అడిగినంత ఇస్తే.. ఎలాంటి భవనానికైనా ఇంటి నంబర్లు ఇస్తామంటూ పలువురు జీహెచ్ఎంసీ అధికారులు వసూళ్లకు తెగబడుతున్నారు. బహుళ అంతస్తులకైతే.. అంతస్తుకింత చొప్పున వసూళ్లు చేస్తున్నారు.
‘‘ఇంజినీరింగ్ పూర్తయింది.. ఉద్యోగ వేటలో ఉన్నాడు. అమీర్పేట్లోని ఒక శిక్షణ సంస్థలో ఐటీ కోర్సు చేస్తున్నాడు. వారాంతం దోస్తులతో కలిసి శివారు ఫామ్హౌస్లో పార్టీ చేసుకున్నాడు.
విశ్రాంత ఆచార్యులకు నెలనెలా సులువుగా పింఛన్ సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ‘డిజిటల్ ఎగ్జిస్టెన్సీ’ ధ్రువపత్రాన్ని ఇస్తున్నారు.
నగరంలో చలిపంజా విసురుతోంది. ఇప్పటికే పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నగరంలోని నిరాశ్రయులు, వీధుల వెంట నిద్రించేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
‘స్వచ్ఛ హైదరాబాద్’ లక్ష్యంగా జీహెచ్ఎంసీ అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రజలు చెత్తను రోడ్లపై, ఖాళీ స్థలాల్లో పడేయకుండా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేలా స్వచ్ఛ ఆటోలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
వికారాబాద్ జిల్లాలో వ్యవసాయమే ప్రధానం. అందులోనూ.. పరిగి అంటే పెట్టింది పేరు. చెప్పుకోదగ్గ నదీనదాలేవీ లేకపోవడంతో బోరు బావులపైనే ఆధారపడి సేద్యం చేస్తుంటారు.
ఇటీవల చలి తీవ్రత బాగా పెరిగింది. పిల్లలు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. బయటికి రావాలంటే గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో వసతిగృహాల్లో చదువుకొంటున్న విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు నాగన్పల్లిని దత్తత తీసుకొని రామోజీ ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయించారని, అలాంటి గొప్ప వ్యక్తిని గ్రామస్థులు ఎప్పటికీ మరిచిపోరని మాజీ సర్పంచి ఎర్ర జగన్ అన్నారు.
ఆధునిక యుగంలోనూ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో రవాణాశాఖ నిర్లక్ష్యం చూపుతోంది. వాహన సామర్థ్య ధ్రువీకరణ పరీక్షలు చేయడానికి అనేక రాష్ట్రాల్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) ఏర్పాటు చేసి మానవ ప్రమేయం లేకుండా చేస్తున్నారు.
అర్ధరాత్రి వేళ.. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయాన.. ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వాహనం దగ్ధమైంది. షషీ అనే వ్యక్తి నడుపుతున్న ఎలక్ట్రిక్ కారు కవాడిగూడ డివిజన్ బీమా మైదాన్ వద్ద అదుపుతప్పి ఇటుక లారీని ఢీ కొట్టింది.
తయారీ లోపం ఉన్న విద్యుత్ వాహనాన్ని విక్రయించిన టాటా మోటార్స్, ఆరెంజ్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్, వెంకటరమణ మోటార్స్ సంస్థలకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-3 జరిమానా విధించింది.