జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి పది మందిలో ఒకరు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రధానంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, డెంగీ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాల కారణంగా కాలనీలు, ఇళ్లు పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.
చేయించుకుంటున్న దరఖాస్తుదారులుఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు కొన్ని ముఖ్యమైన శాఖలపై డేగ కన్ను వేశారు.
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవాన్ని సోమవారం క్రీడాప్రాంగణంలో నిర్వహించారు. విద్యార్థులందరూ ఒకే రకమైన డ్రెస్కోడ్(తెల్లటి వస్త్రాలు) ధరించి సందడి చేశారు. కొందరు తమ తల్లిదండ్రులతో..
కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కబడ్డీలో రాణిస్తున్నారు. ఇటీవల మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా కబడ్డీ క్రీడల్లో మొదటి స్థానం సాధించడం విశేషం.
పాఠశాలల్లో ఉన్నత విద్యతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహను కల్గించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫాం, బ్యాడ్జీలు, స్టడీ అవర్స్లో గ్రూపులు, గ్రూపుల వారీ చర్చ, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో(బ్లాక్ స్పాట్స్) చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరిగే 17 ప్రాంతాల్లో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఒక ఫ్లైఓవర్, 13 అండర్పాస్ వంతెనలు,
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణను మెరుగు పరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతంలోనే అన్ని బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ)ని ఏర్పాటు చేసింది. సదరు కమిటీలకు బడుల నిర్వహణ బాధ్యత అప్పగించారు.
జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం దూర ప్రాంతం నుంచి ఓ వృద్ధురాలు వచ్చింది. ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది.
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ/డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆ యువకుడి సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. పట్టుదలతో క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు. పేదరికంలో పెరిగినా.. బాస్కెట్ బాల్ క్రీడపై ఉన్న ఆసక్తితో పట్టణం వచ్చి సాధన ప్రారంభించి..
భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి మూడు రకాల నృత్యాలను ఏక కాలంలో సాధన చేస్తూ తనదైన శైలిలో ప్రదర్శనలు ఇస్తూ చిన్న వయసులోనే అందరి ప్రశంసలు అందుకుంటుంది..మిర్యాలగూడ పట్టణానికి చెందిన శ్రీపాద సిరి వెన్నెల.
అప్పు తిరిగి చెల్లించేందుకు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఓ వ్యక్తి దొంగగా మారిన ఘటన అనంతగిరి మండలం ఖానాపురంలో చోటుచేసుకుంది. నిందితుడు ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రి చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.
అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్షను విధిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి రోజారమణి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఈ నెల 16 నుంచి బంద్ నిర్వహించనున్నాయి. గతంలో 40 రోజులు సమ్మె నిర్వహించగా, ప్రభుత్వం మూడు రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చింది.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి 705 స్పెషల్ బస్ స ర్వీసులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నల్లగొండ రీజియన్ రూపొందించిన నివేదికకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు.
అనారోగ్యం బారిన పడిన తల్లిదండ్రులకు వైద్యం నిమిత్తం అప్పులు తీర్చేందుకు ఓ కుమారుడు దొంగగా మారాడు. కారోబార్గా పనిచేస్తున్న గ్రామంలోనే ఏడాదిలో మూడు ఇళ్లలో దొంగతనాలు చేశాడు.
లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా రేషన్ బియ్యంతో వ్యాపారం చేసే వారిని ఉపేక్షించబోమని పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు.
ర్ఆర్ఆర్ ఎలైన్మెంట్ మార్చాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని దేవిరెడ్డి బంగ్లా వద్ద మునుగోడు-నల్లగొండ రహదారిపై భూ నిర్వాసితులు రాస్తారోకో నిర్వహించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే నిధులు అవసరం. దీంతో ఆదాయ వనరులను పెంచుకుని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు ప్రారంభించింది.