బోరబండ ప్రయాణప్రాంగణం వద్ద ఈ నెల 17న జరిగిన ఆందోళనలో పెట్రోల్ మంటలంటుకుని గాయపడిన ట్రాన్స్జెండర్లలో నవనీత(24) చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ఏకరూప పరిపాలనే లక్ష్యంగా రాజధానిని ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కలిపి 27 పట్టణ స్థానిక సంస్థలను(యూఎల్బీ) జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు సమాయత్తమైంది.
కాలనీల స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్కు రూ.2 కోట్ల చొప్పున.. 150 డివిజన్లకు రూ.300కోట్ల నిధులు ప్రకటించింది.
వర్షం పడితే చాలు విద్యుత్తు అంతరాయం.. ఈదురుగాలులు వీస్తే తెగిపడే విద్యుత్తు తీగలతో ప్రమాదం.. సిటీలో ఎక్కడ చూసినా ఓవర్హెడ్ లైన్లతో ఆటంకాలు.. వీటన్నింటికి పరిష్కారంగా హైదరాబాద్లో భూగర్భ విద్యుత్తు తీగలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ మెట్రోలో నిత్యం నాలుగున్నర లక్షల మందికిపైగానే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఉద్యోగులు మొదలు, విద్యార్థులు, పర్యాటకులు, పనిమీద వెళ్లేవారు ఇందులో ఉంటున్నారు.
నగరానికి చెందిన యువతి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. తన ఫొటోలు, రీల్స్ తరచూ పోస్టు చేస్తుంది. ఒకరోజు ఆమె ఫొటోలు.. ఇన్స్టాగ్రామ్లోని ఒక ఛానల్లో ప్రత్యక్షమయ్యాయి.
విద్యార్థి స్థాయిలో నైపుణ్యం వెలికి తీసి.. వారి అభిరుచికి తగిన రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దనున్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం నుంచి నాగోలు ఉన్నత పాఠశాల ఒక్కటే ఎంపికైంది.
చర్లపల్లి అంటే కేవలం ఒక పారిశ్రామికవాడే కాదు.. కష్టజీవులకు బతుకునిచ్చిన నేల. అడుగుపెడితే కొలువు ఉందంటూ అక్కున చేర్చుకునే ఇలాఖా. నిద్ర లేవగానే యంత్రాల చప్పుళ్లు, వాహనాల మోతలు, కార్మికుల హడావుడితో కనిపించే చర్లపల్లి..
ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ ఉన్న 20 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లను బల్దియాలో విలీనం చేయనున్న నేపథ్యంలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు పూర్తిస్థాయిలో మారనున్నాయి.
యాజమాన్యాల ప్రయోజనాలను కాపాడేందుకు, కార్మికుల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్ల అమలును ప్రకటిస్తూ కుట్ర పన్నిందని పౌరహక్కుల సంఘం (సీఎల్సీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ గెడ్డం ఆరోపించారు.
పల్లెల్లో పంచాయతీ పోరు మొదలైంది. మంగళవారం నుంచే రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
సామాన్యులకు మాయమాటలు చెప్పి మ్యూల్ఖాతాలు తెరచి సైబర్ మోసగాళ్లకు అందజేస్తున్న 8 మంది నిందితులను నగర సైబర్క్రైమ్, ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.