రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆటో కిరాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గుర్తు తెలియని మరో వ్యక్తి ఎయిర్గన్తో కాల్పులకు పాల్పడ్డాడు.
సఫిల్ గూడ చెరువులో అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సికింద్రాబాద్ పరిధిలో పదోతరగతి విద్యార్థి ద్విచక్రవాహనం నడుపుతూ ఆటోను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయమైంది. ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికి రూ.8 లక్షలు ఖర్చుచేసినా కోలుకోలేదని వైద్యుడు తెలిపారు.
నగరంలో ఆహ్లాదం పంచిన మెట్రోరైలు ప్రారంభ స్టేషన్లు.. క్రమంగా వాటి శోభను కోల్పోతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన స్టేషన్ పరిసరాలు.. పర్యవేక్షణ లేక చెత్తాచెదారంతో కళావిహీనంగా మారాయి.
కార్తిక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైంది. ఈ నెలలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో దీపారాధన చేస్తే తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయని శాస్త్ర వచనం. అపారమైన పుణ్య సముపార్జనకు ఇదో మార్గమని భక్తుల విశ్వాసం.
సినిమా విడుదలకు రెండ్రోజుల ముందుగానే హెచ్డీ ప్రింట్ వెబ్సైట్లో దర్శనమిస్తుంది.. థియేటర్కు వెళ్లేందుకు సిద్ధమైన ప్రేక్షకులు ఇంట్లోనే వీక్షిస్తున్నారు.. ఆరేళ్లుగా 21వేల సినిమాలు పైరసీ చేసిన ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్తో పైరసీ ఆగిపోతుందని తాము కూడా భావించట్లేదని పోలీసులు చెబుతున్నారు.
ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థినులకు బహుళజాతి సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగాలు వెంటనే లభించేందుకు జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు కొత్త పంథాను అనుసరిస్తున్నారు.
హుస్సేన్సాగర్లో మళ్లీ మ్యూజికల్ ఫౌంటెయిన్లు షురూ అయ్యాయి. గతంలో సచివాలయానికి ఎదురుగా రూ.50 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశారు. ఫౌంటెయిన్ ద్వారా ఎగజిమ్మే నీళ్లు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై పడటంతో తరచూ ఫిర్యాదులొచ్చాయి.
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరహా మూడేళ్ల చిన్నారులకు తరగతులు ప్రారంభించింది. పిల్లలకు ఆటపాటలు, తెలుగు, ఆంగ్లం పదాలు నేర్పుతున్నారు.
గాజులరామారం రిజర్వుడ్ ఫారెస్టు భూములపై రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సర్వే విభాగం (ఆర్డీడీఎస్) అందజేసిన సర్వే నివేదికను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) తప్పుపట్టింది. సర్వే లోపభూయిష్టంగా ఉందని, తిరిగి నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.
నిలోఫర్లో చిన్నారులకు కష్టాలు తప్పడం లేదు. ఇక్కడ చికిత్సలు చేయిస్తూ కొన్ని టెస్టుల కోసం గాంధీ, ఉస్మానియా, ఎంఎన్జే, నిమ్స్కు తరలించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. నిత్యం 20 మందికి తక్కువ కాకుండా చిన్నారులను అంబులెన్సుల్లో పంపుతున్నారు.
పేదల బియ్యం దళారుల పాలవుతోంది. పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని దందా సాగిస్తున్నారున. వీరికి కొంతమంది డీలర్లు సహకరిస్తున్నారు. నేరుగా డీలర్లే పేదలకు డబ్బు ఇచ్చి బియ్యం కొంటున్నారు. వాళ్లే వ్యాపారులకు పెద్ద మొత్తంలో అమ్ముతున్నారు.
‘‘నవాబ్పేట మండలం వట్టిమీనపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డికి ఆరున్నర ఎకరాల పొలం ఉంది. అందులో అరెకరం విస్తీర్ణంలో పత్తిసాగు చేశారు. వర్షాలకు పూత నిలబడక పంట ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ఒకటిన్నర క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది.
ఓడిన చోటే గెలిచి చూపిద్దామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు.
జీహెచ్ఎంసీ స్థాయీ సంఘ సమావేశం గురువారం జరగనుంది. ఆస్తి పన్ను వడ్డీ చెల్లింపులో 90 శాతం రాయితీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ తీర్మానం చేయనున్నారు.
ఇంజినీరింగ్ చేశాం..ఇట్టే ఉద్యోగం పట్టేస్తామనుకునేవారిలో చాలామంది మంచి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కావాల్సిన నైపుణ్యాలతో సంసిద్ధంగా లేకపోతే.. కంపెనీలు సైతం క్యాంపస్లోనే కాదు..
