పోలవరం-బనకచర్లపై కేంద్రానికి మన అభ్యంతరాలను తెలిపామని తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమని వాదించామన్నారు.
తెలంగాణలో భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తుపై సమగ్ర పరిశీలన ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు.
ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ మొద్దునిద్రను లేపింది, ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరగని పోరాటం చేసింది.. భారాసనేనని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో తెలంగాణకు చెందిన టెక్నాలజీ సంస్థ క్వాడ్రిక్ ఐటీ రెండో స్థానంలో నిలిచింది.