ఎస్సారెస్పీ స్టేజ్ -2పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ -2కి ఆర్డీ ఆర్ స్టేజ్ 2గా నామకరణం చేస్తూ 24 గంటల్లోగా జీవో ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ బీసీ కులగణన చేసి, 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు. బీసీలకు న్యాయం చేసి బీజేపీ క్రెడిట్ తీసుకున్న తమకు నష్టం లేదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
తెల్ల కాగితాలపై క్రయవిక్రయ ఒప్పందాలు రాసుకుని భూములు కొనుగోలు చేసిన రైతుల సమస్య పరిష్కారానికి మోక్షం లభించనుంది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నార్కట్పల్లి మండలం గోపులాయపల్లి గుట్టపై వెలసిన స్వయంభూ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయానికి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయానికి వెళ్లడానికి ఉన్న ఒకే ఒక రైల్వే కింది వంతెన మార్గం గత నెల రోజులకు పైగా ఇలా నీటితో నిండిపోయింది.
మారుతున్న ఆహార పద్ధతులు, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో చిన్న వయసు నుంచే అనేక మంది గుండెపోటుకు గురవుతున్నారు. అయితే గుండెపోటుకు గురైన బాధితుల ప్రాణాలు నిలిపేందుకు ఆసుపత్రికి.
అడ్డూ అదుపు లేకుండా మద్యం విక్రయం.. నిబంధనలు పాటించని మరబోటు ప్రయాణం.. కృష్ణావెనుక జలాల్లో జలకాలు.. దీనికితోడు విందు భోజనాలు ఏర్పాటు చేస్తుండటంతో వైజాగ్కాలనీ యువకులకు పర్యాటక కేంద్రంగా మారింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించబోతోంది. ఉద్యోగ వేటలో హైదరాబాద్ వంటి నగరాల్లోని కంపెనీల చుట్టూ తిరగనక్కర్లేదు.
బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్నంటుతోంది. సామాన్యులు, మధ్య తరగతి వారికే కాదు ఓ మోస్తరు ఆదాయమున్న వారికీ అది అందకుండా పరుగెడుతోంది. ఆ వేగాన్ని నిలువరించడం మన చేతుల్లో లేకున్నా వినియోగాన్ని తగ్గించే ఆలోచన చేస్తే ప్రయోజనంగా ఉంటుంది.
జిల్లాలో పంట నమోదు (డిజిటల్ క్రాప్ బుకింగ్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సెప్టెంబరు నెలలో ప్రారంభం కాగా ఒక్క నెలలోనే జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 83.47 శాతం పూర్తి చేశారు.
ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధిహామీ పథకంలో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టారు. అధికారుల ప్రణాళిక లేమి, కొన్ని చోట్ల అనువైన స్థలం లేక చెరువులు, కుంటల పక్కనే నిర్మించారు.
ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనతో సత్ఫలితాలను సాధించాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ప్రప్రథమంగా ‘ప్రయోగ దర్శిని’ (ల్యాబ్ మాన్యువల్) పుస్తకాలు ముద్రించింది.
విద్యా వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడానికి సర్కారు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ముఖగుర్తింపు హాజరు ప్రక్రియ అమల్లోకి తీసుకొచ్చింది.