కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు మొదలై 40 రోజులైనా కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లు నడపకుండా నిర్లక్ష్యం చేసిన మంత్రులు.. బీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్త�
తమ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కూడా ఉంచరా? సమాధులను కూల్చేస్తే పూర్వీకుల జ్ఞాపకాలు ఎలా? అంటూ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. గ్రామ శివారులోని సర్వేనంబర్ 1072లో గతంలో శ్మశ
కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందనే విమర్శలొస్తు న్నాయి. కుంగుబాటుకు గురైన పిల్లర్లు కొట్టుకుపోవాలని చూస్తున్న ప్రభుత్వం కల నెరవేరడం లేదని, దీంతో మరో ప్లాన్ రెడీ చేసిందనే ఆరోపణల�
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి విశాల సహకార సొసైటీకి మంగళవారం వచ్చిన రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం పొద్దంతా ఎదురుచూశారు. 2 ఎకరాలకు ఒకే బస్తా ఇస్తామని చెప్పి,
దశాబ్దాలుగా సాగుచేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్న భూమిని, ఇప్పుడు ప్రభుత్వం గుంజుకోకుండా రక్షించుకునేందుకు రైతులు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. ఆదమరిచి కునుకు వేసినా.. అధికారులు ఎక్కడ
ఆదివాసీ కార్డును అడ్డంపెట్టుకొని మంత్రి సీతక్క ఏది మాట్లాడినా చెల్లుతుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ములుగు జిల్లాలో మీ అరాచకాలను ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు? సమాధానం చెప్పకుండా �
అవసరాల కోసం రూ.3లక్షలు తీసుకొని, తిరిగి అడిగిన ఓ దళిత కుటుంబంపై కాంగ్రెస్ నేత దౌర్జన్యానికి దిగిన వ్యవహారం రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటుచేసుకున్నది. బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై మాట�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా ఇప్పటివరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం హనుమక�
రాజ్యాంగాన్ని, చరిత్రను మార్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. పీసీసీ సంవిధాన్ బచావో కమిటీ ఛైర్మన్ డా.వినయ్కుమార్ అధ్యక్షతన మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రాజ్యాంగ పరిరక్షణపై సన్నాహక సమావేశం జరిగింది.
అది ఆదిలాబాద్లోని ఐసెట్ ఆన్లైన్ పరీక్ష కేంద్రం. ఓ పెద్దాయన(62) లోనికి వచ్చారు. అభ్యర్థులంతా పరీక్ష నిర్వాహకుడేమోనని అప్రమత్తమయ్యారు. ఆయనేమో చేతిలో హాల్టికెట్తో తన సీటును వెతుక్కుని కంప్యూటర్ ముందు కూర్చున్నారు. చక్కగా పరీక్ష రాశారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొంది. మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణలోని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
: గత భారాస ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులు కష్టాల పాలయ్యారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద మంత్రి జూపల్లి.. ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) మోటార్లు స్విచ్ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఎగువ నుంచి 1,18,850 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 85 గేట్ల నుంచి దిగువకు వదులుతున్నారు.
తెలుగువాళ్లు ఎక్కడున్నా ఒక్కటిగా ఉందామని, తెలంగాణలో స్థిరపడ్డ ఏపీ ప్రజలు రానున్న ఎన్నికల్లో భాజపాకు అండగా నిలిచి అధికారం చేపట్టే అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు కోరారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు.. మాజీ మంత్రి కేటీఆర్ను డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చలు జరిపే స్థాయి కేటీఆర్ది కాదని విమర్శించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేయించే బాధ్యత జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలదేనని భారాస ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంగళవారం 2023-24కు సంబంధించిన తన నివేదికను జాతీయ ఎస్సీ కమిషన్ అందజేసింది. కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా, సభ్యులు వడ్డేపల్లి రామచందర్, లవ్కుశ్కుమార్, కార్యదర్శి గుడే శ్రీనివాస్ ఆమెను కలిసి నివేదిక ప్రతిని అందించారు.
సిగాచీ పరిశ్రమ అధికార ప్రతినిధులపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళవారం ఘటనా స్థలాన్ని ఈ బృందం పరిశీలించింది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి సహకరించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కోరారు.
కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆ దంపతులు తమ కుమారులనైనా ఉన్నత చదువులు చదివించాలని ఆశపడ్డారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలు చిన్ననాటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ ప్రముఖ కళాశాలల్లో సీట్లు సాధించారు.
బోధనాసుపత్రులను గాడిన పెట్టే క్రమంలో ప్రభుత్వం మరో కీలక ముందడుగు పడింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు ఏడీఎంఈ (అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)లుగా పదోన్నతులు కల్పించింది.
ఈ చిత్రంలో పెద్ద ట్యాంకర్ నుంచి చిన్న ట్యాంకర్కు పైపు సహాయంతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో వింతేముందని అనుకుంటున్నారా! అక్కడే ఉంది అసలు కిటుకు. నీటిని అమ్ముకోవడంలో వ్యాపారులు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారనే దానికి ఈ చిత్రమే నిదర్శనం.
బీసీల రిజర్వేషన్ల అమలు కోసం భూకంపం సృష్టిస్తామని భారాస నేతలు హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములకు పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే మొత్తాన్ని.. కంటోన్మెంట్ అభివృద్ధికే కేటాయించాలని తాను చేసిన విజ్ఞప్తులకు రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తిరువనంతపురం-సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య గుంటూరు మీదుగా నడుస్తున్న శబరి ఎక్స్ప్రెస్ (17229/17230)ను సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మారుస్తూ రైల్వే బోర్డు సంచాలకుడు (కోచింగ్) సంజయ్ ఆర్.నీలం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో జవహర్ నవోదయ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ భారాస నేత బి.వినోద్కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
రాష్ట్రంలో కొన్ని వైద్య కళాశాలలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. అధిక ఫీజుల వసూలు మొదలు రోగుల సంఖ్య ఎక్కువ చేసి చూపడం వరకు అనేక నిబంధనలు అతిక్రమిస్తున్నాయి. రాష్ట్రంలో 26 ప్రైవేటు యూజీ వైద్య కళాశాలలు ఉన్నాయి.
తెలంగాణలో మాదకద్రవ్యాల నియంత్రణలో దర్యాప్తు సంస్థల పనితీరు బాగుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్మోహన్ అభినందించారు. రాష్ట్రంలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు తీరుతెన్నులపై హైదరాబాద్లో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ప్రయాణికుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఎనిమిది రైళ్లకు అదనంగా ఒక్కో థర్డ్ ఏసీ బోగీని జత చేస్తున్నట్లు ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. జులై 13, 14 తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
పరిశ్రమల్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తే వాటిలోని లోపాలు తెలుస్తాయి. ప్రమాదాలను నివారించడానికి ఆస్కారముంటుంది. వాయు, నీటి కాలుష్యం, రసాయనాల లీకేజీలతో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా నియంత్రించవచ్చు.
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ నెల 15లోగా జిల్లా కాంగ్రెస్లకు కొత్త కమిటీలను ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగవంతంగా అమలు చేయడానికి జిల్లాల హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు(పీడీ)గా గ్రూప్-1 అధికారులను ప్రభుత్వం నియమిస్తోంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల, మహబూబాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు కొత్త పీడీలను నియమించింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు 2025-26 విద్యాసంవత్సరానికిగాను అనుమతిని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) పునరుద్ధరించింది. గతేడాది పలు కళాశాలల్లో లోపాలను గుర్తించిన ఎన్ఎంసీ అప్పట్లో భారీ జరిమానాలు విధించింది.
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ స్వాధీనం చేసుకున్న 57.89 కిలోల బంగారాన్ని జప్తు నుంచి విడిపించేలా ఆదేశాలు జారీ చేయాలని నిందితుడైన గాలి జనార్దనరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన దిల్లీ పర్యటనలో రెండో రోజు మంగళవారం ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.
‘‘లెక్కలు తేల్చుకుందాం.. అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరించాల్సిన పెద్ద మనిషిని శాసనసభకు రాకుండా చేస్తూ వేరొకరు ప్రెస్క్లబ్కు వెళ్లి అవాకులు, చవాకులు పేలుతున్నారు’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరోక్షంగా కేటీఆర్పై మండిపడ్డారు.
ఉత్తరాదిలోని 10 జిల్లాల మారుమూల గ్రామాల్లో తిష్ఠ వేసిన ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి. ఆన్లైన్ మోసాల్లో 80 శాతం వీరి ప్రమేయంతోనే జరుగుతున్నట్లు తాజాగా వెల్లడైంది.
