తునికి గ్రామ శివారులో ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు నెలల క్రితం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధుల కింద రూ.55 లక్షలు వెచ్చించి అత్యాధునిక జీవ నియంత్రణ ప్రయోగశాలను నెలకొల్పారు.
రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసురెడ్డి మృతికి ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. గురువారం వాసురెడ్డి మరణించిన సమాచారం తెలియగానే ఎమ్మెల్యే రఘునందన్రావు పొలంపల్లికి వెళ్లి వాసురెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు
మాటలు రాకపోయినా.. చెవులు వినిపించకపోయినా.. ఆవేదనకు గురికాకుండా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు ఆ విద్యార్థి. బొమ్మలు తయారు చేయడంలో, చిత్రాలు గీయడంలో సృజన చాటుతున్నాడు
నాయకత్వ లక్షణాలను ఒడిసి పట్టుకున్న బక్కి వెంకటయ్య.. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్గా గురువారం ఎంపిక కావడంతో ప్రజాప్రతినిధులు, స్నేహితులు అభినందనలు తెలిపారు
ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట దూషిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. ప్రజలకు అవగాహన దిశగా ఆరు నెలల పాటు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
గణేశ్ నవరాత్రులంటే.. ఊరావాడ సంబురమే. ఎవరికి వారుగా ప్రత్యేకతను చాటుతూ నిర్వహించే ఉత్సవాలు అంబరాన్నంటుతాయి. మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహణకు పోలీసు శాఖ ఏటా చర్యలు తీసుకుంటోంది.
సిద్దిపేటలో ఓ భారాస నాయకుడు మంత్రి హరీశ్రావుపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఇంటి ఓట్లన్నీ హరీశన్నకే అని ఫ్లెక్సీపై పేర్కొని సిద్దిపేటలోని 20వ వార్డు భారాస అధ్యక్షుడు మహమ్మద్ చాంద్ ప్రదర్శించారు.
పాపన్నపేట/నారాయణఖేడ్, సెప్టెంబరు 21: వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిణి తెలిపారు. గురువారం పాపన్నపేట పోలీ్సస్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.
జిన్నారం, సెప్టెంబరు 21: పారిశ్రామిక మున్సిపాలిటీ బొల్లారంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు నిదానంగా సాగుతుండటంతో రహదారులపై తీసిన గోతులు స్థానికులకు ఇక్కట్లు కలిగిస్తున్నాయి.
వర్గల్, సెప్టెంబరు 21: తెలంగాణలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, ఆటల రూపంలో, పాటల రూపంలో కళాకరులు సమాజంలో జరుగుతున్న విషయాలను వివరిస్తూ మార్గదర్శకులు అవుతున్నారని, నేటి విద్యార్థులు చదువులతో పాటు కళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
యూరియా కొరత లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అరకొరగా యూరియా సరఫరా చేయడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు
ప్రతీ కార్యకర్త కేసీఆర్లా పనిచేయాలని, ఉద్యమనేత.. బీఆర్ఎస్ అధినేతను మూడోసారి సీఎంను చేయడానికి కృషిచేయాలని ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.