ఆహారభద్రత కార్డుల లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. మార్చిలో పంపిణీ చేయగా మిగిలిన దొడ్డు బియ్యం రేషన్ దుకాణాల్లోనే ఉండిపోయింది.
కేంద్ర జలశక్తి అభియాన్ కింద ఉపాధి హామీలో జిల్లాలో చేపట్టిన జల సంరక్షణ పనులకు గుర్తింపు దక్కింది. దక్షిణ భారతదేశంలోనే మహబూబ్నగర్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
మహబూబ్నగర్ కార్పొరేషన్ చుట్టూ మూడు కీలక విలీన గ్రామాల్లో పది శాతం ఖాళీ స్థలాలు మాయమవుతున్నాయి. ఈ జాగాలు ఎక్కడున్నాయి? ఏ స్థితిలో ఉంటున్నాయి? వాటి దస్త్రాలు ఏం చేశారు? అనేది అంతుపట్టడం లేదు.
అంగన్వాడీ చిన్నారులకు దుస్తులు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించి అందుకోసం వస్త్రాలను పంపిణీ చేసింది. అవి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా కార్యాలయంలోనే మూలుగుతున్నాయి.
మండలంలోని కృష్ణానదిలో నిషేధిత అలివి వలతో చేపల వేట సాగిస్తున్నారు. ఆయా గ్రామాల్లో స్థానికంగా బలంగా ఉన్న నాయకుల అండదండలతో అక్రమార్కులు వీటితో యథేచ్ఛగా చేపలు పడుతున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి చెందిన కొంగళ్ల శివ(26)ని హత్య చేసిన దుండగులను అరెస్టు చేసేంత వరకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే ప్రసక్తే లేదని కుటుంబీకులు కల్వకుర్తి ఠాణాలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
చారకొండ మండలం గోకారం గ్రామ సమీపంలో నిర్మించనున్నడిండి-నార్లాపూర్ జలాశయ నిర్మాణ సామర్ధ్యాన్ని తగ్గించాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా భూ నిర్వాసితులు జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్కు వినతిపత్రం అందజేశారు.
పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా చెత్తా చెదారం కనిపించొద్దని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర అధికారి, జిల్లా పరిశీలకురాలు ఏ.ఉషారాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ పాఠశాల, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాఠశాలల పరిశుభ్రత కార్యక్రమం స్పెషల్ క్యాంపెయిన్ 5.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జలసంచయ్ జన్ భాగీదారి 1.0 విభాగంలో జాతీయ స్థాయిలో మహబూబ్నగర్ జిల్లాకు అవార్డు వచ్చింది. 3వ కేటగిరిలో జిల్లా మూడో స్థానంలో నిలిచినందుకు ఇది దక్కింది.