.. 19.2 క్వింటాళ్ల పత్తి దిగుబడి సాధించి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు పెద్ద అంజినయ్య. నాగ్పుర్ పత్తి పరిశోధన స్థానం అధిక సాంద్రత పద్ధతిని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది.
బెంగళూరులో ఆదివారం జరిగిన రహదారి ప్రమాదంలో కృష్ణగిరి మండలం చుంచుఎర్రగుడి గ్రామానికి చెందిన రవితేజ(30), సమీప బంధువైన రవి(31) మృతిచెందినట్లు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
కర్నూలులోని కోట్ల రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ గుర్తు తెలియని వ్యక్తి (30) ఆత్మహత్య చేసుకున్నారు. డెమో రైలు వెళ్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా పట్టాలపైకి రావడంతో రైలు ఢీకొట్టి వెళ్లిపోయింది.
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. కొన్ని కాల్వలకు నీటి విడుదల ప్రారంభమైంది.. హంద్రీనీవా ప్రధాన కాల్వకు ఈనెల 15 నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
నల్లమల అందాలు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. చారిత్రక నిర్మాణాలకు నెలవైన జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. పర్యాటక రంగంలో 15 శాతం వృద్ధి రేటు సాధిస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వీలుందని అధికారులు ప్రగతి పత్రం రూపొందించారు.
తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురు కన్నడ యువకులు మృతదేహాలై తేలారు. ఎస్సై శివాంజల్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలించి ఆదివారం ఉదయం 11:30 గంటలకు మృతదేహాలను వెలికి తీశారు.
మహానంది మండలం నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిపై గాజులపల్లె-ఆంజనేయపురం గ్రామాల మధ్య తెలుగుగంగ ప్రధాన కాలువలోకి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయిల్ ట్యాంకరు ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది.