రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు చేపట్టింది. మంగళవారం రాత్రి ఆర్థిక శాఖ ఈమేరకు ప్రభుత్వ శాఖలన్నింటికీ లేఖలు రాసింది. బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సూచించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జల్ సంచయ్ జన్ భగీదారి (జేఎస్జేబీ) అవార్డులు-2025కు మన రాష్ట్రం నుంచి ఐదు జిల్లాలు ఎంపికయ్యాయి. నీటి సంరక్షణకు మెరుగైన చర్యలు తీసుకున్న వాటికిచ్చే ఈ అవార్డుల జాబితాలో రాయగడ జిల్లా చోటు దక్కించుకుంది.
గజరాజుల దాడుల నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సంబల్పూర్ జిల్లా కుతబ్ గ్రామస్థులు నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఉషాకోఠి వన్యప్రాణుల అభయారణ్య పరిధి కుతబ్ గ్రామంలో ఏనుగుల గుంపు దాడి చేయడంతో ఇద్దరు మృతిచెందారు.
ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (ఓఎస్సీపీసీఆర్) అధ్యక్షురాలు బబితా పాత్ర్ బుధవారం గంజాం జిల్లాలో పర్యటించారు. తొలుత ఆమె స్థానిక గుసానినువాగాం మెయిన్ రోడ్డులోని ఉత్కళ బాలాశ్రమాన్ని సందర్శించారు.
నవరంగపూర్ జిల్లా నుదహండి సమితి పురుణా పాణిగూడ గ్రామంలో ఉన్న మిరాకల్ చిల్డ్రెన్ హోమ్లో ఉంటున్న రెండో తరగతి విద్యార్థిని బుధవారం మృతి చెందింది. చిన్నారి మరణం తరువాత ఈ హోమ్ వెలుగులోకి వచ్చింది.
కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు పాడైపోయిన గుడ్లను మంగళవారం సరఫరా చేశారు. దాంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ... వాటిని ఆసుపత్రిలోనే విడిచిపెట్టి వెళ్లిపోయారు.