జోగు ళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన విష్ణుకుమార్ నాయుడు, పార్వతమ్మ రెండో సంతానం కార్తీక్ నాయుడు(4) ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు.
కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచు చిన్న భీమరాయుడు (40)ని శుక్రవారం ధరూర్ మం డలం జాంపల్లి వద్ద బొలెరో వాహనం ఢీకొ నగా, మృతి చెందాడు. ఆయన మృతిపై కు టుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఎనిమిది మందిపై ఫిర్యాదు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగానే వెనుక నుంచి ఢీకొట్టి హత్య చేశారని ఆరోపిస్తూ శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఽధర్నా నిర్వహించారు.
నేడు (ఆదివారం) జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) 2025-26 పరీక్షకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
గద్వాల నియోజకవర్గానికి సంబంధించి వివిధ గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్, గద్వాల ప ట్టణ ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
పొగమంచు జాతీయ రహదారులను కప్పేయడంతో.. వాహనాలు ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. రోడ్డు పక్కన వెళ్లే వారు మసక కారణంగా కనిపించక ప్రమాదానికి గురవుతున్నారు. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండగా, అంతే స్థాయిలో క్షతగాత్రులవుతున్నారు.
జిల్లాలో కట్టెకోత మిషన్ల (సామిల్లు) యజమానులు కొత్త మోసానికి తెర లేపారు. అటవీశాఖాధికారుల సహకారంతో కలప కొనుగోలు చేస్తున్నారు.మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అక్కడి వ్యాపారులతో వనపర్తికి కలప తెప్పించి.. తీరా బాగా లేదని, తక్కువ ధరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వెంటనే మంజూరు కావాలంటే ముందుగా వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం, రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పాలనాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని చూస్తే.. పల్లెపోరుకు సిద్ధమైనట్లేనని తెలుస్తోంది.
గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు నిరుపయోగంగా మారుతున్నాయి. గ్రామ పంచాయతీల నిర్వహణ, అత్యవసర సమస్యల పరిష్కారానికి ఆర్థిక వనరులు సమకూర్చుకునేలా దుకాణ సముదాయాలు నిర్మించారు.
గత రెండేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు నిధులు రావడం లేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మందుల కొరత కొన్నిచోట్ల, తాగునీటి సమస్యలు అన్నింట్లో వేధిస్తోంది.
గడువులోగా సీఎమ్మార్ చెల్లించని బియ్యం మిల్లులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అదనంగా 25 శాతం జరిమానా విధించింది. సంబంధిత మిల్లర్లు దీని గురించి పట్టించుకో లేదు.
ప్రజా పంపిణీ మరింత పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల అభిప్రాయ సేకరణకు కేంద్రం ఏఐ ఆధారిత వేదిక ‘ఆశా’ వెబ్సైట్ను రూపొందించింది.