‘ఎందెందు వెతికినా అందందు కలదన్న’ తరహాలో అవినీతి కనిపిస్తోంది. రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్నా.. చేయి తడపనిదే పనికాదన్న రీతిలో ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలకు సముచిత స్థానం కల్పించేలా పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీల్లో తమకే అవకాశం వస్తుందనే ఆశతో ఏళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్న నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
కల్తీ కల్లు.. తాగితే ప్రాణాలు హరిస్తుంది. నీటిలో మత్తు పదార్థాలను కలిపి కృత్రిమ కల్లు తయారుచేస్తుంటారు. అక్రమార్కులు దీన్ని ఇష్టానుసారంగా విక్రయిస్తుండగా, దీన్ని తాగుతూ ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు.
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఎం-ఫార్మసీ విభాగాన్ని ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా.. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ క్యాంపస్కు తరలించారు.
ప్రైవేటు పాఠశాల బస్సు దగ్ధమైన ఘటనలో విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట శివారు ఓఆర్ఆర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
నెలలు నిండిన గర్భిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం.. ఆమె బాలిక కావడం.. ‘అది బలవన్మరణం కాదు.. హత్య’ అని పుట్టింటి వారు ఆరోపిస్తుండడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
హుస్నాబాద్ డివిజన్లో కాంప్లెక్సు ఎరువులు, యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగైదు రోజులుగా ఈ పరిస్థితి నెలకొంది.
ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చేతిలో సామాన్యులు అవసరానికి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేక అవస్థల పాలవుతున్నారు. అధిక వడ్డీ ఆశ చూపించి, నమ్మించి.. వ్యక్తులు, సంస్థలు డిపాజిట్లు వసూలు చేసి చివరికి మోసగిస్తున్నారు.