తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది.
చాలీచాలని వేతనాలతో ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కుటుంబ పోషణకు ఎంత కష్టమైన పనైనా చేస్తున్నారు. మంగళవారం జడ్చర్లలో శ్రీసలాసర్ స్పిన్నింగ్ మిల్లులో ఇద్దరు కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. పని ప్రదేశంలో కార్మికులకు కనీస భద్రత సౌకర్యాలు లేవు.
రాజాపూర్ మండలం పలుగుట్ట తండా శివారులో తలకాయగుట్ట (సర్వే నంబరు 96/1లో 8 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది) నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమార్కులు పొక్లెయిన్ సాయంతో మట్టితోడి టిప్పర్లు, ట్రాక్టర్లలో యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు.
గొడ్డలి వేటుకు నల్లమల విలవిలలాడుతోంది. విలువైన వృక్ష సంపద అంతరించిపోతోంది. రాజకీయ నాయకుల అండతో అక్రమార్కులు కూలీలతో ఒక ఎకరంలో చెట్లను నరికి చదును చేయడానికి రూ.50వేల వరకు చెల్లిస్తున్నారు.
ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకం కింద నగరం, పట్టణాల్లోని చిరు వ్యాపారులకు కొత్త తరహా రుణసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో 2020 నుంచి చిరు వ్యాపారులకు ఆత్మనిర్భర్ నిధి కింద స్వల్పకాలిక రుణాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
చిత్రం చూస్తుంటే.. ఇదేదో పల్లెటూరి బస్టాప్ అనుకుంటున్నారా... అదేం కాదండి.. జిల్లాలోనే రెండో పెద్ద పురపాలిక అయిజ బస్టాండు. చూస్తున్నారుగా ఎలా ఉందో.. రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. జిల్లాలో ప్రయాణ ప్రాంగణాల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఇసుక, మట్టి, నాప రాతిని కంకరగా మార్చి సహజ సంపదను రూ.కోట్లలో దోచుకుంటున్నా ప్రభుత్వానికి ఆదాయం మాత్రం సక్రమంగా సమకూరటం లేదు. ఇసుకరీచ్, క్రషర్ల కోసం మైనింగ్ క్యారీలు అనుమతి పొందిన వారు తరలిస్తున్నది కొండంత ఉంటే ప్రభుత్వ లెక్కకు మాత్రం గోరంత చూపుతుంటారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. అర్ధరాత్రి నుంచి రహదారులపై పొగమంచు కమ్ముకుంటోంది. ఉదయం 8 గంటల వరకూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటోంది. ఈ సమయంలో వీక్షణ దూరం తగ్గిపోయి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నందున వాహనదారులు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి.
తుంకిమెట్ల-నారాయణపేట రోడ్డు మలుపులను సరిచేయకుండానే నిర్మిస్తుండటంతో విమర్శలు వినిపిస్తున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో 49 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. మలుపులు వద్ద గతంలో ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరుకు చెక్ పెట్టేందుకు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి పాఠశాల విద్యాశాఖ ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్)ను అమలులోకి తెచ్చింది. ఉపాధ్యాయుల హాజరు గణనీయంగా మెరుగు పడినప్పటికీ కొందరు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్రావు పేర్కొన్నారు. జడ్చర్ల మండలం గొల్లపల్లిలోని శ్రీసలాసర్ బాలాజీ టెక్స్టైల్స్ పరిశ్రమలోని స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా,
ప్రేమించిన వ్యక్తి మోసగించాడని.. తాను చదువుతున్న కళాశాల భవనంపై నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నర్సింగ్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ ఠాణా ఎస్సై ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరున ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.
మహబూబ్నగర్ జిల్లా జ డ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వా సితుల పునరావాస ప్యాకేజీ పెంపునకు సంబంధించిన అంశాన్ని కేబి నెట్లో ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి కోరారు.
దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి నిరుపేదల అభ్యున్నతికి వెన్ను దన్నుగా నిలిచారని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు.
స్పిన్నింగ్ చేసిన తర్వాత మిగిలిన వ్యర్థ పత్తిని తొలగిస్తున్న సమయంలో షార్ట్సర్క్యూట్ జరగడం.. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటం.. అందులో చిక్కుకొని ఇద్దరు కార్మికులు మృతిచెందడం.. అంతా నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకుంది.
జిల్లాలో కస్తూర్బా విద్యాలయాల్లో ఇష్టారాజ్యం నడుస్తోంది. పర్యవేక్షణ లేక అక్రమాలు జరుగుతున్నాయి. జీసీడీవో (గర్ల్ ఛైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్) పోస్టు మూడు నెలలగా ఖాళీగా ఉంది.
‘ రాజోలికి చెందిన ఓ చేనేత కార్మికుడు ప్రతి నెలా మూడు చీరలు నేస్తే వచ్చే ఆదాయం రూ.12 వేలు. ఆ డబ్బుతో ఇద్దరు పిల్లల చదువులకే రూ.6 వేలు ఖర్చు చేస్తున్నాడు.
కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, మై భారత్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా ‘యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్’ పేరుతో పోటీలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు.
మండలకేంద్రానికి చెందిన రైతు కుర్వ కృష్ణ ఎకరం పావు సొంత పొలంలో ఉల్లి పంట సాగుచేశాడు. ఇప్పటివరకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు తెలిపారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పడిపోయాయి.
నల్లమల ప్రాంతంలో చేపడుతున్న ‘అచ్చంపేట ఎత్తిపోతల’ పథకం పనులకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ముందుకెళ్తూ ఉమామహేశ్వర రిజర్వాయర్ ఏర్పాటు పనులపై ప్రత్యేక దృష్టి సారించింది.
జిల్లాలో చాలా మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్స కేంద్రాల పేరిట ఆస్పత్రులు తెరిచారు. ప్రచారం చేసుకుంటూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంజక్షన్లు, అధిక డోసు కలిగిన మందులు ఇస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని గంట్రావుపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కొంతమంది విద్యార్థినులు మంగళవారం ఎంఈవో శ్రీనివాస్రెడ్డికి ఫిర్యాదు చేశారు.