నగరంలో కొత్తకాలనీలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా కొత్త రూట్లలో ప్రయాణికుల సౌకర్యాలు పెంచేలా ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
జులైలో మూడు రోజులు హైలైఫ్ ఎగ్జిబిషన్ను నిర్వహించనున్నారు. జులై 6, 7, 8వ తేదీల్లో నగరంలోని హెచ్ఐసీసీ నొవాటెల్లో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నారు.
పెళ్లి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి.. ఇది పెద్దలు చెప్పే మాట. దాని అర్థం ఆ కుటుంబం ఆస్తులు, అంతస్తులు, పరువు, మర్యాదలే కాదు ఆరోగ్య చరిత్ర కూడా ముఖ్యమనే భావన ఇందులో ఇమిడి ఉంది.
కాచిగూడ-చిత్తూరు-కాచిగూడ(12797/12798), కాచిగూడ-బెంగళూరు-అశోకపురం-కాచిగూడ(12785/12786) రైళ్లను ప్రారంభించి 50 ఏళ్లు అయిన సందర్భంగా స్వర్ణోత్సవాన్ని నిర్వహించారు.
సాంకేతికను అందిపుచ్చుకొని ప్రయాణ ప్రయాస తప్పించేందుకు చేసిన ప్రయత్నమే ‘టీజీఎస్ ఆర్టీసీ గమ్యం ట్రాకింగ్ యాప్’..బస్సుల రాకపోకలు లైవ్ ట్రాకింగ్ ద్వారా ప్రయాణికుల విలువైన సమయాన్ని ఆదా చేయాల్సిన ఈ యాప్ మరింత ప్రయాసను పెంచుతోంది.
నిరంతర విద్యుత్తు సరఫరాలో కీలకమైన రింగ్ మెయిన్ యూనిట్ల (ఆర్ఎంయూ) నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) నిర్ణయించింది.
అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు చికిత్స చేయించేందుకు ఓ నైజీరియన్ డ్రగ్స్ దందాలోకి దిగాడు. గోవా కేంద్రంగా ఉంటూ నగరానికి రూ.లక్షల విలువైన డ్రగ్స్ చేరవేస్తూ పోలీసులకు దొరికిపోయాడు.
సామాజిక మాధ్యమాల్లో లైకులు, ఫాలోవర్ల మోజులో పడి రోజుకో రీల్ లెక్కన పోస్టు చేస్తుంటాం. ఫొటోలకైతే అసలు లెక్కేలేదు. ఎదుటి వ్యక్తితో కనీస పరిచయం లేకున్నా స్నేహితుల జాబితాలో చేర్చుకుంటాం.
రాజధాని పరిధిలో ప్రతి నెలా 25వేల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. సరైన సమయానికి గమ్యం చేర్చే ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో చాలామంది వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.
బాపు-రమణల చిత్రాల్లో గొప్ప తాత్వికత, జీవన విధానం, వ్యక్తిత్వవికాసం, మానవ సంబంధాలు, భార్యాభర్తల అనుబంధాలు, మనిషి జీవన కర్తవ్యం ఏంటో బోధించే అంశాలున్నాయని, వాటిపై లోతైన పరిశోధన జరగాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు.
కంపెనీలో పెట్టుబడులకు నెలకు 2 శాతం చొప్పున వడ్డీ ఇస్తామంటూ నలుగురు రూ.2.07 కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ ఠాణాలో కేసు నమోదైంది.
మహా న్యూస్ ఛానెల్పై దాడి ఘటనలో భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ సహా 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని అడ్డుకునేందుకు హైదరాబాద్ రెవెన్యూ శాఖ అధికారులు వినూత్న కార్యాచరణ రూపొందించారు. త్వరలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.
తక్కువ ధరకు నాణ్యమైన పసిడి సొంతం చేసుకోమంటూ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. నగరంలో బంగారం ముసుగులో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.