నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాయి. ఈ మేరకు వాస్తవ గణాంకాలను సామాజిక, ఆర్థిక సర్వే- 2025 వెల్ల్లడించింది.
స్వయం సహాయక సభ్యులైన మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద పలు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించింది.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాయి. ఈ మేరకు వాస్తవ గణాంకాలను సామాజిక, ఆర్థిక సర్వే- 2025 వెల్ల్లడించింది.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడంతోపాటు అన్ని రంగాల్లో చైతన్య పరిచేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపడుతున్నాయి.
‘ఆన్లైన్-ఆఫ్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లు యువత ఉసురు తీస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వారిని చిన్నాభిన్నం చేస్తున్నాయి.
పురపాలికల్లో వార్డు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు, సిబ్బందికి పని విభజన ద్వారా పురపాలన సులువు కానుంది.
కట్టెలపొయ్యి మీద తయారు చేసిన జొన్న రొట్టె.. పచ్చి కారం.. చింతపండు తొక్కు.. తింటుంటే ఆ రుచే వేరు. గిరిజన తండా వాసులు నిత్యం జొన్న రొట్టెను తినడం అలవాటు.
యూట్యూబ్ వీడియోలతో బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తున్న బయ్యా సన్నీయాదవ్ అలియాస్ సందీప్యాదవ్పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ సామాజిక మాధ్యమ ఖాతాకు ట్యాగ్ చేశారు.
వరి పంటను సంరక్షించేందుకు క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తుండగా.. గుండెపోటుతో రైతు మృతిచెందిన ఘటన పెన్పహాడ్ మండలం దోసపహాడ్లో శుక్రవారం చోటుచేసుకుంది.
ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఫొటోలు, వీడియోలు తీసి, తిరిగి ఆమెపై దాడి చేసిన కేసులో నిందితులు నూకతొట్టి ప్రమోద్కుమార్, స్వామి రోజాలను అరెస్టు చేసినట్లు సీఐ చరమందరాజు శుక్రవారం విలేకర్లకు తెలిపారు.
నాగార్జునసాగర్ వద్ద అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సాగర్, పరిసర ప్రాంత వాసులు కోరుతున్నారు. తిరుమలగిరి (సాగర్), పెద్దవూర మండలాలకు చెందిన పలు గ్రామాలు, తండాలు సాగర్కు సుమారు 10కిమీ నుంచి 15 కిమీ దూరంలో ఉంటాయి.
మూగజీవాలకు వైద్యం అందక మూగరోదన అనుభవిస్తున్నాయి. పశు వైద్యశాలలో వైద్యులు లేకపోవడంతో వెతలు తప్పడం లేదు. వైద్యంపై అవగాహన లేని అటెండర్లు, గోపాల మిత్రలతో వైద్యం చేయిస్తున్నారు. దీంతో వందలాది మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. (ఆంధ్రజ్యోతి- యాదగిరిగుట్ట రూరల్)
వాన నీటిని సంరక్షించి భూగర్భజలాలను పెంచడమే వాటర్ షెడ్ పథకం ముఖ్య ఉద్దేశమని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మండలంలోని పుట్టపాక గ్రామంలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన వాటర్ షెడ్ యాత్రను జాయింట్ కమిషనర్ నరసింహులుతో కలిసి ప్రారంభించారు.
ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎ్స)కు ఇచ్చిన రాయితీని ప్రజలు వినియోగించుకునేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సూచించారు.
ఆధునిక దేవాలయం, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ జలాశయం రోజు రోజుకూ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు జిల్లాల పరిధిలోని ఆయకట్టు అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్న సాగర్ జలాశయంలో నీటి నిల్వ తగ్గుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మొదటి రోజు పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు సబ్జెక్టు పరీక్షకు మొత్తం 50 పరీక్షా కేం ద్రాల్లో 8,627 మంది విద్యార్ధులకు 8,616 హాజరు కాగా, 11మంది గైర్హాజరయ్యారు.
తుర్కపల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): భువనగిరి జాతీయ రహదారిపై జేతురాం తండాలోని కాళేశ్వరం కాల్వ వద్ద ఉన్న మూల మలుపు వద్ద ప్రమాదాల నివారణకు బ్లింకర్ లైట్లను ఏర్పాటు చేసినట్లు యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు.