[04:14] అనాథ పిల్లల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి ఆదుకుంటామని హామీనిచ్చి మాట తప్పిన తెలంగాణ ప్రభుత్వంపై సీఎం నియోజకవర్గ గజ్వేల్ నుంచే ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు.
[04:14] ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో 44వ జాతీయ రహదారిపై చేగుంట సమీపంలో బైపాస్ సర్కిల్ వద్ద ఉపరితల వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పనులు చురుకుగా సాగుతున్నాయి.
[04:14] సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ గ్రామాల నుంచి అర్జీదారులు సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులకు వినతులు సమర్పించారు.
[04:14] ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఎనిమిది డిపోలు ఉండగా 238 అద్దె బస్సులు నడుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో మూడు డిపోల పరిధిలో 147 అద్దె సర్వీసులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి.
[04:14] గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు మెరుగుపడనున్నాయి. ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.60 కోట్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇటీవల జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో మెదక్ జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదు. ఎన్నికల సీజన్ ముందున్నందున 2023-2024 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు కేటాయింపులు దక్కుతాయని భావించినవారికి నిరాశే మిగిలింది.