ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరున ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.
మహబూబ్నగర్ జిల్లా జ డ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వా సితుల పునరావాస ప్యాకేజీ పెంపునకు సంబంధించిన అంశాన్ని కేబి నెట్లో ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి కోరారు.
దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి నిరుపేదల అభ్యున్నతికి వెన్ను దన్నుగా నిలిచారని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు.
స్పిన్నింగ్ చేసిన తర్వాత మిగిలిన వ్యర్థ పత్తిని తొలగిస్తున్న సమయంలో షార్ట్సర్క్యూట్ జరగడం.. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటం.. అందులో చిక్కుకొని ఇద్దరు కార్మికులు మృతిచెందడం.. అంతా నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకుంది.
జిల్లాలో కస్తూర్బా విద్యాలయాల్లో ఇష్టారాజ్యం నడుస్తోంది. పర్యవేక్షణ లేక అక్రమాలు జరుగుతున్నాయి. జీసీడీవో (గర్ల్ ఛైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్) పోస్టు మూడు నెలలగా ఖాళీగా ఉంది.
‘ రాజోలికి చెందిన ఓ చేనేత కార్మికుడు ప్రతి నెలా మూడు చీరలు నేస్తే వచ్చే ఆదాయం రూ.12 వేలు. ఆ డబ్బుతో ఇద్దరు పిల్లల చదువులకే రూ.6 వేలు ఖర్చు చేస్తున్నాడు.
కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, మై భారత్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా ‘యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్’ పేరుతో పోటీలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు.
మండలకేంద్రానికి చెందిన రైతు కుర్వ కృష్ణ ఎకరం పావు సొంత పొలంలో ఉల్లి పంట సాగుచేశాడు. ఇప్పటివరకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు తెలిపారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పడిపోయాయి.
నల్లమల ప్రాంతంలో చేపడుతున్న ‘అచ్చంపేట ఎత్తిపోతల’ పథకం పనులకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ముందుకెళ్తూ ఉమామహేశ్వర రిజర్వాయర్ ఏర్పాటు పనులపై ప్రత్యేక దృష్టి సారించింది.
జిల్లాలో చాలా మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్స కేంద్రాల పేరిట ఆస్పత్రులు తెరిచారు. ప్రచారం చేసుకుంటూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంజక్షన్లు, అధిక డోసు కలిగిన మందులు ఇస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని గంట్రావుపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కొంతమంది విద్యార్థినులు మంగళవారం ఎంఈవో శ్రీనివాస్రెడ్డికి ఫిర్యాదు చేశారు.