గత వైకాపా ప్రభుత్వ హయాంలో మ్యాపింగ్ తప్పుల తడకగా చేయడం రేషన్కార్డు దారులకు తంటాలు తెచ్చిపెడుతోంది. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, తొలగింపులు తదితరాలకు సంబంధించి ఈనెల 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
వాహనాలు తనిఖీ చేస్తున్న ఆదోని మోటార్ వెహికల్ సహాయ అధికారి(ఎంవీఐ) కదిరి మహమ్మద్ అవేస్పై కర్ణాటక వాసి దాడి చేసిన ఘటన గురువారం ఆదోని మండలం విరుపాపురం గ్రామ సమీపంలో జరిగింది.
వారంతా పేద..మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారే. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అటు చదువులోనూ, ఇటు ఆటల్లోనూ రాణిస్తూ ప్రతిభ చాటుతున్నారు.
ఆ ఇంటి మరో నెల రోజుల్లో పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. అన్నీ సిద్ధం చేసుకున్నారు. అంతలోనే వధువును మృత్యువు వెంటాడింది. ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. ఆస్పరికి చెందిన బీబి, కాశన్న దంపతులకు నలుగురు కుమార్తెలు.
మండలంలోని చిన్నకొత్తపేట గ్రామానికి చెందిన మహిళ పంటినొప్పని సంజామలలోని గ్రామీణ వైద్యుడి దగ్గరికి వెళ్లింది. అతడి వైద్యం వికటించి మహిళ మృత్యువాత పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పిస్తోంది. నిరుద్యోగులైన యువతకు సెల్ ఫోన్ రిపేరు, సర్వీసింగ్లో ఉచిత శిక్షణ ఇస్తోంది.
మండల తీర్మానం బుక్లో ఆమోదం పొందిన పనులను కొట్టివేసిన ఎంపీపీపై ఎంపీడీవో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా పరిషత సీఈవో గురువారం కోవెలకుంట్ల ఎంపీడీవో కార్యా లయంలో విచారణ చేపట్టారు.
ఒట్టి డైలాగులు చెప్పే నాయకులను ప్రజలు ఎప్పుడు నమ్మరని, తమకు సేవ చేసే నాయకులనే నమ్ముతారని, వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
మా వాహనాన్నే ఆపుతావా అని ఆదోని ఎంఈఐపై కర్ణాటక వాసులు దాడికి పాల్పడ్డారు. వివరాల మేరకు.. ఆస్పరి బైపాస్లోని విరుపాపురం సమీపంలో ఆదోని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కదిరి మహమ్మద్ అవైద్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
: కుట్టు శిక్షణ బీసీ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. స్త్రీశక్తిగా ఎదగాలని, స్వయం ఉపాధితోనే ఇది సాధమన్న ప్రభుత్వ ఆశయం పేదలకు ఆర్థిక స్వావలబంన ఇస్తోంది.
జిల్లాలో సారాను పూర్తిగా నిర్మూలించాలని ఎక్సైజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. గురువారం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఆసిస్టెంట్ కమిషనర్ వి. హనుమంతరావు, డీపీఈవో, ఏఈఎస్లతో ఆయన నవోదయం-2లో సారా నిర్మూలనపై సమీక్షించారు.
న్యాయ విద్యలో ప్రాక్టీస్ ఎంతో ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి హరి హరనాథ శర్మ పేర్కొన్నారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రసూన లా కళాశాలలో కెరీర్ పర్ఫెక్ట్ ఇన్ లా అంశంపై గురువారం సమావేశం నిర్వహించారు.