భర్తగా..తండ్రిగా..అన్నగా..తమ్ముడిగా.. తాతగా.. కార్యాలయంలో ఉద్యోగిగా.. సరిహద్దులో సైనికుడిగా.. గేటు ముందు రక్షకుడిగా.. సమాజంలో అనేక రకాల బాధ్యతలు నిర్వర్తించే మగాడు..
ఈ చిత్రంలో కనిపిస్తున్న ట్రక్షీట్.. నర్సప్పగూడేనికి చెందిన నలుగురు రైతులవి. వీరు కనగల్ మండలంలోని రైస్మిల్లులో ఒక లారీలో మొత్తం 678 బస్తాల ధాన్యం ఇస్తే తరుగు పేరిట మిల్లు యజమాని 5 బస్తాలు కోత విధించారు.
రసాయన రహిత ఆహారం, ఆరోగ్యం లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలిక పరిధిలోని ఆరెగూడానికి చెందిన ఆదర్శ రైతు బిల్లపాటి గోవర్ధన్రెడ్డి నాలుగేళ్లుగా దేశవాళి రకాలను సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 90 రోజుల ప్రణాళిక అమలవుతోంది. ఇందులో భాగంగా రోజుకో సబ్జెక్ట్ చొప్పున ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులను చదివిస్తున్నారు.
పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సిటిజన్ బడ్డీ’ యాప్ వినియోగం కొరవడింది. అవగాహన లేమి, అధికారుల నిర్లక్ష్యమే ఇందుక్కారణమవుతోంది.
సూర్యాపేట గ్రంథాలయం నిరుద్యోగులకు కొలువుల బాట పరుస్తోంది. పోటీపరీక్షలకు కావాల్సిన పుస్తకాలు ఉండటంతో ప్రైవేటులో శిక్షణ పొందకుండా ఇక్కడ సాధన చేసి ఉద్యోగాలు సాధిస్తున్నారు.