నగరపాలక సంస్థ పాలమూరులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అమలు ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి రూ.603 కోట్లతో యూజీడీ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) అమలుకు కసరత్తు పూర్తయింది
ఉమ్మడి జిల్లాలో ప్రధాన, గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ కలిపి 2,300లకు పైగా ఆలయాలున్నాయి. చిన్న ఆలయాలను పక్కన బెడితే రోజువారీగా భక్తులు మొక్కలు తీర్చటానికి 1.15 లక్షల వరకు కొబ్బరి కాయలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు పరిధిలోని శిఖం భూమిలో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. వాటిపై చర్యలు తీసుకుని భవిష్యత్తు తరాలకు చెరువును పరిరక్షించాలనే లక్ష్యంతో అయిదేళ్ల కిందట స్థానిక ప్రజా ప్రతినిధులు చెన్నైలోని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో ఫిర్యాదు చేశారు.
ఇటుక బట్టీల తయారీ, బూడిద తరలింపు, ఒండ్రుమట్టి అక్రమ రవాణాకు చిరునామాగా మక్తల్ ప్రాంతం మారింది. పట్టణ పరిసరాల్లో సుమారు 150 ఇటుక బట్టీలు నడుస్తున్నాయంటే అతిశయోక్తికాదు
జిల్లా వ్యాప్తంగా 2024-25 యాసంగి సీజన్కు సంబంధించి రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్నవడ్లకు చెందిన బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కొనుగోలు ప్రక్రియ ముగిసి ఆరు నెలలు అవుతున్నా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలా నిర్వహిస్తున్న పీటీఎంకు 20 శాతం లోపు తల్లిదండ్రులు మాత్రమే హాజరవుతున్నారు. ఒక్కో పాఠశాలలో 5 శాతం నుంచి 20 శాతం వరకు మాత్రమే వస్తుండటంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు
వనపర్తిలోని సురవరం ప్రతాపరెడ్డి గ్రంథాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన గోపాలరావు మంచి కవి, పండితుడు. 14 ఏళ్ల వయసులో ఆయన 8 భాషలపై పట్టు సాధించారు.
ఆటలోకి దిగారో... ప్రత్యర్థుల గుండెల్లో హడలే... గోల్స్తో జట్టు గెలుపునకు వారు నిత్యం కృషి చేస్తుంటారు. 40 ఏళ్ల కిందట కల్వకుర్తి ప్రాంతం క్రీడాకారులకు పుట్టునిల్లుగా నిలిచింది. కాలక్రమేణా ఆటలకు ఆదరణ తగ్గడంతో క్రీడాకారులు కనుమరుగయ్యారు.
చరవాణి ద్వారా పోస్టల్ సేవలను వినియోగదారులకు అందించేందుకుగాను కొత్త యాప్ను పోస్టల్ శాఖ సిద్ధం చేసింది. తపాలాశాఖ ఇంతవరకు పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా వినియోగదారులకు సేవలు అందించింది.
మహిళలు, బాలికల విషయంలో ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టే దిశగా షీటీం కార్యక్రమాలను విస్తరిస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లో ఈవ్ టీజింగ్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు
వందేమాతరం గీతం ఆవిర్భవించి 150 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో శుక్రవారం వందేమాతరం గీతాలాపన నిర్వ హించారు.
గంజాయి ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
మహబూబ్నగర్ నడిబొడ్డున చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగుతున్నాయి. కీలకమైన ఐదో బ్లాకు ఇన్నాళ్లు నిర్మాణానికి నోచుకోలేదు. అందులో ఈవీఎం గోదాము ఉండటమే కారణం.
వందేమాతరం జాతీయ గీతాన్ని మహాకవి బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లో గీతాన్ని సామూహికంగా ఆలపించారు.
చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాల అలంకార తొలగింపు తేదీని పొడగించినట్లు ఆలయ ఈవో మహేశ్వర్రెడ్డి శుక్రవారం ఆంధ్రజ్యోతికి తెలిపారు.