పంచాయతీ కార్యదర్శులు శిక్షణలో నేర్చుకున్న అం శాలను గ్రామస్థాయిలో పూర్తిగా అమలు చేసి, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజంశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
రాష్ట్రంలో ఆయా మెడికల్ కళాశాలలు, జనరల్ ఆసుపత్రులలో ఉన్న ప్రొఫెసర్ పోస్టులకు ఎడీఎంఈ (అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య యువత మత్తు పదార్థాలకు బానిసవుతోంది. జడ్చర్లలో ఒకే నెలలో మూడు చోట్ల ఆబ్కారీ విజిలెన్స్, టాక్స్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేసి గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులో తీసుకున్నాయి.
నగరంలో అంతర్భాగమైన బైపాస్ రహదారికి చేరువలో ఉండే వినాయనగర్కాలనీలో మౌలిక వసతులు లేక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏనుగొండ బైపాస్ కూడలి దాటాక ఎదిర వెళ్లే మార్గంలో వాగు దాటకముందు కుడివైపునకు ఉండే ప్రాంతమే వినాయకనగర్కాలనీ.
అనుమతుల మాటున అక్రమ ఇసుక దందా జోరందుకొంది. ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పనుల పేరుతో ఇతర ప్రాంతాలకు ఇసుకను దారి మళ్లించి డబ్బుల్ని దండుకొంటున్నారు. అనుమతి ఎంతమేరకు ఇచ్చిందీ..
రేషన్ కార్డుల ద్వారా ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నాలుగు నెలలు గడిచాయి.
విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి పెంపొందించేందుకు ప్రభుత్వం అభ్యసనాభివృద్ధి కార్యక్రమం (ఎల్ఐపీ) నిర్వహిస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6-9 తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాలు పరిశీలిస్తున్నారు.
నచ్చిన పాఠశాల ఉంటే ఎంత దూరమైనా పర్వాలేదు. పిల్లలు మంచిగా చదవాల్సిందేనని తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. రోజూ పాఠశాలకు బస్సులో వెళ్లి వస్తారు కదా.. అనేది వారి అభిప్రాయం.
ఉన్నత పాఠశాలల్లో విద్యా సామర్థ్యాల పెంపునకు రెండేళ్లుగా ‘లిప్’(లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనిని మరింత సమర్థంగా అమలు చేయడంలో భాగంగా ఉపాధ్యాయులు ఏఐ (కృత్రిమ మేధ) సహకారంతో బోధన చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
వరదనీరు అందుబాటులో ఉన్నా జూరాల విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద నిర్దేశించిన గరిష్ఠ ఉత్పత్తి సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రంలో మూడేళ్లుగా మొరాయిస్తున్న మూడో యూనిట్లో చివరిదశ మరమ్మతులు ఇప్పటికీ పూర్తి కాలేదు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూరులో చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు.
ప్రజలకు తాగునీరు సరఫరా చేసే నీటిట్యాంకుల నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. లీకేజీలను అధికారులు పట్టించుకోవడం లేదు. వీరి నిర్లక్ష్యం ప్రజారోగ్యంపై పడుతోంది.
జిల్లాలోని ధన్వాడ, మరికల్ మండలాల్లో మిగిలి ఉన్న ప్రభుత్వ భూముల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే ధన్వాడ సింపు కాల్వలోని ప్రభుత్వ భూమి.