నల్లబంగారంతో కళకళలాడిన సింగరేణి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. నెల నెలా 40,716 మంది ఉద్యోగులకు జీతాలివ్వాలంటే బ్యాంకుల నుంచి ‘ఓవర్డ్రాఫ్ట్’(ఓడీ)పై తాత్కాలిక అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, ఈ జీవో బీసీలకు రాజకీయ సమాధి కట్టిందని బీసీ ఐకాస ఛైర్మన్లు ఎంపీ ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్గౌడ్లు మండిపడ్డారు.
నెల రోజుల్లో టిమ్స్ సనత్నగర్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా సీఎం ప్రకటించి నెల దాటినా ఇప్పటికీ అతీగతీ లేదని, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాల పట్ల ప్రచార ఆర్భాటాలు తప్ప పురోగతి కనిపించడం లేదని భారాస మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
స్ట్రాబెర్రీ.. డ్రాగన్ఫ్రూట్.. అవకాడో.. రాంబూటాన్.. బ్లూబెర్రీ.. లాంగన్.. మకాడమియా నట్.. కివీ.. మ్యాంగోస్టీన్.. ఉత్తమ పోషక విలువలు, మార్కెటింగ్ సామర్థ్యం గల ఇలాంటి విదేశీ రకాల ఫలాలను మన దేశంలో సాగు చేయడం రైతులకు లాభదాయకమని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వెల్లడించింది.
ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొంది.. 81 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో రోగులకు నిత్యం ఉచితంగా పాలు అందిస్తూ పెద్దమనసు చాటుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన వసంతశర్మ.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఆవరణల్లో విద్యార్థుల ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్లు పెంచుతుండగా.. కరీంనగర్ జిల్లాలో వీటికి విటమిన్ గార్డెన్లని పేరుపెట్టి సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగుచేస్తున్నారు.
పీడీలను, పీఈటీలను కేవలం వ్యాయామ సంబంధిత డ్యూటీలకే పరిమితం చేయాలని, ఇతర బాధ్యతలను అప్పగించవద్దని తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీ పీడీ, పీఈటీల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
మానవ అక్రమ రవాణా నివారణ కోసం మై ఛాయిస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్)తో కలిసి తెలంగాణ మహిళా భద్రత విభాగం చేపట్టిన ‘సేఫ్ విలేజ్ (సురక్షిత గ్రామం)’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో శిక్షకులకు ఇచ్చే శిక్షణను డీజీపీ శివధర్రెడ్డి, ఆ విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా ఆదివారం ప్రారంభించారు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ‘ధర్మయుద్ధం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి బాసర వరకు టెంపుల్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.380 కోట్లు మంజూరు చేసినట్లు పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు.
హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని అమల్లోకి తెచ్చింది.
గ్రామపంచాయతీల రిజర్వేషన్లపై సోమవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.
సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి ఓ ప్రయోగానికి వేదికైంది. అక్కడ ప్రతి ఇంటిపై పూర్తి ఉచితంగా సౌరవిద్యుత్ కోసం ఏర్పాట్లు చేశారు.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో తెలంగాణ విద్యాకమిషన్, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది.
బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న జీఎఫ్-274 విమానంలో బాంబు ఉన్నట్టు కస్టమర్ ఐడీ పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారుల్లో కలకలంరేపింది.
కాలుష్య నివారణే లక్ష్యంగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలని, వాటి పాలసీలో మార్పు తేవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చన్నైలో ఆదివారం నిర్వహించ�
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కదం తొక్కారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా వక్తలు మాట�
‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక �
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీపై రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. నాలుగు నెలలుగా లబ్ధిదారులు ఎదురుచూడటమే గాక, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని గొంతెత్తి నినదించారు.
జిల్లా జనరల్ దవాఖానలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాలని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అప్పు చేసి నిర్మాణం మొదలు పెట్టిన ఓ లబ్ధిదారురాలు ఆనందం అంతలోనే ఆవిరైంది. బేస్మెంట్ పూర్తయి ఖాతాలో పడిన బిల్లు వెనక్కి పోవడంతో లబోదిబోమంటున్నది. ఓ అధికార పార్టీ నేత కక్షసాధిం�
జగిత్యాల నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి పార్టీ ఫిరాయింపుదారులకు మద్దతిస్తున్నారని మాజీ మంత్రి జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాజెంగి నందయ్య అభినందన స�
గ్రామపాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆవిర్భావసభ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి కమిటీని ప్రకటించారు.
మలక్కా జలసంధి దానికి ఆనుకుని ఉన్న అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో సోమవారం పశ్చిమ, ఉత్తర దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో దీనికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్
ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల దేశంలో ఏటా లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించమే ఇందుకు ప్రధాన కారణమని యశోద హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ఆవేద�
ప్రభుత్వ పెద్దల పట్టింపులేనితనం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి పౌరసరఫరాలశాఖకు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నది. అప్పులతో దినదినగండంగా పాలనను నెట్టుకొస్తున్నామని బీద అరుపులు అరుస్తున్న పాలకులకు
వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు సతీమణి, ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధాదేవి రామరాజు (Tenneti Sudhadevi) (73) ఆదివారం సాయంత్రం నల్లకుంటలోని స్వగృహంలో కన్నుమూశారు.
Telangana పత్తి పంటను కొనాలని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడంతో భువనగిరి జిల్లాకు చెందిన రైతు జహంగీర్ కన్నీటి పర్యంతమయ్యాడు. నేనేమైనా దొంగనా? పాకిస్థాన్ నుంచి వచ్చానా? నా పంట ఎందుకు కొనడం లేదని �
Harish Rao పత్తి, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాజీ మంత్రి హరీశ్రావు ఎండగట్టారు. మీ దుర్మార్గ పాలనలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశా
Harish Rao నెల రోజుల్లో సనత్ నగర్ టిమ్స్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి నేటితో నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. ఈరోజు ప్రారంభిస్తున్నట్లా లేద�
Dasoju Sravan బీసీలకు ఉన్న రిజర్వేషన్లు కూడా రాకుండా సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అసాధ్యమని అన
Talasani Srinivas Yadav బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల ఒత్తిడి తర్వాత డెడికేటెడ్ కమిషన్�
KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏబీపీ నెట్వర్క్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో ప్రసంగించనున్నారు. ఈ సదస్సు నవంబర్ 25, 2025న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనుంది.
Ration Cards వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం చూపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులకు బదులుగా తమ ఫొటోలతో ప్రైవేటు రేషన్ కార్డులు ముద్రించి పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండ
Danam Nagender అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు స్పీకర్కు లేఖ రాశారు. వివరణకు ఇచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని ఆయన లేఖలో కోరారు.
DCC నల్గొండ డీసీసీ అధ్యక్ష పీఠం పున్న కైలాస్ నేతను వరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఏఐసీసీ శనివారం ఏఐసీసీ శనివారం రాత్రి డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవిపై ఎన్నో �
బెంగళూరులో శనివారం నిర్వహించిన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమవారం తన పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ రోపణలు ఎదురొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో 8 మంది విచారణ ముగిసింది.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేటెడ్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతున్నది.
అప్పులపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతినెల అప్పుల వడ్డీ రూ పంలో రూ.2,300 కోట్లు మాత్రమే కడు తూ రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్న
కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన అబ్బెంగుల ర�
బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి ఆరు రోజులకే అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్లో డీల్ కుదుర్చుకొని కరీంనగర్లో సేల్ చేస్తుండగా, అధికారులు పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే నోట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట రావడం, అన్నదాతల మనసుల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచారంటూ ఆయనే స్వయంగా గుర్తుచేయడం వంటి మాటలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపిన ఘటన భద్రా
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్'ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడ
ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు వరుసగా మూడోరోజు శనివారం కూడా ప్రశ్నించారు. సైబర్క్రైమ్ కార్యాలయంలో జరుగుతున్న ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్�
సరైన వైద్యం అందక ఓ బాలుడి ప్రాణం పోయింది. 16 గంటల పాటు మూడు పెద్ద దవాఖానలు తిరిగినా ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. సీఎం సొంత జిల్లాలోనే జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల దుస్థితికి అద్దం పడు�
రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చేస్తున్నది. సగటున రోజుకు రూ.252.10 కోట్లు అప్పులు తెస్తున్నది. అలా ఏడాదిలో సమీకరించాల్సిన రుణాలను కేవలం 7 నెలల్లోనే తీసుకున్నది.
రాష్ట్ర దేవాదాయ శాఖలో అధికారుల బదిలీలపై రచ్చ జరుగుతున్నది. ఏడీసీలు, డీసీల బదిలీలు ఇంకా మొదలవకముందే ఈ ప్రక్రియలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీచేసిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయన్న ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు.. ఆవేదన కనిపించడం లేదా రేవంత్' అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక కలత చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి మాట్లాడిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ
సినిమాల పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్, చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్కారు బడులపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు నత్తను తలపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా పట్టాలెక్కలేదు. ఈ రెండేండ్లలో ఒక్కటంటే ఒక్క ముందడుగు పడలేదు.
రాష్ట్రంలో 2024 అక్టోబర్ నెలలో స్పోర్ట్స్ కోటా టీచర్స్ రిక్రూట్మెంట్లో అనేక అక్రమాలు జరిగాయి. మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపకుండానే ఉద్యోగాలను భర్తీచేశారు.
విలువైన పారిశ్రామిక వాడల భూములను తనవారికి అప్పనంగా కట్టబెట్టాలనే ముఖ్యనేత ప్రతిపాదన మంత్రివర్గంలో మంటలు రేపిందా? ఈ విషయంలో మంత్రులు రెండుగా చీలిపోయారా?
వైద్యారోగ్య శాఖలోని డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ విభాగాల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను �
గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ నియామకాలపై సందిగ్ధం నెలకొన్నది. పరీక్ష నిర్వహించి ఈ నెలాఖరుతో ఏడాది కావస్తున్నా వెయిటేజ్ మార్కుల విషయం ఎటూతేలకపోవడం ఆశావహులకు నిరాశ కలిగిస్తున్నది.
‘కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఫ్యామిలీ పాలసీ’ అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమం
బెస్ట్ అవలైబుల్ స్కూల్స్ స్కీమ్ బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెల రోజులు గడచినా రూపాయి విడుదల చేయని దుస్థితి. బెస్ట్ అవలైబుల్ స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా 230 ప్రైవేట్ పాఠశాలల్లో
సింగూరు ప్రాజెక్టు ఆనకట్టకు మరమ్మతుల నేపథ్యంలో జలాశయంలోని నీటిని ఒకేసారి ఖాళీ చేయబోమని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) జనరల్ అంజద్ హుస్సేన్ తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కోరింది.
తాపేశ్వరం కాజా.. ఆత్రేయపురం పూతరేకులంటే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. ఇదే తరహాలో మేడ్చల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులు తయారు చేస్తున్న తినుబండారాల బ్రాండింగ్ కోసం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కృషిచేస్తున్నారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు హిడ్మాను పోలీసులు అంతమొందించి.. ఎన్కౌంటర్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తున్నారని పౌరహక్కుల సంఘం నాయకులు ఆరోపించారు.
ఒకటి నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాల కవర్ పేజీ(ముఖచిత్రం) ఇక చిరిగిపోదు. అందుకు అవసరమైన నాన్ టియరబుల్ పేపర్ను వాడాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకరకంగా ఇది ప్లాస్టిక్ మాదిరిగా ఉంటుంది.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నగరవాసులకు శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. మదీనాలో మహమ్మద్ ప్రవక్త సహచరులు, ఆయన కుటుంబసభ్యులను ఖననం చేసిన జన్నతుల్ బాకీ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరిగాయి.
రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యదర్శి ఇలంబర్తి తెలిపారు.
