అల్లూరి జిల్లా పేరు చెబితే చుట్టూ పచ్చని కొండల నడుమ పసుపు తివాచీ పరచినట్లుండే వలిసె పూలే గుర్తుకొస్తాయి. అందంతోపాటు ఆరోగ్యం, ఆదాయాన్నిచ్చే పంటగా వీటికి పేరుంది.
పేట ప్రధాన రహదారిపై ఖాళీ జాగా కనిపిస్తే చాలు దుకాణాలు వెలుస్తున్నాయి. పట్టణంలోని పాండురంగస్వామి దేవస్థానం నుంచి వై కూడలి వరకు రహదారి ఉండగా దీనికి ఇరువైపులా ఆక్రమణలు వెలిశాయి.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఉప్ప గ్రామంలో వినాయక మండపం వద్ద విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. స్థానికుడైన దుడ్డు చంటిబాబు (24) మెయిన్ బోర్డు ఆఫ్ చేశారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాఫీ సాగు చేస్తున్న రైతుల కోసం కేంద్ర కాఫీ బోర్డు ఇప్పటికే కాఫీ కృషి తరంగసేవ 080-37685003 టోల్ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది. కాఫీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయా రాష్ట్రాల్లోని రైతులు ఈ నంబరు ద్వారా తెలుసుకుంటున్నారు.
ఆర్టీసీ విశాఖ రీజియన్లోని 17 జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్ఎన్యూఆర్ఎం) బస్సుల ఆధునికీకరణకు సుమారు రూ.కోటి ఖర్చవుతుందని అశోక్ లేల్యాండ్ సాంకేతిక నిపుణులు అంచనా వేశారు.
జిల్లాలో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. గత రెండు వారాల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. చాలాచోట్ల కాలువల నీటి అవసరం లేకుండా, పొలాల్లో చేరిన వర్షం నీటితోనే వరినాట్లు వేసుకుంటున్నారు. నీటి వసతి వున్న ప్రాంతాలతోపాటు వర్షాధార భూముల్లో కూడా వరినాట్లు వేస్తుండడంతో పరిస్థితి ఆశాజనకంగా వుంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 54,465 హెక్టార్లలో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలో తహశీల్దారు ఉద్యోగమంటే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇక్కడ తహశీల్దారుగా పనిచేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. కానీ కొంతకాలంగా ఇక్కడ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అనకాపల్లి తహశీల్దారు పోస్టు అంటేనే వెనకడుగు వేస్తున్నారు. స్థానిక నేతల ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది.
లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి విశాఖపట్నంలో ఆరు నెలలకొకసారి మారీటైమ్ సదస్సు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు.
స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) దశ మారనున్నది. ఇప్పటి వరకు 30 పడకలకే పరిమితమైన ఈ వైద్యశాల.. త్వరలో వంద పడకల స్థాయికి పెరగనుంది. ఈ మేరకు వసతులు, సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చోడవరంతోపాటు రాష్ట్రంలో మొత్తం తొమ్మిది సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పడకల పెంపు, వసతుల కల్పనకు రూ.51.75 కోట్లు కేటాయించింది.
గిరిజన ప్రాంతంలో అరుదైన ఉద్యాన పంటలు డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడో సాగుపై ఆదివాసీ రైతులు ఆసక్తి చూపుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు మూడేళ్ల సాగు ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. దీంతో గిరిజన ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. చింతపల్లి పరిధిలో ఈ ఏడాది 46 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, 89 ఎకరాల్లో ఆవకాడో సాగుకు ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఆహార భద్రత, ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో పెదవాల్తేరులోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్టేట్ ఫుడ్ లేబొరేటరీ నిరుపయోగంగా ఉంది.
విద్యుదాఘాతంతో ఓ గిరిజన యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ ఎ.సూర్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని మత్స్యపురం పంచాయతీ ఉప్ప గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా మంగళవారం మండపానికి విద్యుత్ సరఫరా రాకపోవడంతో ఆ గ్రామానికి చెందిన డి.చంటిబాబు సమీపంలోని విద్యుత్ స్తంభం ఎక్కాడు. విద్యుత్ సరఫరా లేదని భావించి తీగలను పట్టుకున్నాడు. అయితే తీగల్లో విద్యుత్ ప్రసరిస్తుండడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు.
