పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని, వాటిల్లో ఎన్ని గిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తథ్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇప్పటివరకు ఏర్పడిన 2 లక్షల టన్నుల కొరతను ఈనెలలో భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ సహాయమంత్రి అనుప్రియపటేల్ను కోరారు.
అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4 వేల మంది రైతులకు కొత్తగా భూమి పట్టాలివ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో సాగులో ఉన్న గిరిజనులకు హక్కులు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేయడానికి గృహ నిర్మాణశాఖ మరోసారి సిద్ధమైంది. రెండో విడతలోనూ స్థలాలు, ఫ్లాట్ల వేలం ద్వారా భారీ ఆదాయాన్ని సముపార్జించాలని నిర్ణయించింది.
కొండలను, రాళ్లను పేల్చడానికి అనుమతులిచ్చే అధికారం మీకు ఉందా..? ఉంటే ఇతర శాఖల నుంచి వివరాలు సేకరించాక ఇస్తున్నారా..? అన్న అంశంపై వివరణ ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్కు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
రవాణాశాఖలో నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలను చేరుకోకపోవడానికి కారణాలేమిటని మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులను ప్రశ్నించింది. లోపాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లక్ష్యసాధనకు అవసరమైతే ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని మంత్రులు తెలిపారు.
త్వరలోనే యూపీఐ, క్యూఆర్ కోడ్ ఆధారిత కొనుగోళ్లు, ఆటోమేటెడ్ బిల్ పేమెంట్ వంటి సేవలను తెలంగాణలో ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సచివాలయంలో మంగళవారం టి-వాలెట్ సేవల ప్రగతిని మంత్రి సమీక్షించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు సొంత గూటికి చేరారు. ఆదిలాబాద్ డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సంజీవరెడ్డి మంగళవారం తిరిగి కాంగ్రెస్లో చేరారు.
సమాజంలో ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో బతికే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అవకాశాలు కల్పిస్తోందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి నీటి మళ్లింపులో కొత్త సమస్యలు రానున్నాయి.
తెలంగాణ విద్యా విధానాన్ని రూపొందించాలని ఇటీవల ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో దానిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిటీ సభ్యులతో సమీక్షించనున్నారు.
కొవిడ్ సమయంలో బాధితులకు వైద్యులు విశేష సేవలందించారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. డాక్టర్లపై ఎంతో నమ్మకంతో రోగులు ఆసుపత్రులకు వస్తారని, అందుకు అనుగుణంగా వైద్యాన్ని అందించాలని కోరారు.
తమకు శాపంగా మారిన జీవో 33ను వెంటనే రద్దు చేయాలని నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పలువురు డిమాండ్ చేశారు. ఈ జీవోతో నష్టపోతున్న నీట్ యూజీ 2025 తెలంగాణ క్వాలిఫైడ్ విద్యార్థులకు కౌన్సెలింగ్లో న్యాయం చేయాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో ఏడాదిన్నర క్రితం వివాదాస్పద లేఅవుట్లో కరెంటు మీటర్లు ఇచ్చే దందా కొనసాగింది. ‘బిగ్ బ్రదర్' ఒకరు బినామీ పేర్లపై అందులోని ప్లాట్లను కొనుగో లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మరో కాంగ్రెస్ నేత తెర మీదికి వచ్చారు. బీఆర్ఎస్ గుర్తు మీద ఎమ్మెల్మేగా గెలిచి పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టినట్ట
జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి వైద్యులు కుక్క కాటుకు ఇచ్చే రేబిస్ టీకా వేశారు. బాధితుడి కథనం ప్రకారం..మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు జ్వరంతో శనివారం దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.
తెలంగాణ కోటా కింద కోరుకొండ సైనిక్ పాఠశాలలో చదివిన రాష్ట్రానికి చెందిన విద్యార్థికి మెడికల్ సీట్ల కేటాయింపులో స్థానికత వర్తిస్తుందో లేదో వివరణ ఇవ్వాలంటూ కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దక్షిణం వైపు నాలుగో పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఎంజీబీఎస్ పీఎస్కేలో 1200 వరకు స్లాట్లు పెంపునకు కృషి చేయాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.
‘జీవో-317ను సమీక్షిస్తాం. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో గ్యారెంటీ. ఈ గ్యారెంటీ అమలులో భాగంగా మంత్రులతో సబ్ కమిటీ వేసింది.
గ్రామ పంచాయతీల్లో పెండిం గ్ బిల్లులను వారం రోజుల్లో (బతుకమ్మ పండుగలోపే) క్లియర్ చేయాలని తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పంచాయతీ కార్యదర�
అరుదైన ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించడమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు.
అక్రమంగా అబార్షన్ కిట్లను విక్రయిస్తున్న దుకాణదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని ఔషధ నియంత్రణ విభాగం డీజీ షహనవాజ్ ఖాసిం తెలిపారు. ఇటీవల చేసిన దాడుల్లో 234 మెడికల్ షాపుల్లో కిట్లను అక్రమంగా విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దరిమిలా కాంగ్రెస్లో మళ్లీ ముసలం మొదలైంది. ‘నేనే పోటీదారు’ అంటూ నిన్నటిదాకా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఆయన వర్గం సీఎం వర్గానికి కొరకరాని కొయ్యలా ఉండేది. ఎలాగోలా తంటాలు పడి ఎమ్
అవినీతి నిరోధక శాఖ మరో అవినీతి అధికారిని పట్టుకున్నది. విద్యుత్తు శాఖలో విధులు నిర్వర్తిస్తూ అక్రమ సంపాదనలో రూ.వందల కోట్లకు పడగలెత్తిన ఇబ్రహీంబాగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) ఇరుగు అంబేద్క�
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపులో సర్కారు జాప్యం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానల అసోసియేషన
‘గూగుల్ జెమిని నానో బనానా’ యాప్.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండవుతోంది. కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే ఈ ఫొటో ఎడిటింగ్ టూల్ను ప్రముఖుల నుంచి యువత వరకూ అంతా ఉపయోగిస్తున్నారు. ఫొటోలు అప్లోడ్ చేసి కావాల్సిన ప్రాంప్ట్ ఇస్తే..
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం సాత్నాల ప్రాజెక్టు దిగువ భాగం ఇది. 1996లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పట్లో గట్టు వెంబడి రాతి నేల ఉన్నా.. పటిష్ఠంగా లేదని కాంక్రీటు వేశారు.
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్లు ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు కండక్టర్లు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
మిమెటిక్ ఆర్కిటెక్చర్.. అంటే పనితీరును అనుకరించే రూపం అని అర్థం. దేశంలో ఇలాంటి ఆర్కిటెక్చర్తో కట్టిన ప్రభుత్వ కార్యాలయాలు దాదాపు అరుదే. కాగా.. హైదరాబాద్లో జాతీయ మత్స్యఅభివృద్ధి మండలి (ఎన్ఎఫ్డీబీ) కార్యాలయాన్ని ఈ ఆర్కిటెక్చర్తో చేప ఆకారంలో నిర్మించి..
రెవెన్యూ అధికారుల వేధింపులు భరించలేక మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన ఆటోడ్రైవర్ శంకర్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై నివేదిక సమర్పించాలంటూ ఆ జిల్లా కలెక్టర్కు మంగళవారం
అటవీ ఉద్యోగులపై దాడులు చేస్తే సహించేది లేదని, దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్టు పెడతామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. పోలీసుల జీతభత్యాల మాదిరిగా అటవీ అధికారులు,
కష్టపడి చదివి విద్యార్థులు ఉన్నతోద్యోగం సంపాదిస్తే.. రూ.కోట్ల ముడుపులు చెల్లించి అక్రమ మార్గంలో దక్కించుకున్నారని ఆరోపించడం సరికాదని గ్రూప్-1 క్వాలిఫైడ్ ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ టైం టేబుల్ను సవరించారు. ఈ మేరకు ఈ గురుకుల సొసైటీ కార్యదర్శి షఫీఉల్లా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం మొదటి తరగతి 9.15 గంటలకు ప్రారంభవుతుంది.
ఉస్మానియా కళాశాలకు అనుబంధంగా ఉన్న 10 ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ఖజానాకు రూ.5వేల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అయినా ప్రజల మేలు కోసం రేట్ల సవరణకు మద్దతివ్వాలని మంత్రివర్గం విధాన నిర్ణయం తీసుకుందని వివరించారు.
ప్రధాన రాజకీయ పార్టీలు బుధవారం సెప్టెంబరు 17ను తెలంగాణ విలీన, విమోచన, సమైక్యతా దినంగా పాటించనున్నాయి. విలీనం పేరుతో కాంగ్రెస్, వామపక్షాలు.. విమోచన దినోత్సవం పేరుతో భాజపా..
వచ్చే రెండున్నరేళ్లలోగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని కీలక(కోర్ అర్బన్) ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్(లైన్ల) నిర్మాణం పూర్తిచేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన విద్యుత్శాఖ పనితీరుపై సమీక్షించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక సిఫారసుల ఆధారంగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో జీఓ 317 ద్వారా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులను జిల్లాలు, జోన్లకు కేటాయించిన నేపథ్యంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించింది.
