జనవరి 26 వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్మీడియట్ స్థాయిలోనే విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ప్రభుత్వం గత ఏడాది నుంచి ఆంగ్లంలో ప్రయోగ పరీక్షకు శ్రీకారం చుట్టింది.
నైవేద్యం వండిన పాత్రలను బియ్యం పిండి, పసుపు, కుంకుమ, వేపాకులు, పూలు, పైన దీపాలతో అలంకరించారు. తలపై పెట్టుకొని ‘జై మల్లన్న’ అని కీర్తిస్తూ భక్తజనులంతా కొమురవెల్లిలో ఆదివారం ప్రారంభమైన రెండున్నర నెలల జాతరలో పాల్గొన్నారు.
ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రజల కల నెరవేరనుంది. అటు వైద్య సేవలకు దూరమవుతూ... ఇటు ప్రభుత్వ పథకాలను కోల్పోతున్న అర్హులకు రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అధికారుల పర్యవేక్షణ లోపంతో ఏళ్లుగా ఉన్న రోడ్లు, కుంటలు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. తూప్రాన్ పురపాలిక పరిధి బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని కట్టు కాల్వ రోడ్డును కబ్జా చేసి కంచె ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ‘పనుల జాతర ’కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా గత నవంబరు 26 నుంచి పల్లెల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించింది.
చెరకు పంట అతివృష్టి, అనావృష్టిలను తట్టుకొని ఎదుగుతూ రైతుల్లో మనోధైర్యాన్ని నింపింది. ఏడాది పాటు సాగు చేపట్టడం ఒక ఎత్తయితే.. ఆ పంటను పరిశ్రమకు తరలించి విక్రయించడం మరో ఎత్తు.
మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్నేళ్లుగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడుతోంది. దీంతో చేపల వేటతో మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు.
ఇటీవల ఖమ్మం మార్కెట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుని విలువైన పత్తి దగ్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలోని అగ్నిప్రమాద నివారణ చర్యలను పరిశీలించగా అన్ని చోట్ల ఏర్పాట్లు అంతంతే ఉన్నాయి.
సర్వేంద్రియానం.. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంటి చూపు లేకపోతే సమస్త ప్రపంచం అంధకారమే. దీన్ని గుర్తించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ కంటి ఆరోగ్యంపై చైతన్యం తీసుకురావడంతో పాటు పేదలకు ఉచిత అధునాతన వైద్యం అందిస్తోంది.
మనం ఆధ్యాత్మిక క్షేత్రాలకు, విహారయాత్రకు వెళ్తుంటే.. టికెట్ల కోసం అక్కడికి వెళ్లి బారులు తీరి నిల్చుంటాం. లేదంటే బుకింగ్కు వివిధ రకాల యాప్లను వినియోగిస్తుంటాం.
ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండరు పేలిన ఘటనలో దివ్యాంగురాలు సజీవ దహనమైన ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంసేట్ మండలం నాగధర్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్(ఈఎస్ఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రీజనల్ స్థాయిలో విజయం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి.
Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం పోయాక కేటీఆర్ రైతు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్కు అవమానం జరిగిందని ఎంపీ రఘునందన్ రావు గుర్తుచేశారు.