రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీ రావు 89వ జయంతి కార్యక్రమాన్ని ఎనుముల మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇచ్చిన యాంటీ బయాటిక్ ఇంజక్షనే ఇందుకు కారణమని భావిస్తున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆ వ్యాపారి, యువతి మాత్రమే కాదు.. వంద మందిలో 60 శాతం మందికి కంటి సమస్యలే వస్తున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తున్న స్మార్ట్ ఫోన్లు..అందుబాటులో నెట్ రీఛార్జ్ ప్లాన్లు.. ఇంకేముంది 24 గంటలు సామాజిక మాధ్యమాలే లోకంగా జీవించేవారూ ఎక్కువవతున్నారని వైద్యులు చెబుతున్నారు.
రక్షణ, ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా యూనిసెఫ్ సంస్థ సహకారంతో సెర్ప్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు స్నేహ (సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్ ఫర్ అడాలసిస్) పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సహనం శాంతికి మూలం. సహనం సమాజ శ్రేయస్సుకు, వ్యక్తుల మధ్య సంబంధాల బలోపేతానికి ఇది సహకరిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సహనం నేటి సమాజంలో మచ్చుకైనా కనిపించడం లేదు.
పార్ట్ టైం ఉద్యోగం పేరుతో సైబర్ మోసగాళ్ల మాటలను నమ్మిన ఓ వ్యక్తి రూ.8,42,663లను పొగొట్టుకున్నాడు. ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి(30) కొన్నాళ్ల నుంచి చౌటుప్పల్లో నివాసం ఉంటున్నాడు.