మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కగా.. తప్పించుకొనేందుకు రెండున్నర కి.మీలు పరుగుపెట్టిన విషయం సంచలనం రేపిన విషయం విదితమే. ఈ విషయం తెలిసి మండల ప్రజలు ఆ ఠాణా ముందు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు
న్యూస్టుడే, చేగుంట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు పెరగడంతో వంట నిర్వాహకులకు భారంగా మారి, నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం ఇటీవల ధరలు పెంచింది. మళ్లీ తాజాగా రెండో సారిపెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. రిజర్వేషన్ల ఖరారుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ఇసుక బజార్ ఏర్పాటు చేయడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇబ్బందులు తొలగిపోయాయి. నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో రెండు నెలల కిందట నర్సాపూర్లో దీనిని ప్రారంభించారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్. ఈ మండలానికి ఓవైపు దేశంలోనే అత్యంత పొడవైన 44వ జాతీయ రహదారి, మరోవైపు రైల్వే జంక్షన్, ఇంకోవైపు ట్రిపుల్ఆర్ మార్గం. దీనికి తోడు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో సరుకు నిల్వలు, రవాణా సదుపాయాలకు లాజిస్టిక్స్ పార్కు రాబోతోంది. ఈ ప్రణాళిక వేగంగా అమలైతే మెతుకు సీమలో అభివృద్ధి మణిహారం మెరవనుంది.
విద్యార్థి జీవితంలో పదో తరగతి, ఇంటర్.. రెండూ కీలకమే. తల్లిదండ్రులు, విద్యాలయాల నిర్వాహకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. తదనుగుణంగా బాలబాలికలను సిద్ధం చేస్తుంటారు.
ప్రస్తుతం ఉద్యాన పంటల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఇందుకు అనుగుణంగా సాగు లేక ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగేసింది.
చిన్నారులే జాతి సంపద. వీరు ఆరోగ్యంగా ఎదగడం ముఖ్యం. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ఇందులో భాగమే
అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె తలను మంచంకేసి కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జహీరాబాద్ మండలం బూర్దిపాడ్లో శుక్రవారం చోటుచేసుకుంది.
హుస్నాబాద్ వ్యవసాయ విపణి పరిధిలో ఈ సీజన్లో ఇప్పటి వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. ప్రైవేటుగా జిన్నింగు మిల్లుల్లో సీసీఐ కన్నా మూడు రెట్లు ఎక్కువ జరిగింది
గజ్వేల్ మండల పరిధిలోని ఓ గ్రామంలో బాలికకు గత నెలలో నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. సమాచారం అందిన అధికారులు, పోలీసులు నిలిపివేశారు. బాల్య వివాహంతో అనర్థాలను తల్లిదండ్రులకు అవగాహనపరిచారు. అర్థం చేసుకున్న పెద్దలు నిశ్చితార్థాన్ని, పెళ్లి ఆలోచనను విరమించుకొని బాలికను విద్యాలయానికి పంపిస్తున్నారు.
సింగూరు డ్యాంను అధ్యయన కమిటీ పరిశీలించింది. డ్యాంను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టాలా లేక కాపర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలా అనే విషయంలో ప్రత్యక్షంగా కమిటీ పరిశీలన చేసింది.