[05:17] మూడేళ్ల క్రితం పెబ్బేరులో ఓ ఆసుపత్రి వారు ఓ మహిళకు గర్భవిచ్ఛిత్తి శస్త్రచికిత్స చేస్తుండగా.. సమాచారం అందుకున్న వైద్యశాఖ అధికారులు వెళ్లి, ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు.
[05:17] జాతీయ ఉపాధిహామీ పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి పని దినాలను ఖరారు చేశారు. గత సంవత్సరం అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉపాధి పనుల కేటాయింపు, గుర్తింపునకు గ్రామ సభలు నిర్వహించి పనులను గుర్తించారు.
[05:17] సంక్షేమ పథకాలే కొనసాగింపుగా కొనసాగిన 2023-24 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ పాలమూరు ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. దళితబంధు, రెండు పడక గదుల ఇళ్లు, రెండో విడత గొర్రెల పంపిణీ, రైతులకు రుణమాఫీ, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు, కొత్తవారికి ఆసరా పింఛన్లు వంటి పథకాలు ప్రజలకు చేరువయ్యేవే.
దేశంలోని కోట్లాది మంది సామాన్యులు బ్యాంకుల్లో దాచుకున్న ధనానికి రక్షణ కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కోరారు. అదాని గ్రూప్ కంపెనీ షేర్ల విలువ పడిపోవడంతో జాతీయ బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం తలెత్తిందని ఆం దోళన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్ఘమైన వైఖరిని అవలంభిస్తు న్నాయని, ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఆ ప్రభుత్వాల తీరును ఎండగడదామని డీసీసీ అధ్యక్షులు జి.మధుసూదన్రెడ్డి అన్నారు.
గ్రామ పంచాయతీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఆ నిధుల్లో 40 శాతం మేర మెటీరియల్ కాంపోనెంట్గా శాశ్వత పనులు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
జిల్లా కేం ద్రంలోని వీరన్నపేటలో తొగుట వీర క్షత్రియ సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరీ దేవి, నీలకంఠేశ్వరస్వామి అఖండ జ్యోతి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి.
నాలుగు సంవత్సరాల నుంచి వర్షాలు పుష్కలంగా కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా బోరుబావుల కింద 40వేల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు.
పాలమూరు పట్టణం లోని కొత్తగంజ్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమ వారం ఉదయం వివిధ పూజా కార్యక్రమాల అనంతరం 1008 కలశాలతో అభిషేకం నిర్వహించారు.
[06:23] నాన్న సురవరం వెంకట్రామిరెడ్డి, పెదనాన్నలు సురవరం ప్రతాపరెడ్డి, రామచంద్రారెడ్డిల స్ఫూర్తితో ఉన్నతంగా రాణించానని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు.
[06:23] నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఉత్సవాల సందర్భంగా ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు.
[06:23] అతి తక్కువ సమయంలోనే ప్రపంచ శ్రీమంతుల్లో మూడోస్థానంలో నిలిచిన గౌతం అదానీ సంస్థల అవకతవకలపై సుప్రీంకోర్టులో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడం నర్సయ్య డిమాండ్ చేశారు.