నగరంలో కొందరు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తుండటంతో రహదారులు దుర్గంధ బరితంగా మారుతున్నాయి. బల్దియా నిత్యం పారిశుద్ధ్య చర్యలు చేపట్టినా మార్పు రావడం లేదు. చెత్తకుండీలు ఏర్పాటు చేసినా..
బస్సుల్లో ఫుట్బోర్డుపై నిలుచోవడం, పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కడం, కదులుతున్న బస్సు నుంచి దిగిపోవడం వంటి విన్యాసాలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో మార్పులు చేస్తోంది.
సౌదీలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హైదరాబాదీల కుటుంబ సభ్యులు 38 మంది బుధవారం జెడ్డా చేరుకున్నారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పవిత్ర ఉమ్రా యాత్రలో భాగంగా సౌదీ అరేబియాలోని మదీనాకు వెళ్లిన 45 మంది భారతీయులు..
మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన ఇద్దరు స్నేహితులు చోరీలకు పాల్పడుతుండేవారు. జైలుకెళ్లొచ్చాక వారిలో ఒకరు చోరీలు మానేశాడు. తిరిగి చోరీలు చేయాలంటూ స్నేహితుడు బెదిరింపులకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
వినియోగదారులు పౌచ్లో ఎంత పరిమాణంలో వంటనూనె ఉందో సరిచూసుకుని కొనుగోలు చేసేలా ‘కోచింగ్ ది కోచ్’ పేరిట ఫ్రీడమ్ ఆయిల్కు చెందిన జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండి యా లిమిటెడ్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట సర్వే నెం.16లోని 10.20 ఎకరాల్లో హైడ్రా జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
‘ఏమీ లేనివాణ్ని.. ఎవ్వరితోనూ సంబంధాల్లేవు. బంధాలు, బంధుత్వాలకు దూరంగా ఉన్నా. చావుకు భయపడని వాడు దేనికీ భయపడడు’ అంటూ మూడు నెలల క్రితం పోలీసులకు సవాల్ విసిరిన ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి ఎలియాస్ ప్రహ్లాద్కుమార్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటూ కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతున్నాడు.
మహానగరానికి సంబంధించి ప్రస్తుత పాలక మండలి గడువు మరో మూడు నెలల్లో పూర్తవనుండగా ప్రభుత్వం వద్ద ఎలాంటి చర్చ జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీలోనూ ఈ ఎన్నికల గురించి మాట్లాడుకోవట్లేదు. అధికార వర్గాలైతే అసలు పట్టించుకోవట్లేదు.
చిన్న ఇంటికి పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను చెల్లిస్తున్నామంటూ బాధపడే వారికి జీహెచ్ఎంసీ సులువైన పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తును అందుబాటులోకి తీసుకొచ్చింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అఖిల.. తన భర్త పుట్టినరోజుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంది. ఆ విషెస్ ఎల్లప్పుడూ గుర్తుండేలా ఉండాలని నిర్ణయించుకుంది.
నవంబరులో ఇంత చలా? ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పదేళ్లలో ఎప్పుడూ ఈస్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు నవంబరులో పడిపోలేదు. నగరంలో సాధారణంగా డిసెంబరు నెలాఖరు, జనవరి ఆరంభంలో కొద్దిరోజులపాటు 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
హైదరాబాద్ కేంద్రంగా వారాంతపు పర్యాటకానికి శ్రీకారం చుడుతున్నారు. సుమారు 200 కి.మీ. పరిధిలో పర్యాటక, సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానిస్తారు.
నగరంలో గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాల్లోని ఎస్టీపీలు నిరుపయోగంగా మారాయి. శుద్ధి అయ్యే నీటిని మరుగుదొడ్లు, గార్డెనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ వంటి వాటికి వినియోగించుకోవచ్చు.
కూల్చివేతల సమయంలో చట్టప్రకారం వెళ్లాలని ఇటీవలే చెప్పినా.. హైడ్రా తీరు మారదా అంటూ హైకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది. సంధ్య కూల్చివేతలపై ఉత్తర్వులు వచ్చేదాకా కూడా ఆగలేరా.. తెల్లవారుజామున కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.
సిగ్నళ్లు లేని కూడళ్లే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హెచ్-సిటీ ప్రాజెక్టు పట్టాలెక్కింది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో.. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు కూడళ్లలో పైవంతెనల నిర్మాణానికి ఇంజినీర్లు సిద్ధమయ్యారు.
ఎనిమిది మంది సంతాన భారం మోయలేనని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైలార్దేవుపల్లి పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం ప్రకారం.. బిహార్కు చెందిన నౌషాద్(45), ఖాతూన్(38) దంపతులు.