వివిధ రాష్ట్రాలకు వెలుగులు ప్రసాదిస్తున్న పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ నాణ్యమైన విద్యుదుత్పత్తి చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రగతి పథంలో పయనిస్తోంది.
చేతుల్లో కత్తులు పట్టుకొని రోడ్లపై తిరుగుతూ.. అడ్డువచ్చిన వారిపై దాడులుచేస్తూ ఫ్యాక్షన్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా కొందరు రౌడీమూకలు చేసిన బీభత్సం నగరంలో శాంతి భద్రతలకు సవాలుగా మారింది.
వారంతా ఒక ముఠా! రెండు బృందాలుగా ఏర్పడతారు. పగలు కొందరు బేరాలు ఒప్పుకొని సొమ్ము వసూలు చేస్తుంటే.. రాత్రయితే మరికొందరు పొక్లెయిన్లు, ట్రాక్టర్లతో మూకుమ్మడిగా బయలుదేరి దగ్గరలోని కొండలను, చెరువులను కొల్లగొడుతున్నారు.
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు లక్షలాది మంది భక్తులు సింహగిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ.
అనకాపల్లి జిల్లాలో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న కీలకమైన ప్రధాన రహదారులు, అనుసంధాన మార్గాలు, వంతెనల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కోరారు.
నిరుపేద రహిత సమాజ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్ (పీ-4) కార్యక్రమంలో పేద కుటుంబాలన్నీ బంగారంలా మెరవాలన్నదే ఆశయంగా ముందుకెళ్తోంది.
గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు సేవలు పొందేందుకు టోల్ఫ్రీ 1800-4250-0009, హెల్ప్లైన్ 0891-2507225 నంబర్లు అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ కేతన్గార్గ్ ఓ ప్రకటనలో తెలిపారు.
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తాం.. వారి వికాసానికి అవసరమైన సేవలందిస్తామంటూ గత వైకాపా పాలకులు హంగామా చేసి అప్పటి రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేశారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి పురుషోత్తపట్నంలో భూములున్న విషయం విదితమే. ఆ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ పనులు చేస్తుండటంతో సిబ్బంది దాన్ని అడ్డుకునే క్రమంలో ఆ గ్రామస్థులతో సోమవారం గొడవ జరిగింది.
మన్యాన్ని వర్షం వీడడం లేదు. గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగుల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్.పురం, ముంచగింపుట్టు, పెదబయలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన సంపద సృష్టి కేంద్రాలను మళ్లీ గాడిలో పెట్టాలని నిర్ణయించింది. జిల్లాలో వృథాగా ఉన్న అన్ని సంపద సృష్టి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.
ఏజెన్సీలో ప్రస్తుతం పైనాపిల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్లో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో వాటి క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా సుమారుగా 600 ఎకరాల్లో పైనాపిల్ తోటల పెంపకాన్ని గిరిజన రైతులు చేపడుతున్నారు.
సబ్ డివిజన్ పరిధిలో రూ.106 కోట్ల నిధులతో 1,082 జల్జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం చేపడుతున్నామని పాడేరు ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీవీ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం చింతపల్లి, జీకేవీధి మండలంలో ఆయన పర్యటించారు.
జిల్లాలో ఈ నెల 10న పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్, టీచర్స్ మీట్(పీటీఎం)లో భాగంగా ప్రతి విద్యార్థి తన తల్లి పేరిట ఒక మొక్క నాటాలని, ప్రతి పాఠశాలలో మెగా పీటీఎంను ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు.
జిల్లాలోని బీఎన్ (భీమిలి-నర్సీపట్నం) రోడ్డు దుస్థితిపై కలెక్టర్ సహా ఏడుగురు ప్రభుత్వ అధికారులకు లీగల్సెల్ అథారిటీ చైర్మన్, తొమ్మిదో అదనపు కోర్టు న్యాయాధికారి నోటీసులు జారీచేశారు.
మండలంలోని కోనాం జలాశయం నిర్లక్ష్యానికి గురవుతోంది. పదేళ్ల కిందట నుంచి సమస్యలు వేధిస్తున్నా గత వైసీపీ పాలనలో జలాశయాన్ని పట్టించుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.