గడ్డివాము దగ్ధం మద్దిరాల, జూన్ 2: మండల కేంద్రంలో గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల శివారులో వ్యవసాయ బావులు వద్ద కొంతమంది రైతులు శుక్రవారంవరి కొయ్యలను నిప్పు పెట్టారు. ఈ మంటలు ఉన్న వల్లపు రమేష్ గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమైంది. ఈ మంటలు చుట్టుపక్కల 10ఎకరాలకు విస్తరించగా, రైతులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రమే్షకు చెందిన రూ.10వేల విలువైన 100 మోపుల గడ్డి దగ్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సబ్బండ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందని ప్రభుత్వవిప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీన నిర్వహించే సురక్షా దినోత్సవ్ ర్యాలీని విజయవంతం చేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.
రీజనల్ రింగ్రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతూ ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నేత బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన సబ్జైలులో ఉన్న రైతులను పరామర్శించేందుకు ములాఖత్కోసం వెళ్లగా, జైలు సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
ప్రభుత్వ ధనం తో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని బీఎస్పీ జిల్లా ఇన్చార్జీ బండారు రవివర్ధన్ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా శుక్రవారం భువనగిరిలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన తెలిపా రు.
పట్టణంలోని సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో ఐదేళ్ల (ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్))లో చేరదలచుకున్న విద్యార్థుల ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పాండురంగ శర్మ శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహకార రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకాన్ని ప్రారంభించినట్లు డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు.
చార్ధామ్ యాత్రలో విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంతో చేపడుతున్న బడి బాట కార్యక్రమం నేటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభంకానుంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలే ప్రజల ఉజ్వల భవిష్యత్కు పునాది అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లాలో సాధించిన ప్రగతి నివేదికను వివరించారు.
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని చెరువుకు చారిత్రక నేపథ్యంతో వీర్ల చెరువు అని పేరు. 1870 ప్రాంతంలో స్థానిక జాగీర్దార్ యాఖూబ్ అలీ ఆత్మకూరులో చెరువు నిర్మించేందుకు నిర్ణయించారు.
మేలో నిప్పులు కురిపించిన భానుడు జూన్లోకి వచ్చేసరికి కాస్త చల్లబడ్డాడు. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీలకు తగ్గాయి. వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జూనియర్ బాల, బాలికలకు మఠంపల్లి మాంట్ఫోర్ట్ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు గురువారం ముగిశాయి.
యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట ఆలయంలోనూ ఈ విశేష పర్వాన్ని చేపట్టారు.
కొనుగోలు కేంద్రం చేతులెత్తేయడంతో నెల రోజులుగా ధాన్యం కుప్ప పోసి ఎదురుచూసిన అన్నదాతల పాట్లు చెప్పనలవి కావు. అకాల వర్షాలు, తూకం వేసిన ధాన్యం తరలింపునకు లారీలు రాకపోవడం వంటి సమస్యలతో తిప్పర్తి