జిల్లా పోలీస్ బాస్(ఎస్పీ) జానకి.. సాధారణ ప్రయాణికురాలిగా సివిల్ డ్రెస్లో శుక్రవారం సాయంత్రం మహబూబ్నగర్ బస్టాండ్ అంతా కలియ తిరిగారు. కళాశాల వదిలిన సమయానికి అక్కడికి వెళ్ళిన ఆమె బాలికలు, మహిళలను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తున్నారా? ఈవ్ టీజింగ్ చేస్తున్నారా? అని పరిశీలించారు.
గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) నిర్మాణం కొనసాగుతుండగానే అనేక లోపాలు బయటపడుతున్నాయి.
స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతి పురస్క రించుకొని హైదరాబాద్లో ఈ నెల 23న నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని ఆల్మేవా రాష్ట్ర అఽధ్యక్షుడు షేక్ఫారుక్హుస్సేన్ పిలుపునిచ్చారు.
కేంద్రంలో ప్రభుత్వం కార్మిక,రైతు,వ్యవసాయ కార్మికులకు నష్టం చేసే నల్లచట్టాలను తీసుకొ చ్చిందని, వాటికి వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా కేంద్రంలో ధర్నా చేపడుతున్నట్లు నాయకులు తెలిపా రు.
డ్రగ్స్, గంజాయి రహిత సమాజం ని ర్మించడం మనందరి బాధ్యత అని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రం లోని ఒక ఫంక్షన్ హాల్లో విశ్వ హిందూ పరి షత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి ఎస్పీ డాక్టర్ వినీత్ హాజరయ్యారు.
పంటలకు పోషకాలు అవసరమే.. అవి అధికమైతే అనర్థాలకే దారి తీస్తుంది. పైరు ఎదుగుదల, వేర్ల వృద్ధికి దోహదం చేస్తూ దిగుబడులు పెంచడంలో ప్రధాన పోషకం భాస్వరం. దీన్ని డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులతో పంటలకు వినియోగిస్తున్నారు. అవసరానికి మించి వేస్తుండటంతో మొక్కలు వాడుకోగా మిగిలింది భూపొరల్లో చేరుతోంది.
దేవుడి మాన్యం భూములు కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్పోర్స్ను ఏర్పాటు చేయటానికి కసరత్తు చేస్తోంది. అవసరమైతే ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోనున్నామని దేవాదాయ మంత్రి కొండా సురేఖ ప్రకటించిన నేపథ్యంలో భూముల రక్షణ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.
ఇళ్లలో చెత్త స్వచ్ఛ ఆటోలకు వేయకుండా వీధుల్లో విసిరేస్తున్న ఇళ్ల యజమానుల్లో మార్పు తెచ్చేందుకు నగరపాలక సంస్థ సిద్ధమవుతోంది. చాలా మంది యజమానులు నెలకు రూ.70 ఇవ్వాల్సి వస్తోందని రాత్రి 10 గంటల తర్వాత, లేదంటే తెల్లవారు జామున వీధి చివరన కూడళ్లు, సమీప మురుగు కాల్వల్లో పారేస్తున్నారు.
నెల రోజులుగా కిలో వంకాయ రూ.80కి దిగిరావడం లేదు. క్యారెట్, పచ్చిమిర్చి, బీర, కాకర కొండెక్కి కూర్చున్నాయి. రైతు బజార్కు వినియోగదారులు రూ.500 తీసుకెళ్తే చిన్న సంచి నిండటం లేదు. క్యాలీఫ్లవర్, దొండ, చిక్కుడు, గోరు చిక్కుడు, బీట్రూట్ రూ.60కి తగ్గడం లేదు. ములక్కాడలు కిలో రూ.120 ఉంటే, రూ.10 ఉండే టమాట రూ.40కి చేరింది.
మహబూబ్నగర్ మండలంలో ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కళాశాలకు ఆర్టీసీ బస్సుల్లో వస్తోంది. కొందరు ఆకతాయులు నిత్యం బ్యాడ్టచ్ చేస్తున్నారని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆర్టీసీ బస్టాండులో నా మాదిరిగా చాలా మంది బాలికలు ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో పాఠశాలలు, కళాశాలలకు వస్తున్నారు. పోకిరీలపై పోలీసు శాఖ దృష్టి పెట్టాలి’ అని కన్నీటిపర్యంతమైంది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలోని శ్రీసలాసర్ బాలాజీ టెక్స్టైల్ మిల్లులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయి, మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.
మత్తుకు బానిసైన వ్యక్తి బయట గంజాయి కొనలేక పెరట్లోనే మొక్కలు సాగు చేశాడు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లిలో గురువారం ఇది వెలుగులోకి వచ్చింది.
ఎగువ, దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రాలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి సాధించాయి. ఈ ఏడాది వేసవి చివరి వారం నుంచే కర్ణాటక నుంచి వరద వచ్చి చేరడంతో రెండు కేంద్రాల్లో మే 28వ తేదీ నుంచే ఉత్పత్తికి చర్యలు తీసుకున్నారు
అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఫిల్టర్ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ముచేసుకుంటున్నారు.