రాష్ట్రంలోని పలు పురపాలికల పరిధిలోని చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. చెరువు శిఖం, బఫర్జోన్ భూములను ఎట్టి పరిస్థితుల్లో పూడ్చేయకూడదని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదని న్యాయస్థానాల మార్గదర్శకాలు ఉన్నా అక్రమార్కులకు అవేమీ అడ్డే లేకుండాపోయింది.
రాష్ట్రంలో ఐటీఐల తరహాలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను సైతం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లుగా మార్చాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మాది ముమ్మూటికీ బూటకపు ఎన్కౌంటర్ అని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, సహ�
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఎంపీహెచ్ఏ) నియామకాల్లో తాత్కాలిక/కాంట్రాక్ట్ సర్వీసులో ఉన్నవారికి ఇచ్చే వెయిటేజీ పాయింట్లు 20 నుంచి 30కి పెంచడం చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది.
రాష్ట్రంలో పలు ప్రైవేటు నర్సింగ్ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. విద్యార్థులకు సరిగ్గా బోధించడం లేదంటూ ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అనేక నర్సింగ్ స్కూళ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఔషధాలు వేసుకున్నాక అవి శరీరానికి పడకపోతే (రియాక్షన్) ఫిర్యాదు చేసేందుకు అన్ని ఔషధ దుకాణాల వద్ద క్యూఆర్ కోడ్, టోల్ఫ్రీ నంబరు ఇక నుంచి తప్పనిసరిగా ఉండాల్సిందేనని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) శనివారం ఆదేశాలు జారీ చేసింది.
వేళాపాళా లేని నిద్రాహారాలు.. కాలు కదపని కొలువులు.. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే జీవనశైలి.. వెరసి ఈతరం స్థూలకాయం బారిన పడుతోంది. ఆడామగా అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదో ఎడతెగని సమస్యలా మారింది.
కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ఈ స్టేషన్లో ఆధునిక సౌకర్యాలు ఉంటాయన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వం చేసిన అప్పులపై పదేపదే చెబుతున్న కాకిలెక్కల డొల్లతనం కాగ్ నివేదిక ద్వారా మరోసారి బట్టబయలైందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పారిశ్రామిక భూములను లాక్కొని బడాబాబులకు కట్టబెట్టేందుకు భారీ భూ కుంభకోణానికి తెరతీస్తున్నారని భాజపా ఎంపీ కె.లక్ష్మణ్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది.
రాష్ట్రానికి తొలి సైనిక్ స్కూల్ మంజూరు కానుంది. వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని దుద్యాల మండలం హకీంపేటలోని ఎడ్యుకేషన్ హబ్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు కానుంది.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్టప్)పై శాసనసభలో చర్చించాలని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని శాసన సభాపతి ప్రసాద్కుమార్ను ఎమ్మెల్యేలు దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ఘన్పూర్) కోరుతున్నారు.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణల ప్రకారం గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు (జీవో నం. 46) జారీ చేసింది.
ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ను రెండేళ్ల విజయోత్సవాలుగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
బడుగువర్గాలకు పెద్దపీట వేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లకు కొత్త అధ్యక్షులను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 36 మంది డీసీసీ అధ్యక్షుల పేర్లను ప్రకటించగా... వీరిలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక కార్పొరేషన్ ఛైర్మన్ ఉన్నారు.
నాటి నిజాం నవాబుల నుంచి ఇటీవలి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు కవులు, కళాకారులు ముఖ్యమైన భూమిక పోషించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాచరికం, ఆధిపత్యం హద్దు దాటితే.. ఈ నేలను చెరబట్టాలని ప్రయత్నిస్తే.. కవులు, కళాకారులంతా ఏకమై పోరాటాలు చేసి, తరిమేసిన చరిత్ర తెలంగాణ సొంతమని తెలిపారు.
మావోయిస్టు పార్టీ చరిత్రలో మరో భారీ లొంగుబాటు ఇది. పార్టీకి మూలస్తంభాలుగా ఉన్న అగ్రనేతలు పలువురు ఈ ఏడాదే ఎన్కౌంటర్లలో మరణించగా.. తాజాగా పలువురు నేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.