అచ్యుతపురం శివారులో పలు అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని నెలకు రూ. 18 లక్షలు చెల్లిస్తూ ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి 150ని అరెస్ట్ చేశారు. వారిలో 30 మందిపై కేసు నమోదు చేశారు.
సింహాచలం (విశాఖ) : శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయ ప్రధానార్చకుడు, ఇరగవరపు రమణాచార్యులు (58) గుండెపోటుతో మరణించారు. రెండు రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స…
ఇంటింటా రేషన్ సరకుల పంపిణీకి వైకాపా ప్రభుత్వం ప్రారంభించిన ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వ్యవస్థను (రేషన్ వాహనాలు) జూన్ 1 నుంచి నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగర ఖ్యాతిని రెట్టింపు చేసేలా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేద్దామని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నాయని వాటి మీద నెలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
సుమారు 550 గ్రాముల బరువుతో జన్మించిన ఆడశిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని విశాఖలోని జగదాంబకూడలి సమీప మెడికవర్ ఆసుపత్రి వైద్యులు మౌనిక, విజయ్, శ్రీరంగ తెలిపారు.
జిల్లాలో ప్రశాంతతకు.. ప్రకృతి అందాలతోపాటు పారిశ్రామిక ప్రగతికి పేరొందిన ప్రాంతంగా అచ్యుతాపురానికి గుర్తింపు ఉంది. అలాంటిది ఒక్కసారిగా అచ్యుతాపురం అంతర్జాతీయ స్థాయి ఆన్లైన్ మోసాలకు కేంద్ర బిందువుగా మారిందనే సమాచారం ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని గొలుగొండ మండలం కొత్తయల్లవరం నుంచి గుండుపాల వరకు బుధవారం తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, కొత్త ఎల్లవరం సర్పంచి కొల్లు రాంబాబు ఆధ్వర్యంలో తిరంగా యాత్ర, ర్యాలీ నిర్వహించారు.
విశాఖపట్నం ప్రధాన వేదికగా ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
జీవవైవిధ్యం అనేది ప్రకృతి మానవజాతికి ప్రసాదించిన గొప్పవరం. తాగేనీరు, పీల్చేగాలి, చుట్టూ కనిపించే ప్రకృతి, అడవిలో వన్యప్రాణులు, పశుపక్ష్యాదులు, జలచరాలు, అడవులు, మొక్కలు... ఇలా ప్రకృతిలో మన కంటికి కనిపించే ప్రతిదాంట్లో జీవవైవిధ్యం దాగి ఉంటుంది.
రేషన్కార్డులకు దరఖాస్తులు, రేషన్ సరకుల పంపిణీ, గ్యాస్ రాయితీ నిధులు.. తదితర అంశాలపై బుధవారం జిల్లా పౌర సరఫరాల అధికారి (డీసీఎస్ఓ) బి.గణేష్కుమార్తో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
చింతపల్లిలో లిచీ పండ్లు నోరూరిస్తున్నాయి. ఉద్యాన పరిశోధనాస్థానంలో ప్రస్తుతం ఇవి దిగుబడికి వచ్చాయి. వీటిని కేజీ రూ. 150కు స్థానికంగానే విక్రయిస్తున్నట్లు పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త బిందు తెలిపారు.
ఆధార్కు ప్రాధాన్యం పెరిగింది. పొత్తిళ్లలోని బిడ్ద నుంచి ముదుసలి వరకు ఆధార్ అవసరంగా మారింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో ప్రవేశాలకు చిన్నారులకు ఇవి తప్పనిసరి అవుతున్నాయి.
వచ్చే నెల 21వ తేదీ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ విశాఖపట్నంలో నిర్వహించనున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ను ఎంపిక చేశారు. బీచ్రోడ్డు, పక్కన ఇసుక తిన్నెల్లో 15 వేల మంది యోగా ప్రదర్శన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వప్రియ ఫంక్షన్హాలుకు ఎదురుగా ప్రధాన వేదికను ఏర్పాటుచేయనున్నారు.
నగరంలో రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా పెట్టాలని అధికారులను పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. కమిషనరేట్లోని సమావేశ మందిరంలో సీఐ అంతకంటే పైస్థాయి అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
కూటమిలోని టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మిత్రపక్షాల మధ్య పెద్ద దుమారమే రేగింది. తొలుత టీడీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు/పెందుర్తి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి గండి బాబ్జీ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే (జనసేన) చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారని, పార్టీ ఇన్చార్జికి విలువ ఇవ్వడం లేదన్నారు. తమ సిఫారసులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో మలేరియా కార్మికుల పోస్టుల పందేరం నడుస్తోంది. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు తాత్కాలిక ప్రాతిపదికన 431 మందిని నియమించుకునేందుకు ఇన్చార్జి కమిషనర్గా ఉన్న జిల్లా కలెక్టర్ అనుమతిచ్చారు.
మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంచాయితీ కొలిక్కివచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఎంపిక తలనొప్పిగా మారింది. ఫ్లోర్లీడర్గా ఉన్న పీలా శ్రీనివాసరావు మేయర్ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిప్యూటీ ఫ్లోర్లీడర్గా పనిచేస్తున్న గంధం శ్రీనివాసరావుకు అవకాశం కల్పించాలని మేయర్తోపాటు కొందరు ఎమ్మెల్యేలు భావించారు. అయితే డిప్యూటీ మేయర్ పదవిని ఆశించిన కొందరు...కనీసం ఫ్లోర్లీడర్గా అయినా అవకాశం ఇవ్వాలని తమకు సన్నిహితంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావస్తున్నందున...కనెక్టివిటీ కోసం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మిస్తున్నదని, అయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తట్టుకోవడానికి ఫ్లైఓవర్లు కూడా అవసరమని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వీఎంఆర్డీఏలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖా మంత్రి పి.నారాయణ బుధవారం సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యేలంతా వారి వారి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సూచనలు తెలియజేశారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో మరో సీనియర్ అధికారి రాజీనామా చేశారు. యాజమాన్యం ఒత్తిళ్లు భరించలేకే ఆయన సర్వీస్ నుంచి వైదొలగారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల యాజమాన్యం స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రకటించగా స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)లో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి దరఖాస్తు చేసుకున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో జడ్పీ, మునిసిపల్, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో 93 గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు జిల్లా విద్యా శాఖ గుర్తించింది. ఒక పాఠశాలలో ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో అటువంటి హెచ్ఎంలు 15 మంది ఉన్నారు.
కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చురుగ్గా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ అమిత్ బర్ధార్ ఆదేశించారు. పాడేరులో బుధవారం నిర్వహించిన జిల్లా క్రైమ్ సమీక్షలో ఆయన మాట్లాడారు.
యోగా సాధనతో బహుళ ప్రయోజనాలు చేకూరతాయని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ తెలిపారు. యోగాంధ్ర- 2025లో భాగంగా బుధవారం స్థానిక తలారిసింగి అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ముందస్తు ప్రారంభ ప్రక్రియలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రహదారి అంతా గోతులమయం. రాకపోకలు సాగించాలంటే నరకం. ఇటుగా ప్రయాణిస్తే ఒళ్లు హూనం కావలసిందే.. ఇదీ బొర్రా- కోనాపురం రోడ్డు పరిస్థితి. కొన్నేళ్లుగా రహదారి నిర్వహణను గాలికి వదిలేయడంతో ఈ దుస్థితి నెలకొంది.
ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆపరేషన్ కగారులో భాగంగా బుధవారం ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందడం కలకలం రేపింది.
కొయ్యూరు- వై.రామవరం మండలాల సరిహద్దుల్లో గల బొడ్డేరు వాగులో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీని వల్ల ప్రమాదకర గోతులు ఏర్పడడంతో పాటు రెండు మండలాలకు చెందిన సుమారు 20 గ్రామాల గిరిజనులకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.
ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 400 కిలోల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామని పెదబయలు ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు.
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు, నిర్బంధం ఆపాలని డిమాండ్ చేస్తూ … బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జగదాంబ…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో మంగళవారం తెల్లవారుఝామున భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. గెడ్డలు…
ప్రజాశక్తి-దేవరాపల్లి : గొప్ప ఆదర్శమూర్తి పుచ్చలపల్లి సుందరయ్యని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. సోమవారం దేవరాపల్లి మండలం కోడాపల్లి రామాన్నపాలెం గ్రామాల్లో స్వతంత్ర…
ప్రజాశక్తి-అరకులోయ రూరల్:మండలంలోని మాదల గ్రామ పంచాయతీ దాబుగుడ గ్రామంలో తాగు నీరు సౌకర్యం కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేశారు. దాబుగుడ గ్రామంలో తాగు నీరు…
ప్రజాశక్తి-అరకులోయరూరల్:పుచ్చలపల్లి సుందరయ్య సేవలు మరువలేనివని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర తెలిపారు. మండల కేంద్రంలోని ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య…
ప్రజాశక్తి-పాడేరు:ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 22వ రోజు కొనసాగింది. ఈ సమ్మెలో భాగంగా సోమవారం పాడేరు…