పిల్లలకు బాల్యం నుంచే కంప్యూటర్ విద్యపై పట్టు సా ధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కృత్రిమ మేధస్సు శిక్షణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించా రు.
విద్యాశాఖ ఆదేశాల మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెం డర్ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాల ని జిల్లా ఇన్చార్జి డీఈవో అబ్దుల్ ఘని సూచించారు.
పాలమూరు నగరంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణించే వాహనదారుల వెంటపడి పిక్కలు పట్టేస్తున్నాయి.
రవాణా వ్యవస్థలో వారధులు కీలకం. రాకపోకలు సులభతరం అయ్యేందుకు నదులు, వాగులు, కాల్వలపై వంతెనలు దోహదం చేస్తున్నాయి. ఉత్తరాదిన ఇటీవల కొన్ని వంతెనలు కూలిపోయి పలువురు మృత్యువాత పడ్డారు.
కోయిల్సాగర్ నుంచి నీటి విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ ప్రాజెక్టు నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లోని ధన్వాడ, మరికల్, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాలకు ఇది వరప్రదాయిని.
విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ఉదయం వేళ పోషక విలువలతో కూడిన ఆహారం అందించడమే లక్ష్యంగా గత ఏడాది ప్రభుత్వం పీఎం పోషణ్ ద్వారా పాఠశాలల్లో రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇక నుంచి తరగతి గదులు, కళాశాల ఆవరణ మొత్తం నిఘా నీడలో ఉండనున్నాయి. ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకొని అమలు చేసింది.
తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం తగ్గుతోంది. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ప్రస్తుతం 10.4 అడుగుల ఎత్తులో 28 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లు కర్ణాటక అధికారులు తెలిపారు. ప్రధాన కాలువకు 7.2 అడుగుల నీటిని విడుదల చేస్తున్నారు.
డిగ్రీలుంటే సరిపోదు.. ఉద్యోగం సాధించాలన్నా.. పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలన్నా.. ఏ రంగంలో రాణించాలన్నా నైపుణ్యం తప్పనిసరి.. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాలు పెంచుకుంటేనే ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న జూరాల నుంచి వరద ప్రవాహం నిలిచిపోయింది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు దిగువకు నీటి ప్రవాహాన్ని నిలిపి వేశారు.
అయిన వారే మోసం చేశారు. తనకు ఆస్తిలో హక్కు లేకుండా చేశారు. తన ముగ్గురు పిల్లలకు దిక్కెవరని ఓ వితంతువు మహబూబ్నగర్ కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం శివారు పూసలతండాకు చెందిన ఆర్మీ జవాన్ మూడ్ నవీన్ ఆచూకీ కోసం ఆయన సతీమణి సరిత సోమవారం మరిపెడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల మేరకు..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దీర్ఘకాలిక రోగులు మూడు నెలలుగా ఇన్సులిన్ అందక ఇక్కట్లపాలవుతున్నారు. అధిక తీవ్రత గల మధుమేహాన్ని ఇన్సులిన్ ద్వారా నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పురపాలికల్లో నిలిచిన పట్టణ ప్రగతి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గత ప్రభుత్వ హయాంలో టీయూఎఫ్ఐడీసీ, ఎస్డీఎఫ్, డీఎంఎఫ్ తదితర నిధులతో చేపట్టిన.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.