ఓదెల రైల్వేస్టేషన్కు సీక్వెల్గా రూపొందిన మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల2’. సంపత్ నంది కథ అందించటం, తమన్నా కీలక పాత్ర పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది.
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఆయన ఓ హోటల్ నుంచి పారిపోవడం చర్చనీయాంశంగా మారింది.
తనకున్న మిల్కీ బ్యూటీ ట్యాగ్ గురించి తమన్నా మరోసారి స్పందించారు. అందంతో పాటు మరెన్నో విషయాలను పరిగణనలోకి తీసుకొని పాత్రలను ఎంపిక చేసుకుంటామని చెప్పారు.
పాన్ ఇండియా స్థాయిలో ‘హను - మాన్’ సినిమాని నిర్మించి విజయాన్ని అందుకున్నారు ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ అధినేతలు కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి. ఈ నిర్మాతలు మరో పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్టారు.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఒకటి ‘ది రాజాసాబ్’ కాగా, మరొకటి హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకి పరిశ్రమ నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి) ఛైర్మన్ దిల్రాజు.
కథే ఈ సినిమాకి హీరో అని చెప్పారు ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్. కన్నడ అగ్ర నటులు ఉపేంద్ర, రాజ్.బి శెట్టితో కలిసి ఆయన నటించిన చిత్రమే ‘45’. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
జీవితంలో కొత్త విషయాలను నేర్చుకుంటూ.. స్వేచ్ఛగా బతకాలనే ఆశతో దిల్లీకి వస్తుంది మధు. ఆ తర్వాత ఆమె ఓ హాస్టల్లో చేరుతుంది. అక్కడ కొన్ని రోజుల పాటు గడిపిన మధుకు ఆ ప్రదేశం అంతా ఓ వింతగా అనిపిస్తుంది.
మరి కొద్దిరోజుల్లో ‘ఆల్ఫా’ సినిమాతో తనలోని యాక్షన్ కోణాన్ని సినీ ప్రియులకు పరిచయం చేయనున్న కథానాయిక శార్వరీ వాఘ్. ఇప్పుడామె మరో భారీ ప్రాజెక్టులో భాగమైనట్లు తెలుస్తోంది.
బీఎస్ఎఫ్ అధికారి నరేంద్రనాథ్ దూబే జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘గ్రౌండ్ జీరో’. ఈ సినిమా ప్రీమియర్ షోని కశ్మీర్లోని శ్రీనగర్లో ప్రదర్శించనున్నారు.