రామంతాపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మించి 60 ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరింది. కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఉచిత వైద్యం, మందుల పంపిణీ, అవసరమైతే శస్త్రచికిత్సలు చేసేలా ఏర్పాటు చేసిన వెల్నెస్ కేంద్రాలు చిక్కిశల్యమయ్యాయి. ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందే స్థితిలో లేకుండా పోతున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సంతాన సాఫల్య కేంద్రాల గుట్టురట్టు అవుతోంది. సృష్టి కేంద్రం దందా బయట పడిన తర్వాత వీటిపై వైద్య ఆరోగ్యశాఖ నిఘా పెట్టిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. ఇటీవల చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది మరణించిన విషాదం మరువకముందే.. శుక్రవారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది.
మత్తు పదార్థాల రవాణాలో స్మగ్లర్ల నెట్వర్క్ ఏ స్థాయిలో పనిచేస్తోందో బయటపెట్టే ఉదంతాలివి. మహిళలు, డ్రైవర్లు, కూలీలతో డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్న ముఠాలు.. ఇప్పుడు విద్యార్థులను పావులుగా చేసుకుంటున్నాయి.
జేఎన్టీయూలో ఇంజినీరింగ్ పూర్తిచేయడం విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు. డిగ్రీతో సరిపెట్టుకోకుండా ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు అత్యున్నత శిఖరాలు అందుకున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఏపీ మాస్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సమ్మేళనంలో దేశవ్యాప్తంగా ఉత్తమంగా ఎంపికైన 13 స్వయం సహాయ (డ్రాక్రా) సమాఖ్యలకు జాతీయ అవార్డులను శుక్రవారం ప్రదానం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలను మోసం చేయడమేనని బీసీ నేతలు పేర్కొన్నారు.