వందల సంఖ్యలో ఎకరాలున్నా, కొన్ని ఆలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. భూములను కౌలుకు ఇచ్చినా, ఆదాయం సమకూరడం లేదు. మరో వైపు వాటికి రక్షణ కరవై, పలు చోట్ల అన్యాక్రాంతమవుతున్నాయి. మెదక్ నియోజకవర్గంలో ఎనిమిది ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి.
చూడగానే నోరూరించే మామిడి పండ్లు ప్రస్తుతం మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. పలు రకాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. సహజంగా పండించినవి తింటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్న వైద్యులు.. కార్బైడ్తో మాగబెట్టినవి మాత్రం అనర్థమని హెచ్చరిస్తున్నారు.
మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువుల సంరక్షణకు కసరత్తు కొలిక్కి వస్తోంది. తాజాగా ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 2,933 చెరువులకు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాథమికంగా నిర్ధారించినట్లు హెచ్ఎండీఏ తెలిపింది.
జిల్లాలో 24 గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన నాలుగు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది గాయపడడం చర్చనీయాంశమైంది. వాహనదారుల అజాగ్రత్తతోపాటు అకాల వర్షాలూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
‘అస్సాంకు చెందిన మొఫిజ్జుల్ ఇస్లాం కొండాపూర్ మండలం గొల్లపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఆయన భారత్కు చెందిన ఫోన్ నంబర్లతో పాకిస్థాన్ వాసులకు ఓటీపీలు చెబుతూ వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసేందుకు సహకరిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి.
జిల్లాలో బుధవారం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. అత్యధికంగా హత్నూర మండలం గుండ్లమాచనూర్లో 39.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. కోహీర్ పట్టణంలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.
వైద్యరంగంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. కొన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వారి కొరత వేధిస్తోంది. ఆయా వాటిని అధిగమించడం సహా యువత త్వరితగతిన స్థిరపడేందుకు ‘బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్’ దోహదం చేయనుంది.
జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాత్రి వరకు వరుణుడి ప్రభావం కనిపించి వర్షాకాలాన్ని తలపించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి పలుచోట్ల తడిసిపోయింది. అకాల వర్షంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
సమస్త జీవ జాతి అంతరించిపోకుండాఉండేందుకు 2002లో కేంద్ర ప్రభుత్వం.. జీవ వైవిధ్య చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో 2014లో జీవవైవిధ్య మండలి ఏర్పాటుతో సంరక్షణకు చర్యలు చేపట్టారు. పచ్చదనం పెంపు, ప్లాస్లిక్ వాడకం తగ్గించడం, సేంద్రియ ఎరువుల వాడకం, వన్యప్రాణుల వేటను అరికట్టడంపైనా ప్రజలో చైతన్యం తీసుకొచ్చేందుకు విధానాలు రూపొందించారు.
నైరుతి రుతుపవనాలు భారత భూభాగాన్ని తాకాయి. ఆశాజనకంగా ఖరీఫ్ సీజన్ దున్నకాలతో ప్రారంభమవుతోంది. కాళేశ్వరం సంబంధిత ప్రాజెక్టుల నీటిని ఎత్తిపోతలు, చెరువులు నింపడం ద్వారా బోరుబావుల్లోనూ భూగర్భ జలాలు పెరుగుతాయి.
దక్షిణ భారతంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్న ఏకైక ప్రాంతం.. భిన్న రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు.. ఆయా ప్రాంతాల వారి సంప్రదాయ పూజలతో త్రివేణి తీర ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ఏడో రోజు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.