దేవుడి మాన్యంలో అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు వెళ్లిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి(ఈవో) రమాదేవిపై మంగళవారం దాడి జరిగింది. మహిళా అధికారిని నెట్టివేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఎక్కువ మంది పిల్లలు చదువు, ఆటల్లో మునిగిపోయి తగినంత నీరు తాగడంలేదు. మూడేళ్లు, ఆపై వయసు పిల్లలు అధిక ఉప్పు, చక్కెరతో కూడిన ఆహార పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఇలాంటి ఆహారంలో అధిక శాతంలో సోడియం, కాల్షియం ఆక్సలేట్లు, యూరిక్ యాసిడ్లు ఉంటాయి.
తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలు సాధించడంలో రాష్ట్ర విద్యార్థులు వెనకబడుతూనే ఉన్నారు. మూడు, ఆరు, తొమ్మిదో తరగతుల్లో మొత్తం తొమ్మిది సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా... ఎనిమిదింటిలో రాష్ట్ర విద్యార్థులు జాతీయ సగటు కంటే తక్కువ సాధించడం గమనార్హం.
రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకొంటున్న నిర్ణయాలు అమలు జరుగుతున్నాయా లేదా, అమలు చేయకపోతే కారణమేంటి, కారకులెవరన్న అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మంత్రివర్గ భేటీలు జరిగాయి.
మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిల జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం దిల్లీలోని తన అధికార నివాసంలో ఇద్దరు నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
జోరు వానలో కారు ప్రయాణం ఆహ్లాదకరమే. అదే సమయంలో ప్రతిక్షణం ఒక పరీక్షే! ఏమరుపాటుగా ఉన్న ఒక్క క్షణం చాలు.. ప్రమాదం ముంచుకు రావడానికి. అందుకే డ్రైవింగ్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఢిల్లీలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 10న జరిగే రాష్ట్ర క్యాబినెట్లో ద�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పాలనా కాలంలో ఆడబిడ్డల సంక్షేమానికి ఎంతగానో పాటుపడ్డారని, వారికోసం దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచా
రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అంద�
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిడాల నరసింహులు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జేఏసీ �
కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురసారం-2024కి ఎంపికైన చేనేత కార్మికులకు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులకు జాతీయ
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమాజిగౌడ ప్రెస్క్లబ్ను కల్లు కాంపౌండ్తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జగ్గారెడ్డి మరో
బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను అడ్డుకునేందుకే సీఎం ఢిల్లీకి వెళ్తున్నారని ప్రభుత్వం లీకులు ఇచ్చింది.. దీనికి తగ్గట్టే ఢిల్లీలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నా
గోదావరి జలాలను బనకచర్లకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అదే తొండి వాదన వినిపిస్తున్నారు. ఒకవైపు, తెలంగాణ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే.. దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్ట�
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,000 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన బహిరంగ ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం సేకరిం
తెలంగాణలో రైతులకు సరిపడా యూరియా లేదని కాంగ్రెస్ ఎంపీ బలరాంనాయక్ అంగీకరించారు. సోమ్లాతండాలో మంత్రులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర పైసా కూడా లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మహబూబాబాద్ మండలం సోమ్లాతండాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఉప ముఖ�
ప్రజలకు ఏం చేశామనే అంశాలపై శాసనసభకు వస్తే చర్చిద్దామంటూ మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరితే భారత రాష్ట్ర సమితి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.
జూన్లో నిర్వహించిన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ (CMA)ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICMAI) మంగళవారం విడుదల చేసింది.
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ లాంగ్వేజెస్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, దివ్యాంగులకు పింఛను ఇవ్వకుండా మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు.
భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆడుతున్న డ్రామాలు కేటీఆర్ ఆపేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.
MLC Kavitha స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్�
సైబర్ మోసగాళ్ల ఉచ్చులో ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ చిక్కుకున్నారు. నగరానికి చెందిన 49 ఏళ్ల ఆర్మీ మాజీ అధికారికి సైబర్ కేటుగాళ్లు ఈ నెల 6న వాట్సప్ ద్వారా ఏపీకే ఫైల్ పంపించారు.
