ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ను.. కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం రద్దు చేసింది.
వచ్చే గ్రామ పంచాయతి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం నారాయణపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
తెలంగాణ భవన, ఇత ర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో అర్హులైన కార్మికులందరూ తమపే ర్లను నమోదు చేసుకొని బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
కవిత ఎవరినో సంతోషపెట్టాలని తనపై ఎందుకు దూర్బాషాలాడుతుందో తెలియడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్ అభిమానులంతా దు:ఖ సాగరంలో మునిగిపోయామని గుర్తు చేసుకున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జేపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ పునఃనిర్మాణానికి సోమవారం వెల్దండ ఉమ్మడి మండల సింగిల్ విండో ఛైర్మన్, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు జూపల్లి భాస్కర్ రావు రూ.1.16 లక్షలు విరాళంగా అందజేశారు.
ఏపీలోని విశాఖకు వెళ్లేందుకు గతంలో సికింద్రాబాద్, కాచిగూడ నుంచి వెళ్లేవారు. గుజరాత్లోని అహ్మదాబాద్, రాజ్కోట్ వెళ్లే వారు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. పర్యాటకంగా ఈ రెండు రాష్ట్రాలు కీలకమవ్వడతో జిల్లా నుంచి వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
మే 1న నాగర్కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని రిజర్వాయర్లలో 50 టీఎంసీల నిల్వ లక్ష్యం పెట్టుకున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
జిల్లాలో సర్కారు చదువులు ఎక్కడం లేదు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో విద్యార్థులు ప్రతిభ చాటుతుండగా.. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు బోధన అర్థం కావడం లేదు.
తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో.
కేటీదొడ్డి మండలం నందిన్నెకు చెందిన మాజీ సర్పంచి చిన్న భీమరాయుడు బొలేరో వాహనం ఢీకొట్డడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే మాజీ సర్పంచి మృతి కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో.. ప్రభుత్వ నిధులతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన నీటిశుద్ధి యంత్రాలు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్నాయి. చిన్నపాటి మరమ్మతులతో వాటిని బాగు చేసేందుకు అవకాశం ఉన్నా..
ఇప్పటి వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన గంజాయి వినియోగం మెల్లమెల్లగా పల్లెలకు పాకుతోంది. గ్రామీణ యువత మత్తుకు బానిసలై జీవితాలు ఆగం చేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 లోపు సెల్సియస్ డిగ్రీలు నమోదవుతున్నాయి. అరకొర వసతులుండే సాంఘిక సంక్షేమ ఎస్సీ వసతిగృహాల విద్యార్థులు చలికి వణుకుతున్నారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దుందుభి వాగు మొల్గర నుంచి రాత్రిళ్లు టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారు. రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజామున 6గంటల వరకు ఈ దందా గుట్టుగా సాగుతోంది.
జిల్లాలో పలువురు విద్యార్థులు భగవద్గీత కంఠస్థ పోటీల్లో రాణిస్తున్నారు. గీతా జయంతి పురస్కరించుకొని ప్రతిఏటా తిరుమల తిరుపతి దేవస్థానం, విశ్వహిందూ పరిషత్లతోపాటు సేవా భారతి విద్యార్థులకు భగవద్గీత.
జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో మహిళా వైద్య నిపుణులు (గైనకాలజిస్టు) లేక గర్భిణులు, మహిళలకు మెరుగైన చికిత్స అందడం లేదు. 12 మందిని కేటాయించగా..
మంచి నీటిని సరఫరా చేసే నీటి ట్యాంకుల శుభ్రత పడకేసింది. నెలలో రెండు సార్లు వాటిని శుభ్రం చేయాల్సి ఉండగా నెలల తరబడిగా చేయడం లేదు. కొన్నింటికి మూతలు లేవు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి.
త్వరలోనే కొడంగల్ ప్రజలు రైలు కూతను వినబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుందన్నారు. మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రారంభంకానున్నాయన్నారు.