ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. బిరబిరా దిగువకు చేరుతోంది.. శ్రీశైల జలాశయానికి జూన్ 9న సుంకేశుల జలాశయం, జులై 17న జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం రావడం ప్రారంభమైంది.
నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఒకవైపు సామాన్యులు ఏ వస్తువు కొనాలన్నా ధరాభారంతో కుంగిపోతున్నారు. మరోవైపు కొనుగోలు చేస్తున్న వస్తువుల్లో కూడా తూకాల్లో తేడాతో మోసపోతున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నదీజలాలు కలుషితమవుతున్నాయి. తుంగభద్ర, హంద్రీ, కుందూ నదులు, కేసీ, చామకాల్వల్లో పెద్దఎత్తున వ్యర్థాలు పేరుకుపోయి అధ్వానంగా మారాయి.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. గురుకుల పాఠశాల విద్యార్థులకు సొంతభవనం లేకపోవడంతో డోన్లోని స్టేడియంలో తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు.
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు.
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి.
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మరాజుపల్లె నుంచి సిమెంట్నగ ర్కు వెళ్లేదారిలో దారిదోపిడీ దొంగలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనిక్ విభాగంలో ఓ నిండు గర్భిణి అడ్మిషన్లో నిర్లక్ష్యంపై శుక్రవా రం ధన్వంతరీ హాలులో నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ శుక్రవారం తెలిపారు.
శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం పులివెందులకు చెందిన లింగాల విజయకుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో రూ. కోట్ల విలువైన దేవుడి భూములు అక్రమణకు గురయ్యాయని ఎమ్మెల్యే గౌరుచరిత స్పష్టం చేశారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రోచ్ రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఆదోని పురపాలక సంఘంలో రహదారుల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వినతి పత్రం అందజేశారు.