యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఎన్నో రాయితీలు ఇస్తోంది.. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతోంది..క్షేత్రస్థాయిలో అవగాహన కొరవడంతో అభివృద్ధి నెమ్మదించింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన లక్కసాగరం ఎత్తిపోతల పథకం నిర్వహణ అధ్వానంగా ఉంది.
: ఉమ్మడి జిల్లాలో చలి పెరగడంతో జలుబు, దగ్గు, జ్వరాలు తీవ్రమవుతున్నాయి. వారం రోజుల నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు చేరుతుండటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది.
రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ విద్యా బోధన ప్రశ్నార్థకంగా మారింది. వర్సిటీలో 2019లో ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు. కళాశాల ఏర్పడినప్పటి నుంచి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
హెచ్టీ (కర్మాగారాలు) విద్యుత్తు వినియోగదారుల కోసం ఏపీఎస్పీడీసీఎల్ ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 773 మంది హెచ్టీ వినియోగదారులు ఉన్నారు.
కర్నూలు రేంజి అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులు దూకుడు పెంచారు. ఫిర్యాదు అందగానే అధికారులపై వేట ముమ్మరం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అనిశాకు ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబరు 1064 ఏర్పాటు చేసింది.
గర్భిణులకు ప్రధానమంత్రి మాతృ వందన యోజన అండగా నిలుస్తోంది. అర్హులైనవారు వివరాలు నమోదు చేయించుకుంటే ఆర్థిక భరోసా లభిస్తుంది. ఈ పథకం కింద మొదటి కాన్పులో రూ.6 వేలు, రెండో కాన్పులో ఆడ బిడ్డ అయితే రూ.6 వేలు అందిస్తారు.
హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువ నుంచి ఎక్కువ నీటిని తరలించడంలో భాగంగా చేపట్టిన పూడికతీత పనులు రైతుల పాలిట శాపంగా మారింది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీటిని తరలించేందుకుగాను తొమ్మిది ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేశారు.
పశ్చిమ ప్రాంతాల నుంచి పత్తి సరిహద్దులు దాటుతోంది. అధిక ధర చెల్లిస్తామంటూ మహారాష్ట్రతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు దిగుబడులను కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లోనే తూకాలు వేసి నగదు చెల్లించి లారీల్లో తరలిస్తున్నారు.
మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకంతో చిన్న, సన్నకారు రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడి కావడంతో ఎకరాలో ఏడాదికి నాలుగు పంటల చొప్పున.. రెండెకరాల్లో 8-10 పంటలు సాగు చేయడం ద్వారా నెలనెలా ఆదాయం అందుకుంటున్నారు.
రహదారుల నిర్మాణాన్ని గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం మరమ్మతులు చేయించలేదు. ఫలితంగా ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
భావప్రకటన స్వేచ్ఛ.. సామాజిక మాధ్యమాల్లో శ్రుతి మించుతోంది. పలువురిని లక్ష్యంగా చేసుకుని దురుద్దేశంతో అసభ్యకర సందేశాలు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిని నిలువరించేందుకు జిల్లా పోలీసు శాఖ గట్టి చర్యలు చేపడుతోంది.
నందవరం మండలం ముగతికి చెందిన బాణాల మౌనిక(21) అనే గర్భిణి కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లీబిడ్డ మృతి చెందారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రసవం కోసం శనివారం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉంటున్నాయి. మొదట్లో ధర లేకపోవడంతో చాలామంది తీవ్రంగా నష్టపోయారు. పలువురు పంట పొలాల్లోనే వదిలేశారు. మరోవైపు వర్షాల కారణంగా పంట దెబ్బతింది.
బాల్యం నుంచే విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాయి. పాఠశాల స్థాయి నుంచే పాఠ్య ప్రణాళికలకు అనుబంధంగా వృత్తి విద్యా కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్ పరిధిలో వలసల ప్రభావం అధికంగా ఉంటుంది. విద్యార్థులు సైతం పాఠశాలలకు వెళ్లడం మానేసి తల్లిదండ్రుల వెంట సుగ్గికి వెళుతుంటారు. ఇక్కడ డ్రాపౌట్ల శాతం ఎక్కువే.
ప్రకృతి రమణీయ సుందర దృశ్యాలకు నెలవైన నల్లమల.. ఔషధాల ఖిల్లాగా పేరొందింది. అనేక ఔషధ మొక్కలు ఇక్కడ లభిస్తాయి. వైవిధ్యమైన జంతువులతోపాటు అరుదైన వృక్ష సంపద నల్లమల సొంతం. ప్రాచీనమైన భారతీయ వైద్య శాస్త్రంలో నల్లమలలోని శ్రీశైలం, శ్రీగిరి పేర్లు కనిపిస్తాయి.
సాధించాలన్న పట్టుదల.. గెలవాలన్న కసి ఉంటే వైకల్యం ఏమాత్రం అడ్డురాదని నిరూపించారు భరత్కుమార్. పుట్టుకతో పోలియో సోకడంతో ఒక కాలు పనిచేయదు. అయినప్పటికీ కుంగిపోలేదు. అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగారు.
ఆదోని పట్టణంలో ఈనెల 18,19వ తేదీల్లో చేపట్టే పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్నగౌడ్, సీపీఐ మండల కార్యదర్శి రాజీవ్ కోరారు.
ముస్లింల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఇమామ్, మౌజమ్లకు వేతనాలు విడుల చేశారని జామీయ మసీదు అధ్యక్షుడు సాబీర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉసేన్ పీరా, టీడీపీ ముస్లిం, మైనార్టీ నాయకులు కలీముల్లా, కేఎండీ ఫరూక్, బందనవాజ్, తురేగల్ నజీర్, కౌన్సిలర్లు ఇసాక్, అమాన్, వహీద్లు అన్నారు.
వరుస నష్టాలతో ఇబ్బంది పడుతున్న రైతును కంది పంట ఆదుకుంది. మొంథా తుఫాన్ ప్రభావం ఈ పంటపై ఓర్వకల్లు మండలంలో ప్రభావం చూపకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
పంచాయతీ రాజ్ దీపానికి కూటమి ప్రభుత్వం చమురు పోసి గ్రామజ్యోతి వెలిగించింది. అధికారంలోకి వచ్చాక ఆశాఖను సంస్కరణ బాటను పట్టింది. పంచాయతీ కార్యదర్శుల జీవితాల్లో వెలుగులీననున్నాయి.
రాష్ట్ర అభివృద్దిలో ఆర్యవైశ్యులు భాగం కావాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం నగరంలోని సెయింట్ జోసెప్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్యవైశ్యుల కార్తీక వనభోజనం ఏర్పాటు చేశారు.
ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శివ శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మౌలాలి, అజాం బేగ్ తెలిపారు.
ఆదోని పట్టణానికి చెందిన అంతర్జాతీయ వెటర్న్ స్పోర్ట్స్ క్రీడాకారుడు ఖాజా బందే నవాజును ఆదివారం స్థానిక రాజశ్రీ ఫంక్షన్ హాలులో ఆదోని మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ పెద్దలు ఘనంగా సన్మానించారు.