కేఎల్ యూనివర్సిటీ నుంచి లాంచ్ అవుతున్న శాటిలైట్లు వాతావరణం, ఓజోన్ పొర, హెల్త్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి డేటా అందిస్తాయని భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు విజన్ ఆంధ్ర.. కలిసి మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
అల్లూరి జిల్లాలో ప్రభుత్వ బడులకు నూతన శోభ సంతరించుకోనుంది. వైకాపా హయాంలో నాడు-నేడు పేరుతో సదుపాయాలున్న, అవసరం లేని చోట్ల కూడా నిధులు కేటాయించి కోట్లాది రూపాయాలు దుర్వినియోగం చేశారు.
ఈ ఏడాది ఖరీఫ్లో సాగుచేసే రైతులు ఈ-పంట నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం గడువు పెంచింది. ఈనెల 25 వరకూ అవకాశం కల్పిస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
స్థానిక మండల పరిషత్ అధ్యక్షునిపై జనసేన పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగుతుందా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనున్నది. ఎంపీపీ పదవిలో బోదెపు గోవింద్ కొనసాగుతారా? లేకపోతే గద్దె దిగుతారా? అన్నది స్పష్టం అవుతుంది. దీనిపై మండలంలోని రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ పథకానికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్నది. దీంతో బస్సుల్లో ఓఆర్ అనూహ్యంగా పెరిగింది. ఆయా బస్సుల్లో మొత్తం ప్రయాణికుల్లో 70 శాతం మంది మహిళలే వుంటున్నారు. గతంతో పోలిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్టు అధికారులు చెబుతున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల్లో మొత్తం 161 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలవుతున్నది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18, 19 తేదీల్లో అనకాపల్లిలో ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ పేరుతో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ప్రతిఒక్కరూ పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
పీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు చేపట్టి చేపట్టి, మధ్యలో వదిలేసిన భవనాలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పునాదులుదాటి నిర్మాణాలు జరిగిన 154 భవనాల పనులు మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్క భవనం ప్రస్తుత పరిస్థితి, నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు రూపొందించి పంపాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించింది.
పశుపోషణ రైతుల సంక్షేమానికి, ఆర్థికంగా వారిని ఆదుకోవడానికి కూలమి ప్రభుత్వం పలు పథకాలను ప్రకటించి అములు చేస్తున్నది. పశువులకు నీడ కోసం షెడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో రాయితీ ఇస్తున్నది. ఈ పథకాన్ని జిల్లాలోని అన్ని మండలాల రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
వాల్తేరు రైల్వే డివిజన్కు అత్యధిక ఆదాయం సమకూర్చేది కొత్తవలస-కిరండూల్ (కేకే) లైన్. బచేలిలోని గనుల నుంచి ఐరన్ఓర్ను ఈ మార్గంలోనే విశాఖపట్నం తీసుకువస్తారు.
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో స్ట్రాబెర్రీ సాగు విస్తరిస్తున్నది. సంప్రదాయేతర పంటగా స్ట్రాబెర్రీని ఎనిమిదేళ్లుగా గిరిజన రైతాంగం సాగు చేస్తోంది. ఈ ఏడాది కొత్తగా 35 ఎకరాల్లో నాట్లు వేసింది. నవంబరు నాటికి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అలక్ష్యంగా వ్యవహరించవద్దని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ అన్నారు.
రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా మునిరత్నం నాయుడును నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు.
గత వైకాపా ప్రభుత్వం రుషికొండపై రూ. వందల కోట్ల ప్రజాధనం వ్యయం చేసి విలాసవంత భవనాలు నిర్మించింది. వాటిని ప్రభుత్వ అవసరాలకు కాకుండా జగన్ నివాస అవసరాలకు వీలుగా నిర్మించుకోవడంతో వాటిని దేనికీ వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది.
రోడ్డుపై చిన్న చిన్న గోతులు పడితేనే రాకపోకలకు ఇబ్బంది పడతాం. అలాంటిది దారి పొడవునా పెద్ద పెద్ద గోతులుంటే ప్రయాణం నరకమే. నిత్యం రద్దీగా ఉండే నర్సీపట్నం - తుని రహదారి గోతులతో భయానకంగా మారింది.
మగువల కన్నీటి కష్టాలను పరిష్కరించే దిశగా అంతటా ముందడుగు పడుతోంది. మహిళల సాధికారికతకు కృషి చేయడమే కాకుండా వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఆస్ట్రేలియా జట్టు బౌండరీల హోరు.. సిక్సర్ల జోరు కొనసాగించింది. ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్లో ప్రత్యర్థి బంగ్లాదేశ్పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా నవంబరు 14, 15 తేదీల్లో విశాఖ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ‘భాగస్వామ్య సదస్సు’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఇందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వేదికల నిర్మాణ పనులు తాజాగా ఆరంభించారు.
‘డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం-గూగుల్ మధ్య జరిగిన ఒప్పందంతో విశాఖ జిల్లా భీమిలికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దేశమంతా గూగుల్లో భీమిలిని సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ రాక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మధుర ఘట్టం.
చోడవరంలోనే కాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చేవారికి కలిసికట్టుగా కడుపు నింపే కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. సీడీవీఎం కమ్యూనిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కొప్పాక రాజేష్ ఆధ్వర్యంలో గతేడాది పట్టణానికి చెందిన పలువురు యువకులతో సద్భావ బృందం ఏర్పడింది.
రెండు రోజుల క్రితం ఆటో డ్రైవర్ దేవుడు తుని మార్కెట్ నుంచి కూరగాయల లోడుతో ఎలమంచిలి బయలుదేరాడు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం వద్ద ఆర్టీవో తనిఖీ అంటూ ఆటో ఆపి రూ.4 వేలు వసూలు చేశారు.
మహా విశాఖ నగరపాలక సంస్థలో దస్త్రాలు సకాలంలో ముందుకు కదలడం లేదు. మేయర్ పీలా శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడం, ఇప్పటికే స్థాయీ సమావేశంలో ఆమోదం పొందిన దస్త్రాలపై ఆయన సంతకాలు చేయకపోవడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
భద్రతలో భాగంగా నవంబరు 1 నుంచి ఉక్కునగరం, ప్రధాన పరిపాలనా భవనం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పరిధిలోకి రానున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ సీఐఎస్ఎఫ్, హోంగార్డుల రక్షణలో ఉన్న ఇవి ఇక నుంచి ఏపీ ఎస్పీఎఫ్ పరిధిలోకి రానున్నాయి.