కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని మంత్రి సీతక్క తెలిపారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ భారం లేకుండా ప్రభుత్వమే వాటిని చెల్లిస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్లు రికార్డు ధర పలికాయి. నియోపోలిస్ దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది.
తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు కుటుంబ సభ్యులను డబ్బులు అడుగుతున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ పాత్రికేయురాలిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.
ముషీరాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన చిక్కడపల్లి ఎక్సైజ్ పోలీసు స్టేషన్ను సోమవారం జీహెచ్ఎంసీ ఉప మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియ గౌడ్, ఎక్సైజ్ శాఖ అధికారితో కలిసి ప్రారంభించారు.
2018లో మెట్టుగూడలో ద్విచక్రవాహనం మెట్రో స్తంభాన్ని ఢీకొట్టి ముగ్గురు చనిపోయారు. 2017లో జూబ్లీహిల్స్లో కారు మెట్రో స్తంభాన్ని ఢీకొనడంతో ఏపీ మంత్రి నారాయణ తనయుడు చనిపోయారు. మరొకరు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.’’
మద్యం మత్తు..ఆపై అతివేగం.. శిరస్త్రాణం ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సరూర్నగర్ ఠాణా పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయొద్దని..అలా చేస్తే జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. నోట్లో పాన్, ఇతర పదార్థాలు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తుంటారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం, రైళ్ల మళ్లింపుతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదాయం సైతం పెరుగుతోందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
నగరంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ల అక్రమాలకు చెక్పెట్టేలా జలమండలి కార్యాచరణ చేపట్టింది. నగరంలో నీటి సరఫరాకు జలమండలి వినియోగిస్తున్న ట్యాంకర్లు అంతకంతకు పెరుగుతున్నాయి.
గ్యాస్ లీకేజీ తీవ్ర విషాదాన్ని నింపింది. మధురానగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. రహ్మత్నగర్ కమాన్గల్లీలో నివసించే గోపాల్సింగ్ ఇంట్లో ఆదివారం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
నగరవ్యాప్తంగా రహదారుల పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం రూ.12.29కోట్లతో మరమ్మతులు చేపట్టింది. సర్కిళ్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు చేపడుతున్నామని ముఖ్య ఇంజినీరు రత్నాకర్ స్పష్టం చేశారు.
చిన్న పొరపాటు.. అంతులేని విషాదం మిగిలిస్తుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్, స్టవ్ దగ్గర లీకేజీ సమస్యల నిర్వహణ లోపాలతో జరుగుతున్న అగ్నిప్రమాదాలు తీవ్ర నష్టాన్నిస్తుంది.
నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధమైంది. సీపీ సజ్జనార్ ఏడు జోన్ల స్థాయిలో పోలీస్స్టేషన్ల పనితీరు, సిబ్బంది వ్యవహారశైలిపై ఆరా తీస్తున్నారు.
ప్రయాణికులతో టేకాఫ్ తీసుకున్న ఓ అంతర్జాతీయ విమాన సర్వీస్లో బాంబులు పెట్టామని.. ల్యాండింగ్ అయ్యేలోపు పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్పోర్ట్ ఈ-మెయిల్కు సందేశం పంపించిన సంఘటన ఆదివారం.
హైడ్రా ఆధ్వర్యంలో పని చేస్తోన్న వర్షాకాల అత్యవసర బృందాల(ఎంఈటీ) కొనసాగింపు ప్రశ్నగా మారింది. గతంలో ఎంఈటీ బృందాలను జీహెచ్ఎంసీ నియమించేది. విపత్తుల నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రాకే ఎంఈటీ బృందాలను.
‘‘హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని చేవెళ్లలో కొద్దినెలల క్రితం 43 ఏళ్ల వ్యక్తికి పదమూడేళ్ల బాలికతో పెద్దలు పెళ్లి చేశారు. మైనర్కు పెళ్లి చేయడం నేరమని తెలిసినా వివాహ తంతు ముగించారు. ఇంతేకాదు..
తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిమ్స్కు ప్రభుత్వం జవసత్వాలు కల్పిస్తోంది. పెరుగుతున్న రోగుల తాకిడికి తగ్గట్లు సేవలను విస్తరిస్తోంది. తాజాగా అదనంగా 90 మంది వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చేపట్టారు.
సామాజిక తెలంగాణ కోసం అణగారిన కులాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ‘సామాజిక తెలంగాణ పార్టీ’ ఆవిర్భవించినట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆమనగంటి సైదులు పేర్కొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, దీనిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సోమవారం తెలంగాణ భవన్లో బీసీ ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను లీజుకు తీసుకున్న బడాబాబులు..అందులో అక్రమంగా షెడ్లను వేసి అద్దెకు ఇచ్చి రూ.లక్షలు.
దూరంగా ఉంటున్న భర్తను పిల్లలు ఆశ చూపి దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించిన మహిళ చివరకు కటకటాలు పాలైంది. ఆదివారం సౌత్వెస్ట్ జోన్ అదనపు డీసీపీ కృష్ణగౌడ్..
నిరసన కార్యక్రమంలో మంటలంటుకుని గాయపడిన ట్రాన్స్జెండర్లలో ఆదివారం మరొకరు మృతిచెందారు. ట్రాన్స్జెండర్లలోని ఓ బృందం నాయకురాలు మోనాలిసా వేధింపులకు పాల్పడుతోందని.
ESI hospital సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి పునర్నిర్మాణ పనుల్లో సోమవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. కార్మికులు పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది.