మోర్లే బుజ్జి బాయి అనే మహిళ పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో నీటి కోసం ముగ్గురు పిల్లలు కుంటలో దిగారు. కుంటలో లోతు ఎక్కువగా ఉండటంతో.. చిన్నారులు నీటిలో మునిగిపోయారు.
ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న జలమండలి రాబడి అవకాశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. మహానగరంలో 14.2 లక్షల నీటి కనెక్షన్లు ఉన్నా జలమండలికి వస్తున్న ఆదాయంలో 80 శాతం లక్ష కనెక్షన్ల నుంచే వస్తోంది.
జీహెచ్ఎంసీలోని అన్ని సెక్షన్లకు అవసరాన్ని బట్టి కంప్యూటర్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలు వంటివన్నీ ఐటీ విభాగం సమకూరుస్తుంది.
దసరా నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ స్టేషన్ నుంచి పలు రైళ్లు నడుపుతుంది. నగరవాసులు ఏటా పండుగలను తమ వారితో జరుపుకోవడానికి స్వస్థలాలకు బయలుదేరి వెళతారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ భారతీయ స్టేట్ బ్యాంకులో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8వ తేదీన బ్యాంకులో రూ. 5లక్షలు చోరీకి గురైనట్లు బ్యాంక్ అధికారి నాగనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు