జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ను కూడా సీఎం రేవంత్రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎరేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు.
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి లేఖ ఇచ్చినా కలెక్టర్ ప్రావీణ్య పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే మానిక్ రావు మండిపడ్డారు. జహీరాబాద్ నియోజకవర్గంలో తాను సూచించిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు.
దహనం వెబ్ సిరీస్ అంశంలో ఆర్జీవీపై అంజనాసిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్లో అంజనాసిన్హా పేరు ప్రస్తావించారు. అంజనాసిన్హా చెప్పిన విధంగా కొన్ని సీన్లు తీసినట్లు ఆర్జీవీ ప్రస్తావించారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎన్స్ఫోర్ట్మెంట్ డైరెక్టరేట్ అధికారులు (ED Raids) సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లో ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేశ్ ఇంట్ల�
పార్ట్టైమ్ జాబ్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 10.5 లక్షలకు టోకరా వేశారు. నాదర్గుల్కు చెందిన బాధితుడు వృత్తిరిత్యా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని సిని కార్మికులను కోరారు. సినీ పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దని సూచించారు.
ఐటీ కారిడార్లో మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాటల్లో పెట్టి చేతి బ్రాస్లెట్ దొంగిలించిన ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ కే�
నగర పోలీస్ వ్యవస్థలో వివిధ విభాగాల్లో విధులు కొనసాగిస్తున్న సిబ్బందికి అనువైన కేంద్రాన్ని నెలకొల్పి, విధుల్లో మరింత స్వేచ్చగా పని చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాకు నెలవారీ జీతాలు కరెక్ట్గా వచ్చేవి. ఒకవేళ సరైన సమయానికి రాకపోతే అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి మాకు జీతాలు వేయించేవారు. కానీ ఇప్పుడు అసలు జీతాలే లేదంటూ హైడ్రా డిజాస్టర�
నగరంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. బుధవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరాల్సిన �
బర్త్డే బంప్స్ అంటూ.. ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తపేట న్యూమా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దగ్గరపడుతున్నా భూ క్రబద్ధ్దీకరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములలో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం గడుపు�
హెచ్ఎండీఏలో భూముల వేలానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని హెచ్ఎండీఏ లే అవుట్లలోని 100కు పైగా ప్లాట్లకు ఆన్లైన్ వేలం బుధవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో తొలి రో�
పీర్జాదిగూడలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ పేదలపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ లీడర్లు చెప్పినట్లు వింటున్నారు. వీకర్ సెక్షన్ కాలన�
గ్రూప్- 1లో జరిగిన అవకతవకలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) హైకోర్టు తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్ బుధవారం డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై హైకోర్�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతున్నది.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేల జాబితాలో ఒకరుగా నిలిచిన మాగంటి గోపీనాథ్.. పదేండ్ల బీఆర్ఎస్ హ�
నగరంలోని ప్రతిష్టాత్మక నిమ్స్ దవాఖానాలో మీడియాను నిలువరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తర్వాత దవాఖానాలో పరిపాలన విభాగం మొత్తం అస్తవ్యస్తమైనట్లు ఆస్పత్ర
ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అందిస్తున్న నాసిరకం డైట్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ దవాఖానల్లో నాణ్యత లేని డైట్ అందిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అ
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తెలంగాణలో తన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అనే పేరు ప్రకటించారు.
వరద నాలాల్లో కొట్టుకుపోయిన బాధితుల ఆచూకీ మూడో రోజూ లభించలేదు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ముషీరాబాద్ వినోభానగర్కు చెందిన దినేశ్, మల్లేపల్లి అఫ్జల్సాగర్కు చెందిన అర్జున్, రాము వరద నాలాలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
గుండెలవిసేలా విలపిస్తున్న ఈ మహిళది బోయిన్పల్లి. భర్త ఆటోడ్రైవర్. వీరికి ముగ్గురు చిన్న పిల్లలు. మంగళవారం ఉదయం భర్తకు గుండెలో నొప్పి అని చెప్పడంతో హుటాహుటిన గాంధీకి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో చేర్చారు.
చెత్తను మండించి విద్యుత్తు ఉత్పత్తి చేయడంలో భాగ్యనగరం రికార్డు దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే జవహర్నగర్లో 24 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం, దుండిగల్లో 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఉన్నాయి.
శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములుంటే అక్రమార్కులకు పండగే. ఖాళీ స్థలాలు, రహదారులను ఆక్రమిస్తున్నారు. కొన్ని నెలల నుంచి తొండుపల్లి ఔటర్ ఎగ్జిట్ టోల్ప్లాజాకు సమీపంలో సర్వీసు రోడ్డును కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్లో కుళ్లిన మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఉత్తర ముఖద్వారం వద్ద పార్కింగ్ ఏరియా సమీపంలోని ఓ గోనె సంచిలో బయటపడింది. మహిళదిగా పోలీసులు గుర్తించారు. చేతులకు, కాళ్లకు తాళ్లు కట్టి ఉన్నాయి.
1947 డిసెంబరు 4న కింగ్కోఠిలోని నివాసం నుంచి ప్రార్థన కోసం మక్కా మసీదుకు వెళ్లడానికి కారులో బయటకు వచ్చిన 7వ నిజాంమీర్ ఉస్మాన్ అలీఖాన్పై బాంబు వేసిన బృందంలో నింబోలిఅడ్డాకు చెందిన కొత్మీర్ ప్రేమ్రాజ్యాదవ్ సభ్యుడు.
వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరు శివారులో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. వెంచర్లలో స్థలాలను ప్లాట్లుగా మార్చి గుంటల లెక్కన విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 15 ఏళ్ల కిందట పట్టణ శివారులో ఎకరం భూమి రూ.5- 10 లక్షల వరకు ఉండేది.
తల్లి మందలించిందని నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి ఠాణా పరిధిలో జరిగింది. మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మూసాపేట యాదవబస్తీలో తులసమ్మ, జానకీరావు దంపతులకు ముగ్గురు కుమార్తెలు.
2024లో జరిగిన డీఎస్సీ (District Selection Committee) టీచర్ నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా, SGT (Secondary Grade Teacher) విభాగాల్లో జరిగిన అక్రమాలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
రాష్ట్రంలో ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగ యువత చేస్తున్న డిమాండ్ సరైనదే అని ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
Rajnath Singh: నిజాం భారత్కు మాత్రమే వ్యతిరేకం కాదు.. భారత ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమని కేంద్రమంత్రి రాజ్నాథ్ అన్నారు. ఇప్పటికీ దేశంలో రాజకర్లు ఉన్నారని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు మూసీ పక్కన నివసిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మూసీకి వరద వచ్చినప్పుడు ఆ వరదలో కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Hyderabad IT Raids: హైదరాబాద్లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ కళాసిగూడలో క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.