రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చలి తీవ్రత తీవ్రమవుతుండటంతో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, వసతిగృహాలు, గురుకులాల్లోని విద్యార్థులు చన్నీటితోనే స్నానం చేయాల్సిన పరిస్థితి.
నల్గొండ జిల్లా దేవరకొండ పురపాలికలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అసంపూర్తి వంటగదితో మధ్యాహ్న భోజన నిర్వాహకులు తంటాలు పడుతున్నారు. ఇక్కడ 445 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు.
గ్రామీణ నిరుద్యోగ యువతలో నైపుణ్యాన్ని పెంచే శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజనలో చౌటుప్పల్లో ఈ కేంద్రాన్ని సాహితీ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు.
ఇక నుంచి చెత్తకు లెక్కకట్టేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 19 పురపాలికలు ఉన్నాయి. నివాసాలలో సేకరించిన చెత్తతోపాటు, దుకాణాల ద్వారా వెలువడే వ్యర్థాలను ఇక పక్కాగా లెక్కిస్తారు.
రాజేశ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని భారాస నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోదాడలో రాజేశ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
చేయి తడిపితేనే లబ్ధిదారులకు చేయూత అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రతి నెలా చేయూత పింఛన్లు మంజూరు చేస్తోంది. దివ్యాంగులకు రూ.4,016, మిగతా అందరికీ రూ.2,016 చొప్పున అందిస్తోంది.
సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా రైతులు, రైతుకూలీలు సాగించిన మహోజ్వల ఘట్టం, బాంచన్ దొర కాల్మొక్తా నుంచి.. బందూకులు చేతపట్టి ఖబర్దార్ అంటూ సాగే ఈ పోరాటం తెలంగాణలోని భూస్వాములు, దొరలకు ముచ్చెమటలు పట్టించింది.
పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం సాయంత్రం ప్రకటన జారీ చేసింది. మూడు విడతలుగా.. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని నెహ్రూ నాయకత్వంలో ప్రజాస్వామ్యం- సామ్యవాదం నినాదంతో పాలన సాగించారు. 1952లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల అభిప్రాయ సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత వేదిక ‘ఆశా’ వెబ్సైట్ను నూతనంగా రూపొందించింది.
మహిళల ఆర్థిక అభివద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తోందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.