కేంద్ర విద్యాశాఖ ఏటా ఇచ్చే జాతీయ ర్యాంకింగ్లలో ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు తమ స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థలను కిందికి నెట్టి పైకి ఎగబాకుతున్నాయి.
రాష్ట్రంలో మైనర్లు.. ద్విచక్రవాహనాలు, కార్లు డ్రైవింగ్ చేస్తున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వారికే కాకుండా రోడ్లపై ఇతరుల ప్రాణాలకూ ముప్పుగా పరిణమిస్తోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, రోడ్డు భద్రత చట్టాల పట్ల నిర్లిప్తత రహదారులపై ప్రమాదకర పరిస్థితుల్ని పెంచేస్తున్నాయి.
వారికి 2017కు ముందు అసలు భూములే లేవు. దస్త్రాల్లో ఎక్కడా వారి సమాచారం కూడా లేదు. కానీ, భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని(ఎల్ఆర్యూపీ) ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఏకంగా భూ యజమానులుగా మారారు.
హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా కొనసాగుతున్న ఎన్వీఎస్ రెడ్డి... రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పట్టణ రవాణా శాఖ)గా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు.
మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ�
ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మైదం మహేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం మహేశ్ కుటుంబ
నిద్రపోతున్న భర్తపై వేడి నూనె పోయడంతో తీవ్రంగా గాయపడ్డ అతడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్నది. గద్వాల సీఐ శ్రీను కథ నం ప్రకారం.. మల్దకల్ మండలం మల్లెందొడ్డికి చెంద
లివర్ మార్పిడి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ములుగు జిల్లా తాడ్వాయి మాజీ జడ్పీటీసీ భర్త పులుసం పురుషోత్తంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.5 లక్షలు సాయం అందించారు.
కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఓ మహిళా ఓటరు డిమాం డ్ చేసింది. ‘నా అమూల్యమైన ఓటుతో గెలిచావు.. కాంగ్రెస్ పార్టీలో చేరినావు.. ఇప్పుడేమో రైతులను అరిగోస పెడుతున్నవు.. వెంటనే ఎమ్మెల్యే పదవి ను�
ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, అక్కడ కాంగ్రెస్ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ నైజం మోసం అని, అబద్ధాల పునాదుల మీదనే �
భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే తన యావదాస్తిని అమ్మి అయినా సరే అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా అన్ని పనులూ వదులుకొని గెలిపించుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియ�
యాచకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘట న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్డులో గల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటుచేసుకున్నది.
రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ను నెలకొల్పాన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక.. వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టే కుట్ర దాగి ఉన్నదని విద్యుత్తురంగ నిపుణులు అనుమానిస్తున్నారు. వ్యవసాయ �
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్థులు మంగళవారం ఆందోళనకు దిగారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు మంజూ రు కాగా అధికారులు, బ్రోకర్లు కు మ్మక్కై సదరు లబ్ధిదారుడి బిల్లు కా జేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కోసం సదరు రైతు దరఖాస్తు చేసుకోగా ఈ విషయం జోగుళాంబ గ ద్వాల జిల్లాలో
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సేవాలాల్ తండాకు చెందిన భూక్
ట్రిపుల్ ఆర్పై తాజాగా రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు నిత్యం ఢిల్లీకి వెళ్లి ట్రిపుల్ ఆర్ వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్
‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఉన్నది రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తరీఖా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై ఎన్నో ముచ్చట్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఫార్మాసిటీపై నిత్యం విషం చిమ్మిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు, పాదయాత్రలు చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేసి మీ భూములను మీక
KTR పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఓట
IAS Transfers తెలంగాణలో పలు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియామకమయ్యారు. ఎన్వ�
లాటిన్ అమెరికాలో తయారవుతున్న హెరాయిన్, కొకైన్... స్థానికంగా ఉత్పత్తి అవుతున్న గంజాయి సంబంధిత ఉత్పత్తులు... ఔషధ కర్మాగారాల్లో తయారవుతున్న మత్తు మందులు... ఇలాంటివి ఎన్నో రాష్ట్రంలో చాలా సులభంగా లభిస్తున్నాయి.
జీవితంలో రకరకాల దానాలు చేస్తుంటాం. బహుమతులు ఇస్తుంటాం. వాటి ప్రభావం కొద్దిరోజులు లేదా కొన్ని గంటలు. కానీ, ఒక యాత్రను బహుమతిగా ఇస్తే?ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూపిస్తే?వారి హృదయంలో ఆ జ్ఞాపకాలు చిరకాలం నిలుస్తాయి. మర్చిపోలేని మధురస్మృతులను పంచుతాయి!!
