ప్రభుత్వం పెండింగ్ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టం రూపొందించింది. ధరణి స్థానంలో భూ-భారతి పోర్టల్ను ప్రవేశపెట్టింది. గతానికి భిన్నంగా క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో తహసీల్దార్లతో పాటు..
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఉత్తమ ఫలితాల సాధనకు ఇప్పటి నుంచే విద్యాశాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
సాగులో రసాయనాల వాడకం విచ్చలవిడిగా పెరిగింది.. దీనివల్ల భూసారం దెబ్బతింటోంది.. అందుకే ప్రభుత్వాలు సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నాయి.. ఈ విధానంలో పండించే పంటలకు డిమాండ్ పెరుగుతోంది..
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు తొలి విడత పరిహారం పంపిణీ ప్రారంభం కాగా, రెండో విడత ఎప్పుడెప్పుడు, ఎలా చెల్లిస్తారన్న విషయమై నిర్వాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు సంతానం. ఆ ఇద్దరు పిల్లలు తక్కువ బరువుతో ఇబ్బంది పడుతున్నారు. గత నెల 30న సంగారెడ్డిలోని పౌషకాహార పునరావాస కేంద్రంలో చేర్చారు.
గ్రామ పంచాయతీలకు డిసెంబరులో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 20 నుంచి 23వ తేదీవరకు ఓటరు జాబితా సవరణకు అవకాశం కల్పించింది.
జాతీయ రహదారి 365బీ ప్రమాదాలకు నిలయంగా మారింది. సిరిసిల్ల నుంచి సూర్యాపేట వరకు ఉండగా మూడో విడతలో దుద్దెడ క్రాస్ రోడ్డు నుంచి జనగామ వరకు మూడేళ్లుగా విస్తరిస్తూనే ఉన్నారు.
జిల్లాలోని మున్సిపాలిటీల్లో టౌన్ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. నిలువరించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నానే విమర్శలు వినిపిస్తున్నాయి.
సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 261 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. అక్టోబరు 4 నుంచే సాయంత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతుండగా.. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో అల్పాహారం పంపిణీ చేపట్టారు.
దేశం సురక్షితంగా ఉండటానికి సరిహద్దులను కాపలా కాసే సైనికుల అవసరం ఎంతో ఉంటుంది. ప్రాణాలకు తెగించి ఎముకలు కొరికే ఈ చలికాలంలో ఉత్తరాదిన ఎత్తయిన సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్నారు.
క్రీడల్లో గెలవడానికి కష్టపడి సాధన చేస్తుంటారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు వెళ్లి పతకాలు సైతం తెస్తుంటారు. వేల మంది విద్యార్థులు ఆటలపై ఇష్టంతో ముందడుగు వేస్తే చివరికి రాష్ట్ర, జాతీయ స్థాయికి వచ్చేసరికి వేళ్లమీద లెక్కబెట్టేవిధంగా ఉంటోంది.
శీతకాలం వచ్చిందంటే చాలా పొగమంచుతో ప్రధాన రహదారులు రక్తమోడుతున్నాయి. తెల్లవారుజామున ముందున్న వాహనాలు ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించక నిత్యం ప్రమాదాలు చోటు చేసుకొని రోజుకు ఒకరు చొప్పున మృత్యువాతపడుతున్నారు.