స్థానిక ఎన్నికల్లో నిత్యం ప్రజల మధ్యలో ఉం టూ వారి సమస్యల పట్ల పోరాటం చేస్తున్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎం పిక ఉంటుందని బీఆర్ఎస్ గద్వాల నియోజక వర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో.. పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రయాణికులు గమ్యస్థానానికి క్షేమంగా చేరుకునేలా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మీపై కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. వారికి అన్ని విధాలా అండగా ఉండాలని.. వాహనాలను రోడ్డుపై నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించాలని వాహనదారులకు వివరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలకు సమయం రానే వచ్చింది. ఆశావహుల ఎదురుచూపులకు మోక్షం లభించింది. తొలి దశ ఎన్నికలకు అధికారులు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆయా పంచాయతీల పరిధిలో నామపత్రాలు స్వీకరించనున్నారు. గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.
జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరిట మట్టి తవ్వకానికి కొసరంత అనుమతి తీసుకొని కొండంత తవ్వుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఎత్తైన గుట్టలను మాఫియా మాయం చేస్తోంది.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులోని మిషన్ భగీరథ పథకం నుంచి మరికొన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేసి తాగునీటి కష్టాలను తీర్చనున్నారు. వనపర్తి జిల్లా వాసులకు కూడా ఇక్కడి నుంచే తాగునీటి సరఫరా జరగనుంది.
ప్రసవ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణి మృతి చెందిన ఘటన పేటలో చోటుచేసుకుంది. గ్రామీణ ఎస్సై రాముడు కథనం ప్రకారం.. పేట జిల్లా కేంద్రానికి చెందిన పద్మ(26) మూడో కాన్పు నిమిత్తం ఈ నెల 23వ తేదీన పేట మండలం అప్పక్పల్లి వద్ద గల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.
జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కావడం లేదు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల గిట్టుబాటు కావడం లేదని వంట నిర్వాహకులు ముందుకురావడం లేదు. దీంతో కొందరు విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటుండగా..ఇంకొందరు ఇళ్లకు భోజనానికి వెళ్లిపోతున్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు, హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెడుతున్నారు.
విడుదలగద్వాల న్యూటౌన్, న్యూస్టుడే : పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం వడ్డీ రాయితీ నిధులు ఖాతాల్లో జమ చేసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు గడిచిన మార్చి వరకు రాయితీ నిధులు అందించగా, తాజాగా మరో ఆరు నెలలకు సంబంధించి అర్హులైన వారి ఖాతాల్లో సెర్ప్ ద్వారా జమవుతున్నాయి.
తెలంగాణలో ఇటీవల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మహబూబ్నగర్లో జరిగిన ఘటనలో ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ మృతిచెందాడు.