ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీని తగ్గించటం ప్రజలకు పండగలాంటిదని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో సోమవారం పట్ణణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం పది మంది మంత్రులతో సోమవారం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. పదోన్నతులు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులతో విలీనం చేయడం తదితర అంశాలపై ఉప సంఘం అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి చైతన్యబాబు(ఏ-22)ను ఎక్సైజ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పీటీఎం మండలం చెండ్రాయునిపల్లి సమీపంలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఏ-13 సురేంద్రనాయుడుకు చెందిన ఆంధ్రా వైన్స్ దుకాణంలో చైతన్యబాబు పనిచేస్తున్నాడు.
నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల నుంచి పూర్తిగా వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు కొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గ్లోబల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రపంచ వాణిజ్యంలో దేశ వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని అధికారులకు సూచించారు.
‘జగన్ జమానాలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో నాటి ప్రభుత్వ పెద్దల పాత్రపై వెలుగుచూస్తున్న సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారీ జరిగిపోతోందంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలి.
రాష్ట్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా నమోదవుతున్నాయి. బీటెక్, బీఎస్సీ, బీకాం లాంటి డిగ్రీలతోనే ఉద్యోగాలు వస్తుండడంతో చాలామంది పీజీపై ఆసక్తి చూపట్లేదు. చాలామంది స్థానికంగా పీజీ చేయడం కంటే విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు అధ్యక్షత వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో భాగంగా దేశ,
రాజధాని అమరావతి రైతులు చేసిన త్యాగానికి రెట్టింపు ఫలాలు దక్కేలా చేస్తామని, అమరావతి ఓ మునిసిపాలిటీగా మిగిలిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. సీఆర్డీఏ భవనం ప్రారంభం ద్వారా రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందని సీఎం అన్నారు.