రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ప్రభుత్వం అన్నదాతా.. సుఖీభవ పథకం ప్రవేశపెట్టిందని మంత్రాలయ నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు.
అన్నదాతల ఆర్థికాభివృద్ధికి బాటలేయాల్సిన ప్రాథమిక సహకార సంఘాలు గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు వేదికగా మారాయి. అప్పటి అధికార పార్టీ నాయకులు రైతుల ముసుగులో సొసైటీల సొమ్ము దోచుకున్నారు.
కర్నూలు పశ్చిమ ప్రాంతానికి కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి ప్రధాన కాలువ పనులు ఎప్పుడు మొదలవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం ఒకచోటు నుంచి మరో ప్రదేశానికి వెళ్లాలంటే వాహనం తప్పనిసరి. లేకుంటే సకాలంలో పనులు పూర్తికాని పరిస్థితి. వాహనాలు నడపాలంటే ఇంధనం అవసరం. కి.మీ. పెరిగేకొద్దీ ఖర్చు ఎక్కువవుతుంది.
నేను బతికే ఉన్నా.. చనిపోయినట్లు చూపించి తన తాతల నాటి రూ.కోట్ల విలువ చేసే భవనాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, తమకు న్యాయం చేయాలని ఆదోని పట్టణానికి చెందిన జి.ఆర్.విఠల్రావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఉపాధిహామీ పథకంలో పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బోగస్ మస్టర్ల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముఖ ఆధారిత హాజరు నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి (40వ నంబరు) నిత్యం రక్తసిక్తమవుతోంది. ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రహదారి నిర్వహణ అధ్వానంగా ఉండటం.. అక్కడక్కడా లోపాలున్నా వాటిని సరిదిద్దడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈనెల 24 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టేందుకు వ్యవసాయశాఖ అధికారులు సిద్ధమయ్యారు.
విద్యార్థులు పాఠశాల దశ నుంచే చదువుతో పాటు సమాజ సమస్యలపై పోరాడేలా చైతన్యపరిచేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాజ్యాంగ సంబంధిత అంశాలపై వివిధ దశల్లో ప్రతిభా పాటవ పరీక్షలు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది.
శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్సైట్ కలకలం రేపుతోంది. ముందస్తుగా వసతి గదులు బుక్ చేసుకుని ఆలయానికి వెళ్లిన భక్తులు.. తాము మోసపోయామని తెలియడంతో అసలు విషయం బయటపడింది.
ఆగి ఉన్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడగా.. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె మెట్ట వద్ద జాతీయ రహహదారిపై ఆదివారం తెల్లవారుఝామున జరిగింది.
శ్రీశైలానికి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖ ద్వారం నుంచి క్షేత్ర ప్రవేశం చేసే వరకు సుమారు గంటన్నర సమయం పట్టేలా ట్రాఫిక్ నిలిచిపోయింది.