రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయం నుంచి శుక్రవారం ఉదయం మూడు గేట్లు తెరిచి 5,865 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి అధికారులు విడుదల చేస్తున్నారు.
పాలమూరులోని నీటి ప్రాజెక్టులకు నిధుల వరద పారింది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కావాల్సిన నిధుల్ని కేటాయించారు.
కష్టకాలంలో రైతు కుటుంబాలకు బాసటగా నిలిచే రైతుబీమాపై అవగాహన కల్పించేందుకు ప్రచారం కొరవడుతోంది. రైతు ఏ కారణంగా మరణించినా కుటుంబం వీధినపడకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది.
పిల్లలమర్రి వృక్షాన్ని దగ్గరి నుంచి చూడాలన్న పర్యాటకుల కోరిక తీరటం మరింత ఆలస్యం కానుంది. అటవీ శాఖ అధికారులు జులై మొదటి వారంలోనే ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. తేదీని కూడా ఖరారు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నార్కోటిక్, డ్రగ్ కంట్రోల్, ఎస్టీఎఫ్, డీఆర్ఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయిని తెలుసుకోవడానికి జాతీయస్థాయి సాధన సర్వే (న్యాస్) ఏటా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లో న్యాస్ నిర్వహణకు ఉపాధ్యాయుల్ని సమాయత్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్ స్వనిధి’ పథకం వీధి వ్యాపారులకు అండగా నిలిచింది. ష్యూరిటీ లేని రుణాలను విడతల వారీగా వీటి మొత్తాలను పెంచుతూ ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందిస్తోంది.
చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయరు లోలెవల్ కాలువకు అదును దాటుతున్నా నీరు వదలడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. ఆగస్టు నాటికి వరినాట్లు పడాలి. కాగా కుడి లోలెవల్ కాలువ కింద ఇప్పటి వరకూ నీరు వదల్లేదు.
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది.
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు.
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత.
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
జిల్లా కేంద్రంలో ట్రా ఫిక్ నియంత్రణే ధ్యేయంగా ప్రజలకు, వాహనదా రుల కు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీస్ శాఖ నిరంతర పని చేస్తుందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునా థ్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించా రు.
ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యాన్ని నేరుగా పాఠశాలలకు అందించాలని మండలంలోని ప్రధానోపాధ్యాయులు గురువారం తహసీల్దార్ హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు.