తాండూరు నియోజకవర్గంలోని మండలాలకు తపస్ నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూసరాములు, ఆనందం, గాజుల బస్వరాజ్ ఆదివారం వెల్లడించారు.
డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు.. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. నిత్యం వేల మంది పిల్లలను ఆటోలు, వ్యాన్లలో ఎక్కించుకొని రాకపోకలు సాగిస్తున్నారు.
పాతబస్తీని కొత్త నగరంతో అనుసంధానం చేసే సంతోష్నగర్ ఉక్కు వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఆరేళ్లవుతున్నా.. నిర్మాణం పూర్తవకపోవడంతో.. నిత్యం రాకపోకలు సాగించే లక్షకుపైగా ఉద్యోగులు ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్ సైబర్క్రైమ్ డీసీపీ కవితను.. వరంగల్ సెంట్రల్జోన్ డీసీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో రాచకొండ క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్బాబుకు బాధ్యతలు అప్పగించింది.
గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులుగా బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చింది.
మెట్రో స్టేషన్లోకి ప్రవేశించి రెండు గంటల తర్వాత బయటకు వస్తే అదనపు ఛార్జీ వడ్డిస్తు న్నారని, అలాంటప్పుడు మెట్రో స్టేషన్లలో ఆహారశాలలు,ఇతర దుకాణాలు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డిపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూ ఠాణాలో కేసు నమోదైంది. నకిలీ జీపీఏ సృష్టించి.. మరో వ్యక్తి పేరిట స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో కేసు నమోదైంది.
పోలీసులంటే.. కఠిన మనస్తత్వం, కరకుమాటలు, నిర్లక్ష్య ధోరణి ఉంటుందని ప్రజలు అనుకుంటారు. అలాగే కొంతమందిలో ధన వ్యామోహం ఉండడంతో జనంలో చులకన భావం ఉంటోందని నగర కొత్వాల్ సజ్జనార్ భావించారు.
దివ్యాంగులకు వివిధ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఉపాధికి దన్నుగా నిలుస్తోంది కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఆధీనంలో నిర్వహిస్తున్న జాతీయ మానసిక దివ్యాంగుల సాధికారత సంస్థ(నిపిడ్).
‘స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వాదనలు వినిపించేందుకు అవకాశమున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించి ఎన్నికల నిర్వహణకు జీఓ 46 జారీ చేయడం దుర్మార్గం.
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొని నిలబడగలిగేలా నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం సంపాదించుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన అన్నారు.
విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.