‘ఏమీ లేనివాణ్ని.. ఎవ్వరితోనూ సంబంధాల్లేవు. బంధాలు, బంధుత్వాలకు దూరంగా ఉన్నా. చావుకు భయపడని వాడు దేనికీ భయపడడు’ అంటూ మూడు నెలల క్రితం పోలీసులకు సవాల్ విసిరిన ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి ఎలియాస్ ప్రహ్లాద్కుమార్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటూ కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతున్నాడు.
మహానగరానికి సంబంధించి ప్రస్తుత పాలక మండలి గడువు మరో మూడు నెలల్లో పూర్తవనుండగా ప్రభుత్వం వద్ద ఎలాంటి చర్చ జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీలోనూ ఈ ఎన్నికల గురించి మాట్లాడుకోవట్లేదు. అధికార వర్గాలైతే అసలు పట్టించుకోవట్లేదు.
చిన్న ఇంటికి పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను చెల్లిస్తున్నామంటూ బాధపడే వారికి జీహెచ్ఎంసీ సులువైన పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తును అందుబాటులోకి తీసుకొచ్చింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అఖిల.. తన భర్త పుట్టినరోజుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంది. ఆ విషెస్ ఎల్లప్పుడూ గుర్తుండేలా ఉండాలని నిర్ణయించుకుంది.
నవంబరులో ఇంత చలా? ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పదేళ్లలో ఎప్పుడూ ఈస్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు నవంబరులో పడిపోలేదు. నగరంలో సాధారణంగా డిసెంబరు నెలాఖరు, జనవరి ఆరంభంలో కొద్దిరోజులపాటు 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
హైదరాబాద్ కేంద్రంగా వారాంతపు పర్యాటకానికి శ్రీకారం చుడుతున్నారు. సుమారు 200 కి.మీ. పరిధిలో పర్యాటక, సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానిస్తారు.
నగరంలో గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాల్లోని ఎస్టీపీలు నిరుపయోగంగా మారాయి. శుద్ధి అయ్యే నీటిని మరుగుదొడ్లు, గార్డెనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ వంటి వాటికి వినియోగించుకోవచ్చు.
కూల్చివేతల సమయంలో చట్టప్రకారం వెళ్లాలని ఇటీవలే చెప్పినా.. హైడ్రా తీరు మారదా అంటూ హైకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది. సంధ్య కూల్చివేతలపై ఉత్తర్వులు వచ్చేదాకా కూడా ఆగలేరా.. తెల్లవారుజామున కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.
సిగ్నళ్లు లేని కూడళ్లే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హెచ్-సిటీ ప్రాజెక్టు పట్టాలెక్కింది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో.. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు కూడళ్లలో పైవంతెనల నిర్మాణానికి ఇంజినీర్లు సిద్ధమయ్యారు.
ఎనిమిది మంది సంతాన భారం మోయలేనని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైలార్దేవుపల్లి పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం ప్రకారం.. బిహార్కు చెందిన నౌషాద్(45), ఖాతూన్(38) దంపతులు.