వివాహితుడైన నలభై ఏళ్ల యువకుడు పిల్లల కోసం 15 సంవత్సరాల బాలికను పెళ్లిచేసుకోడానికి యత్నించగా ఛైల్డ్ హెల్ప్లైన్ అధికారులు అడ్డుకున్న ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది
ప్రకృతిపరంగా ఏర్పడిన మట్టిగుట్టలపై అక్రమార్కుల కన్ను పడింది. అనుమతుల మాటున అక్రమ దందాకు తెరలేపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజు లక్షల మెట్రిక్ టన్నుల మట్టి అక్రమంగా తరలుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను డీజీపీ జితేందర్ అభినందించారు. ఆయా విభాగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఒక సీసీ కెమెరా ఎంతో మంది పోలీసులతో సమానమని చెప్పటానికి బాగానే ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన మూడో కన్ను(సీసీ కెమెరాలు) మరమ్మతులకు లోనై మూలపడుతున్నాయి.
ఆ కుటుంబాన్ని విధి వంచించింది. పిల్లా పాపలతో హాయిగా సాగుతున్న ఆ జీవన నౌకను హఠాత్తుగా ముంచేసింది. ఏళ్లుగా పొరుగు రాష్ట్రంలో ఉంటున్న తాము స్వరాష్ట్రానికి వెళుతున్నామన్న ఆనందంలో ఆ దేవునికి కృతజ్ఞత చెబుదామని వెళుతుంటే ఏకంగా ఆయన తనవద్దకే తీసుకెళ్లిపోయాడు.
ఉమ్మడి జిల్లాలోని పలు పురపాలికలు, పంచాయతీల పరిధిలో పశువుల సంతలు నిర్వహిస్తున్నారు. సంత నిర్వహణకు టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు ఏడాదంతా క్రయవిక్రయాలపై రుసుం వసూలు చేసుకుంటారు.
దక్షిణ భారతంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్న ఏకైక ప్రాంతం.. భిన్న రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు.. ఆయా ప్రాంతాల వారి సంప్రదాయ పూజలతో త్రివేణి తీర ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ఏడో రోజు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత మండలాల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణాలకు కట్టుబడి ఉన్నానని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు.
రాజీవ్ యువ వికాసం లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్లో రాజీవ్ యు వ వికాసం లబ్ధిదారుల ఎంపిక పురోగతిపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు.