ఒడిశా - ఆంధ్రప్రదేశ్ను అనుసంధానం చేసే జాతీయ రహదారి వర్షాలకు చిత్తడిగా మారింది. అడుగు తీసి వేయలేనంత అధ్వానంగా ఉంది. మూడేళ్ల కిందట రహదారి విస్తరణ పనులు చేపట్టారు.
ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఏళ్లుగా చిన్నారులు పడుతున్న కష్టాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. విద్య, అంగన్వాడీ, వైద్య సేవలు పొందేందుకు ఇన్నాళ్లూ ఇంటి వరండాలు, పూరి పాకలే దిక్కయ్యేవి.
విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని నాడు-నేడులో పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం అంతా బాగున్న బడులకే నిధులు మంజూరు చేసింది. శిథిలావస్థకు చేరిన పాఠశాలల భవనాలను విస్మరించింది.
మన్యంలోని చాలాగ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంతో అక్కడి బాలలు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. వాగులు, వంకలు దాటుకుంటూ బడికెళ్లాల్సిన పరిస్థితి.
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ రెండో విడత ప్రవేశాలకు రంగం సిద్ధమైంది.
ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యానానికి ఊతం ఇస్తున్న ప్రభుత్వం ఈసారి మరింత ప్రోత్సాహం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సామూహికంగా పండ్ల మొక్కల పెంపడానికి శ్రీకారం చుట్టనుంది.
సింహాద్రి అప్పన్న స్వామికి అనకాపల్లి మండలం సిరసపల్లి గ్రామానికి చెందిన భక్తుడు అల్లవరపు త్రిమూర్తులు దంపతులు 17.500 గ్రాముల బరువైన బంగారు పుష్పాన్ని బహూకరించారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రారంభం కానుంది. ఈ నెల 10 నుంచి 18 వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు.
నగరం డ్రగ్స్ వినియోగం, సరఫరాకు కేంద్రంగా మారుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి విమానాలు, కొరియర్ సర్వీసుల ద్వారా దిగుమతి చేసుకుని విక్రయించే వారి సంఖ్య పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, బూట్లుతో పాటు తల్లికి వందనం పేరుతో ఏడాదికి ఒక విద్యార్థికి రూ.13 వేలు ఇస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగడం లేదు.
ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వచ్చారు.
అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలో ఆదివారం 3,114 కుక్కలకు రేబిస్ టీకాలను వేసినట్టు జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్.ఎల్.రాజా రవికుమార్ తెలిపారు.
గిరిజన రైతులు నూతన రాగి వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక ఆచార్య ఎన్జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కార్యాచరణ ప్రారంభించారు. అత్యధిక దిగుబడి, మెండైన పోషక విలువలు కలిగిన ‘ఇంద్రావతి’ ‘వేగావతి’ వంగడాలపై అధ్యయనం చేస్తున్నారు. దిగుబడి, నాణ్యత ఆధారంగా వచ్చే ఏడాది రైతులకు మినీ కిట్స్ రూపంలో విత్తనాలను పంపిణీ చేయనున్నారు.
మండలంలోని రావణాపల్లిలో ఆదివారం సాయంత్రం బిడ్డతో కలిసి తల్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో బిడ్డ మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్య సేవలందించేందుకు తల్లిని విశాఖ కేజీహెచ్కు తరలించారు.
జిల్లాలో 80 పశు సంవర్థకశాఖ ఆస్పత్రుల్లో 24 వేల యాంటీ రేబిస్ టీకాలను అందుబాటులో ఉంచామని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ బి.రామ్మోహనరావు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యానికి మారుమూల గ్రామాల పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇక్కట్లు నడుమ విద్యనభ్యసిస్తున్నారు. అయినా విద్యాశాఖ, ఐటీడీఏ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణ మండలంలోని గిన్నెల పంచాయతీ మారుమూల సబక ప్రభుత్వ పాథమిక పాఠశాలే నిదర్శనంగా చెప్పవచ్చు.
పసిప్రాయాలపై చెరగని గాయాల ముద్ర వేస్తున్నవారిలో తెలిసినవారే ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాలో నమోదైన పోక్సో కేసులను పరిశీలిస్తే నిందితుల్లో ఎక్కువమంది బాధిత బాలల కుటుంబాలకు పరిచయం ఉన్నవారే.
చోడవరం పంచాయతీలో ఇంటి దొంగలు పడ్డారు. ఇంటి పన్నుల రూపేణా వసూలు చేసిన నగదు రూ.17.79 లక్షలను బొక్కేశారు. ముగ్గురు బిల్లు కలెక్టర్లు నగదు పక్కదారి పట్టించినట్లు కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
దుబాయ్ వేదికగా గత నెల 23 నుంచి 29వ తేదీ వరకు జరిగిన అందం, ప్రతిభ (మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్-2025) పోటీల్లో భారత్ తరఫున విశాఖ నగరానికి చెందిన యువతి దిశా పల్నాటి విజేతగా నిలిచారు.
లారీని ఢీకొని తీవ్రంగా గాయపడిన రాంబిల్లి శివారు కుండలదేవునిపాలెం గ్రామానికి చెందిన ఈరుగుల కృష్ణ (36) కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారని సీఐ సీహెచ్.నరసింగరావు చెప్పారు.
భార్యాభర్తలుగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ జంటను శనివారం అరెస్టు చేసినట్లు పెందుర్తి సీఐ సతీశ్కుమార్ తెలిపారు. ఆ వివరాలిలా..
జాతీయ రహదారిపై ఎండాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పలవలస గ్రామానికి చెందిన నంబాల వెంకటరమణమూర్తి (45).
సింహాచలం రైల్వేస్టేషన్ వద్ద ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ స్టేషన్లో రైలు దిగి సిటీ బస్సుల కోసం బీఆర్టీఎస్ రోడ్డులోకి చేరుకోవాలంటే అడుగడుగునా వాహనాలు అడ్డుగా వచ్చేస్తున్నాయి.
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన రెండు చోరీలకు సంబంధించి ఇద్దరు మహిళలను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 20తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర నేర విభాగం ఏసీపీ డి.లక్ష్మణరావు శనివారం పెందుర్తిలో వెల్లడించారు.
సింహాచలం నృసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 9, 10 తేదీల్లో జరిగే గిరిప్రదక్షిణకు సమన్వయంతో ఏర్పాటు చేసి...కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ సూచించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి నుంచి ప్రజల కాపాడటానికి ఐసీఐసీఐ బ్యాంకు అగనంపూడిలోని హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రితో జతకట్టింది. అత్యాధునిక క్యాన్సర్ కేర్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
సింహాచలం అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉంది. భక్తులు స్వామి నామస్మరణ చేస్తూ 32 కిలోమీటర్లు దీక్షతో నడుస్తారు. ఈ మహోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు.
విమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేసి ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా ఒడిశా రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు.