పోలీసులు ‘ప్రజాబంధువు’లు కావాలని, వారు పౌరుల సేవకులమన్న వాస్తవాన్ని విస్మరించరాదని, ఠాణాలకు వస్తున్న వారి పట్ల కఠినవైఖరితో వ్యవహరించకూడదని ముఖ్యమంత్రి మోహన్చరణ్మాఝి చెప్పారు.
రాయగడ జిల్లా వాటర్షెడ్ విభాగానికి చెందిన నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ఉపాధి హామీ పథకం కింద రూ.20 లక్షల మేర సర్కారు నిధులు కాజేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.
బ్రహ్మపుర పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో నేరగాళ్ల ఏరివేతకు ప్రత్యేక దాడులు చేపట్టారు. పెద్దబజారు, బ్రహ్మపుర సదర్, నిమ్మఖండి, దిగపొహండి ఠాణాల పరిధుల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 12 మందిని అరెస్టు చేశామని దక్షిణ మండల పోలీసు ఐజీ నితి శేఖర్ పేర్కొన్నారు.
కొరాపుట్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ చమరానాయక్ మద్యం మత్తులో తన గొంతు తానే కోసుకున్నాడు. జయపురం ఐఐసీ సచ్చీంద్ర ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం..
గంజాం జిల్లా దిగపొహండి ఠాణా పరిధిలో హనుమాన్ కూడలిలోని తనిఖీ గేటు వద్ద ఈ నెల 20న ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దర్ని మరో ఇద్దరు అటకాయించి తాము సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులమని పేర్కొన్నారు.