గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జిల్లా సాధారణ పరిశీలకురాలు షేక్ యాస్మిన్ బాషా అధికారులకు సూచించారు.
లక్షలను బదిలీ చేసుకున్నారు. రైతు కొత్త ఫోన్ కొని సిమ్ కార్డు యాక్టివేట్ చేయించుకుని బ్యాంకు ఖాతాల్ని తనిఖీ చేయగా విషయం బయటపడింది. సోమాజిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి బస్సులో వెళ్తుండగా ఫోన్ చోరీకి గురైంది. సిమ్ బ్లాక్ చేయించేలోపు.. రూ.34 వేలు కొట్టేశారు. బ్యాంకు ఖాతాలు బ్లాక్ చేయించడంతో ఖాతాలోని మిగతా డబ్బును కాపాడుకోగలిగాడు.
గ్రేటర్ హైదరాబాద్లో శివారు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల విలీన వేగం పుంజుకుంది. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సాంకేతిక లోపం, ప్రతికూల వాతావరణం కారణంగా ఆరు దేశీయ విమాన సర్వీసుల రాకపోకలు బుధవారం అర్ధాంతరంగా రద్దయ్యాయి. వారణాసి, మధురై, చెన్నై, శిరిడీ నగరాలతోపాటు గోవా నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన ఇండిగో విమానాలు, ఆయా ఎయిర్పోర్టులలో టేకాఫ్ తీసుకోలేదు.
మహానగరం బృహత్నగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కీలకమైన జలమండలి దీనికి అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. శివారు స్థానిక సంస్థల పరిధిలోనూ పలు ప్రాంతాల తాగునీటి సరఫరా బాధ్యతలను ఇప్పటికే నిర్వహిస్తోంది.
చేపల విక్రయాన్ని విరివిగా చేపట్టడానికి ప్రభుత్వం ఫిష్ క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి గగన్ విహార్ కాంప్లెక్స్ (మెట్రో పిల్లర్ 1300) వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్ను ఎంపీలు అనీల్కుమార్యాదవ్, చామల కిరణ్కుమార్రెడ్డి, ఫిషరీష్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు.
మహేశ్వరంలో ప్రభుత్వం నిర్మించిన డిగ్రీ కళాశాల ఇది. విద్యార్థులకు తరగతి గదులు, ప్రయోగశాలలు, అధ్యాపకులకు కలిపి కనీసం 20 గదులుండాలి. ఇక్కడ కేవలం నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి
పోక్సో కేసులో ప్రభుత్వ ఉద్యోగికి 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఎస్సై కృష్ణవేణి వివరాల ప్రకారం... తిలక్నగర్ ఇందిరానగర్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగి సర్దార్ త్రిలోక్సింగ్ (50) 2024 జూన్లో రెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై నిఘా పెడుతూ కొత్త నేరాలు చేయకుండా అడ్డుకుంటున్న రాచకొండ పోలీసులు.. మరో ముందడుగు వేశారు. రౌడీషీటర్లను సామాజిక సేవలో భాగస్వాముల్ని చేస్తున్నారు
కొంతమంది పోలీసులకు అక్రమాలే వ్యసనంగా మారుతున్నాయి. జల్సాలు, ఆస్తుల సంపాదన లక్ష్యంగా తప్పుడు పద్ధతుల్లో వెళ్తున్నారు. బెట్టింగ్కు అలవాటైన అంబర్పేట్ ఎస్సై భానుప్రకాశ్రెడ్డి రికవరీ చేసిన బంగారం, సర్వీస్ రివాల్వర్ తాకట్టు పెట్టాడు. టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం
అంబర్పేటకు చెందిన ఓ వ్యక్తి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి తరచూ గొడవ పడేవాడు. ఓ రోజు తాగొచ్చి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.’’
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు కొందరు క్యాబ్ డ్రైవర్లు చుక్కలు చూపిస్తున్నారు. బస్సులు అందుబాటులో లేని సమయాల్లో (తెల్లవారుజామున, రాత్రి 10 తర్వాత) ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని నగదు దండుకునేందుకు యత్నిస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ను రద్దు చేస్తూ డ్రైవర్ చెప్పినంత చెల్లించాల్సిందేనంటూ జేబులు గుల్ల చేస్తున్నారు.ఒక్కరికే అభ్యర్థన..
రిజర్వేషన్ టిక్కెట్లో బయలుదేరే సమయం తప్పుగా రావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వారు కాచిగూడ స్టేషన్కు వచ్చే లోపే రైలు వెళ్లిపోవడంతో ఆందోళనకు గురయ్యారు
కాంగ్రెస్ బీసీ ద్రోహి అని, పంచాయతీ ఎన్నికల్లో మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆ పార్టీ దిమ్మెలను కూలగొట్టాలని పిలుపునిచ్చారు
రోడ్డు ప్రమాదంలో కుడి కంటి చూపు కోల్పోయిన డెలివరీబాయ్కి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ కమ్ స్మాల్ కాజెస్ కోర్టు రూ.9,86,284 పరిహారం మంజూరు చేస్తూ వెలువరించిన తీర్పు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శాలిబండలోని గోమతి ఎలక్టాన్రిక్స్ షో రూంలో ఈ నెల 24న జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని ఖిల్వత్ ప్రాంతానికి చెందిన మీర్ సజ్జాద్ అలీగా గుర్తించారు
ఐఏఎస్గా అవతారమెత్తి ప్రజలను మోసగిస్తున్న వ్యకిని ఫిల్మ్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీగార్డ్స్లోని కార్యాలయంలో బుధవారం డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.