ఉపాధ్యాయులుగా చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడమనేది ఒక అరుదైన అవకాశం. అయితే, ప్రస్తుత ప్రభుత్వ టీచర్లు ఏ మేరకు తమ ఉద్యోగ ధర్మాన్ని దృఢ సంకల్పంతో నిర్వర్తిస్తున్నారనే దానిపై బేధాభిప్రాయాలు ఉన్నాయి.. అయితే,
అల్లూరి సీతారామరాజు జిల్లాలో బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా విగ్రహవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ శనివారం హాజరుకానున్నారు.
ఆరేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు శనివారం పోలీసులకు చిక్కాడు. దీనికి సంబంధించి మల్కాపురం సీఐ గొలగాని అప్పారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బెన్నవోలు సుద్దకొండపై తవ్వకాల వల్ల ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా చూడాలని, స్థానికులకు జీవనోపాధి కల్పిస్తూ పంచాయతీకి ఆదాయం సమకూరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదివారం పాడేరు సమీప చింతలవీధి కూడలిలోని భగవాన్ బిర్సాముండా విగ్రహావిష్కరణకు హాజరుకానున్నారని, ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు.
బిందు, తుంపర్ల సేద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. పలు మండలాల్లో పండ్లు, పూల తోటలు సాగు చేస్తుండగా, మిగిలిన అన్ని మండలాల్లో కూరగాయలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు, ప్రజలకు నాణ్యమైన తాజా కూరగాయలను అందించాలనే ఉద్దేశంతో ఎలమంచిలిలో నిర్మించిన రైతు బజారు సుమారు పదేళ్లుగా నిరుపయోగంగా ఉంది.
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలకు వీకెండ్ శనివారం పర్యాటకులు పోటెత్తారు. మన్యంలో ప్రకృతి అందాలను ఆస్వాదించారు. మంచు సోయగాలకు మైమరచిపోయారు. జలపాతాల్లో జలకాలాటలాడారు.
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ఆదివారం పాడేరు వస్తున్నారు. ఆదివాసీ యోధుడు బిర్సాముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు.
విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని.. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు.