కరీంనగర్లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరిగే మూడో తెలంగాణ పోలీసు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటాలని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పిలుపునిచ్చారు. స్పోర్ట్స్మీట్కు ఎంపికైన క్రీడాకారులను ఉద్దేశించి సోమవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
సామాజిక చైతన్యమే లక్ష్యంగా సాహితీ సేవలు అందిస్తున్న విప్లవ రచయితల సంఘం(విరసం) 24వ సాహిత్య పాఠశాల సభను విజయవంతం చేయాలని విరసం వ్యవస్థాపక సభ్యుడు, కవి, రచయిత సారం గపాణి కోరారు.
జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన పండించి న కందిపంటను కొనుగోలు చేసేందుకు వెంట నే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
జిల్లా వ్యాప్తం గా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫో న్లు పోగొట్టుకున్న 38మంది బాధితుల మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ విధులు నిర్వహించే సిబ్బంది సోమవారం ఎస్పీ శ్రీనివాసరావు చేతు ల మీదుగా బాధితులకు ఫోన్స్ను అందజేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయు రాములుపై జరిగిన దాడిని నిరసిస్తూ ఉపాధ్యాయులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
మునిసిపాలిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు సోమవారం మునిసిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
గంపెడు ఆశలు పెట్టుకొని సాగు చేసిన వేరుశనగ కాస్త తెగుళ్ల బారిన పడింది. దిగుబడి గణనీయంగా పడిపోయింది. పెట్టుబడులు సైతం చేతికి రావని రైతులు ఆందోళన చెందుతున్నారు.
స్వయం సహాయక (మహిళా) సంఘాలకు కొత్త సారథుల ఎంపికకు కసరత్తు మొదలైంది. సంఘం సభ్యుల నుంచి గ్రామ, జిల్లా సమాఖ్యలకు అధ్యక్ష, ఉపాధ్యక్షురాళ్లను ఎన్నుకునే ప్రక్రియ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చేపట్టనున్నారు.
ప్రభుత్వం మండలానికి ఒక అంబులెన్స్ను కేటాయించింది. కానీ కౌకుంట్ల మండలం ఏర్పాటై ఏడాది పూర్తయినా ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం.. పక్కనే తుంగభద్ర నదీ ప్రవాహం.. దేశవిదేశాల నుంచి తరలివచ్చే భక్తజనం.. ఎంత సుందరంగా ఉండాలి. కానీ అలంపూర్లో అడుగుపెట్టినప్పటి నుంచే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు.
ప్రభుత్వ నూతన పథకాల లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభలే కీలకం కానున్నాయి. కొత్త రేషన్కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు తదితరాలు ఇందులో ఉన్నాయి.
అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు ప్రశ్నార్థకంగా మారాయి. ఆసుపత్రిని ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నా అత్యవసర సిబ్బంది నియామకానికి నోచుకోవడం లేదు.
‘ఒక దేశం - ఒక విద్యార్థి ఐడీ’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం పాఠశాల నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ప్రత్యేకంగా అపార్(ఆటోమెటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డు అందించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారుల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. సోమవారం లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా పాలనాధికారులను ఆదేశించింది.
పచ్చని పల్లెల్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, పనులు ప్రారంభించకుండా చర్యలు తీసుకోవాలని పరిశ్రమ రద్దు పోరాట సమితి సభ్యులు అన్నారు.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్(ఈఎస్ఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రీజనల్ స్థాయిలో విజయం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి.