ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్భూముల్లో పెద్దలు గద్దల్లా వాలిపోయారు. పారిశ్రామికవేత్తలు, స్థిరాస్తి వ్యాపారుల అవతారమెత్తిన రాజకీయ నాయకులు నిబంధనలను ఉల్లంఘించి వాటిని కొనుగోలు చేశారు.
ఆధార్ నవీకరణ ఆవశ్యకత తప్పనిసరి. లేదంటే కార్డు ఉన్నా ఉపయోగం ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకుని 10 ఏళ్లకోసారి వివరాల నమోదు చేసుకోవాలని యూఐడీఐ (యూనిక్ ఐడెన్టిఫికేషన్ అథారిటీ) ఆదేశాలు జారీ చేసింది.
ఓ వైపు పదో తరగతి ప్రత్యేక తరగతులు.. మరో వైపు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు.. వచ్చే నెలలో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన.. స్వచ్ఛం ఏవం హరిత విద్యాలయం రేటింగ్ పరిశీలన కార్యక్రమాలతో విద్యాశాఖలో హడావుడి నెలకొంది.
పారదర్శకంగా సేవలందించాల్సిన ఆ పోలీసు అదికారి వృత్తికే కళంకం తెచ్చేలా అవినీతిలో ఆరితేరిపోయారు. ఆస్తుల సముపార్జనే ధ్యేయంగా పని చేస్తూ అందినకాడికి దండుకున్నారు.
చిరుత అనగానే.. అందరి ముఖంలో భయం కనిపిస్తుంది. కనిపిస్తే చాలు కాళ్లకు పని చెబుతాం. అతివేగంగా దాడి చేసే స్వభావం దీనిది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల సమీపంలోని పల్లెల్లో జీవాలపై దాడి ఘటనలు తరచూ చోటుచేసుకున్నాయి.
తుల్జా భవానీ మాత అనగానే ముందుగా గుర్తొచ్చేది మహారాష్ట్రలోని తుల్జాపూర్ ఆలయం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన తుల్జాభవానీ మాత ఆలయం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఖాన్జమాల్పూర్ (భవానమ్మపల్లె)లో కొలువై ఉంది.
చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసాగా నిలిచేలా కేంద్రం భద్రతా పథకాన్ని తీసుకొచ్చింది. అదే ‘కిసాన్ మాన్ధన్ యోజన’. ఎవరు అర్హులు, ప్రయోజనాలు ఏంటో తెలిపేదే ఈ కథనం.
ప్రభుత్వ ప్రగతి పనులను కొందరు అధికారులు, గుత్తేదారులు నవ్వుల పాలు చేస్తున్నారు. పర్యవేక్షణ లోపం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల రోజుల వ్యవధిలోనే దాని ప్రభావం కనిపిస్తోంది.