CM Revanth: జహీరాబాద్ పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. జహీరాబాద్ నిమ్జ్లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. అనేక వసతులు సమకూరుతున్నాయి. ఉపాధ్యాయులకు సైతం శిక్షణ ఇచ్చి నాణ్యమైన బోధన అందేలా చూస్తున్నాం.
శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని రైతులు నిలదీయడంతో డబ్బులు తిరిగి చెల్లించిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
పంటలు చేతికొచ్చిన సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిల్వ చేయడానికి సరైన గోదాములు లేక కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదు.
కంటికి కనిపించని పరిమాణంలో ఉండే రాళ్లు శరీరాన్ని మెలిపెడతాయి. కుదురుగా కూర్చోనీయకుండా.. నొప్పితో విలవిలలాడేలా చేస్తుంటాయి. వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడే వారు అనేకం.
అన్నదాతలకు విశిష్ట సంఖ్య కేటాయించి, దీనికి కార్డు సైతం ఇచ్చి పథకాల అమలుకు అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ఈ దిశగా అడుగేసింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితులై ఎంతో మంది ఉద్యమంలో చేరారు. 1990 ప్రాంతంలో ప్రభావం ఎక్కువగా కన్పించింది.
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో.. ఎర్రనేలలతో విస్తరించిన ప్రాంతం జహీరాబాద్ నియోజకవర్గం. భిన్న పంటల సాగుతో గుర్తింపు పొందింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది.
పట్టణాల్లో రోజురోజుకు చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. కాలుష్యం పెరుగుతోంది. హరితహారం, వన మహోత్సవం కార్యక్రమాల ద్వారా ఏటా మొక్కలు నాటుతున్నప్పటికీ.. ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు.
‘నాణ్యమైన విద్య, మెరుగైన సదుపాయాలు సర్కారు బడుల ప్రత్యేకత. డిజిటల్ బోధన.. ఏఐ పాఠాలు ఉంటాయి. పాఠశాలలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.’ అని జిల్లా విద్యాధికారి (డీఈవో) శ్రీనివాస్రెడ్డి కోరారు.
పురపాలికలో దోమలు, ఈగల నివారణకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో పలు వార్డులో మురుగు కాల్వలను నెలలు గడుస్తున్నా శుభ్రం చేయటం లేదు.