అనకాపల్లి : కొత్త పరిశ్రమలు కాదు ఉన్న పరిశ్రమలను తెరిపించి ఎంపీ సిఎం రమేష్ మాట నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వెంకన్న…
ప్రయాణికుల సౌకర్యార్థం భువనేశ్వర్-ముంబయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలను జత చేయనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
విశాఖలో గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఇష్టా రాజ్యంగా టీడీఆర్లు జారీ చేశారు. అనుకున్నదే తడవుగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసి.. వైకాపా నేతలకు బాండ్లు కట్టబెట్టారు.
బాలికను బలవంతంగా ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు.
విస్సన్నపేట భూములపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి నిబంధనలు అతిక్రమించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా, జనసేన నాయకులు గురువారం డిమాండ్ చేశారు.
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు.
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది.
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి.
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు.
నర్సీపట్నం మునిసిపాలిటీలో వార్డు సచివాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పథకాలు, పౌర సేవలు అందించడానికి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన ప్రభుత్వం సొంత భవనాలు పూర్తి స్థాయిలో నిర్మించలేదు. దీంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మునిసిపాలిటీ పరిధిలో 17 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. నాలుగేళ్లు గడిచినా వీటికి భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో మహిళా మండలి భవనాలు, క్రీడా భవనం, అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నారు.
మండలంలోని బొయితిలి పంచాయతీ రాసవీధి, కుంబిడిసింగి పంచాయతీ అండంగిసింగి కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ టీడబ్ల్యూ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ‘భారీ వర్షాలతో కల్వర్టులకు గండి’ శీర్షిక శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్తపై పీవో స్పందించారు. గండి పడిన కల్వర్టులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అండంగిసింగి కాజ్వేపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు గిరిజన ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులు పైబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గిరిజనులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. అధిక సంఖ్యలో గిరిజనులు ఇళ్లకే పరిమతమయ్యారు. ఏజెన్సీలో వారపు సంతలు జరగకపోవడంతో గిరిజనులు నిత్యావసర సరకులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈదురుగాలులకు చెట్లు పడిపోతుండడంతో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతున్నది.
ప్రస్తుత వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వరదల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదముందని, అనవసరంగా బయట తిరగవద్దని పీవో సూచించారు.
పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద ఆక్రమణలపై సచివాలయ సిబ్బందిపై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆక్రమణలపై మునిసిపల్ కమిషనర్ రవిబాబుకు చాల ఫిర్యాదులు అందడంతో టీపీవో శుక్రవారం మినీ స్టేడియం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయ్యప్పస్వామి గుడి పక్కన స్టేడియం స్థలం ఆక్రమించి పూజా సామగ్రి దుకాణం భారీగా ఏర్పాటు చేయడంపై సంబంధిత వ్యక్తిని నిలదీశారు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి సాయంత్రంలోగా ఆక్రమణ తొలగించాలని సచివాలయ సిబ్బందికి టీపీవో ఆదేశాలు జారీ చేశారు. స్టేడియం ముందు మెయిన్ రోడ్డుని ఆనుకొని మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఉండేది.
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు అందడం లేదు. ఆస్పత్రిలో పేరుకు ముగ్గురు స్త్రీ వైద్యనిపుణులు ఉన్నప్పటికీ ఒక్కరూ అందుబాటులో లేరు. ఒకరు చైల్డ్ కేర్ సెలవుపై వెళ్లగా.. మరో ఇద్దరు పాడేరు జిల్లా ఆస్పత్రిలో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఈ కారణంగా ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు అలా్ట్ర సౌండ్ స్కానింగ్, నెల వారి ఆరోగ్య తనిఖీలు నిలిచిపోయాయి.
ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు రద్దయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖలో వైసీపీ ప్రభుత్వం సాగించిన అనేక అక్రమాలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం సిఫారుసుల ముసుగులో ఉపాధ్యాయులను ముడుపులు తీసుకొని అక్రమంగా బదిలీలు చేశారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖలో అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా నిబంధనలకు విరుద్ధంగా జరిపిన బదిలీలను రద్దు చేశారు.
