మహబూబ్నగర్ నగరపా లక సంస్థ పరిధిలోని ఎనుగొండ దేవుని గు ట్టపై నూతనంగా నిర్మించిన గౌడ జాతి ఆ రాధ్య దేవం సురమాంబ సమేత కంఠమ హేశ్వర స్వామి, వనం ఎల్లమ్మ, వనం మైస మ్మల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి.
సా మాజిక తెలంగాణతోనే బడుగులకు న్యా యం జరుగుతుందని రాష్ర్టీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవా యి దిలీప్ కుమార్ అన్నారు. సామాజిక ర థయాత్ర శుక్రవారం గద్వాలకు చేరుకుంది. అనంతరం హరిత హోటల్లో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు.
భూత్పూర్-చించోలి జాతీయ రహదారి నం. 167(ఎన్) భూసేకరణలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలు జోడించి దాదాపు రూ. 10 కోట్లకు పైగా ప్రజాధనం కాజేశారు.
రాష్ట్ర సరిహద్దుకు 3 కి.మీ. దూరంలోని అలంపూర్ చౌరస్తా నిత్యం 3 రాష్ట్రాల ప్రజలతో సందడిగా ఉంటుంది. ఉండవల్లి మండలం పుల్లూరు పంచాయతీ పరిధిలోని ఈ కూడలిలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు జాతీయ, అంతర్రాష్ట్ర రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు బస్సు ఎక్కుతూ, దిగుతూ ఉంటారు.
మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసింది. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 227 దుకాణాలు 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు నిర్వహించుకునేందుకు టెండర్లు నిర్వహిస్తున్నారు.
చెడు వ్యసనాలు దూరం చేసుకోవడం.. నీతి, నిజాయతీగా మెలగటం.. సత్యం పలకడం.. ఆధ్యాత్మిక చింతన.. మంచి నడవడిక.. ఇవి మనిషిని పరిపూర్ణ వ్యక్తిని చేస్తాయి. ఇందుకు అయ్యప్ప దీక్ష దోహదం చేస్తుంది.. మండలం (41 రోజులు) పాటు కఠిన దీక్ష ఆచరించడం ద్వారా ఏడాదికి సరిపడే కొత్త శక్తి లభిస్తుంది.
కబడ్డీ, క్రికెట్ ఆటల్లో మరికల్ కుర్రాళ్లు రాణిస్తున్నారు. ప్రస్తుతం జరగుతున్న 69 ఎస్జీఎఫ్ పోటీల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై గుర్తింపు సాధిస్తున్నారు.
ప్రతి అడుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. అవగాహన కల్పిస్తున్నారు వీపనగండ్లకు చెందిన పల్ల రఘునాథ్రెడ్డి. 67 ఏళ్లు వచ్చినా.. రోజూ సుమారు 20 కి.మీ. పైగా నడవడం, పరుగెత్తడం చేస్తుంటారు.
గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి వంకలపై వంతెనలు లేకపోవడంతో ప్రజలు సంవత్సరాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు వంకలు పొంగి ప్రవహిస్తాయి. వాటిని దాటుతూ గల్లంతై ఏటా పదుల సంఖ్యలో దుర్మరణం పాలవుతున్నారు.
వ్యవసాయ పొలాల్లో అనువైన వసతి లేక యేటా పంట నూర్పిళ్లకు అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. వానాకాలం, యాసంగి సీజన్లలో పంటలు సాగుచేసిన రైతన్నలకు దిగుబడి వచ్చాక ఉత్పత్తులను ఆరబెట్టేందుకు సరైన స్థలాలు కరవయ్యాయి.