గిరిజన నిరుద్యోగులు మంగళవారం కదంతొక్కారు. మెగా డీఎస్సీ నుంచి గిరిజన ప్రాంత టీచర్ పోస్టులను మినహాయించాలని, వాటి భర్తీకి ప్రత్యేక గిరిజన డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన నిరుద్యోగులు ఐటీడీఏ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. జీవో:3 రద్దుతో గిరిజన ప్రాంతంలో టీచర్ పోస్టుల భర్తీలో శతశాతం రిజర్వేషన్ కోల్పోయామని, ఈ క్రమంలో మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంత టీచర్ పోస్టులను ఇతరులతో భర్తీ చేస్తే తీవ్ర అన్యాయానికి గురవుతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం- భద్రాచలం ఆర్టీసీ బస్సులో ప్రయాణమంటే నరకప్రాయంగా మారింది. ఎక్కడ ఆగిపోతుందో?, గమ్యానికి సురక్షితంగా చేరగలమా? అనే సందేహం ప్రయాణికులను నిత్యం వేధిస్తుంటుంది. పీటీడీ యాజమాన్యం కండీషన్లో లేని బస్సులను ఈ మార్గంలో నడుపుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని సోముదేవుపల్లి గ్రామానికి చెందిన అన్నం గణేశ్ అనే దివ్యాంగుడు పారా వాలీబాల్ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. క్రీడలపై ఆసక్తి వున్న ఇతను తొలుత వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యా సంస్థల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.
ఏపీలో భవిష్యత్తులో.. ఎయిర్పోర్ట్స్, పోర్టులు అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్స్కి ఒక పోర్ట్.. నిర్మించాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీ ఫార్మా, ఆక్వా, వ్యవసాయ రంగాలలో చాలా స్ట్రాంగ్గా ఉందని వివరించారు.
వైకాపా హయాంలో జరిగిన అక్రమాలకు కూటమి ప్రభుత్వంలోనూ కొందరు కీలక అధికారులు కొమ్ముకాస్తున్నారు. మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన కూర్మన్నపాలెంలోని ఎంవీవీ-ఎంకే పార్క్ ప్రాజెక్టులో ప్రభుత్వ భూమి ఆక్రమణ.. ప్లాన్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి
మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను పలువురు అధికారులు ధిక్కరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్లో ఒక హాస్టల్ నిర్మాణానికి స్మార్ట్సిటీ ప్రాజెక్టు కింద ఇంజినీర్లు ఇటీవల టెండర్లు పిలవడం ఆశ్చర్యానికి గురిచేసింది
రెండు నియోజకవర్గాలు.. మూడు మండలాలు.. మూడు గ్రామ పంచాయతీలు కలిపితే జంపపాలెం. ఇదేం చిత్రం అనుకుంటున్నారా.. మీరు వింటున్నది నిజమే. జిల్లాలోని ఎలమంచిలి మండలం, జంపపాలెం పంచాయతీది భిన్నమైన భౌగోళిక స్వరూపం.
పాఠశాల దశలోనే విద్యార్థులను ప్రయోగాల వైపు మళ్లించి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇన్స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తోంది.
విధి వక్రించి పుట్టిన రోజు నాడే ఓ యువకుడు మృతి చెందాడు. పెందుర్తి వద్ద జాతీయ రహదారి సేవామార్గంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు సోమవారం వేకువజామున కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించాడు.
నగరంలో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. జూదం నెపంతో ఓ రౌడీషీటర్ను హత్య చేసేందుకు కుట్రపన్నారు. గాయాలపాలై బాధితుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. రైల్వేన్యూకాలనీకి చెందిన మహ్మద్ ఖాజా(28)పై నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది.
‘జస్ట్ వైబ్ కోసమే ఎండీఎంఏ అలవాటు చేసుకున్నానని’.. యువతి హవీలా, ‘దొరికితే రోజూ డ్రగ్స్ తీసుకుంటానని’.. శ్రీవాత్సవ్లు తొణక్కుండా చెప్పడం విని ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.