దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలో లంచం ఇవ్వనిదే పని కావట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు చేయిచాస్తుంటారనే మాటలు వినిపిస్తున్నాయి.
దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధానిలో ఇప్పటికే భద్రత పెంచిన పోలీసులు.. అసాంఘిక శక్తులు, అక్రమ చొరబాటుదారుల కార్యకలాపాలపై దృష్టిసారించారు.
ప్రపంచ సుందరి పోటీలతో పాటు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుండడంతో విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సీఐఎస్ఎఫ్ కమాండెంట్ మంజీత్సింగ్ పేర్కొన్నారు.
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గడువు ముగిసింది. ఎలాంటి రాయితీ లేకుండా ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ కింద రూ.218 కోట్ల ఆదాయం సమకూరింది.
బాహ్యవలయ రహదారిపై కారు టైరు పగిలిపోవడంతో దాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తికి సహకరించేందుకు అదే దారిలో వెళ్తున్న ఇద్దరు చొరవ చూపారు. మరో కారు వచ్చి ఢీకొట్టడంతో వారిలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.
భావినగరం అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ విధులు.. కార్యకలాపాలు హెచ్ఎండీఏ తరహాలో ఉండనున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 56 గ్రామాల్లో 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భావినగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దివ్యాంగుల ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యూత్ ఫర్ జాబ్స్ అనే సంస్థతో కలిసి ప్రత్యేక జాబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది.
ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తామని రూ.50 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన వ్యవహారంలో ఆదర్శ్ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఓరుగంటి దుర్గా, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సుబ్బారావు మీద హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైంది.
విశ్రాంత డీఎస్పీ నెల్సన్ ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు పోలీసు అధికారుల విధి నిర్వహణలో ఆటంకాలు కలిగిస్తున్నారని ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ ఈ నెల 7న మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు.
లగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ జారీ తర్వాత ప్రయాణికులను విమానం ఎక్కనివ్వకుండా నిరోధించిన ఇండిగో ఎయిర్లైన్స్ కంపెనీ లిమిటెడ్ సిబ్బంది తీరుపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సేవల అవసరం పెరుగుతోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం రాజ్భవన్లోని దర్బార్ హాలులో రెడ్క్రాస్, తలసీమియా డే జరిగాయి.
నిత్యం పుస్తకాలతో కుస్తీపట్టే నగర విద్యార్థులు ‘స్ట్రీట్కాజ్’ సంస్థ ద్వారా సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నారు. మారుమూల గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు.
గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, డీప్ టెక్ సాంకేతిక సంస్థలు, సామాజిక పరిష్కారాల అంకురాల అభివృద్ధి కోసం సంయుక్త కార్యక్రమాల రూపకల్పనకు రాయదుర్గం టీహబ్, జపాన్ వెంచర్ క్యాపిటల్, ఆవిష్కరణల సంస్థ బియాండ్ నెక్ట్స్ వెంచర్స్ ఇండియా(బీఎన్వీఐ) గతంలో చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని పొడిగించుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఎస్హెచ్వోగా బాలానగర్ ఠాణా సీఐ టి.నర్సింహరాజు ఎంపికయ్యారు. పౌరుల అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా సేకరించి ఇందులో ఉత్తమంగా సేవలు అందిస్తున్న 10 ఠాణాల ఎస్హెచ్వోలను డీజీపీ కార్యాలయం అధికారులు ఎంపిక చేశారు.
బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో గురువారం అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగే మిస్ వరల్డ్ 2025 ప్రారంభ కార్యక్రమానికి సన్నాహకాలు మొదలయ్యాయి. గురువారం జరిగిన రిహార్సల్స్లో వేర్వేరు దేశాలకు చెందిన సుందరీమణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అందుకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట .. పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు దిగింది.
పాక్లోని ఉగ్ర శిబిరాలపై మన సైన్యం (Indian Army) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పట్ల భారత పౌరుడిగా గర్వంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు.
జిల్లాలోని ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చోరీల కట్టడికి ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పలుచోట్ల సక్రమంగా పనిచేయక చోరీలు పెరిగిపోతున్నాయి.ఫ్యాన్లు అవసరమున్నా ఏర్పాటు చేయడంలేదు.నీటిపంపులు పనిచేయడం లేదు.
భూమి ఉన్న ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో 11 అంకెలతో కూడిన విశిష్ఠ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని, రైతుల వివరాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసి తక్షణమే అమలు చేయాలని సూచించింది.
బెంగళూరులోని ప్రముఖ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న యువతికి హైదరాబాద్లోని బ్రాంచికి బదిలీ అయ్యింది. నగరంతో కనీస పరిచయం లేని ఆ యువతి ఎక్కడుండాలి..? హాస్టల్లో ఉండాలన్నా..
నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరిపడా మందుల అందడం లేదు. రద్దీ ఎక్కువగా ఉన్న సోమ, మంగళ, బుధవారాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఆయా ఆసుపత్రుల ప్రాంగణాల్లోని జన ఔషధ, ప్రైవేటు మెడికల్ దుకాణాలే దిక్కుగా మారుతున్నాయి.
లేఅవుట్లోని ఇతరుల ఇళ్ల స్థలాలు, పార్కులు, రహదారులను ఆక్రమించి శ్రీధర్రావు అనే వ్యక్తి గచ్చిబౌలిలో నిర్మించిన సంధ్య కన్వెన్షన్ సెంటరు ఆక్రమణలను మంగళవారం హైడ్రా నేలమట్టం చేసింది. 6 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించిన రెండు సంధ్యా కన్వెన్షన్ హాళ్లు, వంట గదులు.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతి ప్రేమించడానికి నిరాకరించడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జీడిమెట్ల ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముక్కు కారుతోందని వెళ్తే సిటీ స్కాన్ చేయించుకునే క్రమంలో గుండెపోటుతో మహిళ మృతిచెందింది. కేపీహెచ్బీ ఎస్హెచ్వో రాజశేఖర్రెడ్డి వివరాల ప్రకారం..హైటెక్ సిటీ పరిధి ఖాజాగూడలోని సాయి ఐశ్వర్య లేఅవుట్లో ఉంటున్న ఎస్.సూర్యలక్ష్మి(66).
అల్లంత దూరాన తండ్రి చూస్తుండగా అక్క చేయి పట్టుకుని నడిచి వస్తున్న మూడేళ్ల బాలుడిని మృత్యు రూపంలో వచ్చిన కారు బలితీసుకుంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన ప్రకారం..
హైదరాబాద్లోని ఐసీఎంఆర్లో భాగమైన జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్)లో పురుగుమందుల అవశేషాల విశ్లేషణ విషయంలో భారీ శాస్త్రీయ మోసం, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ముంబయికు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రికల్చర్ (సెంటెగ్రో) అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది.
హైటెక్ సిటీ కేంద్రంగా రూ.792 కోట్లు మోసగించిన ఫాల్కన్ ఇన్వాయిస్ కేసులో కీలక నిందితుడైన ఫాల్కన్ సంస్థ సీఈవో యోగేంద్ర సింగ్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐడీ డీజీ శిఖాగోయల్ ఓ ప్రకటనలో తెలిపారు.
మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలు తిలకించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ కాంప్లిమెంటరీ పాస్లు జారీ చేస్తోంది. ఆసక్తిగలవారుhttps://tourism.telangana.gov.inలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పాస్ల కోసం క్యూరేటెడ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీలో పాల్గొనాల్సి ఉంటుంది.
ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న సుందరీమణులకు పర్యాటక శాఖ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. భరత నాట్య కళాకారిణుల ప్రత్యేక నృత్యాలు, డప్పులతో స్వాగతం పలుకుతుండడంతో విమానాశ్రయంలో పండగ వాతావరణం నెలకొంది.
ఇది షాబాద్ మండలం హైతాబాద్ సమీపంలోని సోలిపేట గ్రామంలోని ఎసైన్డ్ భూమి. కొన్ని నెలల క్రితం భూ ఉపరితలానికి సమానంగా ఉండేది. మట్టి కోసం తవ్వడంతో భారీ గుంత ఏర్పడింది. పదిహేను, ఇరవై అడుగుల లోతు వరకు తవ్వేశారు. రాత్రివేళ పొక్లెయిన్లతో మట్టి తవ్వుతున్నా..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్న అంశంపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు బుధవారం నగరంలో నాలుగుచోట్ల ‘ఆపరేషన్ అభ్యాస్’ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్లో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసులు పాల్గొననున్నాయి.
సైబర్ నేరాలపై అవగాహన ఉన్నా.. కొంచెం ఏమరుపాటు, నిర్లక్ష్యం డబ్బు పోయేందుకు కారణమంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. నగరంలో ప్రతి నెలా 15-20 క్రెడిట్ కార్డు మోసాలపై కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది 4 నెలల్లో వచ్చిన 80 ఫిర్యాదుల్లో 90 శాతం మంది ప్రైవేటు ఉద్యోగులు.
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కొన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే నడిపిస్తుండగా.. మరికొన్ని ఆసుపత్రులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జత చేసి అనుమతులు తీసుకుంటున్నాయి.
ఆపరేషన్ సిందూర్తో హైదరాబాద్లో భద్రత మరింత కట్టుదిట్టమైంది. దేశ రక్షణ రంగం, సైన్యానికి చెందిన కీలక సంస్థలు, విభాగాలు, అంతర్జాతీయ సంస్థలతో పాటు వ్యూహాత్మకంగా హైదరాబాద్ కీలక స్థానంలో ఉండడంతో మూడు కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు.
జీహెచ్ఎంసీలోని కొందరు ఇంజినీర్లు బరి తెగించారు. రోడ్డు వేయకుండా బిల్లులు పెట్టేస్తున్నారు. 2021-22, 2022-23 సంవత్సరాల్లో చేపట్టిన పలు పనుల బిల్లులను.. మూడేళ్ల తర్వాత ఆమోదానికి పంపడంతో అప్పటి కమిషనర్ ఇలంబర్తి అనుమానాలు వ్యక్తం చేశారు.
కొత్తగా నిర్మించిన భవనానికి ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇవ్వడానికి కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్తు శాఖ ఏఈ అనిశాకు చిక్కారు.
పలు ప్రాంతాల్లో దేవుడి భూములు క్రమక్రమంగా కనుమరుగువుతున్నాయి. ధూపదీప నైవేద్యాల కోసం భక్తులు వితరణ చేసిన భూములపై కన్నేస్తున్న అక్రమార్కులు నకిలీ పత్రాలతో విక్రయిస్తూ, నిర్మాణాలు చేపడుతున్నారు.
సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీని అల్వాల్ పోలీసులు ఛేదించారు. కరడుగట్టిన పాత నేరస్థుడు చింతకింద అనిల్ వారిని హతమార్చినట్లు తేల్చారు.
హానికర వ్యర్థాల నిర్వహణను మెటల్ పరిశ్రమల యూనిట్ల నిర్వాహకులు గాలికొదిలేశారు. లెడ్, జింక్, మాంగనీస్ వంటి లోహాలను శుద్ధి చేసే పరిశ్రమల్లో అనేక ప్రమాదకర వ్యర్థాలు వెలువడుతాయి.
‘మినీ అంగన్వాడీ’ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు ప్రధాన అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 138 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా ప్రభుత్వం గత ఏడాది జనవరిలో అప్గ్రేడ్ చేసింది.
బంగ్లాదేశ్ నుంచి అక్రమ రవాణాకు గురై నగరానికి చేరిన ఓ యువతిని(24) ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయం అధికారులు బుధవారం తిరిగి స్వదేశానికి తరలించారు.
ఆక్రమణదారులపై కేసు నమోదుచేసి, వేగవంతమైన విచారణతో సత్వర చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న హైడ్రా పోలీస్ స్టేషన్ గురువారం ప్రారంభం కాబోతుంది.