చేగుంట మండలం రెడ్డిపల్లిలో జీఎస్ఎన్ ఫెర్రో అల్లాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ 2016లో మూతపడింది. పని చేస్తున్న సమయంలోనూ విద్యుత్తు బిల్లు చెల్లించలేదు.
నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. మొత్తం ఇక్కడ 10 మంది వైద్యులు విధుల్లో ఉండగా, ఆరుగురు వైద్యులు డిప్యుటేషన్పై ఉన్నారు.
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. వారి భవిష్యత్తు బాగుండాలంటే.. బాల్యం సవ్యంగా సాగాలి. ఈ నేపథ్యంలోనే ఏటా ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల ద్వారా వారికి బాసటగా నిలుస్తున్నాయి.
హత్నూర మండలం నస్తీపూర్ గ్రామ శివారులో గత ఏడాది డిసెంబరు 1న జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఇందులో పాత నేరస్థుడి సహా ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు
పరిశ్రమల్లో ప్రమాదాలతో కార్మికులకే కాకుండా.. సాధారణ జనానికీ ఇక్కట్లు తప్పడం లేదు. పారిశ్రామికవాడలకు అతి సమీపంలో కాలనీలు, పాఠశాలలు ఉండటం ఆందోళనకరం. పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ప్రమాద ప్రభావం రెండు కిలోమీటర్ల వరకు ఉందని స్థానికులు చెబుతున్నారు
హత్నూర మండలం దౌల్తాబాద్కు చెందిన రావెళ్లి బుచ్చమ్మ-నర్సింహులుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోవడంతో.. ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను పేర్కొంటూ.. ‘పేదల గూడు.. దక్కని గోడు’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి గృహనిర్మాణ శాఖ పీడీ చలపతిరావు స్పందించారు.
తెలంగాణ పోలీసు శాఖలో కొత్త ఆశలకు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తూ శిక్షణ పూర్తి చేసుకున్న యువ మహిళా ఎస్సైలు సమత (మిరుదొడ్డి), సౌజన్య (బెజ్జంకి), మానస (రాయపోల్)లు సోమవారం తొలిసారిగా బాధ్యతలు స్వీకరించారు.