Madhu Yaskhi కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయంలోని ఆయన పేషీకి మధు యాష్కి వచ్చారు.
KTR కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు ఇంకా 2లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ను కోరామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
KTR ములుగు మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడంలేదని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మహేశ్ కుటుంబానికి కేటీఆర్ ర
MLA Kaushik Reddy ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
TG Weather తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచ
BRSV గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ADE Ambedkar హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే అంబేద్కర్ నివాసంతో పాటు బంధువుల ఇంట్లో లెక్కలేనంతా డబ్బు బయటప�
ACB విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మణికొండలోని నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుల ఇండ్లలోనూ సోదాలు చేస్తున్నారు.
భారత రాజ్యాంగంపైన, సుప్రీంకోర్టుపైన బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట �
ములుగు (Mulugu)మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మైదం మహేష్ ఐదు నెలలుగా వేతనం అందలేదని మనస్థాపంతో ఈ నెల మూడవ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.
Health Department వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ సర్కార్ తమపై దయ ఉంచి ఇప్ప�
Health Department వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఔట్ సోర్స�
సూర్యాపేట (Suryapet) జిల్లా దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆరు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ.. విధులు బహిష్కరించి హాస్పిటల్ ఆవరణలో ధర్నాకు దిగారు.
జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal) మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనే పోసింది భార్య. తీవ్రంగా గాయపడిన బాధితుడు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
తెలంగాణలో సకల జనుల సమరభేరి మోగుతున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం సకల జనుల సమ్మెతో ఉద్యమించిన తెలంగాణ సమాజం.. ఇప్పుడు సర్కారు దమన నీతి మీద సమరం చేస్తున్నది. సర్�
యూరియా వాడకం తగ్గించే రైతులు, కౌలు రైతులకు ప్రోత్సాహకంగా బస్తాకు రూ.800 చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రైతులకే బదిలీ చేస్తామని చెప్పారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు, కెమెరామన్ నాగరాజుపై ప్రభు
ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థులెవరూ చదువుకు దూరం కాకూడదని, దానికి తమ వంతు ఏదైనా చేయాలని నాలుగు దశాబ్దాల కిందట సంకల్పించారు కాకినాడ జిల్లా తొండంగి మండల కేంద్రానికి చెందిన సోదరులు చాడ వెంకటేశ్వరులు, రమణ. అయితే ఆ ఆశయం నెరవేరడానికి ముందే రమణ, ఆయన భార్య ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆపద వచ్చినా... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతున్నది.
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపడుతున్�
‘మీ చుట్టూ ఇంకెన్నాళ్లు తిప్పుకుంటరు.. ఏదో ఒకటి తేల్చండి.. లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు’ అంటూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ మహిళ బైఠాయించింది.
వక్ఫ్ సవరణ చట్టంలోని కీలక నిబంధనలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఢిల్లీలోని ఏపీభవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వక్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లి మాజీ జడ్పీటీసీ లావణ్య, రాంబాబు దంపతుల కుమారుడికి... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సూర్యాంశ్ అని నామకరణం చేశార
తెలంగాణ విద్యార్థుల మెడికల్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మెడికల్ ఎంట్రెన్స్లో అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్�
రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అందులో 1.29 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నట్టు గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు. ఇందులో 20వేల ఇండ్లు గోడల వరకు నిర్మాణం కాగా, 8,633 ఇండ్లు స్లాబ్
ఆర్థిక పరిస్థితులు బాగాలేక కరీంనగర్ జిల్లాలో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. చొప్పదండి ఎస్సై నరేశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మాపూర్కు చెందిన ముద్దసాని కనుకయ్య (46) కరీంనగర్ పోలీస్ కమిషన�
పాదయాత్ర నేపథ్యంలో హనుమకొండ సర్క్యూట్ గెస్ట్హౌస్ రోడ్డులోని తన ఇంటిలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను సుబేదారి పోలీసులు సోమవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ద�
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తున్నది. ఉత్తరభాగంలోని పలుచోట్ల కేంద్రం రూపొందించిన అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఇప్�
కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేలు ఎన్నిచేసినా తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారంతా దొరికిపోయిన దొంగలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్సార్నగర్లో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, ఎస్సై హమీద్ కథనం మేరకు.. వీఎస్సార్నగర్కు చెందిన చింతల అర్జున్ (33) ఆటో �
అంగన్వాడీల ఆందోళన అట్టుడికింది. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించడంతోపాటు పలు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.