అల్పపీడనం, వాయుగుండం వర్షాలతో మండలంలో ఖరీఫ్ వరి నాట్లు ప్రారంభమయ్యాయి. మండలంలో ఈ ఏడాది ఖరీఫ్లో 2,025 హెక్టార్లలో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. వరినారు సిద్ధంగా ఉండడంతో గ్రామాలలో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. మండలంలోని మేడివాడ, రావికమతం, పెద్దిరాజు, మత్స్యపురం, గుమ్మాళ్లపాడుల్లోని చెరువుల్లో తాజాగా కురుస్తున్న వర్షాలకు పుష్కలంగా నీరు చేరింది. ఈ వర్షాలకు రైతులు దమ్ములు ప్రారంభించి వరి నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది కల్యాణపులోవ రిజర్వాయర్ నీటిని ఆగస్టు ఐదున ఆయకట్టు భూములకు విడుదల చేసేవారు. అయితే ఈ ఏడాది వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్ నుంచి నీటిని విడుదలకు ముందుగానే దమ్ములు పట్టి, వరి నాట్లు ప్రారంభించేశారు.
జిల్లాను ముసురు వీడడం లేదు. శుక్రవారం సైతం ఈదురుగాలులతో కూడిన వర్షం కొనసాగింది. దీంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులులకు చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. తాజా పరిస్థితి చూస్తే వర్షం తగ్గే సూచనలు ఏ మాత్రం కన్పించకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో గెడ్డలు, వాగులు ఉధృతంగానే పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని మండలాల్లో గెడ్డలు, వాగుల పరిస్థితి అలానే ఉంది, జిల్లాలోని వరద ప్రభావం అధికంగా ఉన్న చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్, జాయింట్ కలెక్టర్ ఎం.జే.అభిషేక్ వరద సహాయక, పునరావస చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రజాశక్తి – పిఎం.పాలెం : బక్కన్నపాలెంలో సినీ పరిశ్రమ నిర్మించిన హుదూద్ ఇళ్ల వద్ద రైతులు చేపట్టిన నిరసన 8వ రోజూ కొనసాగింది. కెవిపిఎస్ నాయకులు సియాద్రి…
ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్ప్లాంట్ సెక్టర్-5లోని ఉక్కు హౌస్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి -యంత్రాంగం ములగాడ : జివిఎంసి 40వ వార్డు పరిధి ఎకెసి కాలనీలో స్వచ్ఛ సర్వేక్షణ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ గుండపు…
ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఫీడర్ అంబులెన్స్ల నిర్వహణపై ఆలక్ష్యం నెలకొంది. ఫలితంగా వీటిలో పనిచేస్తున్న డ్రైవర్ల పై భారం పడుతూ చాలీచాలని వేతనాలతో విధులు…
ప్రజాశక్తి- అనంతగిరి:మండలంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ఇదురుగాలతో వర్షం కురవడంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తుం డటంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గెడ్డలు దాటలేని…
ప్రజాశక్తి-పాడేరు:స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ”మీకోసం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుండి అర్జీదారులు తరలి వచ్చారు.…
ప్రజాశక్తి -తగరపువలస : పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు, వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్, జివిఎంసి కార్పొరేటర్ మూర్తి యాదవ్, పర్యావరణ వేత్త జెవి రత్నం, భౌగోళిక శాస్త్రవేత్త రాజశేఖర్రెడ్డి,…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం వారు మధురవాడ మార్కట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
జీవీఎంసీ 8వ వార్డులో గంజాయి సేవించే వారు అధికమవుతున్నారు. గంజాయ్ బ్యాచ్లకు ఈ వార్డు కేరాఫ్గా మారుతోంది. ఈ ప్రాంతంలోని యువకులు పూటుగా గంజాయి సేవించి విచక్షణ రహితంగా ఘర్షణలకు పాల్పడుతున్నారు.