జనగామ జిల్లా లింగలఘనపురం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను హత్యచేశారు (Murder). లింగాలఘనపురం మండలంలోని ఏనబావి గ్రామ శివారు పిట్టలోనిగూడెంకు చెందిన కాల్య కనకయ్య (30)కు ఇద్దరు భార్యలు �
కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం -2024 కి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body Elections) రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ఉత్కంఠ తెరపడింది. ఆశావాహులు పోటీ�
: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను సర్కారు భారీగా పెంచింది. ఒకేసారి విద్యార్థులపై రూ.25వేల భారం మోపింది. రూ.14,900 ఉన్న ఫీజు చాలా కాలేజీల్లో రూ.39 వేలకు చేరింది.
రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు.
Heavy Rains తెలంగాణలో రాబోయే మూడురోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల మూసివేత పరంపర కొనసాగుతున్నది. తాజాగా ఈ విద్యాసంవత్సరంలో మరో ఐదు కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)గుర్తింపునకు దరఖాస్తు చేసుకోలేదు.
Harish Rao జీతం రాకపోవడంతోపాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
Dasyam Vinay Bhaskar దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తుందని, నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి విపరీతమైన పని భారం, ఒత్తిడి పెంచి కార్మికుల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మార్చిందని బీఆర్�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన 18 నెలలుగా రైతులను మోసం చేశారని ఆరోపించారు.
KTR ‘సీఎం రేవంత్రెడ్డి..రైతు సమస్యలపై చర్చిద్దాం రమ్మంటే తొక ముడిచి తప్పించుకొని ఢిల్లీకి పారిపోయినవెందుకు? అయినా సవాల్ విసరడం.. బురదజల్లడం.. పారిపోవడం నీకు మొదటి నుంచి అలవాటే, నువ్వు రాకుంటే నీ మంత్రినై�
పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వారం రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బీరంగూడ పనేషియా దవాఖానలో చికిత్స పొందుతున్న అఖిలేష్ అనే కార్మికుడు మ
Srisailam Dam శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశ�
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంకు 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయమైన పరిహారం దక్కాలని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వార్తలు రాసిందని తాము కూడా రైతుల పక్షాన నిలదీయడంతో ఎట్టకేలకు ప్లాట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ�
కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావుతోపాటు మరో ఇద్దరు ఐఏఎస్లను ఈ నెల 24న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల�
జీతం రాకపోవడంతోపాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి చెందాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కమ్మగాని శ్రీనివాస్ (48) దేవరుప్పుల మండలంలో ఉపాధి హామీ ఏపీవోగా పనిచేస�
సినిమా నటీనటుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ పచ్చ మీడియా చేసిన పిచ్చి ప్రచారం అంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. సినీతారల ఫోన్లు ట్యాప్ అయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసుశాఖ స్పష్టంచేసింది. ఎస్ఐబీ మాజీ అధ�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు ఎదురవుతున్నది. అర్హులను కాదని నేతల అనుచరులకు ఇండ్లను మంజూరు చేయడంతో.. అవి కేంద్ర ప్రభుత్వ పీఎంఏవై యాప్లో తిరస్కారానికి గురవుతున్నాయి.
ఉపరిత ఆవర్తన ద్రోణి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా బంగాళాఖాతం వరకు సముద్రమట్టం నుంచి 3.1-5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులపాటు భారీ వర్షాలు కు�
వానకాలం సీజన్ మొదలైనా రాష్ట్రంలో చేపల పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంపిణీ ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ సాధన మాదిగ అమరవీరులకు అంకితమిస్తూ.. మాదిగ, పీడిత ప్రజల హక్కుల కోసం నూతన ఉద్యమాల దిశగా పయనించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు
‘కాంగ్రెస్ ప్రజాపాలనలో మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే జైలుకు.. ఇదెక్కడి సామాజిక న్యాయం’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గు
కన్నెపల్లి పంప్హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాలని తాము అడిగితే, కుంగిన బరాజ్కు ఎత్తిపోయాల్నా? అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నరని బీఆర్ఎస్ ఎమ్మెల
ములుగులో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ జులుం ప్రదర్శించింది. ఈ నెల 3 నుంచే జిల్లా వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నది.
కట్టుకథలు, పచ్చి అబద్ధాలతోనే కాంగ్రెస్ పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు.