డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం.. పుస్తకం మాత్రమే కాదని అది ఒక శక్తివంతమైన మార్గదర్శక గ్రంథమని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్నాయక్ పేర్కొన్నారు.
జిల్లా ఎన్నికల సమగ్ర సమాచారమంతా టీ పోల్ రాష్ట్ర ఎన్నికల యాప్లో పొందుపరిచామ ని, జిల్లాలో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు క లెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతో ష్ తెలిపారు.
భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఏరియల్ సర్వే చేశారు.
పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పాలనను, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి వి శ్రీనివా్సగౌడ్ అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో బీసీలకు 20.98 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కాయి. బీసీలకు ప్రస్తుతం 24 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల్లో అంతకంటే తక్కువ రిజర్వేషన్లు రావడం గమనార్హం.
పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడదల చేసింది.
హన్వాడ మండలం గొండ్యాల వద్దనున్న వాగు (గొండ్యాల వాగు) నుంచి గ్రావిటీ కాలువ నిర్మించి, కోయిలకొండ మండలాన్ని సస్యశ్యామలం చేయాలని భారాస ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రపతి భవన్కు వెళ్లాలని, దేశ ప్రథమ పౌరురాలిని కలవాలని అంతా కలలు కంటారు.. కానీ, కొందరికే అవకాశం దక్కుతుంది. గండీడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు ఆ గౌరవం పొందారు.
చిన్న పిల్లలకు రోగనిరోధకశక్తి అభివృద్ధి చెంది.. పోలియో, తట్టు, డయేరియా, కోరింత దగ్గు, హెపటైటిస్-బి తదితర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి 0-5సంవత్సరాల వరకు పిల్లలకు టీకాలు వేస్తారు.
మట్టిని ఇసుకగా మార్చి కొందరు వ్యక్తులు కాసులుగా మార్చుకుంటున్నారు. ఏ మాత్రం నాణ్యతలేని ముడి ఇసుకను నీటితో ఫిల్టర్ చేసి ప్రజల అవసరాలను బట్టి అమ్ముకుంటున్నారు.
జిల్లాలో పేట, కోస్గి, మక్తల్లో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. అక్కడ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామని వచ్చిన రైతులకు యార్డుల్లో తిప్పలు తప్పడంలేదు
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో ఎవరైనా ఉద్యోగి మృతి చెందితే ఖనన ఖర్చులు ఇవ్వలేకపోతున్నారు. విధులు నిర్వహించే ఉద్యోగి మరణిస్తే రూ.30 వేలు దహన సంస్కారాలకు ఇవ్వాల్సి ఉంటుంది.
ఔషధ దుకాణదారులు నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా మందులు విక్రయిస్తున్నారు. దుకాణదారులపై నమ్మకంతో రోగులు మందులు కొనుగోలు చేస్తూ వారు ఇచ్చిన మాత్రలు తింటున్నారు.
విద్యార్థుల్లోని సృజనను ప్రోత్సహించేందుకు జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్ష పోటీలు నిర్వహిస్తోంది. సమాజంలోని మూఢ నమ్మకాలు తొలగించి శాస్త్రీయ భావనలు పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మారుతీనగర్ కాలనీలో జరిగింది. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన నేనావత్ లక్ష్మణ్ (38) కుటుంబ సభ్యులతో కలిసి 2023 వరకు హైదరాబాద్లో ఉండేవారు.