గంజాం జిల్లా ధారకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముండమొరై గ్రామంలో మంగళవారం రాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త అమర్ నాయక్ను భార్య అంజనా నాయక్ ఊపిరాడనీయకుండా చేసి హతమార్చిందని పోలీసులకు ఫిర్యాదు అందింది.
గత కొన్ని రోజులుగా రాయగడ జిల్లా టికిరి పోలీసు స్టేషన్ పరిధిలో జరుగుతున్న బైక్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఐసీ బిస్వానందిని బాగ్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.1.51 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. సోమవారం రాత్రి భువనేశ్వర్లోని లోక్సేవాభవన్లో ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి అధ్యక్షతన హైలెవల్ క్లియరెన్స్ అథారిటీ (హెచ్ఎల్సీఏ) సమావేశం జరిగింది.
జాజ్పూర్ జిల్లాలో వ్యాపించిన అతిసారం నియంత్రణలోకి తేవడానికి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఒకవైపు ఆసుపత్రుల్లో చికిత్స, మరోవైపు జనజాగరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వ్యవసాయోత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసి, అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణగా చేస్తామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చెప్పారు. మంగళవారం బొలంగీర్ జిల్లా కేంద్రంలో ‘కృషక్శక్తి’ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది.
గోపాల్పూర్ తీరంలో ఆదివారం రాత్రి యువతిపై జరిగిన అత్యాచారం కేసులు 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్.ఎం మంగళవారం చెప్పారు.
బాల్య వివాహానికి నిరాకరించిందని ఓ కుటుంబాన్ని మూడేళ్లుగా గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో తాగునీరు, నిత్యావసర సరకులు, ఇతర అవసరాలకు ఆ దళిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
కోరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని గంగమ్మ మందిరం ఎదురుగా ఉన్న ఏటీఎం కేంద్రం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగదు దోచుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.