ఇచ్చిన హామీ మేరకు బంగారం లేదా డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన చెన్నై షాపింగ్మాల్కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 మొట్టికాయలు వేసింది.
గ్రేటర్లో భారాసకు వరుస షాక్లు ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా.. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీ అత్యధికంగా 16 స్థానాలు గెల్చుకోవడం ఊరటనిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం, నగర పోలీస్, హెచ్సీఎస్సీ సంయుక్తంగా శుక్రవారం ఎల్బీస్టేడియంలో నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ అధ్యక్షతన నిర్వహించిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో నటుడు శర్వానంద్ మాట్లాడుతూ.. సినిమాలో తాము హీరోలైతే.. ప్రజల ప్రాణాలను కాపాడే పోలీసులు నిజజీవితంలో అసలైన హీరోలని ప్రశంసించారు.
తెదేపా అభిమాన గణం చేయి వెంటే నిలిచిందా..? అవుననే అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్, భాజపా, భారాస నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరికీ గతంలో ఆ పార్టీతో అనుబంధం ఉంది.
నవీన్ యాదవ్ కుటుంబసభ్యుల 40 ఏళ్ల కల నెరవేరింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గెలుపొందడంతో కుటుంబ సభ్యులంతా భావోద్వేగంతో ఆనందబాష్పాలు రాల్చారు.
హైదరాబాద్కు ప్రయాణికులతో శుక్రవారం టేకాఫ్ తీసుకున్న రెండు అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో బాంబులు పెట్టామని.. శంషాబాద్లో ల్యాండింగ్ అయ్యేలోపు విమానాలను పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్పోర్ట్ ఈ- మెయిల్కు సందేశం పంపించారు.
సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు పరుస్తోంది. గూడులేని నిరుపేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బస్తీలు బ్రహ్మరథం పట్టాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించిన రహ్మత్నగర్ డివిజన్లో ఆ పార్టీకి అత్యధిక మెజార్టీ లభించింది.
మండలకేంద్రమైన వికారాబాద్ పరిధిలోని పుల్మద్ది గ్రామాన్ని ఈజిప్ట్, గణ, మలేషియా, ఒమాన్, బంగ్లాదేశ్, శ్రీలంక విదేశాలకు చెందిన పదిమంది విదేశీ ప్రతినిధులు సందర్శించారు.