సైబర్ నేరాలు జిల్లాలో ఇటీవల పెరిగాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం ఈవో రమా దేవి,దేవాదాయ, దేవస్థానం సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాలయాల జేఏసీ చైర్మన గజ్వేల్లి రమే్షబాబు డిమాండ్ చేశారు.
పంటల సాగులో ఎరువుల వినియోగాన్ని దశల వారీగా తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భూసారం దెబ్బతినకుండా వాతావరణ కాలుష్యం లేకుండా ఉండేందుకు సమగ్ర కార్యాచరణ చేపడుతోంది.
మంత్రి ఇలాకాలో ఇసుక దందా జోరుగు సాగుతోంది. అభివృద్ధి పథకాల పేరిటి రాత్రింబవళ్లు అక్రమంగా రవాణ చేస్తున్నారు. రాత్రి వేళల్లో పొక్లెయిన్లు వాగులో వాలుతున్నాయి.
వంద పడకలతో జిల్లా ఆసుపత్రి తర్వాత ఆ స్థాయిలో వైద్య సేవలందిస్తున్న మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి మరో మెట్టు ఎక్కనుంది. ఆసుపత్రిలో పీజీ వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు జాతీయ వైద్య కమిషన్ ప్రకటించింది.
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి స్థానిక, ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటేలా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాగత ఎన్నికలు, పార్టీ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల కోసం జోగులాంబ గద్వాల్ జిల్లా.
సూర్యాపేట బస్సు డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు సోమవారం మధ్యాహ్నం 2.15లకు సూర్యాపేట బస్టాండ్ నుంచి దేవరకొండ బస్టాండ్కు వెళ్లేందుకు బయల్దేరింది. సరిగా నకిరేకల్కు వచ్చే ఆర్వోబీ వద్ద ఒకసారి, బస్టాండ్ వద్ద రెండుసార్లు మొరాయించింది.
పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ వసతిగృహాలు సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో ఏదో ఒక సమస్య కనిపిస్తోంది.
జిల్లాలో గంజాయి వినియోగదారులు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఆరు నెలలుగా స్తబ్ధుగా ఉన్న వీరంతా తిరిగి రవాణాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో పోలీసులు తీసుకున్న పకడ్బందీ చర్యలతో వినియోగం పూర్తిగా.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద అండర్పాస్ వంతెన పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారిపై ధర్మోజిగూడెం వంతెన అతి ప్రమాదకరమైంది.
జిల్లా కేంద్రంలో గర్భవిచ్ఛిత్తి నిర్భయంగా చేస్తున్నారు. జనరల్ ఆసుపత్రి సమీపంలో ప్రైవేటు ఆసుపత్రి కేంద్రంగా లింగ నిర్ధారణ, భ్రూణహత్యల దందాకు తెరదీశారు. లింగనిర్ధాణ పరీక్షలు చేసి మరీ ఆయువు తీస్తున్నారు.
ఎన్నిసార్లు తిరిగినా తహసీల్దార్ సమస్య పరిష్కరించడంలేదని కలెక్టరేట్కు వచ్చినా మళ్లీ తహసీల్ కార్యాలయానికి వెళ్లాలని చెప్పడంతో ఓ వ్యక్తి కలెక్టరేట్లో సోమవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.