నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఇండోర్ స్టేడియం నిర్మించాలని ఏఐవైఎఫ్ జిల్లా సహాయకార్యదర్శి రాజివ్, మండలాధ్యక్ష, కార్యదర్శులు చిన్న, రాజు డిమాండ్ చేశారు.
రౌడీయిజం తగ్గించే దిశగా రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు
నగరంలోని శరీన్నగర్లో సంచలనం సృష్టించిన కాశపోగు సంజన్న హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీలు బాబు ప్రసాద్, శ్రీనివాసాచారి, సీఐలు మధుసూదన్గౌడు, శేషయ్యలు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
పట్టణంలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటు చేసిన జనని మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ సీఈఓ వెంకటరమణ గత 20 రోజులుగా సెల్ఫోను స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతు న్నారు.
మండలంలోని పూడిచెర్ల బస్ స్టేజీ సమీపాన రైతు సూర్య రాజన్న పొలంలో ఫారం పాండ్స్ భూమి పూజ కార్యక్రమానికి శనివారం రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫారం పాండ్స్ భూమి పూజ చేసిన సమీపాన బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
కార్పొరేషన్ల రాయితీ రుణాలు అందజేసేం దుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 690 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గత నెలలోనే అధికారులు, బ్యాంకర్లు ఇంట ర్వ్యూలను కూడా పూర్తి చేశారు. అయితే జాబితా విడుదల కాకపోవడంతో దరఖాస్తుదా రులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ప్రజాశక్తి -డోన్ : పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లన్నీ ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలు లను కల్పించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆశా…
ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్ : తక్షణమే ఉపాధి పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేసి పనుల వద్ద సౌకర్యాలు కల్పించాలి పనిముట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక…
ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ (నంద్యాల) : ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం మండల కన్వీనర్ కర్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య…
కోడుమూరుకు చెందిన అబ్దుల్ గని దుబాయిలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు ఇక్కడ ఉపాధి జాబ్కార్డు ఉంది.. కూలీగా పేరు నమోదై ఉండటంతో ఆయన పేరుతో వేతనాలు మంజూరు చేసి పక్కదారి పట్టించారు.
పందికోన జలాశయంలో చేపల పెంపకం పేరుతో ఏటా దోపిడీ సాగుతోంది. ఏటా రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల మేరకు కొల్లగొడుతున్నారు. పంచాయతీ, మత్స్య శాఖ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహిస్తారు. ఎక్కువ ధరకు పాట పాడినవారికి ఏడాది పాటు చేపలు పట్టుకుని, అమ్ముకునేందుకు అనుమతిస్తారు.
తుంగభద్ర దిగువ కాల్వ పశ్చిమ ప్రాంత వాసుల జీవనాడి.. కాల్వ నిర్వహణకు ఐదేళ్ల వైకాపా హయాంలో పైసా ఇవ్వలేదు.. ప్రధాన కాల్వ చెదిరిపోయింది.. షెటర్లు శిథిలావస్థకు చేరాయి.. సాగునీరు చేనుకు చేరక ఆయకట్టు రైతులు భారీగా నష్టపోయారు.
భూముల రీసర్వే పేరుతో గత వైకాపా ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. భూ విస్తీర్ణాల్లో తేడాలు రావడంతో కలత చెందారు. సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
తుంగభద్ర బోర్డు పరిధిలో అవినీతి ప్రవాహం ‘కట్ట’లు తెంచుకొంది. కాల్వ పూడికతీత, లైనింగ్ మరమ్మతులు, రంధ్రాల పూడ్చివేత, ముళ్లపొదల తొలగింపు, స్లూయిస్లు, షెట్టర్లకు మరమ్మతులు చేసే పనులు గుత్తేదారులకు అప్పగించారు.
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ ఆలయంలో సంవత్సరానికి నాలుగు నెలలు మాత్రమే పూజలు జరిగే పరిస్థితి ఉంటోంది. మిగతారోజుల్లో ఆలయమంతా నీటితో నిండిపోయి ఉండటంతో స్వామి దర్శనం ఎప్పుడు చేద్దామా..! అని భక్తులు ఎదురుచూస్తుంటారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చేరికలకు దరఖాస్తులను అధికారులు ఆహ్వానిస్తున్నారు. అనాథలు, తల్లిదండ్రులు వలసపోయిన వారు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలికలకు ఉన్నత చదువు అందించేందుకు కస్తూర్బాలు నిరంతరం కృషి చేస్తున్నాయి.