జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా జనరల్ ఆసుపత్రిలో పొరుగు సేవలు, కాంట్రాక్టు పద్ధతిన పలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగుల నియామకంలో నిబంధనలు పాటించడం లేదనే విమర్శలొస్తున్నాయి.
అతివల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ‘స్వాస్థ్ నారీ..స్వశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈనెల 17 నుంచి వచ్చేనెల 2వరకు పల్లె, పట్టణాల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆదేశించింది.
జాతీయ రహదారి నాలుగు వరుసలుగా విస్తరించిన సమయంలో, నార్సింగి వద్ద బాక్స్ వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే కేవలం రెండు పైపులతో కల్వర్టు నిర్మించారు.
స్నేహితులంతా కలిసి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)లో కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
నేరస్థులు చట్టం కళ్ల నుంచి తప్పించుకోలేరని, కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామంలో యువతిపై హత్యాచారం కేసులో తగిన శిక్ష పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట సిద్దిపేటలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు మూడు వేలకు పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో కేవలం 120 మంది మాత్రమే ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని పెద్ద మత్తడి, మొండి మత్తడి, దేవునిపల్లి మత్తడి పొంగిపోలుతుండగా అన్ని గ్రామాల్లోని చెరువులో మత్తలు దూకుతున్నాయి.