గద్వాల మండల పరిధిలోని మదనపల్లి గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి కా వడంతో గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరై ప్రారంభించారు.
సత్యసాయిబాబా శత జయంతి కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించగా, కలెక్టర్ విజయేందిరబోయి సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ట్రామాకేర్ వస్తే ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ, కార్డియాలజీ, అనస్తీషియా, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్లు ఇతర వైద్య నిపుణులు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ లాంటి ప్రత్యేక వైద్య పరికరాలు, బ్లడ్ బ్యాంకు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, 30 నుంచి 50 పడకలు, అంబులెన్సు, తదితర సౌకర్యాలుంటాయి.
వాహనం ఏదైనా సరే కొన్న రోజే షోరూంలో వినియోగదారుడి ముక్కుపిండి మరి రూ.వేల నుంచి రూ.లక్షల వరకు లైఫ్ అండ్ రోడ్ ట్యాక్స్ వసూలు చేసుకుంటున్నాయి ప్రభుత్వాలు కట్టిన పన్నులతో వినియోగదారులకు అవసరమైన రహదారులు, మౌలిక వసతులు కల్పించాలని చట్టాలు చెబుతున్నాయి.
పీఎంశ్రీ కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం సకల వసతులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం బడుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించాలని సంకల్పించింది.
అక్రమ ఇసుక దందా ఆగడం లేదు. అధికార పార్టీ అండ ఉండగా తమకు అడ్డు చెప్పేదెవరని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుకను దోచేస్తున్నారు.
గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ‘స్త్రీనిధి’ పథకం కింద రుణాలు మంజూరు చేస్తుండగా కొన్ని చోట్ల రికవరీ జరగక మొండి బకాయిలు పేరుకుపోతున్నాయి.
భారీ వర్షాలు పంట దిగుబడిపై ప్రభావం చూపాయి. వానాకాలంలో వరి సాగు చేసిన రైతులకు నష్టమే మిగిలేలా పరిస్థితి ఉంది. కల్లం వద్ద ఏ రైతు నోట విన్నా గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి తక్కువైందనే మాటలే వినిపిస్తున్నాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం మహిళా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ బాధ్యత ఆర్డీవోల నేతృత్వంలో జిల్లా పంచాయతీ అధికారుల సమన్వయంతో పూర్తి చేశారు.