Raghurama: ప్రజా ఫిర్యాదులపై ఈ శాసనసభ కమిటీ మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేశామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. ఆ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని చెప్పారు. ఈ కమిటీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని రఘురామరాజు తెలిపారు.
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన పాపాలను పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లిలో గతంలో టీడీపీ నేతను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వైసీపీకి చెందిన ముగురిని పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్ర విభజనతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రాలో విలీనమైన గ్రామాలకు విద్యుత్తు కనెక్షన్ అందని ద్రాక్షగా మారిపోయింది.
రేషన్ కార్డుదారులంతా తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ అల్లూరి మన్యంలో మాత్రం ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గడువు ముంచుకొచ్చినా ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సిన వారు వేలల్లో మిగిలిపోయారు.
ఆరుగాలం పంటపొలాల్లో కష్టపడుతున్న రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని అందుబాటులో ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకుని మల్టీపర్పస్ డ్రోన్ కనిపెట్టాడు అనకాపల్లి జిల్లా కొత్తూరు నరసింగరావుపేట పోర్టు కాలనీకి చెందిన 22 ఏళ్ల యువకుడు అప్పికొండ దుర్గాప్రసాద్.
మహా విశాఖ నగరపాలక సంస్థ మేయరుగా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఉదయం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు.
చోడవరం సమీపంలోని లక్ష్మీపురం పెద చెరువులో చేపలు పడుతున్నారంటే చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారంతా అక్కడే ఉంటారు. పెద్ద చేపలు దొరికితే వాటాలు వేసుకునేందుకు ఇద్దరు, ముగ్గురు జట్టు కడతారు.
ప్రజలు పౌరసేవలు ఇంటి నుంచే పొందేలా రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది. మన మిత్ర పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో, జిల్లాలో ఎక్కడ నుంచైనా సేవలు పొందేందుకు, ఫిర్యాదులు చేసేందుకు సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామ కమిటీలతో తెదేపా బలోపేతం అవుతుందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. సోమవారం కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతిఒక్కరికీ సరైన సమయంలో అవకాశాలు వస్తాయని చెప్పారు.
విద్యుత్తు తీగను తాకాలనే ఆలోచనకే వణికిపోతుంటాం. అలాంటిది కొన్నేళ్లగా ఈ తీగలను దొంగిలిస్తూ పోలీసుల కంటికి కునుకులేకుండా చేస్తున్న అంతర్ జిల్లా నేరస్థులను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు అరెస్టు చేశారు.
గంజాయి రవాణా కేసులో నేరం రుజువుకావడంతో ముగ్గురికి పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.రత్నకుమార్ సోమవారం తీర్పు ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజలు అందజేసిన అర్జీలకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు.
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్గా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాకు సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నిలుపుదల చేయించాలని ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం…
ప్రజాశక్తి-పాడేరు:ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్రమైన సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారుల పైనే ఉందన్నారు. సోమవారం…
విద్యా హక్కు చట్టం 12 (1)సి ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికిగాను ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్షా అభియాన్ అడిషనల్ ప్రోజెక్టు కో-ఆర్డినేటర్ చంద్రశేఖరరావు తెలిపారు.
విశాఖపట్నం డిపోనకు చెందిన సీలేరు మీదుగా భద్రాచలం నడిపే ఆర్టీసీ బస్సులు కాలం చెల్లినవి, కండీషన్లో లేనివి కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో సకాలంలో గమ్యస్థానానికి చేరతామో? లేదోననే భయం ప్రయాణికులను వెంటాడుతోంది. సోమవారం ప్రయాణికులకు ఇదే పరిస్థితి ఎదురైంది.
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపునకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే వాహన చోదకులు ఘాట్ దిగాలంటే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) పనుల్లో భాగంగా ఘాట్లోని ఒక వైపు గోతులు తవ్వుతున్నారు. అయితే కేబుళ్లు అమర్చినా గోతులను సక్రమంగా పూడ్చకపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
రాయి క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా, పలు క్వారీల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి మార్టూరులో పలు రాయి క్వారీలను ఆయన తనిఖీ చేశారు.
మన్యంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో జనం ఊరట చెందారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలను రూ.12 కోట్లతో నిర్మించారు. అయితే బెంచీలు సమకూర్చకపోవడంతో విద్యార్థినులు తరగతి గదుల్లో నేలపైనే కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అత్యాధునిక వసతులతో ఈ కళాశాలను నిర్మించి విద్యార్థినులకు కనీసం బెంచీలు కూడా సమకూర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది.
వివిధ ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను పాయకరావుపేట పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 850 కిలోల వైర్లు, రూ.84,000 నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : వైద్య ఆరోగ్య శాఖలో, ఎన్ హెచ్ఎం ద్వారా, గ్రామీణ ప్రాంతాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో పనిచేస్తున్న, ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్,కమ్యూనిటీ…