వికారాబాద్ జిల్లా చెంగోల్లో శుక్రవారం డీసీఎంఎస్ మేనేజర్ సలాం, అధికారులు చిన్నయ్య, భాస్కర్ చౌదరి అధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
మియాపూర్ ప్రాంతం శివనామ స్మరణతో మార్మోగింది. స్థానిక మాతృశ్రీనగర్ కమ్యూనిటీ గ్రౌండ్లో గురువారం ‘ఈటీవీ’ తెలంగాణ, ‘ఈటీవీ’ ఆంధ్రప్రదేశ్, ‘ఈటీవీ’ లైఫ్ ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై.. దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటారు.
నగరాభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు పెద్ద ఎత్తున ఆమోదం పొందాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన స్థాయీ సమావేశంలో మొత్తం 24 తీర్మానాలకు సభ్యులు పచ్చజెండా ఊపారు.
నగరమంతా ఒక ఎత్తు.. నానల్నగర్ చౌరస్తా మరో ఎత్తు. వానలు, వరదలు, ధర్నాలు, రాస్తారోకోలతో సంబంధం లేకుండా.. సంవత్సరానికి 365 రోజులు.. రోజుకు 24గంటలు.. అక్కడ వాహన రద్దీ ఉంటుంది. మెహిదీపట్నం నుంచి హైటెక్సిటి మార్గంలోని ఈ నానల్నగర్ కూడలి దాటాలంటే వాహనదారులు గంటపాటు పడిగాపులు కాయాల్సిందే.
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)లోపల చెరువులకు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఇందుకోసం పూర్తి నీటి నిల్వ స్థాయి (ఎఫ్టీఎల్) నిర్ధారిస్తూ ప్రాథమిక, శాశ్వత నోటిఫికేషన్ల జారీకి 222 చెరువుల వివరాలను హెచ్ఎండీఏ హైడ్రాకు పంపింది.
మెట్రోరైలుకు రాబోయే మార్చి నెల కీలకంగా మారనుంది. మొదటిదశ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను మార్చి 31లోగా పూర్తి చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.
‘రాజధాని నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది..నగరం నలుమూలలా ఆర్టీసీ బస్సులు నడుపుతాం. శివారు ప్రాంతాల్లో ఉంటున్నవారు, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు బస్సులు వేయనున్నాం..
ఖైరతాబాద్కు చెందిన బాలికకు.. ఇన్స్టాగ్రామ్లో యువతి పరిచయమైంది. తరచూ ఇద్దరు చాటింగ్ చేస్తూ స్నేహం పెంచుకున్నారు. ఒకరి ఫొటోలు ఒకరు పంపించుకున్నారు. నెల తర్వాత అకస్మాత్తుగా బెదిరింపులు.. పరిచయమైన యువతి బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతోంది. సైబర్ నేరగాళ్లు ఈ పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది.
‘‘ఫలక్నుమా- లింగంపల్లి మార్గంలో నడిచే ఒక్కో ఎంఎంటీఎస్ రైలులో నిత్యం 3 వేల నుంచి 4 వేల మంది ప్రయాణిస్తుంటారు. ఇంత డిమాండ్ ఉన్నా ఆయా మార్గాల్లో రైళ్లు నడపకపోవడంతో అనేక మంది ప్రత్యామ్నాయాలను ఎంచుకొని ట్రాఫిక్ నరకం అనుభవిస్తున్నారు.’’
అనుమతి లేని క్లినిక్లు, ల్యాబ్లు, ఇళ్లలో చికిత్స తీసుకునే వ్యక్తుల వల్ల బయోమెడికల్ వ్యర్థాలు సాధారణ చెత్తలో కలుస్తున్నాయని పీసీబీ పరిశీలనలో వెల్లడైంది.
కిశోర బాలికల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు ఆరోగ్య విషయాలపై అంతగా అవగాహన లేకపోవడంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు.
జనన, మరణాలు నమోదు చేసేందుకు యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్(యూబీడీ) వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. రోజువారీగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది
తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డుకు రహదారులు, భవనాల శాఖ అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. తాండూరులో ప్రారంభంలోనే 2 కి.మీ. పొడవున తారు తొలగిపోయి కంకర లేచిన రహదారిని సిమెంటు రోడ్డుగా మారుస్తున్నారు
భూమి ఉన్న ప్రతి అన్నదాతలకు ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట గుర్తింపు కార్డు జారీకి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు(ఫార్మర్ రిజిస్ట్రీ) జిల్లాలో నెమ్మదిగా కొనసాగుతోంది.
గనుల ఖిల్లాగా పేరొందిన గ్రామంలో ఇతర జిల్లాలు.. పొరుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరికి పని ప్రదేశంలో గాయాలైనా, అనారోగ్యం బారిన పడినా.. చెంతనే వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.