గ్రేటర్ రహదారి వ్యవస్థలో అనేక లోపాలున్నాయి. ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా బల్దియా రంగంలోకి దిగింది. కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలతో ఇంజినీరింగ్ విభాగం క్షేత్రస్థాయి సర్వేకు నడుం బిగించింది.
నగరంలోని 4 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్టు వచ్చిన బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటలకు అన్నా యూనివర్సిటీ స్టూడెంట్స్/అలుమ్ని పేరిట అబిదా, అబ్దులా పేర్లతో సిటీ సివిల్కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
మెట్రోరైళ్లు పది లక్షల కిలోమీటర్లు తిరిగిన వాటికి పూర్తి మరమ్మతులు (ఓవర్హాలింగ్) చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 14 రైళ్లకు చేపట్టగా మిగతా వాటిని దశలవారీగా 2027 నాటికి పూర్తిచేసేందుకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ షెడ్యూల్ రూపొందించుకుంది.
నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి గతంలో అబ్దుల్పూర్మెట్లోని పంచాయతీ లేఅవుట్లో 400 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఇటీవల ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేశారు.
రాజధాని నగరం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం గేట్ల వద్ద విచిత్ర పరిస్థితి నెలకొంది. స్టేడియం గేట్ల బయట గోడను నిర్మిస్తుండటంతో ప్రవేశాలకు అవకాశమే లేకుండా పోతోంది.
ఉదయం 8 నుంచి 10.. సాయంత్రం 5 నుంచి 7.. ఈ సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం నరకప్రాయమవుతోంది. సరిపడా బస్సులు లేకపోవడంతో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది.
కోడళ్ల గొడవను ఆపడానికి వెళ్లి తోపులాటలో కిందపడి అత్త మృతి చెందిన ఘటన బహదూర్పుర ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం..కిషన్బాగ్ అసద్బాబానగర్కు చెందిన మహమూద్(45)కు గతంలో పెళ్లయ్యింది.
మూడు నెలల సన్న బియ్యం పంపిణీలో కొందరు మేడ్చల్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే చేతివాటం ప్రదర్శించి మూడు లారీల్లో 900 క్వింటాళ్లు తరలిస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు.
ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం కొత్త పట్టిక(మెనూ) సరిగా అమలు కావడం లేదు. కొన్ని బడుల్లో కేవలం అన్నం, నీళ్లచారు వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
డయాలిసిస్ రోగులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. గతంలో కొందరికి రాగా.. చాలామంది ఎదురు చూశారు. వారి అభ్యర్థనలపై స్పందించిన ప్రభుత్వం కొత్తగా రూ.2,016 చొప్పున మంజూరు చేసింది.
భూమి ఉన్న ప్రతి రైతుకు ఆధార్కార్డు తరహాలో 11 అంకెల విశిష్ట గుర్తింపు కార్డు జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం జిల్లాలో నెమ్మదిగా సాగుతోంది.
నగరంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల వద్ద రికవరీ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. నిజాంపేట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును అబ్దుల్లాపూర్మెట్ దాటాక కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు.