నగరంలోని భారత రాష్ట్ర సమితి నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డుతోంది. క్షేత్ర స్థాయిలో ఓటర్లను కలుసుకోవడమే లక్ష్యంగా రెండంచెల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
జీవనశైలి మార్పుతో వివిధ రకాల క్యాన్సర్లు దాడి చేస్తున్నాయి. నిమ్స్, ఎంఎన్జేకు వచ్చే రోగుల సంఖ్య ఏటా పెరగడమే అందుకు నిదర్శనం. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్లలో నగరం టాప్లో ఉంటోంది. పొగతాగడం, మద్యపానం,
అభ్యర్థిని అరువు తెచ్చుకుని పోటీ చేయించే స్థితికి కాంగ్రెస్ దిగజారిపోయిందని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఎంఐఎం కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తోందన్నారు.
భారత ఉపఖండమంతా శాస్త్రీయంగా, కచ్చితత్వంతో సర్వే నిర్వహించాలనే లక్ష్యంతో ‘ట్రిగొనోమెట్రికల్’ (trigonometrical) ప్రాజెక్టుకు 1802 సంవత్సరంలో శ్రీకారం చుట్టారు. ఇది బ్రిటీష్ ఇన్ఫెంట్రి అధికారి విలియం లాంబ్టన్ ఆధ్వర్యంలో ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ పర్యవేక్షణలో ప్రారంభమైంది.
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ ఉత్తుత్తి ఆత్మీయతలు...పైపై అనురాగాలు మాత్రం పొంగిపొర్లుతున్నాయి. ప్రతి ఇంటికి వచ్చి మరీ పలకరింపులు...దావత్తులకు ఆహ్వానం...పొగడ్తలు...అబ్బో...ఆ ప్రేమలకు ఓటర్లు తడిసి ముద్దవుతున్నారు.
కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు అక్రమాలకు వేదికగా మారిన పలువురు దస్తావేజు లేఖర్లను అదుపులోకి తీసుకుని విచారించారు.
మత్తు కోసం మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకుని ఓ యువకుడు మరణించిన ఘటన రాజేంద్రనగర్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోరెడ్డి వివరాల ప్రకారం.. ఓల్డ్సిటీలో కాలాపత్తర్కు చెందిన ఆటోడ్రైవర్ కరీం కుమారుడు అహ్మద్అలీ(28) శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు.
జిల్లాలోని పలు చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చాలా సంబర్భాల్లో ఆక్రమణలను నిర్ధారించుకోకుండా రెవన్యూ అధికారులు పట్టాలు జారీ చేస్తుండడంపై ఇటీవల హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
భూమి పట్టా చేస్తలేడని వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. మండలంలోని బెన్నూర్కు చెందిన కమ్మరి కృష్ణ కుమార్తె అనితను పదేళ్ల కిందట గుల్బర్గా జిల్లా షాబాద్కు చెందిన కమ్మరి అర్జున్ పవార్కిచ్చి పెళ్లి చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు గుర్రాలను అంచనా వేస్తూ విడుదల అవుతున్న ఎన్నికల సర్వేలపై జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు కొన్ని పార్టీలు సర్వేలను ఉపయోగించుకుంటున్నాయని,
నగర కొత్వాల్ వీసీ సజ్జనార్ గురువారం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఫైరింగ్ రేంజ్లో లక్ష్యాన్ని గురిచూసి కాల్చారు. ఎన్ని తూటాలు లక్ష్యాన్ని తగిలాయో లెక్కించారు.
తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనల విశిష్టత, వైభవాన్నిచాటే లక్ష్యంతో అన్నమాచార్య భావనా వాహిని (ఏబీవీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తందనాన’ అంతర్జాతీయ సంగీత పోటీల గ్రాండ్ ఫినాలే డిసెంబరు 20న ఉంటుందని ఏబీవీ వ్యవస్థాపకురాలు డా.శోభారాజు తెలిపారు.
మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఎల్లారెడ్డిగూడలో గురువారం రాత్రి మైనార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు.
ఇంజాపూర్ నుంచి తొర్రూర్ వెళ్లే దారిలో వరద ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి క్యాంప్ ఆఫీస్కు వెళ్లే దారి సైతం ఇదే. వర్షం కురిసిన ప్రతిసారి రోడ్డు కోతకు గురవుతోంది.
మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తనకు రంగారెడ్డి జిల్లా యాచారంలోని రూ.4 కోట్ల విలువైన 2వేల గజాల భూమిని గురువారం ఇబ్రహీంపట్నం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయశాఖ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
తెలుగువర్సిటీ వసతిగృహంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్కు చెందిన పద్మకు ఇద్దరు కుమారులు. భర్త లేరు. పెద్దకుమారుడు పరుశురాం (20)
అమాయకులకు మాయమాటలు చెప్పి రూ.3 కోట్లు వసూలు చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సూర్యాపేట ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. సూర్యాపేట మండలం బాషానాయక్ తండాకు చెందిన గడ్డం లక్ష్మణ్కుమార్ సూర్యాపేట,
ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని వారికి డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గురువారం డీసీపీ యోగేశ్గౌతం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి చౌదరిగూడలోని శ్రీనివాస కాలనీలో 400 గజాల పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా (Hydra) అధికారులు రక్షించారు.