వచ్చే నెల పెట్టుబడుల సదస్సు, జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో నగరంలో మౌలిక వసతుల కల్పన, రహదారుల మరమ్మతులు, ముఖ్య కూడళ్ల వద్ద సుందరీకరణ పనుల కోసం రూ.130 కోట్లు వెచ్చించనున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు.
[03:43] లోయర్ మాచ్ఖండ్, బలిమెల వద్ద జల విద్యుత్కేంద్రాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని ఒడిశా రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సుశాంత్ నందా హామీ ఇచ్చారు.
[03:43] మన్యంలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు పందిరిమామిడిలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గత నెలలో ఐదు రోజులపాటు కేవీకేలో 38 మంది మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
[03:43] పూర్తయిన పనిని ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేసి ఎంబుక్లో నమోదు చేసేవారు.. బిల్లులు అప్లోడైన వెంటనే గుత్తేదారు ఖాతాల్లోకి డబ్బులు జమయ్యేవి.. ఇదంతా ఒకప్పటి మాట.
నియోజకవర్గంలో వర్గపోరు వల్ల మా ఇద్దరికీ (బొడ్డేడ ప్రసాద్) నష్టమని, మరోవైపు పార్టీ అధినేత జగన్ సైతం క్లాస్ తీసుకున్నారని ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావు గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడి వలే పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పిలుపునిచ్చారు.
బుచ్చెయ్యపేట, రోలుగుంట మండలాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బుచ్చెయ్యపేట మండలం రాజాంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో యజమాని అక్కడికక్కడే మృతి చెందాడు. రోలుగుంట మండలం బలిజిపాలెం వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో తాపీ మేస్ర్తీ చనిపోయాడు. వివరాల్లోకి వెళితే..
‘నిన్ను సస్పెండ్ చేశారుగా...ఎందుకొచ్చావు?, మా సార్నే తిడతావా! ఎంత ధైర్యం?...నిన్ను మెడపట్టి బయటకు తోసేయమని మా ఎమ్మెల్యే చెప్పారు. మర్యాదగా కార్యాలయంలో నుంచి వెళ్లిపో. లేకపోతే సచివాలయానికి తాళం వేసేస్తా’...అని అంటూ సోమవారం మునగపాక మండలం పల్లపు ఆనందపురంలో ఒక మహిళా పంచాయతీ కార్యదర్శిని అధికార వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు కర్రి సంజీవమ్మ హెచ్చరించారు.
కేంద్ర బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించబోయే ఫొటో ప్రదర్శన ప్రచార వాహనాన్ని సోమవారం ఆర్డీవో జయరాం జెండా ఊపి ప్రారంభించారు.
వెలుగు అధికారుల నిర్లక్ష్యం నాగయ్యపేటకు చెందిన తొమ్మిది మంది రైతుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. మూడు వారాల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వెలుగు సిబ్బంది చెప్పారు.