నల్లగొండ: నేషనల్ మీన్స్కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్ఈ)–2023 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ బి.భిక్షపతి తెలిపారు. నల్లగొండతోపాటు...
ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులైన ఉత్తమ్, కోమటిరెడ్డిలకు కీలకమైన నీటిపారుదల, రోడ్లు, భవనాల శాఖలు దక్కడంతో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్లో ఉన్న కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటూ, ఏళ్లపాటూ అభివృద్ధికి నోచుకోని రహదారుల అభివృద్ధికి నిధులు అందుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భూ వివాదంలో ఓ వ్యక్తిని కొట్టడంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడనే ఆరోపణలపై చింతపల్లి ఠాణా ఎస్సై సతీష్రెడ్డిని జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదివారం రాత్రి జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేశారు.
ఉన్నతస్థాయికి రావాలంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవాలి. అవన్నీ ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్న ఓ పల్లెటూరి యువకుడు నాగేశ్వరరావు.
పంచ నారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రిలో ఆదివారం స్వాతి నక్షత్రోత్సవం విశేషంగా నిర్వహించారు. గర్భగుడిలోని స్వయంభువులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.
మండలంలోని సుంకిశాల గ్రా మంలోని శ్రీ వేంకటేశుడి కల్యాణ వేడుకలు ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో కల్యాణ వేడుకలు కొనసాగాయి. ఆలయం నుంచి ముత్యాల పల్లకిలో భక్తుల గోవింద నామస్మరణ నడుమ కల్యాణ మండపం వద్దకు గోవిందుడిని తోడ్కొని వచ్చారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల క్రీడాకారులు తమ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర క్రీడల అధికారి డాక్టర్ రాంలక్ష్మణ్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 9వ రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలను ఆయన వీక్షించారు.
ఉమ్మడి జిల్లాలో వారం రోజుల క్రితం వరకు ఉక్కపోత ఉండగా, ఆ తరువాత వాతావరణంలో అనూహ్యంగా ఏర్పడిన మార్పులతో చలి పెరిగింది. శీతాకాలం ప్రారంభమైనా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతోపాటు ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు.
పలు కారణాలతో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల వివరాలను ఏడాదిన్నర క్రితం అధికారులు నివేదించినా, ప్రభుత్వం ఉప ఎన్నికలు నిర్వహించలేదు. గ్రామ పాలనలో పంచాయతీ పాలకవర్గాలు కీలకం.
యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ( Yadagirigutta Lakshminarasimha Swami ) ఆలయానికి రికార్డ్ స్థాయిలో నిత్య ఆదాయం పెరిగింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.