గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధి జరిగేలా గోపాల మిత్రలు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. గోపాల మిత్రల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత మంత్రి శ్రీహరిని కోరుతున్నానని పేర్కొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఏ చిన్న అవకాశం వచ్చినా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇందుకు పదో తరగతి పరీక్ష రుసుంను పోషకుల నుంచి అందినంత దండుకుంటున్న తీరే నిదర్శనం.
ఆహ్లాదాన్ని పంచే ఉద్యానవనాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ఫలితంగా ప్రజలు సేదదీర లేకపోతున్నారు. చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో వెంచర్లు ఏర్పాటవుతున్నాయి.
శివ్వంపేట మండలం గూడురు కస్తూర్బాలో 213 మంది విద్యార్థులున్నారు. వీరికి వేడినీటిని అందించేందుక గీజర్ ఏర్పాటు చేసి, సౌర వ్యవస్థ ఏర్పాటు చేసినా, మరమ్మతుకు గురైంది. బాగు చేయించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వానా, చలికాలంలో పిల్లలకు ఇబ్బందులు తప్పడం లేదు.
చెత్త వ్యర్థం కాదు.. ఆదాయవనరు అని నిరూపించారు. స్వచ్ఛ సిద్దిపేటనే లక్ష్యంగా పట్టణవాసులు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించే క్రతువు ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
టెండర్లో దుకాణాలు దక్కించుకున్న మద్యం వ్యాపారులు అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనతో ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు చేపడుతున్నారు. చిన్న చిన్న పల్లెల్లోనూ పదుల సంఖ్యలో బెల్టు దుకాణాలు కొనసాగిస్తున్నా వారికి అడ్డు చెప్పేవారే లేకుండా పోయారు.
దేశంలో అత్యంత పొడవైన 44వ జాతీయ రహదారిపై అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసేందుకు జాతీయ ప్రాధికార సంస్థ అధికారులు(ఎన్హెచ్ఏఐ) చర్యలు తీసుకుంటోంది. ప్రమాదాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా కిలో మీటరుకు ఒక కెమెరాను బిగించేందుకు పనులు ప్రారంభించారు.
సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారిపై చౌటకూరు మండలం శివంపేట వద్ద సర్వీసు దారిపై రైతులు ఇలా ధాన్యం ఆరబోశారు. రోడ్డు సగం భాగంలో మాత్రమే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
కొంతకాలంగా జోగిపేట పట్టణంలో వరుస చోరీలు ప్రజలు, వ్యాపారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టపగలు కూడా దుండగులు దొంగతనాలకు పాల్పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. పోలీసులు నిఘా పెంచాలని, చోరీలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలు తీసుకుంటూ పేదరికం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వయం ఉపాధి దిశగా పలువురు అడుగులు వేస్తూ కుటుంబ ఉన్నతిలో భాగస్వాములవుతున్నారు.
గజ్వేల్లో ఏర్పాటు చేసిన మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్) మెరుగైన వైద్య సేవలందిస్తోంది. రూ.31.69 కోట్ల వ్యయం.. 100 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రిని 2023 అక్టోబరు 2న ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో సదుపాయాలు లేక సేవలు ఆరంభించలేదు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో మరో రహదారికి నాలుగు వరుసల మహర్దశ పట్టనుంది. ఎవరు ఊహించని విధంగా హుస్నాబాద్-జనగాం మార్గంలో అక్కన్నపేటలో జిల్లా సరిహద్దు వరకు హ్యామ్(హైబ్రిడ్ యాన్యూటి మాడల్) రహదారి నిర్మించనున్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సందేశం వెల్లువెత్తిందని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ పేర్కొన్నారు.