వరి రైతులకు పంటను పండించడం కంటే అమ్మడమే కష్టంగా మారింది. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం, గన్నీ సంచులు, హమాలీలు, లారీల కొరత తదితర సమస్యలు ఎదురవుతుంటే.. తూకం వేసి తరలించాక మిల్లుల వాళ్లతో కోతల తిప్పలు తప్పట్లేదు.
తలా పాపం తిలా పిడికెడు అన్నట్లు పాలమూరు నగరంలోని పెద్దచెరువు, ఎర్రకుంట వాగుల్లో ఆక్రమణలు ఇప్పుడు ఇళ్ల యజమానులను వరదల రూపంలో వెంటాడుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితమే వాగులను ఆక్రమించి సెట్బ్యాక్ లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు.
ఇటీవల హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ ప్రాంతంలోని భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
నా అన్న వాళ్లు లేని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే అనాథ చిన్నారుల కోసం శిశు సదనం, బాల సదనాలు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పిస్తోంది. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథాశ్రమాల్లో ఉన్న వారికి కూడా చేయూత అందిస్తోంది.
చదువుకున్న దివ్యాంగులు ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లడం శ్రమతో కూడుకున్న పని. దీనివల్ల చాలా సందర్భాల్లో వారు అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
నెట్టెంపాడు పథకంలో అసంపూర్తి పనులకు రూ.407 కోట్లు అవసరం. ఈ మేరకు 2022లో సాగునీటిశాఖ ప్రతిపాదనలు పంపింది. పనులకు సంబంధించి అంచనాల సవరణ మేరకు రూ.407.71 కోట్లు ఇస్తే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని సాగునీటి శాఖ ప్రతిపాదించింది.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో నాగర్కర్నూల్ పట్టణ విస్తీర్ణం పెరుగుతోంది. అందులో భాగంగా 19వ వార్డు పరిధిలోని శ్రీసుబ్రమణ్యస్వామి దేవాలయం సమీపంలో కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు.
నాగర్కర్నూల్ పురపాలికలో నల్లా బిల్లులు తీసుకోవడంలేదు. తాము ప్రతి నెలా బిల్లు కడుతామంటూ వెళ్లినా తీసుకునే వారు లేరని వెనక్కి పంపిస్తున్నట్లు పట్టణంలోని పలువురు చెబుతున్నారు.
మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో ముందుచూపు, సమన్వయం కొరవడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గన్నీబ్యాగుల కేటాయింపు మొదలుకొని ధాన్యం తరలింపు, బిల్లుల నమోదు వరకు అలసత్వం, అవినీతి కనిపిస్తోంది
పెద్ద ఊళ్లు అభివృద్ధి చెంది పురపాలికలుగా మారాయి. అందుకు అనుగుణంగా మురుగు పారుదల వ్యవస్థ లేదు. కొత్త కాలనీల్లో నిర్మాణాలు ఓ ప్రణాళిక ప్రకారం లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో మురుగునీరంతా ఎక్కడో ఒకచోట చేరి ఆ పట్టణానికే దోమల ఉత్పత్తి కర్మాగారంగా మారుతోంది.
గత ఏడాది ఉల్లి ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది రైతులు సాగుకు మొగ్గు చూపారు. రెండు, మూడు నెలల నుంచి మార్కెట్లోకి ఎక్కువ పంట రావటంతో రోజు రోజుకూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
‘పురపాలికలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. 5వ వార్డు పరిధిలోకి వచ్చే కొత్త ఎస్సీ కాలనీలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 125 మందికి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న బుద్దారం జలాశయం ఎడమ కాలువ పనులు పూర్తి కావడం లేదు. సుమారు 12 ఏళ్ల క్రితం వీటిని ప్రారంభించారు. పనులు పూర్తయితే 10,600 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
వానాకాలం పంటల సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్కు సైతం రైతన్నలు వరిసాగు వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో అన్ని రకాల పంటలు 1,13,306 హెక్టార్లలో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా పార్టీని గ్రామ స్థాయిలో బలో పేతం చేసేందుకు అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు.
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, లబ్ధిదారులంతా ప్రభుత్వానికి అండగా ఉండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్సరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అమలులోకి వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడ్లో గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నవ వధువు కేసును పోలీసులు చేధించారు. భర్తే గొంతు నులిమి చంపినట్లు వెల్లడించారు. నారాయణపేట డీఎస్పీ లింగయ్య గురువారం మద్దూర్ పోలీస్ స్టేషన్లో సీఐ సైదులు, ఎస్ఐ విజయ్కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు.
జూరాల ప్రాజెక్టుకు 2023 మినహా ఎనిమిదేళ్లుగా సమృద్ధిగానే వరద వస్తోంది. అయినప్పటికీ యాసంగి సీజన్లో సాగు, తాగునీటికి దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నీరందక పంటలు ఎండిపోతుండగా, దప్పిక తీర్చుకోవడానికి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయించుకోవాల్సి వస్తోంది.