మారిన జీవనశైలి.. ఆహార అలవాట్లు.. సమస్యల ఊబిలోకి దించుతున్నాయి. ఒకప్పుడు ఎక్కడో ఓ చోట ఊబకాయులు కనిపించేవారు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా జాబితాలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
కొన్నాళ్లుగా మహిళా సంఘాల సభ్యులు వడ్డీ లేని రుణ రాయితీ గురించి ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వారికి ఊరటనిస్తూ సదరు రాయితీని విడుదల చేయడం విశేషం.
వరి కోతల అనంతరం మిగిలిన మొదళ్లకు రైతులు నిప్పు పెట్టి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇది భూసారాన్ని దెబ్బతీయడంతో పాటు కాలుష్యం ఏర్పడి పర్యావరణానికి ముప్పు కలిగిస్తుంది.
దేశంలో శ్వేత విప్లవ పితామహుడు, పాల ఉత్పత్తిని ప్రోత్సహించిన వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా ఏటా జాతీయ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రైవేటుకు పోటీగా విజయ సంస్థ రైతులకు అదనంగా లీటరుకు రూ.4 అందజేస్తోంది. నాలుగేళ్ల నుంచి ఈ నిధులు రావడం లేదు. ఒక వ్యక్తికి ఒక రోజుకు 400 మి.లీ. పాలు అవసరం. 117 మి.లీ. మాత్రమే లభ్యవముతున్నాయి.
రైస్మిల్లులో చోరీకి పాల్పడిన ముఠాను పోలీసులు వారం రోజుల్లోనే అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు
ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డును అలా దూరం నుంచి మహిళ చూపగానే కండక్టరు టికెట్ తీసి ఇస్తున్నారు. కండక్టరు అవసరం లేకుండానే ఒక యంత్రంపై ఆధార్ కార్డును పెట్టి స్కాన్ చేసే విధానం వస్తే.. ఏ దశలోనూ దుర్వినియోగం కాకుండా ఉంటుందని సిద్దిపేట జిల్లా కొండపాక పాఠశాల విద్యార్థిని కీర్తన చెబుతోంది.
స్థానిక సమరంలో పైచేయి సాధించేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే పంచాయతీ పాలకవర్గాలే కీలకం.
జిల్లాలో గనుల తవ్వకాల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల కిందట అక్రమ మైనింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డి యజమానిగా ఉన్న మైనింగ్ కంపెనీకి చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేయడమే ఇందుకు నిదర్శనం
సిద్దిపేట ఈ-సేవా కేంద్రంలో కొనసాగుతున్న ఆధార్ కేంద్రానికి నిత్యం సగటున 70 మంది హాజరవుతున్నారు. అందులో కొత్తగా జారీకి 10 మంది, నవీకరణకు 20, సవరణలకు (డెమోగ్రఫీ) 40 మంది ఉంటున్నారు. వీరింతో పాటు మరింత మంది ఈ కేంద్రానికి పోటెత్తుతున్నారు. నిర్దేశిత స్లాట్లు దాటితే మరుసటి రోజు రావాలని సూచిస్తున్నారు.