అనకాపల్లి : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని మెట్రోకమ్ యూనిట్ 4 ఫార్మా కంపెనీలో ఇటిపి ప్లాంట్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై…
మారుమూల గ్రామాల్లో రహదారి సదుపాయాలు అంతంతమాత్రమే. ముఖ్యంగా గత ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులపై ఎక్కడలేని నిర్లక్ష్యం ప్రదర్శించింది. పాలన చివరి కాలంలో హడావుడిగా చేసిన పనుల్లో డొల్లతనం అప్పుడే బయటపడి నాణ్యతను వెక్కిరిస్తోంది.
గత వైకాపా ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త విధానాలు రైతులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. వైఎస్సార్ జగనన్న భూరక్ష పేరిట చేపట్టిన రీ సర్వేలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. నేతల అండదండలతో కొన్ని మండలాల్లో అధికారులు ఇష్టానురీతిగా వ్యవహరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్థిక భరోసా లభించిందని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడితే ఆ ప్రభావం సమస్యల పరిష్కారంతోపాటు ప్రగతిపై పడుతుంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలి.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రీజనల్ స్థాయిలో గెలిచిన జూనియర్స్, సీనియర్స్ జట్లు రాష్ట్ర స్థాయిలో తలపడుతున్నాయి.
ముల్లుమెట్ట సమీపంలో సోమవారం ఆటో ఆదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ పెద్దరాయి గ్రామానికి చెందిన గిరిజన కుటుంబం.
స్టీల్ప్లాంటు పరిరక్షణ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుందని, ఇప్పుడు కర్మాగారాన్ని శతశాతం ఉత్పత్తి స్థాయికి తీసుకురావలసిన బాధ్యత కార్మికులు, యాజమాన్యంపై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.
పదిహేనేళ్ల క్రితం నాటి పాలకులు, అధికారులు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వంగలి రైతులు, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఎదుట చేపట్టిన ఆందోళన సోమవారం మూడో రోజుకు చేరుకుంది.
సంక్రాంతి సెలవులు ముగిసి విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రయాణికులతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సోమవారం రద్దీగా మారింది.
ప్రజాశక్తి -ఉక్కునగరం : విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో జరిగిన ఓ ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు మహమ్మద్ గౌస్ (43) మృతి చెందాడు. పెదగంట్యాడ మండలం ఇస్లాంపేట ప్రాంతానికి చెందిన…
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా గుర్తింపు పొందిన సప్పర్ల రెయిన్గేజ్ నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏజెన్సీ వాసులను చలి వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది. దీంతో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు ఏజెన్సీలో పొగమంచు కుమ్ముకుంటున్నది.
ఆంధ్ర కశ్మీర్ లంబసింగి అందాలను చూడడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ఎక్కువ మంది పర్యాటకులు రహదారులకు ఇరువైపులా, పంట పొలాల్లో మద్యం సేవించి సీసాలు, వ్యర్థాలను అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మన్యంలోని ఎత్తిపోతల పథకాలకు మోక్షం లభించడం లేదు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు వినియోగానికి దూరంగా ఉంటున్నాయి. ఫలితంగా ఆయకట్టు కింద వున్న పంట పొలాలకు సాగునీరందని పరిస్థితులు కొనసాగుతున్నాయి.
మండలంలోని చౌడుపల్లి పంచాయతీ వాముగెడ్డ గ్రామంలో 20 రోజుల వ్యవధిలో ముగ్గురు శిశువులు మృతి చెందడం కలకలం రేపింది. ఈ విషయాన్ని స్థానికులు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ దృష్టికి తీసుకువెళ్లడంతో సోమవారం వైద్యాధికారుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించింది.
నగరంలో ఏటీఎంల నిర్వహణ అధ్వానంగా ఉంది. అనేక చోట్ల అవి సక్రమంగా పనిచేయడం లేదు. అత్యవసరంగా డబ్బు తీసుకునేందుకు వెళ్లే వారికి చేదు అనుభవం ఎదురవుతోంది. బ్యాంకులను ఆనుకొని ఉన్న వాటిల్లోనూ అదే పరిస్థితి. డెబిట్ కార్డుల స్కానర్లు పనిచేయకపోవడం, బటన్లు పాడైపోవడంతో సేవలందడం లేదు.
పీఎంపాలెం ప్రాంతాల్లో రోజురోజుకీ భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. కబ్జాల ముసుగులో ప్రభుత్వ గెడ్డ స్థలాలను సైతం కప్పి తమ వశం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు.
విశాఖపట్నం స్టీల్ప్లాంట్ విక్రయ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు దేశ ప్రధాని మోదీ ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు.
జిల్లాలో కొంతకాలంగా సాగు విస్తీర్ణం తగ్గుతోంది. సాగు ఖర్చులు పెరగడం.. దిగుబడులు తగ్గడం.. గిట్టుబాటు ధరలు లేకపోవడమే దీనికి కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 85,857 హెక్టార్లు.
జిల్లాలో కొంతకాలంగా సాగు విస్తీర్ణం తగ్గుతోంది. సాగు ఖర్చులు పెరగడం.. దిగుబడులు తగ్గడం.. గిట్టుబాటు ధరలు లేకపోవడమే దీనికి కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
విశాఖ జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో స్వామీజీల పేరుతో ఏడుగురు వ్యక్తులు లంకె బిందెల పేరిట ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Vangalapudi Anitha: పోలీసులకు హోంమంత్రి వంగలపూడి అనిత పలు సూచనలు చేశారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఛార్జ్షీటు విషయంలో ఆలస్యం చేయవద్దని.. ట్రాఫిక్, పార్కింగ్పై దృష్టి సారించాలన్నారు.